<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/" xmlns:dc="http://purl.org/dc/elements/1.1/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/" xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/" xmlns:media="http://search.yahoo.com/mrss/"><channel><title>tirupati</title><atom:link href="https://telugu.abplive.com/tirupati/feed" rel="self" type="application/rss+xml"/><link>https://telugu.abplive.com/</link><description/><lastBuildDate>Tue, 7 Jul 2026 06:12:19 +0530</lastBuildDate><language>en-US</language><sy:updatePeriod>hourly</sy:updatePeriod><sy:updateFrequency>1</sy:updateFrequency><generator>https://telugu.abplive.com</generator><item><title><![CDATA[Tirumala News: 116 ఏళ్ల వృద్ధురాలికి శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించిన టీటీడీ]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/tirupati/ttd-chairman-br-naidu-arranges-vip-break-darshan-in-tirumala-for-116-year-old-devotee-252649</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/tirupati/ttd-chairman-br-naidu-arranges-vip-break-darshan-in-tirumala-for-116-year-old-devotee-252649#respond</comments><pubDate>Mon, 6 Jul 2026 08:30:30 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ తిరుపతి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/tirupati/ttd-chairman-br-naidu-arranges-vip-break-darshan-in-tirumala-for-116-year-old-devotee-252649</guid><description><![CDATA[&lt;p&gt;TTD Chairman BR Naidu | తిరుపతి: ఇటీవల కాలినడకన తిరుమలకు కొండపైకి వెళ్తున్న ఒక వందేళ్లు పైగా వయసున్న వృద్ధురాలి వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. శ్రీవేంకటేశ్వర స్వామిపై ఆ 116 ఏళ్ల వృద్ధురాలికి ఉన్న అచంచలమైన భక్తికి ముఖ్యమంత్రి &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt;, అలాగే టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు చలించిపోయారు. ఆ వృద్ధ భక్తురాలితో పాటు ఆమె కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా శ్రీవారి దర్శనం చేయించాలని టీటీడీ చైర్మన్ నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఆమె వివరాలు తెలిస్తే తనకు తెలియజేయాలంటూ ఆయన &amp;nbsp;సోషల్ మీడియా ఎక్స్ ద్వారా నెటిజన్లను విజ్ఞప్తి చేశారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;రంగంలోకి విజిలెన్స్ అధికారులు &amp;ndash; నవనీతమ్మగా గుర్తింపు&lt;/strong&gt;&lt;br /&gt;చైర్మన్ విజ్ఞప్తిపై టీటీడీ విజిలెన్స్ అధికారులు తక్షణమే స్పందించి వివరాల కోసం ప్రయత్నించారు. ఆ వృద్ధురాలిని తమిళనాడు రాజధాని చెన్నైకి చెందిన నవనీతమ్మగా గుర్తించారు. చైర్మన్ ఆదేశాల మేరకు విజిలెన్స్ సిబ్బంది ఆమెను, ఆమె కుటుంబ సభ్యులను సంప్రదించి తిరుమల దర్శనానికి అవసరమైన ఏర్పాట్లు చేశారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/06/f1904d9a780a6cb7998ade8b165e3ee61783306023006233_original.jpg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe title=&quot;YouTube video player&quot; src=&quot;https://www.youtube.com/embed/XfbQLv0EZJ4?si=FpGNNNaudo3k_v8R&quot; width=&quot;560&quot; height=&quot;315&quot; frameborder=&quot;0&quot; allowfullscreen=&quot;allowfullscreen&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;
&lt;p&gt;Also Read: &lt;a href=&quot;https://telugu.abplive.com/spirituality/madurai-meenakshi-temple-architecture-why-does-goddess-appear-in-a-green-hue-know-in-telugu-252602&quot; target=&quot;_blank&quot; rel=&quot;noopener&quot;&gt;మధురై మీనాక్షి అమ్మవారు ఆకుపచ్చ రంగులో ఎందుకు దర్శనమిస్తారు?&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం &amp;ndash; మురిసిపోయిన కుటుంబ సభ్యులు&lt;/strong&gt;&lt;br /&gt;టీటీడీ చైర్మన్ నిర్ణయం ప్రకారం సోమవారం ఉదయం వృద్ధురాలైన నవనీతమ్మతో పాటు ఆమె కుటుంబ సభ్యులకు చైర్మన్ కార్యాలయ సిబ్బంది ప్రత్యేకంగా విఐపీ బ్రేక్ దర్శన భాగ్యాన్ని కల్పించారు. బయోమెట్రిక్ కౌంటర్ వద్ద సిబ్బంది దగ్గరుండి ఆమెను ఆలయంలోనికి తీసుకెళ్లారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో టీటీడీ ఈఓ ముద్దాడ రవిచంద్ర సమక్షంలో వేద పండితులు ఆమెకు వేదాశీర్వచనం చేశారు.&lt;/p&gt;
&lt;p&gt;ఈఓ రవిచంద్ర స్వయంగా వృద్ధురాలికి పట్టువస్త్రం కప్పి, తీర్థప్రసాదాలను అందజేశారు. అంతటితో ఆగకుండా ఆ శతాధిక వృద్ధురాలి కాళ్లకు నమస్కరించి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా నవనీతమ్మ మనవడు దిక్పతీ మాట్లాడుతూ.. &amp;lsquo;ఆ శ్రీనివాసుడి రూపంలో టీటీడీ చైర్మన్ &amp;nbsp;మా అమ్మమ్మకు, మా కుటుంబానికి ఇంతటి అద్భుతమైన దర్శన భాగ్యం కల్పించారు. టీటీడీకి, చైర్మన్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు&amp;rsquo; అంటూ భావోద్వేగానికి లోనయ్యారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/06/d4b4f2248dfdb930d0304ed3be4cb3de1783305627352233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Sri Sundararaja Swamy: తిరుచానూరులో వార్షిక అవతారోత్సవాలు.. జులై 5 నుంచి 3 రోజుల పాటు ఆధ్యాత్మిక వైభవం!]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/tirupati/annual-avatharotsavam-of-sri-sundararaja-swamy-at-tiruchanur-from-july-5-to-7-252554</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/tirupati/annual-avatharotsavam-of-sri-sundararaja-swamy-at-tiruchanur-from-july-5-to-7-252554#respond</comments><pubDate>Sat, 4 Jul 2026 23:57:24 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ తిరుపతి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/tirupati/annual-avatharotsavam-of-sri-sundararaja-swamy-at-tiruchanur-from-july-5-to-7-252554</guid><description><![CDATA[&lt;p&gt;Sri Sundararaja Swamy Temple |&amp;nbsp;తిరుపతి: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సుందరరాజస్వామివారి వార్షిక అవతారోత్సవాలు రేపటి నుండి (జూలై 5 నుండి 7వ తేదీ వరకు) 3 రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగనున్నాయి. ఈ పవిత్ర ఆధ్యాత్మిక వేడుకల సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, వైభవంగా అభిషేకాలు, నయనానందకరంగా ఊంజల్&amp;zwnj;సేవ మరియు వివిధ వాహనసేవలను భక్తిశ్రద్ధల మధ్య నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.&lt;/p&gt;
&lt;p&gt;ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజూ ఉదయం సుప్రభాతం, సహస్రనామార్చన, నిత్యార్చన వంటి విశేష పూజలు నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ సుందరరాజస్వామివారికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీరు, పసుపు, చందనంతో శాస్త్రోక్తంగా 'మహా అభిషేకం' జరుపుతారు. సాయంత్రం 5:45 నుండి 6:15 గంటల వరకు శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో స్వామివారికి ఊంజల్&amp;zwnj;సేవ నిర్వహిస్తారు. అనంతరం ప్రతి రోజు రాత్రి వేళల్లో స్వామివారు ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దివ్య దర్శనమివ్వనున్నారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;వాహనసేవల వివరాలు&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;జూలై 5 (మొదటి రోజు): పెద్దశేష వాహనంపై శ్రీ సుందరరాజస్వామివారి విహారం.&lt;/p&gt;
