<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/" xmlns:dc="http://purl.org/dc/elements/1.1/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/" xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/" xmlns:media="http://search.yahoo.com/mrss/"><channel><title>rajamundry</title><atom:link href="https://telugu.abplive.com/rajamundry/feed" rel="self" type="application/rss+xml"/><link>https://telugu.abplive.com/</link><description/><lastBuildDate>Tue, 18 Aug 2026 12:04:21 +0530</lastBuildDate><language>en-US</language><sy:updatePeriod>hourly</sy:updatePeriod><sy:updateFrequency>1</sy:updateFrequency><generator>https://telugu.abplive.com</generator><item><title><![CDATA[Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/rajamundry/odalarevu-fishermen-missing-konaseema-state-government-search-operation-chandra-babu-pawan-kalyan-reivew-256600</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/rajamundry/odalarevu-fishermen-missing-konaseema-state-government-search-operation-chandra-babu-pawan-kalyan-reivew-256600#respond</comments><pubDate>Tue, 18 Aug 2026 10:41:42 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ రాజమండ్రి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/rajamundry/odalarevu-fishermen-missing-konaseema-state-government-search-operation-chandra-babu-pawan-kalyan-reivew-256600</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Konaseema Fishermen Missing:&lt;/strong&gt; కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు జెట్టి నుంచి వేటకు వెళ్లిన ఎనిమిది &amp;nbsp;మంది మత్స్యకారులు సముద్రంలో గల్లంతయ్యారు. వీరు ప్రయాణిస్తున్న బోటు ఆచూకీ తెలియకపోవడంతో తీర ప్రాంతంలో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి, గాలింపు చర్యను ముమ్మరం చేసింది. కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీసులు, మత్స్యశాఖ అధికారుల సమన్వయంతో గాలింపు ప్రక్రియ కొనసాగుతోంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;మత్య్సకారుల బృందం ఆగస్టు 3వ తేదీన ఓడలరేవు జెట్టి నుంచి బోటులో సముద్రంలోకి వేటకు వెళ్లారు. సాధారణంగా వారు ఆగస్టు 12వ తేదీ నాటికి తిరిగి ఒడ్డుకు చేరుకోవాల్సి ఉంది. అయితే గడువు ముగిసినా బోటు గానీ, అందులోని మత్స్యకారులు గానీ తిరిగి రాకపోవడంతో వారి కుటుంబ సభ్యులు అధికారులకు సమాచారం అందించారు. అప్పటి నుంచి ప్రభుత్వం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;మత్స్యకారుల ఆచూకీ కోసం వివిధ కోణాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. దీని కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంది. సముద్ర గర్భంలో గాలింపు కోసం కోస్ట్&amp;zwnj;గార్డ్&amp;zwnj; నౌకలను, మెరైన్&amp;zwnj; పోలీసుల సహకారాన్ని తీసుకుంటున్నారు. కాకినాడ, భైరవపాలెం, విశాఖపట్నం, ఒడిశాలోని పారాదీప్&amp;zwnj; తీర ప్రాంతాల్లోని బోట్లను అధికారులు అప్రమత్తం చేశారు. గల్లంతైన బోటు ఆ ప్రాంతాల వైపు వెళ్లే అవకాశం ఉందన్న అంచనాతో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. విశాఖ నుంచి పారాదీప్ మధ్య ఉన్న తీరప్రాంతంలో సెర్చ్ అండ్&amp;zwnj; రెస్క్యూ ఆపరేషన్లను మరింత వేగవంతం చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు నిర్ణీత సమయానికి తిరిగి రాకపోవడం వాతావరణ పరిస్థితులు లేదా సాంకేతిక లోపాలు వల్ల బోటు దారి తప్పి ఉండవచ్చని భావిస్తున్నారు. 8 మంది ప్రాణాలు ప్రమాదంలో ఉండటంతో ప్రభుత్వం దీనిని అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకుంది. &amp;nbsp;మత్స్యకారుల భద్రతకు పెద్దపీట వేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు అందాయి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష&lt;/h2&gt;
&lt;p&gt;ముఖ్యమంత్రి &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; నాయుడు ఈ ఘటనపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. గల్లంతైన మత్స్యకారుల బోటు ఆచూకీ లభించే వరకు గాలింపు చర్యలు ఆపకూడదని ఆయన స్పష్టం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇస్తూ అధికారులందరూ సమన్వయంతో పని చేయాలని సూచించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;పవన్ పర్యవేక్షణ&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;డిప్యూటీ సీఎం &lt;a title=&quot;పవన్ కల్యాణ్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Pawan-Kalyan&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;పవన్ కల్యాణ్&lt;/a&gt;&amp;zwnj; వ్యక్తిగతంగా ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఆయన కోనసీమ జిల్లా కలెక్టర్&amp;zwnj;, ఎస్పీలతో మాట్లాడి తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మత్స్యకారుల ప్రాణాల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, గాలింపు పురోగతి గురించి వారి కుటుంబాలకు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేయాలని ఆదేశించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;మంత్రి అచ్చెన్న దిశానిర్దేశం&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;మంత్రి అచ్చెన్నాయుడు మత్స్య శాఖ, కోస్ట్&amp;zwnj;గార్డ్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. గాలింపు చర్యల్లో ఎటువంటి జాప్యం జరగకుండా చూడాలని రెస్క్యూ ఆపరేన్లు వేగవంతం చేయాలని ఆయన కోరారు.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/18/ad8f392c48f8b2c61f5b44a77a991beb1787029883152215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!]]