అన్వేషించండి

East Godavari News : తూర్పు గోదావరిలో కాపు ఓటు బ్యాంకుపై టీడీపీ గురి! సానా సతీష్ వ్యూహాలతో మారనున్న రాజకీయ సమీకరణాలు?

East Godavari Latest News: టీడీపీలో కాపు సామాజికవ‌ర్గంలో బ‌ల‌మైన నాయ‌క‌త్వం కోసం ప్ర‌య‌త్నిస్తుందా అంటే ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి జిల్లాలో జ‌రుగుతోన్న ప‌రిణామాల‌ను చూస్తే అవున‌నే అన్న చ‌ర్చ జ‌రుగుతోంది.

East Godavari Latest News: ఉభయ గోదావరి జిల్లాల్లో రాజకీయలపై  కొన్ని సామాజిక వర్గాలు తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. ఆ సామాజిక వార్గలు ఎవరి పక్షాన ఉంటే ఎన్నికల్లో ఆపార్టీకి విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. గతంలో జరిగిన ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు పరిశీలిస్తే ఇది వాస్తవమనే భావన మరోసారి రుజువు అయింది. అందుకే ఏపీలో ప్రధాన పార్టీలన్నీ సామాజికవర్గాల వారీగా సమీకరణాలను తెర మీదకు తెచ్చి ఆయా సామాజిక వర్గాలను మచ్చిక చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. దీంట్లో భాగంగానే ఉభయ గోదావరి జిల్లాలో బలమైన సామాజిక వర్గంగా ముద్రపడిన కాపుల గురించి దృష్టిసారించే ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నాయన్న చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇటీవల కాలంలో ప్రధాన పార్టీలు ఆ దిశగా పావులు కదపడాన్ని చూస్తుంటే అవుననే సమాధానం లభిస్తోంది. 

జనసేన ఆవిర్భావం తరువాత మారిన సీన్‌..
ఉభయగోదావరి జిల్లాల్లో ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే అదే పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం ఉండదు. ఎందుకంటే గతంలో కూడా ఇలానే జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని పార్టీలు వ్యూహాలు రచిస్తుంటాయి. నాయకులను ప్రోత్సహిస్తూ ఉంటాయి. ప్రధానంగా తూర్పుగోదావరిలో కాపు సామాజికవర్గంలో ఇదే జరుగుతోంది. ముఖ్యంగా కాపు సామాజికవర్గం చాలా వరకు టీడీపీకి సంప్రదాయ ఓటు బ్యాంకు ఉంది.

పవన్‌ కల్యాణ్‌ జనసేన పార్టీ ఏర్పాటుతో సీన్‌ కాస్త మారింది. 

అగ్రభాగం కాపులు జనసేనలోకి మారిపోగా టీడీపీ తీవ్రంగా నష్టపోయింది. ఇది 2019 ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. 2024లో ఇటువంటి తప్పు జరగకుండా టీడీపీ ప్లాన్ చేసింది. జనసేన, బీజేపీతో కూటమిగా ఏర్పడి భారీ విజయాన్ని దక్కించుకున్న పరిస్థితి కనిపించింది. అయితే కాపుల్లో 80 శాతం జనసేన పార్టీలోకి మారడం వల్ల టీడీపీ తీవ్రంగా కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంకును కోల్పోయిన పరిస్థితి ఉండగా వైసీపీ కూడా కొంత కాపు సామాజికవర్గాన్ని కోల్పోయింది.  

టీడీపీలో కాపులను బలపరిచేలా ప్రయత్నాలు..
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీలో కాపులను బలపరుచుకునేందుకు టీడీపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తుందా అన్న ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇటీవల జరుగుతోన్న పరిణామాలు చూస్తుంటే ప్రయత్నం కాదు తీవ్ర ప్రయత్నమే చేస్తోంది. ఇందు కోసం రాజ్యసభ సభ్యుడు సానా సతీష్‌ ఆధ్వర్యంలో ఇప్పటికే ఆ దిశగా అడుగులు వేస్తోంది. కాకినాడ జిల్లాలోని టీడీపీలో ఉన్న కాపులను ఐక్యపరిచి బలమైన నాయకత్వం నిర్మించే కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా కాకినాడలో టీడీపీలో ఉన్న ముఖ్య కాపు నాయకులతో సమావేశం ఏర్పాటు చేసిన ఎంపీ సానా సతీష్‌ ఇటీవలే అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోనూ ముఖ్యమైన కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులతో సమావేశమయ్యారు. 

కాపు యువ నాయకత్వం కోసమే..
టీడీపీలో కాపు సామాజిక వర్గం నుంచి నమ్మకమైన కాపు నేతలుగా ముద్రపడిన నిమ్మకాయల చినరాజప్ప, కొత్తపల్లి సుబ్బారాయుడు, బండారు సత్యానందరావు ఇలా కొందరు నేతలు ఉన్నప్పటికీ ఆర్ధికంగా ప్రస్తుతం సానా సతీష్‌ మాత్రమే ఉన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి బాధ్యతలన్నీ ఆయనపైనే పెట్టే ప్రయత్నంలో టీడీపీ అధిష్టానం ఉందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు యువనేత లోకేష్‌ సానా సతీష్‌ మధ్య మంచి సంబంధాలు ఉండడం దీనికి బలాన్నిస్తున్నాయి. ఇప్పుడు సానా సతీష్‌ ద్వారా లోకల్‌గా మరింత మంది నాయకులను తీర్చిదిద్దాలని చూస్తున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