&lt;p&gt;జూలై 6 (రెండో రోజు): హనుమంత వాహనంపై స్వామివారి మహోత్సవ విహారం.&lt;/p&gt;
&lt;p&gt;జూలై 7 (మూడో రోజు): వైభవంగా గరుడవాహన సేవ. ఈ రోజు స్వామివారు నాలుగు మాడవీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహిస్తారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;Also Read:&amp;nbsp;&lt;a title=&quot;శివ మంత్రమే ఎందుకు 'మృత్యుంజయ' స్త్రోత్రం అయింది&quot; href=&quot;https://telugu.abplive.com/spirituality/mrityunjaya-mantra-why-shiva-mantra-has-become-a-source-of-mrityunjaya-mantra-know-in-details-23579&quot; target=&quot;&quot;&gt;శివ మంత్రమే ఎందుకు 'మృత్యుంజయ' స్త్రోత్రం అయింది&lt;/a&gt;&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;అవతారోత్సవాల పురాణ విశిష్టత&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఈ అవతారోత్సవాలకు ఒక విశిష్టమైన చారిత్రక, పురాణ ప్రాశస్త్యం ఉంది. పూర్వం మధురైలోని అళగిరి పెరుమాళ్ ఆలయంపై ముష్కరులు దాడులు చేసిన సమయంలో, అక్కడి అర్చకులు శ్రీ సుందరరాజస్వామివారి ఉత్సవమూర్తులను రక్షణ కోసం తిరుచానూరుకు తీసుకువచ్చినట్లు ఆలయ సంప్రదాయం చెబుతోంది. ఆ తర్వాత మహంతుల కాలంలో ఇక్కడ మూలవిరాట్టును ప్రతిష్ఠించి నిత్యారాధనలు ప్రారంభించారు. ఈ పవిత్ర చారిత్రక ఘట్టాన్ని స్మరించుకుంటూ ప్రతి ఏడాది ఇక్కడ అవతారోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.&lt;/p&gt;
&lt;p&gt;ఈ ఉత్సవాల కారణంగా జూలై 5 నుండి 7వ తేదీ వరకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జరిగే నిత్య ఊంజల్&amp;zwnj;సేవను టీటీడీ రద్దు చేసింది. ఈ 3 రోజుల పాటు జరిగే శ్రీ సుందరరాజస్వామివారి అవతారోత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని, స్వామివారి కృపాకటాక్షాలు పొందాలని టీటీడీ అధికారులు విజ్ఞప్తి చేశారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/04/a34bb2bea12c0880f0c3f942a75a473d1783189315254233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Breaking News: రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో భారత్‌పై ఇంగ్లాండ్ ఘన విజయం]]></title><link>https://telugu.abplive.com/news/today-top-stories-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-4th-july-2026-252486</link><comments>https://telugu.abplive.com/news/today-top-stories-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-4th-july-2026-252486#respond</comments><pubDate>Sat, 4 Jul 2026 10:38:03 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ న్యూస్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/today-top-stories-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-4th-july-2026-252486</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Top Stories Today | ఈరోజు వార్తల ముఖ్యాంశాలు..&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;h2&gt;రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో భారత్&amp;zwnj;పై ఇంగ్లాండ్ ఘన విజయం&lt;/h2&gt;
&lt;p&gt;ఇంగ్లాండ్&amp;zwnj;తో జరిగిన రెండో టీ20లో భారత్ ఓటమి పాలైంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (49), అభిషేక్ శర్మ (43), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (37) పరుగులతో రాణించారు. ఇంగ్లాండ్ ఓపెనర్లు డకౌట్ అయినప్పటికీ జాకబ్ బెథెల్ (76 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో జట్టుకు విజయాన్ని అందించాడు. మరో 6 బంతులు మిగిలుండగానే ఇంగ్లాండ్ రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.&lt;/p&gt;
&lt;h2&gt;సాయికృష్ణ తరహాలో పోలీస్ స్టేషన్లోనే చంపేయండి: ప్రశ్న రావణ్&lt;/h2&gt;
&lt;p&gt;వరుస అరెస్టులపై &amp;lsquo;ప్రశ్న రావణ్&amp;rsquo; ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. వేంపాడు టోల్ గేట్ వద్ద నాలుగో బెయిల్ వచ్చిన వెంటనే, పోలీసులు ఐదోసారి తనను అరెస్టు చేసి నక్కపల్లికి తరలించడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్&amp;zwnj;ను ప్రశ్నించినందుకే సుమారు 500 మంది పోలీసులు ప్రజా సమస్యలను వదిలేసి తన చుట్టూ తిరగడం సిగ్గుచేటన్నారు. ఒక మనిషిని చంపగలరేమో కానీ, ప్రశ్నించే గొంతును నొక్కలేరని స్పష్టం చేశారు. గత నాలుగు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నానని తెలిపిన ఆయన, ఇలా వేధించే బదులు నేరుగా పోలీస్ స్టేషన్&amp;zwnj;లోనే చంపేయాలని సీఎం &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt;, లోకేష్, పవన్ కళ్యాణ్&amp;zwnj;లకు సవాలు విసిరారు.&lt;/p&gt;
&lt;h2&gt;సాయికృష్ణ కేసులో కీలక మలుపు.. హైకోర్టుకు సిట్ నివేదిక&lt;/h2&gt;
&lt;p&gt;విజయవాడలో తీవ్ర సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు కీలక నివేదికను సమర్పించింది. ఈ నివేదిక ద్వారా కేసు దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన పలు సంచలన విషయాలను సిట్ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ టెర్రస్ (పైకప్పు)పై లభించిన ఎముకలు, బూడిద, ఒక స్టీల్ బ్రాస్&amp;zwnj;లెట్ మరియు ఇతర కీలక వస్తువులను ఉన్నతాధికారుల సమక్షంలో సిట్ సేకరించింది. ఈ వస్తువులన్నింటినీ ఒక న్యాయాధికారి సమక్షంలో పారదర్శకంగా సీల్ వేసి, తదుపరి పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ కి పంపినట్లు సిట్ తన నివేదికలో పేర్కొంది.&lt;/p&gt;
&lt;p&gt;పోలీస్ స్టేషన్ పైకప్పుపై లభించిన ఎముకలు, బూడిద అసలు సాయికృష్ణవేనా కాదా? అనే అత్యంత కీలకమైన కోణంలో ప్రస్తుతం దర్యాప్తు సాగుతోంది. ఈ విషయాన్ని శాస్త్రీయంగా నిరూపించడం కోసం, సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి యొక్క డీఎన్ఏ (DNA) నమూనాలను సేకరించి, వాటిని లభించిన ఎముకల నమూనాలతో సరిపోల్చాలని సిట్ యోచిస్తోంది. ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక మరియు డీఎన్ఏ పరీక్షల అనంతరం ఈ కేసులో మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.&lt;/p&gt;
&lt;h2&gt;ప్రశ్న రావణ్&amp;zwnj;కు బెయిల్.. జైలు నుంచి విడుదల&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసులలో నిందితుడిగా ఉన్న 'ప్రశ్న రావణ్'కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ లభించిన అనంతరం ఆయన జైలు నుండి విడుదలయ్యాడు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ప్రశ్న రావణ్.. ఈ కష్టసమయంలో తనకు అండగా నిలిచి, మద్దతు తెలిపిన మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపాడు.&lt;/p&gt;
&lt;p&gt;ఈ కేసులకు సంబంధించిన పూర్తి వివరాలపై తాను త్వరలోనే కూలంకషంగా ఒక ప్రెస్&amp;zwnj;మీట్ ఏర్పాటు చేసి, అన్ని విషయాలను ప్రజల ముందు మాట్లాడుతానని ఆయన స్పష్టం చేశాడు. అలాగే, చట్టపరంగా తనకు ఎంతగానో సపోర్టు చేసి, బెయిల్ రావడంలో కీలక పాత్ర పోషించిన లాయర్ జడ శ్రవణ్ కు కృతజ్ఞతలు తెలిపాడు. అనంతరం ప్రశ్న రావణ్ తన లాయర్ శ్రవణ్&amp;zwnj;తో కలిసి నేరుగా ఇంటికి బయలుదేరారు. కాగా, ప్రశ్న రావణ్&amp;zwnj;పై ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పదుల సంఖ్యలో వివిధ కేసులు నమోదైన సంగతి తెలిసిందే.&lt;/p&gt;