></title><link>https://telugu.abplive.com/jobs/andhra-pradesh-teacher-recruitment-dsc-notification-3000-posts-nara-lokesh-256589</link><comments>https://telugu.abplive.com/jobs/andhra-pradesh-teacher-recruitment-dsc-notification-3000-posts-nara-lokesh-256589#respond</comments><pubDate>Tue, 18 Aug 2026 07:58:22 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ జాబ్స్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/jobs/andhra-pradesh-teacher-recruitment-dsc-notification-3000-posts-nara-lokesh-256589</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;AP DSC Notification 2026:&amp;nbsp;&lt;/strong&gt;ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం వేచి చూస్తున్న లక్షలాది మంది మంత్రి నారా లోకేష్ మరో గుడ్ న్యూస్ చెప్పారు. ఇప్పటికే ఎప్పుడు ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారో చెబుతూ క్యాలెండర్ ప్రకటించారు. దాని ప్రకారం అక్టోబర్&amp;zwnj;లో డీఎస్సీ నోటిఫికేషన్ వేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. దానికి అనుగుణంగానే 3000 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ రాబోతోందని ఆయన తెలిపారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;అసెంబ్లీ వేదికగా లోకేష్&amp;zwnj; ప్రకటన&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;ఆంధ్రప్రదేశ్&amp;zwnj; శాసనసభ వర్షాకాల సమావేశాల్లో భాగంగా విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్&amp;zwnj; &amp;nbsp;ఉపాధ్యాయ నియామకాలపై స్పష్టమైన రోడ్డు మ్యాప్ ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఖాళీలను భర్తీ చేసే ప్రక్రియలో భాగంగా రాబోయే అక్టోబర్&amp;zwnj; నెలలో 3000 పోస్టులతో కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడనుందని ప్రకటించారు. ప్రభుత్వం పాఠశాలల్లో ఉపాధ్యాయ- విద్యార్థి నిష్పత్తిని మెరుగుపరచడం ద్వారా విద్యా ప్రమాణాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనేది ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;ప్రతి ఏటా డీఎస్సీ&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;ఈ ప్రకటనలో అత్యంత కీలకమైన మరో అంశం యాన్యువల్ డీఎస్సీ, ఇప్పటివరకు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియక అభ్యర్థులు పడే మానసిక ఒత్తిడిని తొలగించడానికి, ప్రతి సంవత్సరం నిర్ధిష్ట సమయంలో నోటిఫికేషన్ విడుదల చేసేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. దీని వల్ల అభ్యర్థులు తమ ప్రిపరేషన్&amp;zwnj;ను ప్రణాళికాబద్ధంగా కొనసాగించుకోడానికి వీలు అవుతుంది. ఇప్పటికే ప్రభుత్వం గ్రూప్-1, గ్రూప్&amp;zwnj;-2, డీఎస్సీ పోస్టుల భర్తీ ప్రక్రియలో ముందంజలో ఉన్నట్టు అసెంబ్లీలో వెల్లడించింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;నియామకాల్లో పారదర్శకత&lt;/h2&gt;
&lt;p&gt;నియామక ప్రక్రియలో ఎటువంటి అక్రమాలకు తావులేకుండా వంద శాతం పారదర్శకత పాటిస్తామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు. కంప్యూటర్ ఆధారిత పరీక్షల ద్వారానే అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని, జిల్లాల వారీగా ఉన్న ఖాళీలు, రిటైర్మెంట్&amp;zwnj;లు, పదోన్నతలు ఆధారంగా నోటిఫికేషన్ డిజైన్ చేస్తున్నట్టు ఆయన తెలిపారు. గతంలో ఎదురైన న్యాయపరమైన ఆటంకాలను, దాదాపు 336 కోర్టు కేసులను అధిగమించి గత ఏడాది నిర్వహించిన మెగా డీఎస్సీని 148 రోజుల్లోనే రికార్డు స్థాయిలో పూర్తి చేసినట్టు గుర్తు చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;ఉపాధ్యాయులకు అంతర్జాతీయ శిక్షణ&lt;/h2&gt;
&lt;p&gt;ఉపాధ్యాయులకు కేవలం పాఠశాలలకు పరిమితం కాకుండా, వారికి అత్యాధునిక బోధనా పద్ధతుల్లో శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే ఏపీ ఉపాధ్యాయులను సింగపూర్, ఫిన్&amp;zwnj;లాండ్ వంటి దేశాలకు పంపి అంతర్జాతీయ ఎక్స్&amp;zwnj;పోజర్ కల్పించనున్నారు. అక్టోబ్&amp;zwnj;లో నోటిఫికేషన్ ఇచ్చి, పరీక్షలు నిర్వహించి ఉగాది పండుగ నాటికి ఎంపికైన వారికి నియామక పత్రాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుంది. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి వీరందరూ విధుల్లో చేరనున్నారు.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/18/26826903dd147be88738a2f7b510cf721787019858734215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[AP CM Chandrababu Speech: ఎల్‌నినో ప్రభావంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. అక్కడ మాత్రమే వరి వేయాలని రైతులకు సూచనలు]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/ap-cm-chandrababu-highlights-severe-drought-and-el-nino-impact-in-ap-legislative-council-256579</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/ap-cm-chandrababu-highlights-severe-drought-and-el-nino-impact-in-ap-legislative-council-256579#respond</comments><pubDate>Mon, 17 Aug 2026 21:20:16 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ అమరావతి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/amravati/ap-cm-chandrababu-highlights-severe-drought-and-el-nino-impact-in-ap-legislative-council-256579</guid><description><![CDATA[&lt;p&gt;అమరావతి: ఈ ఏడాది భారత్&amp;zwnj;లో పలు రాష్ట్రాల్లో ఎల్ నినో తీవ్ర ప్రభావం చూపుతోంది. ఆగస్టు నెల సగం పూర్తయినా లోటు వర్షపాతం కారణంగా రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, ఎల్ నినో తీవ్ర ప్రభావం, నీటి సంక్షోభంపై మాట్లాడుతూ ఈ ఏడాది 35.5 శాతం లోటు వర్షపాతం ఉంటుందని నిపుణులు అంచనా వేశారని రైతులకు కీలక సూచనలు చేశారు. ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలోనూ తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడి నీటి లభ్యత తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. లోటు వర్షపాత పరిస్థితుల కారణంగా రైతులు అన్ని ప్రాంతాల్లో వరి వేసి ఇబ్బంది పడొద్దని సూచించారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;గోదావరి బేసిన్ మినహా ఇతర ప్రాంతాల్లో వరి వద్దు!&lt;/strong&gt;&lt;br /&gt;గోదావరి నదికి మాత్రమే కొంత వరద నీరు వస్తోందని తెలిపారు. కనుక గోదావరి బేసిన్ మినహా మిగిలిన ఏ ప్రాంతంలోనూ వరి పంటలు వేస్తే, పంటలు ఎండిపోయి రైతులు ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉందని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. ఈ విషయాన్ని రైతులు గ్రహించి నీటిని అత్యంత పొదుపుగా వాడుకోవాలని సూచించారు. ఎల్ నినో ప్రభావంతో లోటు వర్షపాతం నమోదవుతుందని రైతులు అర్థం చేసుకుని, ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవడం మంచిదన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు వారి ప్రాంతాల్లో ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించాలని సూచించారు.