Andhra Pradesh liquor scam preliminary chargesheet : ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాంలో సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రాథమిక చార్జిషీట్ దాఖలు చేసింది. ఏసీబీ కోర్టు న్యాయాధికారి నివాసానికి రెండు ట్రంక్ పెట్టెల్లో చార్జిషీటుతో పాటు దర్యాప్తులో సేకరించిన ఆధారాలను కూడా సమర్పించారు . చార్జిషీటు దాదాపుగా మూడు వందల పేజీలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ చార్జిషీటుతో వందకుపైగా ఫోరెన్సిక్ ఆధారాలను జత చేశారు. ఈ స్కాంలో మొత్తంగా రూ. 62 కోట్లు సీజ్ చేసినట్లుగా సిట్ చార్జిషీట్‌లో తెలిపింది. 268 మంది సాక్షులను విచారించామని .. వందల కోట్ల నగదును బ్యాంకులు, రియల్ ఎస్టేట్ కంపెనీలు, బంగారం షాపుల్లో పెట్టుబడిగా పెట్టినట్లుగా గుర్తించామని తెలిపారు. 

మొత్తం 41 మంది నిందితులను SIT పేర్కొంది,  కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి,  మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి యొక్క IT సలహాదారుడు, ఈ స్కామ్‌లో ఏ 1 ఉన్నారు.   రాజంపేట ఎంపీ మిధున్  రెడ్డి   నంబర్ 4గా  ఉన్నారు.  2019-2024 మధ్య YSRCP ప్రభుత్వం లిక్కర్ విధానాన్ని దుర్వినియోగం చేసి, ప్రముఖ బ్రాండ్లను అణచివేసి, తక్కువ పేరున్న కొత్త బ్రాండ్లను  ప్రమోట్ చేయడం ద్వారా  రూ. 3,200 కోట్ల లంచాలు సేకరించినట్లు సిఐడీ తేల్చింది.  ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (APSBCL)లో ఆటోమేషన్‌ను నిలిపివేసి, మాన్యువల్ ఆర్డర్ ఫర్ సప్లై (OFS) విధానాన్ని అమలు చేసి, లంచాల ఆధారంగా బ్రాండ్ ఇండెంట్‌లను నిర్ణయించినట్లు SIT తెలిపింది. 

లంచాల ద్వారా సేకరించిన నిధులు షెల్ కంపెనీలు , హవాలా నెట్‌వర్క్‌లు, రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, బంగారం కొనుగోళ్లు ,  లగ్జరీ ఐటెమ్‌ల ద్వారా  మనీ లాండరింగ్ చేసినట్లుగా సిట్ ఆధారాలు సమర్పించినట్లుగా తెలుస్తోంది.  తక్కువ నాణ్యత గల లిక్కర్ సరఫరా వల్ల ఆరోగ్య సమస్యలు, ఆల్కహాల్ డీఅడిక్షన్ కేసులు  ,  మహిళలపై గృహ హింసలో పెరుగుదల వంటివి ఈ స్కామ్ వల్ల జరిగాయని  తేల్చారు.   APSBCL డిపో మేనేజర్ ఫోన్ నుండి సేకరించిన WhatsApp కాన్ఫరెన్స్ కాల్ రికార్డింగ్‌లు, స్క్రీన్ షాట్‌లు సేకరించారు. ఈ రికార్డింగ్‌లు ఫోరెన్సిక్ టీమ్ ద్వారా ధృవీకరించి  చార్జిషీట్‌కు అనుబంధంగా జతచేశారు. 

రాజ్ కసిరెడ్డి ఏప్రిల్ 21, 2025న అరెస్టయ్యాడు .  లంచాల వ్యవస్థను నిర్వహించినట్లు ఒప్పుకున్నాడని SIT తెలిపింది.  ఓల్విక్ మల్టీవెంచర్, క్రిపతి ఎంటర్‌ప్రైజెస్ వంటి కంపెనీల ద్వారా నిధులు రియల్ ఎస్టేట్ ,  బంగారంలో పెట్టుబడి పెట్టారని సిట్ గుర్తించింది.  సాధారణంగా, లిక్కర్ షాప్ సూపర్‌వైజర్లు కస్టమర్ డిమాండ్ ఆధారంగా బ్రాండ్ ఇండెంట్‌లను రూపొందిస్తారు. కానీ, SIT పరిశోధనలో డిపో మేనేజర్లు సూపర్‌వైజర్ల లాగిన్‌లను ఉపయోగించి, లంచాల ఆధారంగా ఇండెంట్‌లను రూపొందించినట్లు తేలింది .  ప్రతి ఐదు రోజులకు లంచాలు సేకరించారని చార్జిషీటులో తెలిపింది.  

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) మనీ లాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద కేసు నమోదు చేసి, SIT నుండి FIRలు, చార్జిషీట్‌లు, బ్యాంక్ ఖాతా వివరాలను కోరింది   ప్రాథమిక చార్జిషీట్ ఈ స్కామ్‌లో లంచాలు, మనీ లాండరింగ్,  విధాన పరమైన దుర్వినియోగం  వివరాలను సిట్ బయట పెట్టింది.