&lt;h2&gt;కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పోడు భూముల కోసం స్థానికుల ఆందోళన&lt;/h2&gt;
&lt;p&gt;కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని దేవుడుపల్లి బీట్&amp;zwnj;లో, సూర్ధపూర్ గ్రామ శివారులో ఉన్న సుమారు 150 హెక్టార్ల భూమిని అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ భూములు పోడు సాగు చేస్తున్న రైతుల ఆధీనంలో ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇటీవల అటవీశాఖ అధికారులు ట్రెంచ్ తవ్వకాలకు వెళ్లగా, స్థానిక రైతులు అడ్డుకున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఈ నేపథ్యంలో అటవీశాఖ అధికారులు ముందస్తు చర్యలో భాగంగా &amp;nbsp;వందమందికి పైగా పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, జేసీబీల సహాయంతో అటవీశాఖ అధికారులు కందకాల తవ్వకాలు చేపట్టారు.రైతులు భూముల వద్దకు చేరకుండా ముందస్తుగానే పోలీసులు గ్రామ పరిసరాల్లో బందోబస్తు ఏర్పాటు చేశారు.&lt;/p&gt;
&lt;h2&gt;5 వేల పోలీస్ ఉద్యోగాలా.. 19 వేల పోస్టులు వేయాలి.. నిరుద్యోగుల ఆందోళన&lt;/h2&gt;
&lt;p&gt;తెలంగాణలో కేవలం 5 వేల పోలీస్ ఉద్యోగాల భర్తీ ప్రకటనపై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 19 వేల పోస్టులు భర్తీ చేయాలంటూ దిల్&amp;zwnj;సుఖ్&amp;zwnj;నగర్&amp;zwnj;లో ఆందోళన చేపట్టారు. ఇచ్చిన మాట తప్పి మోసం చేశారని సీఎం రేవంత్&amp;zwnj; రెడ్డిపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన నిరుద్యోగులను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.&lt;/p&gt;
&lt;h2&gt;&lt;strong&gt;గచ్చిబౌలిలో ట్రిపుల్&amp;zwnj; ఐటీ విద్యార్థి ఆత్మహత్య&lt;/strong&gt;&lt;/h2&gt;
&lt;p&gt;హైదరాబాద్ గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్&amp;zwnj;లో విషాదం చోటుచేసుకుంది. కంప్యూటర్ సైన్స్ చదువుతున్న ఖమ్మం జిల్లాకు చెందిన అనిరుధ్ అనే విద్యార్థి శనివారం కాలేజీ భవనం 6వ అంతస్తు నుండి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.&lt;/p&gt;
&lt;h2&gt;&lt;strong&gt;&amp;nbsp;20 ఏళ్ల రాజకీయ ప్రస్థానం.. సీఎం రేవంత్ రెడ్డికి మంత్రుల అభినందనలు&lt;/strong&gt;&lt;/h2&gt;
&lt;p&gt;మిడ్జిల్ మండలం జడ్పీటీసీగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి, రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి వరకు విజయవంతంగా 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న శుభసందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వాకిటి శ్రీహరి శుభాకాంక్షలు తెలిపారు.&lt;/p&gt;
&lt;blockquote class=&quot;twitter-tweet&quot;&gt;
&lt;p dir=&quot;ltr&quot; lang=&quot;te&quot;&gt;మిడ్జిల్ మండలం జడ్పీటీసీగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి, రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి వరకు నేటితో విజయవంతంగా 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న శుభసందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. &lt;a title=&quot;రేవంత్ రెడ్డి&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Revanth-Reddy&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;రేవంత్ రెడ్డి&lt;/a&gt; గారికి ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క గారు, మంత్రులు శ్రీమతి సీతక్క,&amp;hellip; &lt;a href=&quot;https://t.co/CWYXWKWxFF&quot;&gt;pic.twitter.com/CWYXWKWxFF&lt;/a&gt;&lt;/p&gt;
&amp;mdash; Telangana Congress (@INCTelangana) &lt;a href=&quot;https://x.com/INCTelangana/status/2073317362762416434?ref_src=twsrc%5Etfw&quot;&gt;July 4, 2026&lt;/a&gt;&lt;/blockquote&gt;
&lt;p&gt;
&lt;script src=&quot;https://platform.x.com/widgets.js&quot; async=&quot;&quot; charset=&quot;utf-8&quot;&gt;&lt;/script&gt;
&lt;/p&gt;
&lt;h2&gt;సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో అనేక అనుమానాలు.. సీబీఐ విచారణకు వైసీపీ నేతల వినతి&lt;/h2&gt;
&lt;p&gt;విజయవాడ గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసుపై జరుగుతున్న మెజిస్టీరియల్ విచారణకు వైసిపి నేతలు అంబటి రాంబాబు, మల్లాది విష్ణు, సుధాకర్ బాబు, వంగవీటి నరేంద్ర హాజరై, తమకున్న పలు అనుమానాలతో కూడిన వినతి పత్రాన్ని అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ, సాయికృష్ణ లాకప్ డెత్, అనంతరం మృతదేహం మాయం చేయడం వెనుక అనేక సందేహాలు ఉన్నాయని, దీనిని తాము ప్రభుత్వ హత్యగానే భావిస్తున్నామని ఆరోపించారు. ఈ ఘటనలోని వాస్తవాలు వెలుగుచూసి అసలు దోషులు బయటకు రావాలంటే కేసును తక్షణమే సిబిఐ విచారణకు అప్పగించాలని వారు డిమాండ్ చేశారు.&lt;/p&gt;
&lt;h2&gt;విజయవాడ సాయికృష్ణ లాకప్ డెత్.. ప్రారంభమైన మెజిస్టీరియల్ విచారణ&lt;/h2&gt;
&lt;p&gt;గాదె సాయికృష్ణ లాకప్ డెత్ ఘటనపై సబ్ కలెక్టర్ ఆఫీసులో మెజిస్టీరియల్ విచారణ ప్రారంభమైంది. నూతన భారతీయ న్యాయ సంహిత చట్ట నిబంధనలకు లోబడి, జాతీయ మానవ హక్కుల కమిషన్ మార్గదర్శకాలను ఖచ్చితంగా అనుసరిస్తూ ఈ విచారణను నిష్పక్షపాతంగా జరపాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఆదేశించగా, ఇందులో భాగంగా బాధితుడి తల్లి విజయలక్ష్మి మరియు ఇతర కుటుంబ సభ్యులు తమ వాంగ్మూలాన్ని, సాక్ష్యాలను అధికారులకు సమర్పించేందుకు కార్యాలయానికి చేరుకున్నారు. అలాగే ఈ ఘటనకు సంబంధించి ప్రజల వద్ద ఎలాంటి సమాచారం లేదా ఆధారాలు ఉన్నా వాటిని వెంటనే విచారణాధికారికి సమర్పించి సహకరించాలని అధికారులు ఒక ప్రకటనలో కోరారు.&lt;/p&gt;
&lt;h2&gt;Krishna District Latest News: కృష్ణా జిల్లా గూడూరులో విషాదం- ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళల ఆత్మహత్య &amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;Krishna District Latest News: కుటుంబ కలహాలు ముగ్గురు మహిళల బలవన్మరణానికి కారణమయ్యాయి. కృష్ణాజిల్లా గూడూరు మండల అనంతాయిపేటలో ఈ విషాదం చోటుచేసుకుంది. ఒకేసారి ముగ్గురు మహిళలు మరణించడం స్థానికంగా కూడా కలకలం రేపింది. &amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Warangal Latest News: వరంగల్&amp;zwnj; భద్రకాళి టెంపుల్ వద్ద ఉద్రిక్తత- బీజేపీ శుద్ధి కార్యక్రమాన్ని అడ్డకున్న పోలీసులు&lt;/h2&gt;