&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/17/0c6deb82229a002e4c9329fa640804a51786981200531233_original.jpg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;రాష్ట్రంలో తాగునీటి అవసరాలకు మొదటి ప్రాధాన్యత ఇస్తూనే, పరిశ్రమలకు అవసరమైన నీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి పెడతామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. నిపుణుల అంచనాల ప్రకారం ఈ ఏడాది దాదాపు 35.5 శాతం మేర లోటు వర్షపాతం నమోదు కానుందని తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రాజెక్టులతో పాటు పెన్నా బేసిన్ వ్యాప్తంగా పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, కొన్ని జిల్లాల్లో లోటు వర్షపాతం 42 శాతానికి చేరిందన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;నీటి కొరతతో రాష్ట్రాల మధ్య వివాదాలు&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;నీటి కొరత వల్ల రాష్ట్రాల మధ్య వివాదాలు, విభేదాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గత రెండేళ్లుగా ఏపీ ప్రభుత్వం నీటి నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందన్నారు. పొరుగు రాష్ట్రాలైన &lt;a title=&quot;కర్ణాటక&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Karnataka&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కర్ణాటక&lt;/a&gt;, మహారాష్ట్రలలో కూడా వర్షపాతం తగ్గడంతో అక్కడి రిజర్వాయర్లు నిండిన తర్వాతే మన రాష్ట్రానికి నీరు వస్తుందని తెలిపారు. దీనివల్ల కృష్ణా పరివాహక ప్రాంతంలోని శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు నీటి ప్రవాహం భారీగా తగ్గిందని ఆయన వివరించారు. ఉదాహరణకు శ్రీశైలానికి సాధారణంగా రావాల్సిన 753 టీఎంసీల నీటికి గాను ఈ ఏడాది కేవలం 214 టీఎంసీలు మాత్రమే వచ్చాయని తెలిపారు.&lt;/p&gt;
&lt;p&gt;జూన్ నుంచి డిసెంబర్ మధ్య సాధారణంగా పడాల్సిన 867 మిల్లీమీటర్ల వర్షపాతానికి బదులుగా కేవలం 557 మి.మీ మాత్రమే నమోదయ్యే అవకాశం ఉందన్నారు. జులై నుంచి నవంబర్ వరకు &amp;nbsp;20 శాతం నుండి 68 శాతం వరకు లోటు వర్షపాతం ఉంటుందని, డిసెంబర్&amp;zwnj;లో మాత్రమే స్వల్పంగా సాధారణ వర్షపాతం ఉండవచ్చని వివరించారు. ఈ ఏడాది అన్ని జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కానుందని.. కొన్ని జిల్లాల్లో జులైలో 68 శాతం లోటు వర్షపాతం నమోదు కాగా, ఆగస్టులో 35 శాతం, సెప్టెంబర్ నెలలో 35 శాతం, అక్టోబర్&amp;zwnj;లో 25 శాతం, నవంబర్&amp;zwnj;&amp;zwnj; నెలలో 20 శాతం మేర లోటు వర్షపాతం నమోదు కానుందని అంచనాలు వివరించారు. &amp;nbsp;నీటి కొరత ముప్పు తీవ్రంగా ఉన్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సీఎం &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; హెచ్చరించారు.&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/17/e020b81666993aefcbcfe68bc98679421786981067447233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! ]]></title><link>https://telugu.abplive.com/politics/bjp-national-executive-ap-telangana-leaders-political-strategy-cabinet-expansion-256555</link><comments>https://telugu.abplive.com/politics/bjp-national-executive-ap-telangana-leaders-political-strategy-cabinet-expansion-256555#respond</comments><pubDate>Mon, 17 Aug 2026 16:23:03 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ పాలిటిక్స్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/politics/bjp-national-executive-ap-telangana-leaders-political-strategy-cabinet-expansion-256555</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Andhra Pradesh and Telangana BJP:&amp;nbsp;&lt;/strong&gt;సోమవారం బీజేపీ జాతీయ కార్యవర్గాన్ని అధిష్ఠానం ప్రకటించింది. నితిన్ జట్టులోకి తెలుగు రాష్ట్రాల నుంచి కేవలం ఇద్దరికే చోటు దక్కింది. ఆ ఇద్దరు కూడా ఆంధ్రప్రదేశ్&amp;zwnj;కు చెందిన వారే. రామ్&amp;zwnj;మాధవ్&amp;zwnj;కు చోటు దక్కినా ఆయన ఢిల్లీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తెలంగాణ నుంచి మాత్రం ఒక్కరంటే ఒక్కరికి కూడా చోటు లభించలేదు. అంతేకాకుండా మొన్నటి వరకు జాతీయ కార్యవర్గంలో ఉన్న డీకే అరుణకు కూడా చోటు కల్పించలేదు. అయితే ఈ మార్పులు చేర్పులపై ఆంధ్రప్రదేశ్&amp;zwnj;కు చెందిన నేతలు కాస్త నిరాశ చెందుతుంటే, తెలంగాణకు చెందిన నేతలు మాత్రం ముసిముసి నవ్వులు నవ్వుతూ ఫుల్&amp;zwnj; ఖుష్ అవుతున్నారు. పదవులు రాని వారందరూ ఎందుకు ఆనందపడుతున్నారో చూద్దాం. &amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;ఏపీలో అన్&amp;zwnj;హ్యాపీ- తెలంగాణలో హ్యాపీ&lt;/h2&gt;
&lt;p&gt;మంత్రివర్గ విస్తరణ, పార్టీ పదవులు, నామినేటెడ్ పదవులు ఏవైనా సరే ఒక లీడర్&amp;zwnj;కు బూస్ట్ ఇస్తాయి. తన ప్రాంతంలో పెట్టు మరింత పెంచుకోవడానికి సహకరిస్తాయి. అందుకే పదవుల కోసం గ్రామస్థాయి లీడర్ నుంచి జాతీయ స్థాయి నాయకుడి వరకు పోటీ పడుతుంటారు. లాబీయింగ్ చేస్తుంటారు. పదవులు రాని వారు మాత్రం విమర్శలు చేస్తారు. ఆలిగి కూర్చుంటారు. మరికొందరు తిరుగుబాటు చేస్తారు. బీజేపీ నేతల ఆలోచనలు మాత్రం వేరుగా ఉన్నాయి. త్వరలోనే జరిగే మంత్రివర్గ విస్తరణలో తమకు చోటు ఖాయమనే ధీమాతో ఉన్నారు. అందుకే తమను జాతీయ కార్యవర్గంలోకి తీసుకోలేదని సంబరపడిపోతున్నారు. అదే తెలంగాణ నేతల్లో ఆనందాన్ని రెట్టింపు చేస్తే, ఆంధ్రప్రదేశ్ నేతల్లో నిరాశ నింపుతోంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;ఏపీ బీజేపీ నేతలకు ఆమాత్యయోగం లేనట్టే!&lt;/h2&gt;
&lt;p&gt;పార్టీలు ఏ పని చేసినా దాని వెనుక రాజకీయ వ్యూహం కచ్చితంగా ఉంటుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా అదే ఆలోచనతో పావులు కదుపుతోంది. వివిధ స్థాయి పదవులకు నాయకులను ఎంపిక చేస్తుంది. ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లో పార్టీని అధికారంలోకి వచ్చే బలం బలగం బీజేపీకి లేదు. అందుకే కూటమితో ప్రయాణం సాగిస్తోంది. అందుకే సొంతంగా ఎదగడానికి ప్రయత్నిస్తూనే కూటమిని కూడా కాపాడుకోవాలని ఆలోచనతో వెళ్తోంది. త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో కచ్చితంగా ఆంధ్రప్రదేశ్&amp;zwnj;కు ఒక మంత్రి పదవి వస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఆ మంత్రి పదవి ఇచ్చే క్రమంలో లెక్కలు పరిగణలోకి తీసుకుంటారు. ఇప్పటికే మూడు మంత్రిపదవులు ఆ రాష్ట్రం నుంచే ఉన్నాయి. ఇందులో టీడీపీ లీడర్లు ఇద్దరు అయితే, మూడో వ్యక్తి బీజేపీ నుంచి ఎన్నికైన వ్యక్తే. టీడీపీ నుంచి శ్రీకాకుళం నుంచి ఎన్నికైన రామ్మోహన్ నాయుడు కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉంటే, గుంటూరు నుంచి ఎన్నికైన పెమ్మసాని చంద్రశేఖర్&amp;zwnj; గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ మంత్రిగా ఉన్నారు. నరసాపురం నుంచి బీజేపీ గుర్తుపై గెలిచిన భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు భారీ పరిశ్రమల, ఉక్కు శాఖల మంత్రిగా కొనసాగుతున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;పురంధేశ్వరిని పోటీ నుంచి తప్పించిన అధిష్ఠానం&lt;/h2&gt;
&lt;p&gt;ఇప్పుడు ఏపీకి ఇంకో పదవి ఇవ్వాల్సి వస్తే కచ్చితంగా సీనియర్&amp;zwnj;, రాజమండ్రి నుంచి విజయం సాధించిన పురంధేశ్వరి పోటీకి వస్తారు. ఇవ్వాల్సిన మంత్రి పదవి ఈసారి కూటమి పార్టీల్లో ఒకరికి ఇవ్వాల్సిన మోదీ, అమిత్&amp;zwnj;షా నిర్ణయించినట్టు తెలుస్తోంది. అలా చేస్తే బీజేపీ కేడర్&amp;zwnj;ను నిరాశ పరచినట్టు అవుతుంది. అందుకే జాతీయ కార్యవర్గంలోకి పురంధేశ్వరిని తీసుకున్నారు. ఇప్పుడు ఆమెను మంత్రిపదవి రేసు నుంచి తప్పించారు. దీంతో సమీకరణాలు లెక్కించడం బీజేపీకి, కూటమి పార్టీలకు ఈజీ అవుతుంది. అందుకే ఇది తెలిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు ఒక్కసారిగా డీలా పడిపోయారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;తెలంగాణలో నేతల హ్యాపీకి కారణం!&lt;/h2&gt;
