అన్వేషించండి

Konaseema Viral News: బిర్యానీలో మండ్రకప్ప, ముగ్గురిలో ఒకరు మృతి! అమలాపురం హోటల్‌లో ఏం జరిగింది?

వాత‌వార‌ణం ముసురేసింది..ఇంక వెంట‌నే గుర్త‌కు వ‌చ్చేది వేడి వేడిగా ఘుమ‌ఘుమ‌లాడే బిర్యానీ క‌దా.. స‌రిగ్గా ఇలాగే బిర్యానీ తెచ్చుకుని పార్శిల్ విప్పి తింటుండ‌గా అనుకోని అతిధి క‌నిపించింది.. 

వాత‌వార‌ణం ముసురేసింది.. జోరుగా వ‌ర్షాలు కురుస్తున్నాయి.. ఇంక వెంట‌నే గుర్త‌కు వ‌చ్చేది వేడి వేడిగా ఘుమ‌ఘుమ‌లాడే బిర్యానీ క‌దా.. స‌రిగ్గా ఇలాగే బిర్యానీ తెచ్చుకున్న న‌లుగురు కుర్రాళ్లు పార్శిల్ విప్పి తింటుండ‌గా పార్శిల్లో అనుకోని అతిధి క‌నిపించింది.. 

అంబేడ్క‌ర్ కోన‌సీమ జిల్లా అమ‌లాపురంలో ఓహోట‌ల్ నుంచి తెచ్చుకున్న బిర్యానీ పార్శిల్‌లో చికెన్ పీస్‌ల‌తో పాటు చ‌నిపోయిన మండ్ర‌క‌ప్ప ఉన్న వీడియో ఇప్ప‌డు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.. అయితే ఈ బిర్యానీ తిన్న ముగ్గురు యువ‌కుల్లో ఒక యువ‌కుడు చ‌నిపోయాడ‌ని, మ‌రో ఇద్ద‌రు అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యార‌ని ప్ర‌చారం సాగుతోంది.. ఇదిలా ఉంటే దీనిపై ఎవ్వ‌రూ ఇప్ప‌టివ‌ర‌కు ఎటువంటి ఫిర్యాదు చేయ‌క‌పోగా ఈ న్యూస్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియా గ్రూపుల్లో తెగ స‌ర్క్యులేట్ అవుతోంది..

అస‌లేం జ‌రిగిందంటే...

వారం రోజుల క్రితం అమ‌లాపురంలోని కొంకాప‌ల్లికి చెందిన ముగ్గురు యువ‌కులు అమ‌లాపురంలోని ప్ర‌ముఖ హోట‌ల్ నుంచి బిర్యానీ పార్శిల్ తెచ్చుకున్నారు. ముగ్గ‌రు స‌గం వ‌ర‌కు తినేశారు.. ఇంత‌లో చికెన్ ఫ్రై పీసుల‌తో క‌లిపి ఏగిపోయిన కొంచెం డిఫ‌రెంట్‌గా వారి కంట ప‌డింది.. స‌రిగ్గా ప‌రిశీలించిన వారికి షాక్ అవ్వాల్సి వ‌చ్చింది.. బిర్యానీ పీసుల‌తో క‌లిపి ఏగిపోయిన మండ్రక‌ప్ప క‌నిపించింది. దీంతో కంగారు అయిన వారు వెంట‌నే దానిని వీడియో తీసి తిరిగి అదే హోట‌ల్‌కు ప‌ట్టుకెళ్లి చూపించిన‌ట్లు తెలిసింది.. దీనికి ఆ హోట‌ల్ నిర్వాహ‌కులు త‌ప్పు ఒప్పుకుని మ‌రో పార్శిల్ ఇస్తామ‌ని చెప్పార‌ని, అయితే అప్ప‌టికే వారికి ఆరోగ్యంలో తేడా రావ‌డంతో ఆసుప‌త్రికి వెళ్లార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇందులో ఒక యువ‌కుడికి సీరియ‌స్ అవ్వ‌గా ఆ యువ‌కుడిని కాకినాడ‌లోని ఓ ప్ర‌యివేటు ఆసుప‌త్రికి త‌ర‌లించ‌గా అక్క‌డ చికిత్స పొందుతూ మృతిచెందాడ‌ని చెబుతున్నారు.