&lt;p&gt;&lt;strong&gt;Warangal Latest News:&lt;/strong&gt; వరంగల్&amp;zwnj;లో &lt;a title=&quot;కాంగ్రెస్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Congress&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కాంగ్రెస్&lt;/a&gt;, బీఆర్&amp;zwnj;ఎస్&amp;zwnj; సవాళ్లు, ప్రమాణాలకు వ్యతిరేకంగా బీజేపీ నిరసన చేపట్టింది. భద్రకాళీ అమ్మవారి టెంపుల్ వద్ద శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టింది. దీన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ కార్యక్రమానికి స్థానికంగా ఉన్న &lt;a title=&quot;బీజేపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/BJP&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;బీజేపీ&lt;/a&gt; కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. పోలీసులు వారిని అడ్డుకోవడం కాసేపు ఉద్రిక్తత నెలకొంది. &amp;nbsp;&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/04/9a7e67f925756bc95af2e12f2d945c8a1783141633275215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Tirumala Latest News: జూన్ నెలలో రికార్డు స్థాయిలో తిరుమల లడ్డూల విక్రయం- టీటీడీ  కీలక ప్రకటన]]></title><link>https://telugu.abplive.com/photo-gallery/spirituality/tirumala-latest-news-record-sales-of-laddu-prasadam-in-june-ttd-key-announcement-252443</link><comments>https://telugu.abplive.com/photo-gallery/spirituality/tirumala-latest-news-record-sales-of-laddu-prasadam-in-june-ttd-key-announcement-252443#respond</comments><pubDate>Fri, 3 Jul 2026 18:32:45 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ ఆధ్యాత్మికం ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/photo-gallery/spirituality/tirumala-latest-news-record-sales-of-laddu-prasadam-in-june-ttd-key-announcement-252443</guid><description><![CDATA[]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/03/8c6f29d9a1108484c6c3a61b132acdec1783083715450215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[JSW Rayalaseema Steel Plant: కడప స్టీలు ప్లాంటు నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన.. దేశంలోనే తొలి గ్రీన్‌ స్టీల్‌ ప్లాంట్]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/kurnool/chandrababu-launches-rs-16350-crore-jsw-rayalaseema-steel-plant-indias-first-green-steel-factory-in-kadapa-252396</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/kurnool/chandrababu-launches-rs-16350-crore-jsw-rayalaseema-steel-plant-indias-first-green-steel-factory-in-kadapa-252396#respond</comments><pubDate>Fri, 3 Jul 2026 12:13:23 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ కర్నూలు ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/kurnool/chandrababu-launches-rs-16350-crore-jsw-rayalaseema-steel-plant-indias-first-green-steel-factory-in-kadapa-252396</guid><description><![CDATA[&lt;p&gt;జమ్మలమడుగు: రాయలసీమ ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ఉక్కు పరిశ్రమ కల ఎట్టకేలకు సాకారం అవుతోంది. ఈ ప్రాంత పారిశ్రామిక రూపురేఖలను పూర్తిగా మార్చేసే సరికొత్త అధ్యాయానికి జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె కొండ ప్రాంతం వేదికగా మారింది. &amp;nbsp;ప్రతిష్ఠాత్మక జేఎస్&amp;zwnj;డబ్ల్యూ (JSW) రాయలసీమ ఉక్కు కర్మాగార (Steel Plant) శంకుస్థాపన పనులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ప్రారంభించారు. దాదాపు రూ.16,350 కోట్ల భారీ బడ్జెట్&amp;zwnj;తో కడప స్టీల్ ప్లాంట్&amp;zwnj;ను నిర్మిస్తున్నారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;దేశంలోనే తొలి గ్రీన్&amp;zwnj; స్టీల్&amp;zwnj; ప్లాంట్&lt;/strong&gt;&lt;br /&gt;పర్యావరణ పరిరక్షణకు ఏపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తూ ఈ స్టీల్ ప్లాంటులో అత్యాధునిక ఎలక్ట్రిక్&amp;zwnj; ఆర్క్&amp;zwnj; ఫర్నేస్&amp;zwnj; (EAF) టెక్నాలజీని వినియోగిస్తున్నారు. దీనివల్ల పర్యావరణానికి హాని కలిగించే కార్బన్ ఉద్గారాలు భారీ స్థాయిలో తగ్గి, పర్యావరణహితమైన గ్రీన్&amp;zwnj; స్టీల్ ఉత్పత్తి అవుతుందని అధికారులు తెలిపారు. ఈ తరహా అత్యాధునిక ప్లాంట్&amp;zwnj; భారత్&amp;zwnj;లోనే మొట్టమొదటిదని జేఎస్&amp;zwnj;డబ్ల్యూ పరిశ్రమ వర్గాలు తెలిపాయి. దీనికి తోడుగా, పరిశ్రమ అవసరాల కోసం 2,400 ఎకరాల్లో 400 మెగావాట్ల సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులను జేఎస్&amp;zwnj;డబ్ల్యూ నియో ఎనర్జీ సంస్థ నిర్మిస్తోంది. ఉక్కు పరిశ్రమతో పాటు ఈ గ్రీన్ ఎనర్జీ ప్లాంట్లకు కూడా సీఎం &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; శుక్రవారం శంకుస్థాపన చేశారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe title=&quot;YouTube video player&quot; src=&quot;https://www.youtube.com/embed/Q-jTCZIzH6Y?si=5vmNhkym-M6l14x8&quot; width=&quot;560&quot; height=&quot;315&quot; frameborder=&quot;0&quot; allowfullscreen=&quot;allowfullscreen&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;
&lt;p&gt;కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు ప్రస్థానంలో ఎన్నో మలుపులు చోటుచేసుకున్నాయి. 2019లో తొలి ప్రతిపాదనలు రాగా.. 2025లో జేఎస్&amp;zwnj;డబ్ల్యూ సంస్థ నివేదికలకు రాష్ట్ర మంత్రివర్గం, ఎస్&amp;zwnj;ఐపీబీ (SIPB) గ్రీన్&amp;zwnj; సిగ్నల్&amp;zwnj; ఇచ్చాయి. అనంతరం గత మార్చి 25న 1,100 ఎకరాల భూమిని సంస్థకు అధికారికంగా అప్పగించడంతో పనులు ఊపందుకున్నాయి. ఈ భారీ పరిశ్రమ ఏర్పాటుతో రాయలసీమలోని స్థానిక ఎంఎస్&amp;zwnj;ఎంఈలకు, రవాణా రంగానికి కొత్త ఉపాధి అవకాశాలు లభించి భారీ ఊపు రానుంది.&lt;/p&gt;
&lt;p&gt;Also Read: &lt;a href=&quot;https://telugu.abplive.com/andhra-pradesh/visakhapatnam/gudivada-amarnath-slams-alliance-government-accuses-chandrababu-of-claiming-credit-for-ysrcps-kadapa-steel-plant-work-252391&quot; target=&quot;_blank&quot; rel=&quot;noopener&quot;&gt;Kadapa Steel Plant: మళ్లీ మళ్లీ జరగాలి పెళ్లి.. చంద్రబాబు కడప స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనపై గుడివాడ అమర్నాథ్ సెటైర్లు&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;జేఎస్&amp;zwnj;డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్ ద్వారా 2,500 మందికి ప్రత్యక్షంగా, మరో 5,000 మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. మొత్తం 1,100 ఎకరాల విస్తీర్ణంలో రెండు దశల్లో ఈ ప్లాంటు నిర్మాణం పూర్తి చేయనున్నారు. మొదటి దశలో రూ. 4,800 కోట్ల పెట్టుబడితో పనులను చేపట్టి, 2028 ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఆ తర్వాత రెండో దశలో రూ. 11,850 కోట్ల భారీ వ్యయంతో ఈ ప్రాజెక్టును పూర్తి చేయనున్నారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;వైఎస్సార్ హయాం నుండి జగన్ పాలన వరకు.. ప్లాంట్ ప్రస్థానం&lt;/strong&gt;&lt;br /&gt;కడపలో స్టీలు ప్లాంటు ఏర్పాటుకు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే మొదలైంది. 