&lt;p&gt;తెలంగాణలో బీజేపీ నేతలు మాత్రం ఫుల్ హ్యాపీగా ఉంటున్నారు. ఒక వేళ జాతీయ కార్యవర్గంలో చోటు కల్పించి ఉంటే కచ్చితంగా తమ మంత్రిపదవి ఆశలపై నీళ్లు చల్లినట్టేనని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఎవర్నీ ఎంపిక చేయకపోవడం వారంతా తమ లాబీయింగ్&amp;zwnj;ను మరింత తీవ్రం చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్&amp;zwnj;తో పోల్చుకుంటే తెలంగాణలో బీజేపీ బలంగా ఉంది. ఇక్కడ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తుంది. అందుకే పార్టీ పదవులతో ఇక్కడి నేతలను డైవర్ట్ చేయలేమని గ్రహించి, వారి మంత్రి పదవుల ఆప్షన్&amp;zwnj;ను లైవ్&amp;zwnj;లో ఉంచింది. త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో కచ్చితంగా వారిని తీసుకుంటారనే విశ్లేషణలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఇక్కడ ఇద్దరికి మంత్రిపదవులు ఉన్నాయి. కిషన్ రెడ్డి గనుల శాఖను చూస్తున్నారు. మరో నేత &lt;a title=&quot;బండి సంజయ్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Bandi-Sanjay&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;బండి సంజయ్&lt;/a&gt;&amp;zwnj; కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా సేవలు అందిస్తున్నారు. వీరితోపాటు ఇంకో మంత్రిపదవి తెలంగాణలు దక్కవచ్చని వార్తలు వస్తున్నాయి. అందుకే వారిని జాతీయ కార్యవర్గంలోకి తీసుకోలేదనే విశ్లేషణ వినిపిస్తోంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;విష్ణువర్దన్ రెడ్డి పలుకుబడి!&lt;/h2&gt;
&lt;p&gt;ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లో బీజేపీ యువ నేత విష్ణువర్దన్ రెడ్డి మాత్రం కాస్త హ్యాపీగా ఉన్నారు. ఆయన కరుడుగట్టిన &lt;a title=&quot;బీజేపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/BJP&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;బీజేపీ&lt;/a&gt; లీడరే అయినప్పటికీ ఆయన మనసు వైసీపీలో ఉంటుందని కూటమి నేతలు సెటైర్లు వేస్తుంటారు. అందుకే ఆయన్ని రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్ పదవులకు కానీ, ఎన్నికల్లో పోటీకి కానీ &lt;a title=&quot;టీడీపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/tdp&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;టీడీపీ&lt;/a&gt;, &lt;a title=&quot;జనసేన&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Janasena&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;జనసేన&lt;/a&gt; అంగీకరించలేదు. నేరుగా ఆయనకు కేంద్రంలో ప్రత్యేక పదవులు ఇచ్చే పరిస్థితి లేదు. మధ్యేమార్గంగా ఆయన్ని డైరెక్ట్&amp;zwnj;గా నబీన్ టీంలోకి తీసుకున్నారు. దీంతో అధిష్ఠానం వద్ద ఆయన పలుకుబడి బాగానే ఉందని ప్రచారం మొదలైంది. ఇది ఆయనకు కలిసి వచ్చే అంశంగా చెప్పుకుంటున్నారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/17/f6776cb0dd10100a2bcd1c14c41ae34d1786963892353215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Chandra Babu About Mega DSC 2025: మెగా డీఎస్సీ2025 ఆరోపణలపై సాక్ష్యాలు ఉంటే సభ ముందు పెట్టండి, వైసీపీకి చంద్రబాబు సవాల్‌!]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/andhra-pradesh-assembly-mega-dsc-2025-irregularities-transparency-cm-chandra-babu-naidu-challenges-to-ysrcp-256547</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/andhra-pradesh-assembly-mega-dsc-2025-irregularities-transparency-cm-chandra-babu-naidu-challenges-to-ysrcp-256547#respond</comments><pubDate>Mon, 17 Aug 2026 15:03:30 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ అమరావతి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/amravati/andhra-pradesh-assembly-mega-dsc-2025-irregularities-transparency-cm-chandra-babu-naidu-challenges-to-ysrcp-256547</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Chandra Babu About Mega DSC 2025: &lt;/strong&gt;ఆంధ్రప్రదేశ్&amp;zwnj; అసెంబ్లీలో మెగా డీఎస్సీ 2025పై కీలకమైన చర్చ జరిగింది. ఈ నియామకాల్లో అక్రమాలు జరిగాయని చాలా కాలంగా వైసీపీ ఆరోపణలు చేస్తూ వస్తోంది. రోడ్లపై నిరసనలు తెలియజేస్తోంది. అధికారులు ఎప్పటికప్పుడు వారు చేస్తున్న ఆరోపణలకు కౌంటర్ ఇస్తూనే వస్తున్నారు. అయినా తమ ఆరోపణలను మాత్రం వారు ఆపడం లేదు. దీంతో అసెంబ్లీలోనే చర్చ పెట్టి పూర్తి సమాచారాన్ని ప్రజలకు చేరవేయాలని ప్రభుత్వం భావించింది. అనుకున్నట్టుగానే అసెంబ్లీలో విస్తృతంగా చర్చ సాగింది. ఇందులో మాట్లాడిన మంత్రులు, ముఖ్యమంత్రి వైసీపీ తీరును తప్పుపట్టారు. అక్రమాలు జరిగినట్టు ఆధారాలు చూపించకుండా కేవలం బురద జల్లుతున్నారని, అపోహలు సృష్టించడమే వారి పని అని అంటూ మండిపడ్డారు. సాక్ష్యాలు ఉంటే పట్టుకొని సభకు రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ చేశారు. ఈ ప్రభుత్వంలో తప్పులకు ఆస్కారం లేదని అలాంటి వాటిని ఉపేక్షించే ప్రసక్తే లేదని అన్నారు. అదే టైంలో జరగని తప్పులు గురించి ఆధారాలు లేకుండా పదే పదే ఆరోపణలు చేసిన వారి కూడా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఎలాంటి తప్పులు లేకుండా కేవలం ప్రతిభ ఆధారంగానే మెగా డీఎస్సీ 2025 నియామకాలు పూర్తి అయ్యాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తేల్చి చెప్పారు. తప్పులు లేకుండా, పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రతి దశలోనూ జాగ్రత్తలు తీసుకున్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఆ విషయం రాసిన అభ్యర్థులకు, ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు తెలుసునని అన్నారు. అందుకే వైసీపీ ఎన్ని విధాలుగా తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తున్నా పట్టించుకున్న వారు లేరని అభిప్రాయపడ్డారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;కేవలం వైసీపీ నేతలు మాత్రమే రోడ్డుపైకి వచ్చి నానాయాగి చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. వారు చేస్తున్న ఆరోపణలకు అధికారులు సాక్ష్యాలతో సమాధానం ఇచ్చారని పేర్కొన్నారు. ధర్నాలు చేస్తున్న వైసీపీ నేతలకు స్పోర్ట్స్&amp;zwnj;కు గేమ్స్&amp;zwnj;కు తేడా తెలియదన్నారు. అందుకే ఏదో జరిగిపోయిందనే భ్రమల్లో ప్రజలను తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి అధికారులతోపాటు డీఎస్సీలో ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులు కూడా