MLA Defection: ఫిరాయింపు ఎమ్మెల్యేపై కోల్‌కతా హైకోర్టు అనర్హతా వేటు - తెలంగాణలో ఆ పది మందికి కొత్త టెన్షన్ !
ఫిరాయింపు ఎమ్మెల్యేపై కోల్‌కతా హైకోర్టు అనర్హతా వేటు - తెలంగాణలో ఆ పది మందికి కొత్త టెన్షన్ !
Pawan Kalyan:  అటవీ భూములను కబ్జా చేసిన పెద్దిరెడ్డి - పవన్ కల్యాణ్ సంచలన వీడియో - చర్యలకు ఆదేశాలు
అటవీ భూములను కబ్జా చేసిన పెద్దిరెడ్డి - పవన్ కల్యాణ్ సంచలన వీడియో - చర్యలకు ఆదేశాలు
Jubilee Hills by-election : 42 టేబుల్స్‌, 10 రౌండ్‌లు- జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి- మధ్యాహ్నానికి ప్రక్రియ పూర్తి 
42 టేబుల్స్‌, 10 రౌండ్‌లు- జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి- మధ్యాహ్నానికి ప్రక్రియ పూర్తి 
Delhi Blast case : ఢిల్లీ పేలుళ్ల నిందితులు ఎప్పుడు ఎక్కడ తిరిగారు? వెలుగులోకి వస్తున్న రోజుకో ప్రాంత సీసీటీవీ వీడియోలు!
ఢిల్లీ పేలుళ్ల నిందితులు ఎప్పుడు ఎక్కడ తిరిగారు? వెలుగులోకి వస్తున్న రోజుకో ప్రాంత సీసీటీవీ వీడియోలు!
Advertisement

వీడియోలు

Proud India | భారతదేశంపై అమెరికా అక్కసు వెనక కారణం ఇదే | ABP Desam
Jubilee Hills By Election Counting | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కౌంటింగ్ కు భారీ భద్రత ! | ABP Desam
రోహిత్, కోహ్లీల కెరీర్‌లో విలన్‌గా మారిన బీసీసీఐ!
సంజూ కోసం జడ్డూని వదిలేస్తారా? CSKకి పిచ్చి పట్టింది: శడగొప్పన్ రమేష్
నితీష్‌కి బీసీసీఐ అన్యాయం.. మండిపడుతున్న తెలుగు ఫ్యాన్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLA Defection: ఫిరాయింపు ఎమ్మెల్యేపై కోల్‌కతా హైకోర్టు అనర్హతా వేటు - తెలంగాణలో ఆ పది మందికి కొత్త టెన్షన్ !
ఫిరాయింపు ఎమ్మెల్యేపై కోల్‌కతా హైకోర్టు అనర్హతా వేటు - తెలంగాణలో ఆ పది మందికి కొత్త టెన్షన్ !
Pawan Kalyan:  అటవీ భూములను కబ్జా చేసిన పెద్దిరెడ్డి - పవన్ కల్యాణ్ సంచలన వీడియో - చర్యలకు ఆదేశాలు
అటవీ భూములను కబ్జా చేసిన పెద్దిరెడ్డి - పవన్ కల్యాణ్ సంచలన వీడియో - చర్యలకు ఆదేశాలు
Jubilee Hills by-election : 42 టేబుల్స్‌, 10 రౌండ్‌లు- జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి- మధ్యాహ్నానికి ప్రక్రియ పూర్తి 
42 టేబుల్స్‌, 10 రౌండ్‌లు- జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి- మధ్యాహ్నానికి ప్రక్రియ పూర్తి 
Delhi Blast case : ఢిల్లీ పేలుళ్ల నిందితులు ఎప్పుడు ఎక్కడ తిరిగారు? వెలుగులోకి వస్తున్న రోజుకో ప్రాంత సీసీటీవీ వీడియోలు!
ఢిల్లీ పేలుళ్ల నిందితులు ఎప్పుడు ఎక్కడ తిరిగారు? వెలుగులోకి వస్తున్న రోజుకో ప్రాంత సీసీటీవీ వీడియోలు!
Pawan Kalyan vs Mithun Reddy: డిప్యూటీ సీఎం పవన్‌కు మిథున్ రెడ్డి ఘాటు హెచ్చరిక - క్షమాపణ చెప్పకపోతే చట్టపరమైన చర్యలు
డిప్యూటీ సీఎం పవన్‌కు మిథున్ రెడ్డి ఘాటు హెచ్చరిక - క్షమాపణ చెప్పకపోతే చట్టపరమైన చర్యలు
America shutdown ends:  43 రోజుల కష్టాలకు చెక్ -  అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్‌ తాత్కాలిక ముగింపు - ట్రంప్ సంతకం పూర్తి
43 రోజుల కష్టాలకు చెక్ - అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్‌ తాత్కాలిక ముగింపు - ట్రంప్ సంతకం పూర్తి
Alluri Seetharamaraju district: ఊరికి స్కూల్ వచ్చిందని గిరిజనులు ఉత్సాహం- థింసా నృత్యాలతో సంబరాలు- అధికారులకు సన్మాం చేసిన ఆదివాసీలు!
ఊరికి స్కూల్ వచ్చిందని గిరిజనులు ఉత్సాహం- థింసా నృత్యాలతో సంబరాలు- అధికారులకు సన్మాం చేసిన ఆదివాసీలు!
Red Fort Blasts Conspiracy: 32 వాహనాలతో భారీ విధ్వంసానికి ప్లాన్! ఉగ్రవాదుల పాత్ర, రహస్యాలు బయటపెట్టిన దర్యాప్తు అధికారులు
32 వాహనాలతో భారీ విధ్వంసానికి ప్లాన్! ఉగ్రవాదుల పాత్ర, రహస్యాలు బయటపెట్టిన దర్యాప్తు అధికారులు
Embed widget