2007లో బ్రహ్మణి స్టీల్స్ కు వైఎస్సార్ శంకుస్థాపన చేశారు. అయితే వైఎస్సార్ అకాల మరణం, ఓబులాపురం మైనింగ్ కేసులో గాలి జనార్దనరెడ్డి జైలుకు వెళ్లడంతో నాటి &lt;a title=&quot;కాంగ్రెస్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Congress&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కాంగ్రెస్&lt;/a&gt; సర్కార్ బ్రహ్మణి స్టీల్స్ ఒప్పందాన్ని రద్దు చేసింది. రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు 2018 డిసెంబరు 28న జమ్మలమడుగు నియోజకవర్గం మైలవరం మండలం కంబాలదిన్నెలో 'రాయలసీమ స్టీలు కార్పొరేషన్' పనులకు శంకుస్థాపన చేశారు. కానీ, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ &lt;a title=&quot;జగన్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/cm-jagan&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;జగన్&lt;/a&gt; పాత ప్రాజెక్టును పక్కనపెట్టారు. &amp;nbsp;2019 డిసెంబరులో సున్నపురాళ్లపల్లె వద్ద వైఎస్ఆర్ స్టీలు ప్లాంటు కార్పొరేషన్ పేరిట జేఎస్&amp;zwnj;డబ్ల్యూ సంస్థతో కలిసి శంకుస్థాపన చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;గత ఏడాది కడపలో నిర్వహించిన మహానాడు వేదికగా &lt;a title=&quot;టీడీపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/tdp&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;టీడీపీ&lt;/a&gt; అధినేత చంద్రబాబు జిల్లా ప్రజలకు ఒక కీలక హామీ ఇచ్చారు. &amp;nbsp;కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ నిర్మాణాన్ని ఖచ్చితంగా పూర్తి చేస్తామన్నారు. ఇచ్చిన మాట ప్రకారమే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులకు శుక్రవారం నాడు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం పనులు పూర్తి చేస్తామని.. దీని ద్వారా 3000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;బహిరంగ సభకు అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు&lt;/strong&gt;&lt;br /&gt;ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి అధికారులు ఘనంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. కలెక్టర్&amp;zwnj; శ్రీధర్, ఎస్పీ నచికేత్&amp;zwnj; విశ్వనాథ్, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు, జేఎస్&amp;zwnj;డబ్ల్యూ ప్రతినిధుల రాక కోసం 4 హెలిప్యాడ్లను సిద్ధం చేశారు. సుమారు 25 వేల మందితో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. సభకు వచ్చే వాహనాల కోసం వందల బస్సులు, కార్ల పార్కింగ్ సౌకర్యాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/03/fe603cd84875263efe59cd726d60f7211783060701099233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[VB GRAM G Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో వీబీ గ్రామ్‌జీ పథకం ప్రారంభం! గ్రామాల్లో విప్లవం మొదలైందన్న సీఎం, డిప్యూటీ సీఎం!]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/tirupati/ap-cm-chandrababu-naidu-launches-vb-gram-gi-scheme-in-tirupati-district-with-pawan-kalyan-and-shivraj-singh-chouhan-252307</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/tirupati/ap-cm-chandrababu-naidu-launches-vb-gram-gi-scheme-in-tirupati-district-with-pawan-kalyan-and-shivraj-singh-chouhan-252307#respond</comments><pubDate>Thu, 2 Jul 2026 15:32:37 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ తిరుపతి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/tirupati/ap-cm-chandrababu-naidu-launches-vb-gram-gi-scheme-in-tirupati-district-with-pawan-kalyan-and-shivraj-singh-chouhan-252307</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;VB GRAM G Andhra Pradesh:&amp;nbsp;&lt;/strong&gt;ఆంధ్రప్రదేశ్&amp;zwnj; రాష్ట్ర గ్రామీణ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చే దిశగా కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. తిరుతి జిల్లాలోని ముక్కాల వారి పల్లె వేదికగా వికసిత భారత్&amp;zwnj; జి రామ్&amp;zwnj; జి పథకానిి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివారాజ్ సింగ్ చౌహాన్, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్&amp;zwnj; పాల్గొన్నారు. గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా, పారదర్శకమైన పాలనతో పేదరిక నిర్మూలన దిశగా ఈ పథకాన్ని రూపొందించినట్టు ప్రభుత్వం ప్రకటించింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;ఏంటీ ఈ వీబీ గ్రామ్&amp;zwnj;జీ ?&lt;/h2&gt;
&lt;p&gt;వీబీ గ్రామ్&amp;zwnj;జీ అనేది గతంలో ఉన్న ఉపాధి హామీ పథకానికి మెరుగై సవరణలు చేస్తూ, గ్రామాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిచ్చేలా రూపొందించిన కొత్త విధానం. ఈ పథకం కింద కేవలం శ్రమ శక్తిని వినియోగించడమే కాకుండా, శాశ్వత గ్రామీణ ఆస్తుల నిర్మాణానికి పెద్ద పీట వేస్తారు. దీని ద్వారా గ్రామాల్లో సిమెంట్&amp;zwnj; రహదారులు, మురుగు నీటి కాలువలు, భూసార పరిరక్షణ పనులు, పశువుల కోసం నీటి తొట్టెలు వంటి మౌలిక సదుపాయాలను నిర్మిస్తారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఈ పథకం ప్రధాన ఉద్దేశం గ్రామాలకు ఆర్థికంగా సామాజికంగా బలాన్ని ఇవ్వడం. కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కోసం దేశవ్యాప్తంగా రూ. 7.5 లక్షల కోట్లు కేటాయించగా, ప్రతి గ్రామానికి ఉపాధి కార్యక్రమాల నిమిత్తం &amp;nbsp;సుమారు రెండు కోట్లు అందజేయాలని నిర్ణయించింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;దేశవ్యాప్తంగా జులై 1 నుంచే పథకం ప్రారంభమైంది. అయితే ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లో మాత్రం రెండో తేదిన స్టార్ట్ చేశారు. తిరుపతి జిల్లా ముక్కాలవారి పల్లెలో గురువారం నాడు ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు తన పర్యటనలో ఈ పథకాన్ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ&amp;zwnj; , కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్&amp;zwnj;తో కలిసి ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏ్పాటు చేసిన సభను ఉద్దేశించి ప్రసంగించారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;పథకం అమలులో గతంలో అమలులో ఉన్న లోపాలను సరిదిద్దుతూ అనేక సంస్కరణలు ప్రవేశపెట్టారని &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; తెలిపారు. గతంలో ఉన్నవ వంద రోజుల పని కాలన్ని 125రోజులకు పెంచారని వివరించారు. మరికొన్ని సందర్భాల్లో ఏడాదికి 185 రోజుల వరకు పని కల్పించే అవకాశం ఉందని సీఎం తెలిపారు. గతంలో ఎంజీనరేగాలో కేంద్ర, రాష్ట్రాల వాటా 90:10గా ఉండేదని, ఇప్పుడు రాష్ట్రాల వాటాను 40 శాతానికి పెంచడం ద్వారా అభివృద్ధి పనుల్లో రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యాన్ని మరింత పెంచారని అభిప్రాయపడ్డారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;నిధుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు రియల్&amp;zwnj; టైమ్&amp;zwnj; మానిటరింగ్, డిజిటల్&amp;zwnj; విధానాన్ని తీసుకుచ్చారని వివరించారు. దీని వల్ల దొంగ లెక్కలు రాసే అవకాశం ఉండదని తెలిపారు. కార్మికులు చేసిన పనికి వేతనం ఆలస్యం కాకుండా, నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే డబ్బులు జమ అవుతాయన్నారు. ఏ గ్రామంలో ఏ పని చేపట్టాలనేది స్థానికంగా గ్రామ సభలే నిర్ణయించుకుంటాయని అన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఆంధ్రప్రదేశ్&amp;zwnj; రాష్ట్రంలో ఈ పథకం అమలు కోసం మొత్తం రూ. 