రోడ్డుపైకి వచ్చి వైసీపీ నేతలకు కౌంటర్ ఇచ్చారని, వీరిలో ఎక్కువ మంది మహిళలే ఉన్నారని గుర్తు చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేస్తున్నా వారి వద్ద ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు చంద్రబాబు. వారు అధికారంలో ఉన్నప్పుడు డీఎస్సీ ఉద్యోగాల నోటఫికేషన్ వేయలేకపోయామనే కోపంతోనే ఇలాంటివి చేస్తున్నారని అన్నారు. తాము ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టు నోటిఫికేషన్ ఇచ్చామని, 108 రోజుల్లోనే ప్రక్రియను ఎలాంటి తప్పుల్లేకుండా పూర్తి చేశామని అన్నారు. ఇందులో భాగమైన అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృతజ్ఞత తెలిపారు. ఇంత పకడ్బంధీగా ఉద్యోగ నియామకాలు పూర్తి చేసినప్పటికీ వైసీపీ తప్పుడు ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. నిజంగా వారి వద్ద ఏమైనా ఆధారాలు ఉంటే కచ్చితంగా అసెంబ్లీకి వచ్చి వాటిని టేబుల్&amp;zwnj;పై పెట్టాలని సవాల్ చేశారు. రోడ్డుపై నిలబడి ఏవో కాగితాలు చూపించి ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;తమ ప్రభుత్వంలో తప్పుల చేసేందుకు ఆస్కారం లేదని అలాంటి తప్పులు ఉన్నట్టు నిరూపిస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; అన్నారు. అదే టైంలో సాక్ష్యాలు లేకుండా పదే పదే తప్పుడు ఆరోపణలు చేసినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. తప్పులు జరిగి ఉంటే చర్యలు, సాక్ష్యాలు లేకుండా తప్పుడు ఆరోపణలు చేసినా చర్యలు ఉంటాయని వైసీపీ వాళ్లకు వార్నింగ్ ఇచ్చారు. ఇక డీఎస్సీపై క్లియర్&amp;zwnj;గా అన్ని వివరాలు చెప్పేశామని, ఇకపై దీని గురించి చర్చ అనవసరమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. &amp;nbsp; &amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/17/459819c5b4ea23eceab5ca61520078461786958965147215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Andhra Pradesh Assembly Sessions: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/andhra-pradesh-assembly-sessions-mega-dsc-nara-lokesh-key-bills-amaravati-256500</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/andhra-pradesh-assembly-sessions-mega-dsc-nara-lokesh-key-bills-amaravati-256500#respond</comments><pubDate>Mon, 17 Aug 2026 07:56:02 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ అమరావతి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/amravati/andhra-pradesh-assembly-sessions-mega-dsc-nara-lokesh-key-bills-amaravati-256500</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Andhra Pradesh Assembly Sessions:&amp;nbsp;&lt;/strong&gt;ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి వర్షాకాల సమావేశాలు సోమవారం ఉదయం నుంచి ప్రారంభంకానున్నాయి. గవర్నర్&amp;zwnj; ఎస్ అబ్దుల్&amp;zwnj; నజీర్&amp;zwnj; నోటిఫికేషన్ మేరకు ఉదయం 9 గంటలకు శాసనసభ, పది గంటలకు శాసన మండలి కొలువుదీరనున్నాియ. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా అత్యంత కీలకమైన ఈ సమావేశాల్లో ప్రభుత్వం పలు ప్రజా ప్రాధాన్యత కలిగి అంశాలను సభ ముందుకు తీసుకురానుంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;సమావేశాల అజెండా&lt;/h2&gt;
&lt;p&gt;ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ సమావేశాలు నాలుగు రోజుల పాటు నిర్వహించే అవకాశం ఉంది. తొలిరోజు ఉభయ సభలు ప్రారంభమైన కొద్ది సేపటికే వాయిదా పడతాయి. అనంతరం స్పీకర్ అధ్యక్షతను శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ భేటీ కానుంది. ఈ కమిటీ సమావేశాల కాలవ్యవధిని, ప్రతి రోజూ చర్చించాల్సిన అంశాలపై తుది నిర్ణయం తీసుకుంటుంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఈసారి సమావేశాల్లో ఒక నూతన సాంకేతిక విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. ఎమ్మెల్యేలు తమకు కేటాయించిన సీట్లలో కూర్చుంటే వారి హాజరు నమోదు అయ్యేలా డిజిటల్ ఏర్పాట్లు చేశారు. భద్రత దృష్ట్యా అసెంబ్లీ పరిసరాల్లో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. మీడియా, సిబ్బందికి డిజిటల్ పాస్&amp;zwnj;లనను తప్పనిసరి చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;మండలిలో మెగా డీఎస్సీపై వార్&lt;/h2&gt;
&lt;p&gt;మెగా డీఎస్సీ 2025లో అక్రమాలు జరిగాయని చాలా కాలంగా వైసీపీ ప్రచారం చేస్తోంది. మండలిలో కూడా దీనిపై నిలదీయాలని చూస్తోంది. అందుకే తొలి రోజే మెగా డీఎస్సీపై మంత్రి నారా లోకేష్&amp;zwnj; సభలో ప్రకటన చేయనున్నారు. పారదర్శకంగా ఎలా నిర్వహించారో పవర్&amp;zwnj;పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించనున్నారు. దీంతో ఈ వివాదానికి పుల్&amp;zwnj;స్టాప్ పెట్టి భవిష్యత్&amp;zwnj;లో చర్చ లేకుండా చేయాలని అధికార పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;కీలక బిల్లులు ఆమోదం&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;ఈ సమావేశాల్లో ప్రభుత్వం సుమారు 6 కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు రాజకీయ ప్రాతినిధ్యాన్ని 34శాతానికి పెంచుతూ ప్రభుత్వం బిల్లు తీసుకురానుంది. దీనిపై డెడికేటెడ్&amp;zwnj; కమిషన్ ఇచ్చిన నివేదికను ఆగస్టు 18న మంత్రిమండలి ఆమోదించి, అదే రోజు సభలో చర్చకు పెట్టనుంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;మున్సిపల్ మేయర్లు, చైర్మన్&amp;zwnj;ను నేరుగా ప్రజలే ఎన్నుకునే ప్రత్యక్ష ఎన్నికల విధానానికి సంబంధించి చట్ట సవరణ చేయనున్నారు. గత ప్రభుత్వం హయాంలో తీసుకొచ్చిన దిశ చట్టాన్ని ఉపసంహరించుకుని, మహిళలు, బాలికల భద్రత కోసం మరింత పటిష్టమైన నిబంధనలను ప్రభుత్వం రూపొందించనుంది. ఏపీ విద్యుత్ శాసనాలు-2019 బిల్లును ఉపసంహరించుకుంటూ సంబంధిత శాఖ మంత్రులు కొత్త ప్రతిపాదనలు చేయనున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;అమరావతిలో మౌలిక వసతుల అభివృద్ధి&lt;/h2&gt;