అయితే ఈ ఘ‌ట‌న‌పై బాధితులు ఎవ్వ‌రూ బ‌య‌ట‌కు రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇదిలా ఉంటే ఆ హోట‌ల్ నిర్వాహ‌కులు కూడా ఆ వ్య‌క్తి మృతిచెందింది త‌మ హోట‌ల్‌లో ఫుడ్ తిని మాత్రం కాద‌ని, అతనికి అప్ప‌టికే సివీరియ‌ర్ హెల్త్ ఇష్యూలు ఉన్నాయ‌ని, మందులు వేసుకోవ‌డంలో నిర్ల‌క్ష్యం చేయ‌డం వ‌ల్ల అత‌ను మృతిచెందాడ‌ని వైద్యులే తేల్చి చెప్పార‌ని స‌ద‌రు హోట‌ల్ యాజ‌మాన్యం చెప్ప‌కొస్తుందంటున్నారు.  

బిర్యానీలో మండ్ర‌క‌ప్ప రావ‌డం నిజ‌మేనా..

అమ‌లాపురంలో మాత్రం ప్ర‌ముఖ హోట‌ల్‌లో తెచ్చుకున్న బిర్యానీ పార్శిల్‌లో చ‌నిపోయిన మండ్ర‌క‌ప్ప రావ‌డం వాస్త‌వమేన‌ని స్థానికంగా చ‌ర్చ జ‌రుగుతోంది.. బిర్యానీ తెచ్చుకుని తింటున్న క్ర‌మంలో ఆ పార్శిల్‌లో మండ్ర‌క‌ప్ప రావ‌డంతో ఆ పార్శిల్‌ను వెన‌క్కు తెచ్చి హోట‌ల్ వారికి చూపించ‌డంతో వారు త‌ప్పు ఒప్పుకున్నార‌ని, అంతే కాకుండా ఆ యువ‌కుడి ఆసుప‌త్రి బిల్లు కూడా హోట‌ల్ యాజ‌మాన్య‌మే క‌ట్టింద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.. అయితే బాధితుడు మృతిచెందాడ‌ని చెబుతున్న వారి కుటుంబ స‌భ్యులు కానీ, మ‌రో ఇద్ద‌రు యువ‌కులు కానీ ఈ దుమారంపై మాట్లాడ‌డం లేదు..  

హోట‌ల్ యాజ‌మాన్యం ఏమంటుందంటే..

బిర్యానీ పార్శిల్ లో మండ్ర‌క‌ప్ప వ‌చ్చింద‌ని, అది తిన్న ముగ్గురు యువ‌కుల్లో ఒక‌రు మృతిచెందాడ‌ని జ‌రుగుతోన్న ర‌చ్చ‌పై స‌ద‌రు హోట‌ల్ యజ‌మానితో ఏబీపీ దేశం మాట్లాడింది. అయితే దీనిపై స‌ద‌రు యాజ‌మాని మాట్లాడుతూ త‌మ హోట‌ల్ కు సంబందించిన బిర్యానీ పార్శిల్‌లో అటువంటిదేమీ వ‌చ్చిన‌ట్లు త‌మ దృష్టికి రాలేద‌ని, ఒక వేళ వ‌చ్చి ఫుడ్ పాయిజ‌న్ అయ్యుంటే అది ప‌ట్టు కెళ్లింది కేవ‌లం ఆ ముగ్గురూ మాత్ర‌మే కాద‌ని, చాలా మంది పార్శిళ్లు తీసుకెళ్తార‌ని, పార్శిల్‌లో మండ్ర‌క‌ప్ప వ‌చ్చింద‌ని చెబుతున్న ముగ్గ‌రు అస్వ‌స్థ‌త‌కు గురికావాలి క‌దా అటువంటిదేమీ జ‌రగ‌లేదంటున్నారు. అయితే మృతిచెందిన యువ‌కుడికి తీవ్ర ఆనారోగ్య స‌మ‌స్య‌లున్నాయ‌ని వారి కుటుంబికులే  తెలిపార‌ని, మందులు స‌క్ర‌మంగా వాడ‌క‌పోవ‌డం వ‌ల్ల‌నే అత‌ను మృతిచెందిన‌ట్లు కుటుంబికులు, వైద్యులు నిర్ధారించాని ఆయ‌న తెలిపారు. 