12, 845 కోట్లు ఖ్చు చేయనున్నట్టు డిప్యూటీ సీఎం &lt;a title=&quot;పవన్ కల్యాణ్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Pawan-Kalyan&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;పవన్ కల్యాణ్&lt;/a&gt; తెలిపారు. ఇందులో కేంద్రం నుంచి 7700 కోట్లు, రాష్ట్ర వాటాగా 4000 కోట్లు కలిపి ప్రారంభంలో 11000 కోట్లుపైనే నిధులు సిద్ధం చేసినట్టు తెలిపారు. గత రెండేళ్లలో పల్లె పండుగ వంటి కార్యక్రమాల ద్వారా 16, 695 కోట్ల ఉపాధి నిధులను ప్రభుత్వం సమర్థవంతంగా వినియోగించిందని పవన్ గుర్తు చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe class=&quot;vidfyVideo&quot; style=&quot;border: 0px;&quot; src=&quot;https://telugu.abplive.com/web-stories/auto/what-is-the-meaning-of-g-ram-g-scheme-252270&quot; width=&quot;631&quot; height=&quot;381&quot; scrolling=&quot;no&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/02/9e808521bb7439195b7b3272f8879d661782986400876215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Prasna Ravan Bail and Arrest: అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్‌ ప్రశ్న రావణ్‌ మళ్లీ అరెస్టు! 2025 నాటి కేసులో చర్యలు!]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/rajamundry/prasna-ravan-youtuber-arrest-sarpavaram-pithapuram-drama-bail-and-rearrest-updates-252279</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/rajamundry/prasna-ravan-youtuber-arrest-sarpavaram-pithapuram-drama-bail-and-rearrest-updates-252279#respond</comments><pubDate>Thu, 2 Jul 2026 10:50:39 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ రాజమండ్రి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/rajamundry/prasna-ravan-youtuber-arrest-sarpavaram-pithapuram-drama-bail-and-rearrest-updates-252279</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Prasna Ravan Bail and Arrest:&lt;/strong&gt; ఈ మధ్య కాలంలో జరిగిన దళిత క్రైస్తవ సభలో అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్&amp;zwnj; ప్రశ్న రావణ్&amp;zwnj;ను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఆయనకు అర్థరాత్రి బెయిల్ మంజూరు అయ్యింది. అయితే ఆయన్ని అరెస్టు చేసినప్పటి నుంచి మెజిస్ట్రేట్&amp;zwnj; వద్దకు తీసుకెళ్లే వరకు పిఠాపురంలో &amp;nbsp;హైడ్రామా సాగింది. చివరకు అర్థరాత్రి బెయిల్ వచ్చింది. అయితే వెంటనే మరో కేసులో అరెస్టు చేస్తున్నట్టు పోలీసులు ఆయనకు, ఆయన తరఫున లాయర్&amp;zwnj;కు తెలియజేశారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;రావణ్&amp;zwnj;ను అరెస్ట్ చేసిన పోలీసులు పిఠాపురం జగ్గయ్య చెరువు వద్ద ఉన్న న్యాయమూర్తుల బంగ్లాకు తీసుకువెళ్లి మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. సుమారు రెండు గంటల పాటు బెయిల్&amp;zwnj;పై వాదనలు జరిగాయి. నిందితుడు తరపున జడ శ్రవణ్ వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు విన్న న్యాయమూర్తి &amp;nbsp;నిందితుడికి వ్యక్తిగత పూచిపై బెయిల్ గ్రాంట్ చేశారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;అంతకు ముందు పిఠాపురం పోలీస్ స్టేషన్&amp;zwnj;లో హైడ్రామా నడిచింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్&amp;zwnj;పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన జోసఫ్&amp;zwnj; ఎలియాస్&amp;zwnj; ప్రశ్న రావణ్&amp;zwnj;ను అప్పగించాలని పెద్ద ఎత్తున జనసైనికులు స్టేషన్&amp;zwnj;ను చుట్టుముట్టారు. అప్పటికే ఆయన అరెస్టు సమాచారం అందుకున్న దళిత కైస్తవ సంఘాలు అక్కడకు చేరుకున్నారు. వారు ఆయనకు రక్షణగా నిలిచారు. దీంతో పిఠాపురంలో పోలీస్&amp;zwnj; స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. అయితే పరిస్థితి చేయిదాటిపోకుండా ఉండేందుకు పోలీసులు భారీగా బలగాలను మోహరించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;పరిస్థితి మరింత హీటెక్కకుండానే నిరసనకారులను అక్కడి నుంచి పోలీసులు తీసుకెళ్లిపోయారు. అయినా కొందరు అక్కడే నినాదాలు చేస్తూ ఉండిపోయారు. ఈ పరిస్థితుల్లో నాటకీయపరిణామాల మధ్య రావణ్&amp;zwnj;ను పోలీసులు సైలెంట్&amp;zwnj;గా మెజిస్ట్రేట్&amp;zwnj; ముందు హాజరుపరిచారు. అర్థరాత్రి వరకు సాగిన వాదనల తర్వాత ఆయనకు న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;అయితే ఇలా బెయిల్ వచ్చిందో లేదో మరో కేసులో రావణ్&amp;zwnj;ను పోలీసులు అరెస్టు చేస్తున్నట్టు తెలిపారు. &amp;nbsp;గత ఏడాది సర్పవరం పోలీస్&amp;zwnj; స్టేషన్&amp;zwnj;లో నమోదు అయిన కేసులో పోలీసులు అదుపులోకి తీసుకుని సర్పవరం తరలించారు. దీన్ని ఆయన తరపున వాదిస్తున్న శ్రవణ్&amp;zwnj; ఖండించారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఉప ముఖ్యమంత్రిపై ఎలాంటి తప్పుడు కామెంట్స్ చేయలేదని, గతంలో &lt;a title=&quot;పవన్ కల్యాణ్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Pawan-Kalyan&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;పవన్ కల్యాణ్&lt;/a&gt; చేసిన వ్యాఖ్యలను మాత్రమే గుర్తు చేశారని అన్నారు. ఈ మధ్య కాలంలో నేతలు చేస్తున్న కామెంట్స్&amp;zwnj;పై చర్యలు తీసుకోకుండా ప్రశ్నిస్తున్న గొంతుకలను నొక్కేందుకు మాత్రమే అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;జూన్ 28న జరిగిన దళిత క్రైస్తవ సమర శంఖారావంలో రావణ్&amp;zwnj; శృతిమించి మాట్లాడారు. సీఎం &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt;, ఉప ముఖ్యమంత్రి పవన్&amp;zwnj; కల్యాణ్, రాధా మనోహర్&amp;zwnj;దాస్&amp;zwnj;పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎవరైనా చేయిస్తున్నారా అనే కోణంలో పోలీసులు ప్రశ్నించారు. దీనికి సంబంధించిన వివరాలు రాబడుతున్నారు. ఆయనకు వచ్చే ఆదాయ వనరులను పరిశీలిస్తున్నారు.&amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/02/4c86e3858748699ae53d301fabd3dff01782969548445215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[AP TET 2026: ఆంధ్రప్రదేశ్‌ టెట్ అభ్యర్థులకు అలర్ట్! దరఖాస్తుల సవరణకు వన్ టైమ్ డిలీట్ ఆప్షన్! పూర్తి వివరాలు ఇవే!]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/ap-tet-2026-application-correction-one-time-delete-process-updates-252273</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/ap-tet-2026-application-correction-one-time-delete-process-updates-252273#respond</comments><pubDate>Thu, 2 Jul 2026 09:57:57 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ అమరావతి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/amravati/ap-tet-2026-application-correction-one-time-delete-process-updates-252273</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;AP TET 2026:&amp;nbsp;&lt;/strong&gt;ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లో ఉపాధ్యాయ కొలువుల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు రాష్ట్ర విద్యాశాఖ కీలక ఊరటనిచ్చింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్&amp;zwnj; ఆన్&amp;zwnj;లైన్ దరఖాస్తు ప్రక్రియలో అభ్యర్థులు పొరపాటున నమోదు చేసిన తప్పులను సరిదిద్దుకునేందుకు ప్రభుత్వం ఒక అవకాశాన్ని కల్పించింది. దరఖాస్తు సమర్పించిన తర్వాత ఏవైనా పొరపాటులు గుర్తిస్తే వాటిని సవరించుకోడానికి గతంలో ఉన్న ఇబ్బందులను తొలగిస్తూ వన్&amp;zwnj;టైమ్ డిలీట్ అనే సరికొత్త ఫీచ్&amp;zwnj;ను అందుబాటులోకి తెచ్చింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;టెట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ దరఖాస్తు ఫామ&amp;zwnj;లో పేరు, విద్యార్హతలు, లేదా ఇతర వ్యక్తిగత వివరాలను నమోదు చేసేటప్పుడు కొన్నిసార్లు తప్పులు చేస్తుంటారు. ఇటువంటి తప్పులు వల్ల