&lt;p&gt;రాజధాని అమరావతి అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం తన కార్యాచరణను సభలో వివరించే ఛాన్స్ ఉంది. క్వాంటమ్&amp;zwnj; వ్యాలీ ట్విన్ టవర్స్&amp;zwnj;, రైల్వే రోడ్డు కనెక్టివిటీ, మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు ప్రకటించనుంది. అలాగే, పెట్టుబడులను ఆకర్షించేందుకు రూపొందించిన ఏపీ పీపీపీ పాలసీ 2026 గురించి కూడా చర్చ జరగనుంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ దూరం- స్పీకర్ హెచ్చరిక&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;గత సమావేశాల మాదిరిగానే ఈసారి కూడా వైసీపీ సభ్యులు సభకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని, సభలో మాట్లాడేందుకు తగిన సమయం ఇవ్వరని మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యను స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఖండించారు. సభకు రాకుండా సమయం ఇవ్వడం లేదనడం సరికాదన్నారు. 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న &lt;a title=&quot;జగన్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/cm-jagan&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;జగన్&lt;/a&gt;&amp;zwnj;కు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడానికి లేదని, కానీ సభకు వస్తే ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం కల్పిస్తాం, సమాధానం చెప్పించే బాధ్యత తనది అన్నారు. ఎమ్మెల్యే క్వార్టర్లపై వైసీపీ నేతలు చేస్తున్న కామెంట్స్&amp;zwnj;పై కూడా స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/17/3a34975dfe5d931e1a8be4e48229db261786933483287215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Road Accidents: పశ్చిమ గోదావరి జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు- నలుగురు యువకులు గల్లంతు]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/rajamundry/car-falls-into-canal-near-aithampudi-locks-in-west-godavari-atn-256452</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/rajamundry/car-falls-into-canal-near-aithampudi-locks-in-west-godavari-atn-256452#respond</comments><pubDate>Sun, 16 Aug 2026 09:51:06 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ రాజమండ్రి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/rajamundry/car-falls-into-canal-near-aithampudi-locks-in-west-godavari-atn-256452</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;West Godavari Road Accident |&amp;nbsp;పశ్చిమ గోదావరి జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు- నలుగురు యువకులు గల్లంతు&lt;/strong&gt;&lt;br /&gt;ఇరగవరం: పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం ఐతంపూడి లాకుల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓగిడి గ్రామం నుంచి తూర్పు గోదావరి జిల్లాలోని మోరి వైపు వెళ్తున్న ఒక కారు ఐతంపూడి లాకుల వద్దకు రాగానే అదుపుతప్పి పక్కనే ఉన్న కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో కారులో ప్రయాణిస్తున్న ఒక యువకుడు సురక్షితంగా బయటపడగా, మిగిలిన నలుగురు యువకులు నీటి ప్రవాహంలో గల్లంతయ్యారు.&lt;/p&gt;
&lt;p&gt;గల్లంతైన వారిని రాజారాం (17), పోతుల లక్ష్మీభాను (18), నాగిరెడ్డి దుస్వంత (18), సాయి సూర్య (19)లుగా గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికులతో కలిసి నీటిలో గల్లంతైన యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొట్టిన ఏపీఎస్&amp;zwnj;ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు&lt;/strong&gt;&lt;br /&gt;సూర్యాపేట జిల్లా ఆకుపాముల వద్ద జాతీయ రహదారిపై అర్ధరాత్రి వేళ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నర్సాపూర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న శ్రీకృష్ణ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును, ఏలూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఏపీఎస్&amp;zwnj;ఆర్టీసీ సూపర్&amp;zwnj; లగ్జరీ బస్సు వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. ప్రమాద సమయంలో ఈ రెండు బస్సుల్లో కలిపి మొత్తం 63 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ సంఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు.&lt;/p&gt;
&lt;p&gt;ఢీకొట్టిన తీవ్రతకు ఆర్టీసీ బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయి, డ్రైవర్ క్యాబిన్&amp;zwnj;లోనే ఇరుక్కుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, సుమారు రెండు గంటల పాటు శ్రమించి డ్రైవర్&amp;zwnj;ను క్షేమంగా వెలికితీశారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిద్రమత్తులోకి జారడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/05/aca28404c4a15d281d9926783606b2791725512487811219_original.png" width="220"/></item><item><title><![CDATA[Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/rajamundry/ap-deputy-cm-pawan-kalyan-suffering-from-high-fever-and-shoulder-pain-256448</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/rajamundry/ap-deputy-cm-pawan-kalyan-suffering-from-high-fever-and-shoulder-pain-256448#respond</comments><pubDate>Sun, 16 Aug 2026 09:12:54 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ రాజమండ్రి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/rajamundry/ap-deputy-cm-pawan-kalyan-suffering-from-high-fever-and-shoulder-pain-256448</guid><description><![CDATA[&lt;p&gt;అమరావతి: ఇటీవల ఏపీ కేబినెట్ భేటీకి హాజరుకాని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శనివారం జరిగిన ఎట్ హోమ్ కార్యక్రమానికి సైతం హాజరుకాలేకపోయారు. తీవ్ర భుజం నొప్పి, తీవ్ర జ్వరంతో బాధపడుతున్నప్పటికీ కాకినాడలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు, అలాగే రాజమహేంద్రవరంలో సెంట్రల్ క్రాఫ్ట్ వుడ్ బ్యాంక్ ప్రారంభోత్సవానికి ఆయన హాజరయ్యారు. కాకినాడలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించే సమయంలో సెల్యూట్ చేసినా, భుజం నొప్పి తీవ్రత వల్ల చేతిని పూర్తిస్థాయిలో పైకి ఎత్తలేకపోయారని &lt;a title=&quot;జనసేన&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Janasena&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;జనసేన&lt;/a&gt; పార్టీ తెలిపింది. తీవ్ర జ్వరం కారణంగా శనివారం సాయంత్రం లోక్&amp;zwnj;భవన్&amp;zwnj;లో ఏర్పాటు చేసిన ఎట్ హోమ్ కార్యక్రమానికి కూడా హాజరు కావడం లేదని పవన్ కళ్యాణ్ కొన్ని గంటల ముందే తెలిపారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;హైదరాబాద్&amp;zwnj;కు పవన్ కళ్యాణ్&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;అనారోగ్య సమస్యల కారణంగా ఆయన అధికారులకు మెరిటోరియస్ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొనలేకపోయారు. దాంతో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ (జేసీ), ఎస్పీల చేతుల మీదుగా అధికారులకు ఈ అవార్డులను అందజేశారు. ఆ తర్వాత రాజమహేంద్రవరంలో వుడ్ బ్యాంక్ ప్రారంభోత్సవానికి &lt;a title=&quot;పవన్ కల్యాణ్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Pawan-Kalyan&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;పవన్ కల్యాణ్&lt;/a&gt; హాజరయ్యారు. అయితే అప్పటికే ఆయన తీవ్ర జ్వరంతో ఇబ్బందిపడుతుండటంతో ఆ కార్యక్రమాన్ని త్వరగానే ముగించాల్సి వచ్చింది. వెంటనే వైద్యులు ఆయనను పరీక్షించి ప్రథమ చికిత్స చేశారు. అనంతరం పవన్ కళ్యాణ్ హైదరాబాద్&amp;zwnj;కు బయలుదేరి వెళ్లారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;blockquote class=&quot;twitter-tweet&quot;&gt;