ఫుడ్ సేప్టీ అధికారులు ఏం చేస్తున్న‌ట్టు...?

అమ‌లాపురంలో హోట‌ళ్ల‌లో జ‌రుగుతోన్న దారుణాల‌పై ఫుడ్ సేప్టీ అధికారులు క‌నీస చ‌ర్య‌లు క‌ర‌వ‌య్యాయ‌ని ప్ర‌జ‌లు మండిప‌డుతున్నారు. గ‌తంలో హెట‌ళ్ల‌పై అధికారులు దాడులు చేసిన క్ర‌మంలో కుళ్లిపోయిన మాసం ప‌దార్ధాలు, నిల్వ ఉంచిన ఆహార ప‌దార్ధాలు గుర్తించి కేసులు రాశారు.. అయితే ఈదాడులు జ‌రిగి రెండేళ్లుకు పైబ‌డినా అస‌లు ఇటీవ‌ల కాలంలో ఎటువంటి దాడులు చేయ‌క‌పోవ‌డం వ‌ల్ల‌నే ఈ ప‌రిస్తితి త‌లెత్తుతోందంటున్నారు. ప్ర‌తీ హోట‌ల్స్‌లోనూ ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారుల ఫోన్ నెంబ‌ర్లు ఉండేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప్ర‌జ‌లు సూచిస్తున్నారు. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bihar Elections Phase 1 Polling: బిహార్‌లో మొదటి దశ పోలింగ్ ప్రారంభం- తొలి విడతలో పరీక్ష ఎదుర్కొంటున్న లీడర్లు వీళ్లే!
బిహార్‌లో మొదటి దశ పోలింగ్ ప్రారంభం- తొలి విడతలో పరీక్ష ఎదుర్కొంటున్న లీడర్లు వీళ్లే!
PM Kisan Yojana 21st Installment: ప్రధానమంత్రి కిసాన్ యోజన డబ్బులు ఎప్పుడు వేస్తారు? ఈ విడత డబ్బులు మీ ఖాతా పడుతుందో లేదో ముందే చెక్ చేసుకోండి!
ప్రధానమంత్రి కిసాన్ యోజన డబ్బులు ఎప్పుడు వేస్తారు? ఈ విడత డబ్బులు మీ ఖాతా పడుతుందో లేదో ముందే చెక్ చేసుకోండి!
Gollapalli Surya Rao Health Update: మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావుకు అనారోగ్యం- గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిక, నిల‌క‌డ‌గా ఆరోగ్య పరిస్థితి!
మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావుకు అనారోగ్యం- గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిక, నిల‌క‌డ‌గా ఆరోగ్య పరిస్థితి!
Telangana cabinet : కొండా సురేఖ సహా ఆ ముగ్గురు అవుట్‌- విజయశాంతి సహా ముగ్గురు ఇన్‌; జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తర్వాత తెలంగాణ కేబినెట్ విస్తరణ!
కొండా సురేఖ సహా ఆ ముగ్గురు అవుట్‌- విజయశాంతి సహా ముగ్గురు ఇన్‌; జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తర్వాత తెలంగాణ కేబినెట్ విస్తరణ!
Advertisement