భవిష్యత్&amp;zwnj;లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని అభ్యర్థులు ఇప్పటికే సమర్పించిన దరఖాస్తును పూర్తిగా డిలీట్ చేసి, సరైన వివరాలతో మళ్లీ దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు టెట్ కన్వీనర్&amp;zwnj; వెంకట్&amp;zwnj; కృష్ణారెడ్డి అధికారిక ప్రకటన విడుదల చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఈ సవరణ ప్రక్రియ నిరంతరం అందుబాటులో ఉండదు. కేవలం పరిమిత కాలం మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. ఇవాళ్టి (జులై 2) నుంచి ఐదో తేదీ వరకు మాత్రమే అభ్యర్థులు ఈ వన్&amp;zwnj; టైమ్&amp;zwnj; డిలీట్&amp;zwnj; ఆప్షన్&amp;zwnj;ు వినియోగించుకోవచ్చు. నిర్ణీత గడువు ముగిసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో దరఖాస్తుల సవరణకు అవకాశం ఉండదని అధికారులు స్పష్టం చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;అభ్యర్థుల అధికారిక టెట్&amp;zwnj; వెబ్&amp;zwnj;సైట్&amp;zwnj;లోకి వెళ్లి తమ లాగిన్ వివరాలతో ప్రవేశించాలి. అక్కడ వన్&amp;zwnj;టైమ్ డిలీట్&amp;zwnj; అనే ఐచ్చికాన్ని ఎంచుకోవాలి. దీని వల్ల పాత దరఖాస్తు వ్యవస్థ నుంచి డిలీట్ అవుతుంది. ఆ తర్వాత అభ్యర్థులు తాజా వివరాలతో ఎటువంటి తప్పులు లేకుండా దరఖాస్తు తిరిగి సబ్&amp;zwnj;మిట్ చేయాలి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఈ సవరణ ప్రక్రియలో కొన్ని పరిమితులు ఉన్నాయి. దరఖాస్తులో ఆధార్&amp;zwnj; నంబర్&amp;zwnj;, మొబై్&amp;zwnj; నంబర్ మినహా మిగిలిన అన్ని అంశాలను(పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, విద్యార్హతలు, జిల్లా) మార్చుకోవడానికి వీలు ఉంటుంది. ఈ వన్ టైమ్ డిలీట్, తిరిగి దరఖాస్తు చేసుకునే ప్రక్రియకు ప్రభుత్వం ఎలాంటి ఫీజు వసూలు చేయడం లేదు.అభ్యర్థులు ఉచితంగానే ఈ సదుపాయాన్ని వాడుకోవచ్చు. &amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/02/bf5a248254ef8ed46cabac59db743f651782966448236215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Breaking News: అమరావతి ఆపడం ఎవరితరం కాదు, గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోంది: ముఖ్యమంత్రి చంద్రబాబు]]></title><link>https://telugu.abplive.com/news/today-top-stories-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-2nd-july-2026-252269</link><comments>https://telugu.abplive.com/news/today-top-stories-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-2nd-july-2026-252269#respond</comments><pubDate>Thu, 2 Jul 2026 08:49:09 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ న్యూస్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/today-top-stories-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-2nd-july-2026-252269</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Top Stories Today | ఈరోజు వార్తల ముఖ్యాంశాలు..&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;h2&gt;Telangana ACB : డిఎస్పి భీమ్ రెడ్డి నివాసాలపై ఏసీబీ సోదాలు- భారీ సంఖ్యలో ఆస్తులు గుర్తింపు!&lt;/h2&gt;
&lt;p&gt;Telangana ACB : డిఎస్పి భీమ్ రెడ్డి నివాసాలపై ఏసీబీ సోదాలు నిర్వహించారు. మహబూబ్&amp;zwnj;నగర్, నలగొండ, హైదరాబాద్ ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటికే భారీగా ఆస్తులను గుర్తించినట్టు సమాచారం. బెంగళూరు నగరంలో ఒక ఎకరా భూమి, &lt;a title=&quot;కర్ణాటక&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Karnataka&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కర్ణాటక&lt;/a&gt; 3 ఎకరాల భూమి, జహీరాబాద్&amp;zwnj;లో 6 ఎకరాలు భూములకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేస్కున్నారు. భీమ్ రెడ్డి నివాసంలో భారీగా విదేశీ మద్యం సీసాలు గుర్తించారు. భారీగా బంగారు ఆభరణాలను సీజ్ చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Chandra Babu Latest News: అమరావతి ఆపడం ఎవరితరం కాదు, గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోంది: ముఖ్యమంత్రి చంద్రబాబు&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;Chandra Babu Latest News: మావిగన్ నినాదంతోనే వచ్చే ఎన్నికల్లో ప్రజల ముందుకు వెళ్తామని చెప్పిన వైఎస్&amp;zwnj; &lt;a title=&quot;జగన్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/cm-jagan&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;జగన్&lt;/a&gt;&amp;zwnj;కు ముఖ్యమంత్రి &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; కౌంటర్ ఇచ్చారు. ఎవరు వచ్చిన అమరావతిని కదల్చలేరని అన్నారు. గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోందని అన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Kavitha Arrest: నాచారం ఇండస్ట్రియల్ ఏరియాలో తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అరెస్ట్!&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;Kavitha Arrest: ఉప్పల్ నియోజకవర్గంలోని నాచారం ఇండస్ట్రియల్ ఏరియాలో తెలంగాణ రక్షణ సేన తలపెట్టిన భూ పోరాటాన్ని పోలీసులు భగ్నం చేశారు. భూపోరాటం చేసే స్థలంలో వేసిన టెంట్లు తొలగించారు. ఈ క్రమంలో పోలీసులు, తెలంగాణ రక్షణ సేన కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చేందుకు కల్వకుంట్ల కవితను అదుపులోకి తీసుకున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Telangana Latest News: పోలీసులతో బీఆర్&amp;zwnj;ఎస్&amp;zwnj;నేతల వాగ్వాదం- మంత్రులు పిలిస్తే అడ్డుకోవడం ఏంటని ఆగ్రహం&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;గురుకులాల టెండర్లలో అవినీతి జరిగిందని ఆరోపణలపై మంత్రులతో చర్చిచేందుకు సిద్ధమని గన్&amp;zwnj;పార్క్ వద్దకు బయల్దేరిన హరీష్&amp;zwnj;రావు, ప్రవీణ్&amp;zwnj; కుమార్&amp;zwnj;ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, బీఆర్&amp;zwnj;ఎస్ నేతలకు మధ్య వాగ్వాదం నడిచింది. మంత్రులు పిలిస్తే పోలీసులు అడ్డుకోవడం ఏంటని నేతలు ప్రశ్నించారు. కార్లు వెళ్లనీయకపోవడంతో కాలినడకన వెళ్లేందుకు నేతలు సిద్ధమయ్యారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Telangana Latest News: గన్ పార్క్ వద్దే చర్చిద్దాం! తెలంగాణ భవన్&amp;zwnj; &lt;strong&gt;నుంచి&lt;/strong&gt; బయల్దేరిన హరీష్&amp;zwnj;! మధ్యలో అడ్డుకున్న పోలీసులు !&lt;/h2&gt;
&lt;p&gt;తెలంగాణలో రాజకీయాలు ఆసక్తిగా మారాయి. తెలంగాణలో అప్పులు, అభివృద్ధి, కుంభకోణాలపై చర్చించేందుకు కాంగ్రెస్, బీఆర్&amp;zwnj;ఎస్&amp;zwnj; నాయకులు సిద్ధమయ్యారు. గురుకులాల టెండర్ల విషయంలో భారీ అవినీతి జరిగిందని బీఆర్&amp;zwnj;ఎస్ ఆరోపిస్తూ వస్తోంది. దీనిపై గన్&amp;zwnj;పార్క్ వద్ద చర్చిద్దామని కాంగ్రెస్ సవాల్ చేసింది. దీన్ని స్వీకరించిన బీఆర్&amp;zwnj;ఎస్ నేతలు హరీష్&amp;zwnj;, ప్రవీణ్&amp;zwnj;కమార్&amp;zwnj; తెలంగాణ భవన్&amp;zwnj;ను బయల్దేరారు. మార్గ మధ్యలో జోక్యం చేసుకున్న పోలీసులు వారిని అడ్డుకున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Telangana Latest News: తెలంగాణ అప్పులపై పొలిటికల్&amp;zwnj; హైడ్రామా! కేటీఆర్, హరీష్ చర్చకు రావాలని మంత్రులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు బైఠాయింపు!&lt;/h2&gt;