&lt;p dir=&quot;ltr&quot; lang=&quot;te&quot;&gt;రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ &lt;a href=&quot;https://x.com/PawanKalyan?ref_src=twsrc%5Etfw&quot;&gt;@PawanKalyan&lt;/a&gt; గారు తీవ్ర జ్వరం కారణంగా ఈ సాయంత్రం లోక్&amp;zwnj; భవన్&amp;zwnj;లో నిర్వహించే &amp;ldquo;ఎట్ హోమ్&amp;rdquo; కార్యక్రమానికి హాజరుకాలేకపోతున్నారు. ఈ విషయాన్ని లోక్&amp;zwnj; భవన్&amp;zwnj; అధికారులకు తెలియజేశారు. శనివారం ఉదయం కాకినాడలో నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో&amp;hellip;&lt;/p&gt;
&amp;mdash; JanaSena Party (@JanaSenaParty) &lt;a href=&quot;https://x.com/JanaSenaParty/status/2088576517161079275?ref_src=twsrc%5Etfw&quot;&gt;August 15, 2026&lt;/a&gt;&lt;/blockquote&gt;
&lt;p&gt;
&lt;script src=&quot;https://platform.x.com/widgets.js&quot; async=&quot;&quot; charset=&quot;utf-8&quot;&gt;&lt;/script&gt;
&lt;/p&gt;
&lt;p&gt;ఇండిపెండెన్స్ డే కార్యక్రమాల్లో పాల్గొన్న సమయంలోనూ పవన్ కళ్యాణ్ చేతులు పదే పదే కదిలిస్తూ కనిపించారు. చేతి సమస్య, నొప్పి ఇంకా తగ్గలేదని ఆయన ఇంకా కోలుకుంటున్నారని ఆ వీడియో చూసిన వారు చెబుతున్నారు. అయితే సీఎం &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt;తో కలిసి పవన్ కళ్యాణ్ కేబినెట్ భేటీల్లో పాల్గొనడం లేదని, అధికారిక కార్యక్రమాల్లో సైతం కూటమి నేతలతో కలిసి కనిపించడం లేదన్న ప్రచారం మళ్లీ ఊపందుకుంది. ఇటీవల సీడ్ యాక్సెస్ రోడ్డు సహా అమరావతి ప్రాజెక్టు అభివృద్ధి పనులకు పవన్ కళ్యాణ్ హాజరు కాలేదని తెలిసిందే. ఆ సమయంలో విశాఖలో నిర్వహించిన ఏనుగుల దినోత్సవంలో డిప్యూటీ సీఎం పాల్గొన్నారు. ఈ క్రమంలో &lt;a title=&quot;టీడీపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/tdp&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;టీడీపీ&lt;/a&gt;కి, పవన్ కళ్యాణ్&amp;zwnj;కు మధ్య దూరం పెరిగిందని సోషల్ మీడియా కోడై కూస్తోంది.&lt;/p&gt;
&lt;p&gt;Also Read: &lt;a href=&quot;https://telugu.abplive.com/andhra-pradesh/tirupati/anam-ramanarayana-reddy-minister-medical-emergency-tirupati-independence-day-256406&quot; target=&quot;_blank&quot; rel=&quot;noopener&quot;&gt;Anam Ramanarayana Reddy:తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!&lt;/a&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/16/7293f64bf9f2f8cb97e64309a94236f61786851462704233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/rajamundry/andhra-pradesh-deputy-cm-pawan-kalyan-speech-at-the-80th-independence-day-in-kakinada-256415</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/rajamundry/andhra-pradesh-deputy-cm-pawan-kalyan-speech-at-the-80th-independence-day-in-kakinada-256415#respond</comments><pubDate>Sat, 15 Aug 2026 15:51:58 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ రాజమండ్రి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/rajamundry/andhra-pradesh-deputy-cm-pawan-kalyan-speech-at-the-80th-independence-day-in-kakinada-256415</guid><description><![CDATA[&lt;p&gt;80th Independence Day in Kakinada |&amp;nbsp;కాకినాడ: స్వాతంత్రం కోసం ఒక తరం పోరాటం చేస్తే, మరో తరం దానిని కాపాడిందని, దేశ నిర్మాణానికి పునాదులు వేయాల్సిన బాధ్యత ప్రస్తుత తరంపై ఉందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ముఖ్యంగా యువతకు దిశానిర్దేశం చేస్తూ.. &amp;lsquo;వేగం అనేది సత్యం కాదు&quot; (Speed is not truth) అని, సోషల్ మీడియాలో వచ్చే సమాచారాన్ని నమ్మే ముందు అందులో వాస్తవం ఉందా లేదా అని ఆలోచించాలని సూచించారు. రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛను ఇతరులను దూషించడానికి కాకుండా, బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగడానికి ఉపయోగించాలని పిలుపునిచ్చారు. వ్యవస్థలో తప్పులుంటే వాటిని సరిదిద్దాలే తప్ప, ఆస్తులను ధ్వంసం చేయడం మార్పుకు మార్గం కాదని తన ఉద్యమ ప్రయాణాన్ని గుర్తు చేశారు. యువత డబ్బుకు ఓటు వేయకుండా, సమస్యలకు పరిష్కారం చూపే శక్తిగా ఎదిగి భారతదేశాన్ని నడిపించాలని ఆయన ఆకాంక్షించారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/15/f32487c2813826b7208aefd0cf584d441786788508541233_original.jpg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;కాకినాడలో జరిగిన భారత 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొని, జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ గీతాలాపన చేసి, పోలీసు దళాల నుంచి గౌరవ వందనం ఆయన స్వీకరించారు. డిప్యూటీ సీఎం సతీమణి అన్నా కొణిదెల ఈ వేడుకల్లో పాల్గొన్నారు. &amp;nbsp;దేశ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నపవన్&amp;zwnj; కల్యాణ్&amp;zwnj;, దేశ నిర్మాణంలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఈ ఏడాది జాతీయ గీతం 'వందేమాతరం' 150 ఏళ్లు పూర్తి చేసుకోవడం, 1923లో అఖిల భారత &lt;a title=&quot;కాంగ్రెస్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Congress&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కాంగ్రెస్&lt;/a&gt; సమావేశానికి వేదికైన చారిత్రక నగరమైన కాకినాడలో ఈ ఉత్సవాలు జరుపుకోవడం ఎంతో విశేషమని గుర్తు చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe title=&quot;YouTube video player&quot; src=&quot;https://www.youtube.com/embed/A2MaBdz_NSs?si=OhIFmZpuPhrx538m&quot; width=&quot;560&quot; height=&quot;315&quot; frameborder=&quot;0&quot; allowfullscreen=&quot;allowfullscreen&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/15/c1ddf0131475a836cfeb33c13d2f16aa1786788532773233_original.jpg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;ప్రధాని &lt;a title=&quot;నరేంద్ర మోదీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/narendra-modi&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;నరేంద్ర మోదీ&lt;/a&gt; ఆశయమైన 'వికసిత్ భారత్ 2047' సంకల్పంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తనవంతు బలమైన పాత్ర పోషిస్తుందని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అందిన రూ. 4,597 కోట్ల పన్ను వాటా నిధులతో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ముఖ్యంగా గిరిజన గ్రామాల కోసం 'అడవి తల్లి బాట' కార్యక్రమం కింద రూ. 78 కోట్లతో రహదారుల నిర్మాణం, అలాగే రూ. 