వీడియోలు

Ghazala Hashmi New Lieutenant Governor | వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్ గా తొలి ముస్లిం మహిళ | ABP Desam
Zohran Mamdani won Newyork Mayor Election |  న్యూయార్క్ మేయర్ గా గెలిచిన జోహ్రాన్ మమ్ దానీ | ABP Desam
పాక్ ప్లేయర్ తిక్క కుదిర్చిన ICC.. కానీ మన సూర్యకి అన్యాయం!
రికార్డుల రారాజు కింగ్ కోహ్లీ బర్త్ డే స్పెషల్
ఫెషాలీ, దీప్తి కాదు.. తెలుగమ్మాయి వల్లే గెలిచాం: రవిచంద్రన్ అశ్విన్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bihar Elections Phase 1 Polling: బిహార్‌లో మొదటి దశ పోలింగ్ ప్రారంభం- తొలి విడతలో పరీక్ష ఎదుర్కొంటున్న లీడర్లు వీళ్లే!
బిహార్‌లో మొదటి దశ పోలింగ్ ప్రారంభం- తొలి విడతలో పరీక్ష ఎదుర్కొంటున్న లీడర్లు వీళ్లే!
PM Kisan Yojana 21st Installment: ప్రధానమంత్రి కిసాన్ యోజన డబ్బులు ఎప్పుడు వేస్తారు? ఈ విడత డబ్బులు మీ ఖాతా పడుతుందో లేదో ముందే చెక్ చేసుకోండి!
ప్రధానమంత్రి కిసాన్ యోజన డబ్బులు ఎప్పుడు వేస్తారు? ఈ విడత డబ్బులు మీ ఖాతా పడుతుందో లేదో ముందే చెక్ చేసుకోండి!
Gollapalli Surya Rao Health Update: మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావుకు అనారోగ్యం- గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిక, నిల‌క‌డ‌గా ఆరోగ్య పరిస్థితి!
మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావుకు అనారోగ్యం- గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిక, నిల‌క‌డ‌గా ఆరోగ్య పరిస్థితి!
Telangana cabinet : కొండా సురేఖ సహా ఆ ముగ్గురు అవుట్‌- విజయశాంతి సహా ముగ్గురు ఇన్‌; జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తర్వాత తెలంగాణ కేబినెట్ విస్తరణ!
కొండా సురేఖ సహా ఆ ముగ్గురు అవుట్‌- విజయశాంతి సహా ముగ్గురు ఇన్‌; జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తర్వాత తెలంగాణ కేబినెట్ విస్తరణ!
Akbaruddin Owaisi: అధికారంలో రెడ్డి ఉన్నా.. రావు ఉన్నా హైదరాబాద్ మాదే  - అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
అధికారంలో రెడ్డి ఉన్నా.. రావు ఉన్నా హైదరాబాద్ మాదే - అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
Bihar Assembly Elections 2025:ఏ బూత్‌లో ఎంత మంది ఓటు వేస్తారో ఎన్నికల సంఘం ఎలా నిర్ణయిస్తుంది? నియమాలు  ఏంటీ?
ఏ బూత్‌లో ఎంత మంది ఓటు వేస్తారో ఎన్నికల సంఘం ఎలా నిర్ణయిస్తుంది? నియమాలు ఏంటీ?
Ramachandrapuram Crime News: రామ‌చంద్ర‌పురంలో బాలిక అనుమానాస్ప‌ద మృతి; ఇంటి య‌జ‌మాని కుమారుడిపైనే డౌట్‌
రామ‌చంద్ర‌పురంలో బాలిక అనుమానాస్ప‌ద మృతి; ఇంటి య‌జ‌మాని కుమారుడిపైనే డౌట్‌
Andhra Pradesh New Districts : ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు జిల్లాలు, ఏడుకొత్త డివిజన్ల ప్రతిపాదన- నివేదిక సిద్ధం చేసిన కేబినెట్‌ ఉపసంఘం 
ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు జిల్లాలు, ఏడుకొత్త డివిజన్ల ప్రతిపాదన- నివేదిక సిద్ధం చేసిన కేబినెట్‌ ఉపసంఘం 
Embed widget