&lt;p&gt;Telangana Latest News: తెలంగాణ అప్పులపై రాజకీయ కాకా రేగుతోంది. రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్&amp;zwnj; ఆధారంగా &lt;a title=&quot;కాంగ్రెస్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Congress&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కాంగ్రెస్&lt;/a&gt;, బీఆర్&amp;zwnj;ఎస్ మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది. ముఖ్యమంత్రి &lt;a title=&quot;రేవంత్ రెడ్డి&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Revanth-Reddy&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;రేవంత్ రెడ్డి&lt;/a&gt; చర్చకు రావాలని బీఆర్&amp;zwnj;ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్&amp;zwnj; కేటీఆర్, మాజీ మంత్రి హరీష్&amp;zwnj; సవాల్ చేశారు. దీనికి స్పందించిన మంత్రులు తాము చర్చకు రడీ అంటూ సిద్ధమయ్యారు. ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్&amp;zwnj;కు వస్తానని మంత్రి జూపల్లి ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు తాము కూడా చర్చకు సిద్ధమని మరికొందరు మంత్రులు రెడీ అయ్యారు. వారంతా గన్&amp;zwnj;పార్క్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పించి చర్చకు వెళ్లాలని నిర్ణయించారు. అయితే చర్చించేందుకు కేసిఆర్, కేటీర్&amp;zwnj;, హరీష్&amp;zwnj; రావు రావాలని డిమాండ్ చేశారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Hyderabad Latest News: శంషాబాద్&amp;zwnj; ఎయిర్&amp;zwnj;పోర్ట్&amp;zwnj;లో 20 మంది మహిళలు అరెస్టు- నకిలీ వీసాలతో మస్కట్ వెళ్లేందుకు యత్నం&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;Hyderabad Latest News: నకిలీ వీసాలతో మస్కట్ వెళ్లేందుకు యత్నించిన 20 మంది మహిళలను ఎయిర్&amp;zwnj;పోర్ట్&amp;zwnj; అధికారులు అరెస్టు చేశారు. ఇమ్మిగ్రేషన్ తనిఖీలు సందర్భంగా నకిలీ వీసాల బాగోతం బయటపడింది. వారిని అదుపులోకి తీసుకున్న అధికారులు ఎయిర్&amp;zwnj;పోర్ట పోలీసులకు అప్పగించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;AP TET 2026: టెట్ అభ్యర్థులకు గుడ్ న్యూస్- తప్పుల సవరణలో కీలక అప్&amp;zwnj;డేట్&amp;zwnj;!&lt;/h2&gt;
&lt;p&gt;&lt;strong&gt;AP TET 2026:&lt;/strong&gt;ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ఆన్లైన్ దరఖాస్తు చేసిన అభ్యర్థులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే అప్లై చేసిన వారు తప్పులు చేసి ఉంటే సరి చేసే మళ్లీ దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం ఛాన్స్ ఇస్తోంది. దీని కోసం వన్&amp;zwnj;టైం డిలీట్ ఆప్షన్&amp;zwnj;ను కల్పించింది. అభ్యర్థులు ఇవాళ్టి నుంచి ఐదో తేదీ వరకు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/02/cebabf63d1564677efd70eaeaa77e8a21782962138456215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Telangana Police vs AP Police:హైదరాబాద్‌లో ఏపీ పోలీసులపై క్రిమినల్‌ కేసు! కేవీ రెడ్డి అరెస్టుతో రేగిన వివాదం!]]></title><link>https://telugu.abplive.com/telangana/hyderabad/telangana-police-register-criminal-case-against-ap-police-over-kv-reddy-arrest-incident-252263</link><comments>https://telugu.abplive.com/telangana/hyderabad/telangana-police-register-criminal-case-against-ap-police-over-kv-reddy-arrest-incident-252263#respond</comments><pubDate>Thu, 2 Jul 2026 08:22:12 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ హైదరాబాద్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/telangana/hyderabad/telangana-police-register-criminal-case-against-ap-police-over-kv-reddy-arrest-incident-252263</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Telangana Police vs AP Police:&lt;/strong&gt;హైదరాబాద్&amp;zwnj;లో మంగళవారం రాత్రి చోటు చేసుకున్న పరిణామాలు సంచలనం సృష్టించాయి. ఏపీ పోలీసులు నిబంధనలు ఉల్లంఘించి హైదరాబాద్&amp;zwnj;కు చెందిన ఓ వ్యక్తిని అరెస్టు చేయడమే కాకుండా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలు ఇప్పుడు న్యాయపరమైన మలుపు తిరిగాయి. పోలీసులపై కేసు నమోదు చేసే వరకు సిచ్యుయేషన్ వెళ్లింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;మంగళవారం రాత్రి సుమారు 7.30 గంటల సమయంలో హైదరాబాద్&amp;zwnj;లోని బైరామల్&amp;zwnj;గూడ, మధురానగర్&amp;zwnj;లో నివసిస్తున్న కేవీ రెడ్డి ఇంటికి ఏపీ పోలీసులు వెళ్లారు. ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లోని విజయనగరం జిల్లా బొబ్బిలి నుంచి ఓ టీం వచ్చి ఆయన్ని విచారించింది. సాధారణ దుస్తుల్లో, ప్రైవేటు వాహనంలో వచ్చి పోలీసులు కేవీ రెడ్డిని తీసుకెళ్లారు. ఆయన్ని బలవంతంగా లాక్కెళ్లారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కనీసం దుస్తులు మార్చుకునేంత టైం కా ఇవ్వలేదని ఆరోపించారు. అడ్డుగా వచ్చిన తనపై అనుచితంగా ప్రవర్తించారని ఆయన భార్య ఫిర్యాదులో పేర్కొన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;స్థానికులు వెంటనే స్పందించి ఏపీ పోలీసుల వాహనాన్ని అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న సరూర్&amp;zwnj; నగర్ పోలీసులు అక్కకడికి చేరుకొని ఏపీ పోలీసులను, విజయలక్ష్మిని పోలీస్ స్టేషన్&amp;zwnj;కు తరలించారు. అక్క బాధితురాలి ఫిర్యాదు మేరకు బొబ్బిలి సీఐ శ్రీనివాస్&amp;zwnj;, ఇతర సిబ్బందిపై మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించారనే ఆరోపణలతో సరూర్&amp;zwnj; నగర్&amp;zwnj; పోలీసులు కేసు నమోదు చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఏపీలో జరుగుతున్న రాజకీయాలపై కేవీ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ కామెంట్స్ చేశారు. విజయనగరం జిల్లా బాడంగికి చెందిన మాజీ సర్పంచ్&amp;zwnj; కండి రమేష్&amp;zwnj; &amp;nbsp;దీనిపై ఫిర్యాదు చేశారు. ఏప్రిల్&amp;zwnj; 10న కేవీ రెడ్డిపై కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో బీఎన్&amp;zwnj;ఎస్&amp;zwnj; సెక్షన్లు 152, 197, 296, 353, 352తోపాటు ఐటీ యాక్ట్&amp;zwnj;67, 67(ఏ) కింద కేసులు ఉన్నాయి. ఈ ఏడాది మే 5న కోర్టు కేవీ రెడ్డి నాన్&amp;zwnj; బెయిలబుల్&amp;zwnj; వారెంట్&amp;zwnj; జారీ చేసింది. దీని ఆధారంగానే ఏపీ పోలీసులు అరెస్టుకు వచ్చామని పేర్కొన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;రాష్ట్రాల మధ్య సరిహద్దులు దాటి పోలీసులు అరెస్టు చేసేటప్పుడు పాటించాల్సిన రూల్స్ పాటించలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తిని అరెస్టు చేసేటప్పుడు స్థానిక పోలీసులకు ముందస్తు సమాచార ఇవ్వాలి, కానీ ఈ కేసులో ఏపీ పోలీసులు, ప్రైవేట్&amp;zwnj; వాహనాల్లో సివిల్ డ్రస్&amp;zwnj;లో వచ్చి కేవీ రెడ్డిని బలవంతంగా తీసుకెళ్లడం చట్టపరమైన నిబంధనల ఉల్లంఘన అని విమర్శలు వస్తున్నాయి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;కేవీ రెడ్డిపై నమోదు చేసిన ఐటీ యాక్ట్&amp;zwnj; సెక్షన్లు, బీఎన్&amp;zwnj;ఎస్&amp;zwnj; సెక్షన్ల తీవ్రతను బట్టి చూస్తే ఇది రాజకీయ ప్రేరేపిత చర్య అని బాధితుడి కుటుంబం వాదిస్తోంది. &amp;nbsp;&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/02/5a36091c055fdfdc107a852f89a828f61782960700891215_original.jpg" width="220"/></item></channel></rss>