8,000 కోట్లతో కోటి 30 లక్షల మందికి తాగునీరు అందించేలా మెగా వాటర్ గ్రిడ్ పనులను వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాష్ట్రంలో పచ్చదనాన్ని 50% పెంచే లక్ష్యంతో 10 కోట్ల మొక్కల పెంపకాన్ని చేపట్టామని, మడ అడవుల సంరక్షణలో దేశంలోనే రెండో స్థానాన్ని సాధించామని ఆయన ప్రకటించారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/15/13b64cf07e48ff5230cd89792cc30f3b1786788563561233_original.jpg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;రైతు సంక్షేమానికి ఏపీ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, 'అన్నదాత సుఖీభవ' పథకం ద్వారా ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి రూ. 20,000 సాగు సాయం అందిస్తున్నామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన డొంక రోడ్ల నిర్మాణానికి 'బిబి జీరామంజీ' పథకం ద్వారా 10,000 కిలోమీటర్ల మేర శ్రీకారం చుట్టామన్నారు. అలాగే పిఠాపురం నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి రూ. 1,000 కోట్లతో ఆసుపత్రులు, రహదారులు, దేవాలయాల పునరుద్ధరణ వంటి కీలక పనులు చేపట్టినట్లు తెలిపారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/15/e0de3fa226105445d05d680e049497741786788648999233_original.jpg&quot; /&gt;&lt;br /&gt;మంగళగిరిలోని జనసేన పార్టీ సెంట్రల్ ఆఫీసులో 80 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారీ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం నేతలు జెండా వందనం సమర్పించి, జాతీయ గీతాలాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్, ఏపీఎంఎస్ఐడీసీ ఛైర్మన్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే, ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు శ్రీ సామినేని ఉదయభాను, &lt;a title=&quot;జనసేన&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Janasena&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;జనసేన&lt;/a&gt; నేతలు అక్కల గాంధీ, బి పార్వతీ నాయుడు, పోతిరెడ్డి అనిత, ఎం నాగలక్ష్మి, బోడపాటి శివదత్, శివ పార్వతి, చందు సాంబశివ రావు, గంజి చిరంజీవి, రావి సౌజన్య, &amp;nbsp;పాకనాటి రమాదేవి, పెనుగొండ సుబ్బారాయుడు, దాసరి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.&lt;/p&gt;
&lt;p&gt;Also Read: &amp;nbsp;&lt;a href=&quot;https://telugu.abplive.com/andhra-pradesh/amravati/amaravati-first-independence-day-chandrababu-speech-swarnandhra-2047-256399&quot; target=&quot;_blank&quot; rel=&quot;noopener&quot;&gt;Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!&lt;/a&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/15/b4146faffb0476ba0483802c06f0d8b31786788441268233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/andhra-pradesh-shtree-shakti-scheme-anniversary-chandrababu-naidu-bus-ride-super-six-updates-256409</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/andhra-pradesh-shtree-shakti-scheme-anniversary-chandrababu-naidu-bus-ride-super-six-updates-256409#respond</comments><pubDate>Sat, 15 Aug 2026 14:23:08 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ అమరావతి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/amravati/andhra-pradesh-shtree-shakti-scheme-anniversary-chandrababu-naidu-bus-ride-super-six-updates-256409</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Free Bus For Women In AP:&amp;nbsp;&lt;/strong&gt;ఆంధ్రప్రదేశ్&amp;zwnj; ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్త్రీశక్తి ఉచిత బస్ ప్రయాణం పథకం నేటితో ఏడాది పూర్తి చేసుకుంది. మహిళల ఆర్థిక సాధికారత, ఆత్మగౌరవాన్ని పెంపొందించే లక్ష్యంతో గతేడాది సరిగ్గా ఇదే రోజున ప్రారంభమైన ఈ పథకం, రాష్ట్ర చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; నాయుడు స్వయంగా మహిళలతో కలిసి బస్&amp;zwnj;లో ప్రయాణించారు. క్షేత్రస్థాయిలో పథకం అమలు జరుగుతున్న తీరును తెలుసుకున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;img src=&quot;https://pbs.twimg.com/media/HPv6u3qaUAAnubG?format=jpg&amp;amp;name=large&quot; alt=&quot;Image&quot; /&gt;&lt;/p&gt;
&lt;h2&gt;రాయపూడి నుంచి క్యాంప్ కార్యాలయం వరకు...&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;విజయవాడలోని పరేడ్ గ్రౌండ్స్&amp;zwnj; నుంచి సీడి యాక్సెస్&amp;zwnj; రోడ్డు మీదుగా సీఎం క్యాంప్ కార్యాలయం వరకు ముఖ్యమంత్రి మహిళలతో కలిసి బస్&amp;zwnj;లో ప్రయాణించారు. ఈ ప్రయాణంలో ఆయన వివిధ జిల్లాల నుంచి వచ్చిన మహిళలతో ముచ్చటించారు. పథకం ద్వారా వారికి కలుగుతున్న లబ్ధి, పొదుపు అవుతున్న నగదు గురించి ఆరా తీశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;img src=&quot;https://pbs.twimg.com/media/HPv6x2xaUAAp4fl?format=jpg&amp;amp;name=medium&quot; alt=&quot;Image&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;చేపలు అమ్ముకుంటూ జీవనం సాగించే ఒక మహిళ, స్త్రీ శక్తి పథకం వల్ల తనకు నెలకు 4000 వరకు ప్రయాణ ఖర్చులు ఆదా అవుతున్నాయని వెల్లడించింది. ఈ పొదుపుతో తన ఆరోగ్య అవసరాలకు మందుల కొనుగోలు చేస్తున్నట్టు ఆమె తెలిపింది. దీనిపై స్పందించిన సీఎం, ఆరోగ్య అలవాట్లు మార్చుకుంటే సంపాదనను మరింత పొదుపు చేసుకోవచ్చని సూచించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;నంద్యాల నుంచి వచ్చిన ఒక ముస్లిం మహిళ, ఉచిత బస్ ద్వారా తనకు నెలకు 1500 ఆదా అవుతోందని చెప్పారు. ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన చేనేత మహిళ మాట్లాడుతూ, ముడి సరకు తేవడానికి, నేసిన చీరలు మార్కెట్&amp;zwnj;కు చేరవేయడంలో ఈ పథకం తమకు వరంగా మారిందని తెలిపింది. గతంలో కేవలం భర్త మాత్రమే వ్యాపార పనులకు వెళ్లే వారని ఇప్పుడు తాము కూడా వెళ్తున్నామని ఇది ఆనందాన్నిచ్చిందని తెలిపింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;img src=&quot;https://pbs.twimg.com/media/HPv6u3xaQAAIENy?format=jpg&amp;amp;name=large&quot; alt=&quot;Image&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;పథకం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో 87 కోట్ల ఉచిత ప్రయాణాలు నమోదైనట్టు సీఎం తెలిపారు. సగటున రోజుకు 24 లక్షల మంది ఈ పథకం ద్వారా ఉచితంగా ప్రయాణాలు చేస్తున్నారని చెప్పారు. ఏపీఎస్&amp;zwnj;ఆర్టీసీలోని మత్తం 9, 978 బస్సుల్లో 7,631 బస్సుల్లో ఈ పథకం అమలు అవుతోంది. ఇందులో పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్&amp;zwnj;ప్రెస్&amp;zwnj;, మెట్రో ఎక్స్&amp;zwnj;ప్రెస్&amp;zwnj;, సిటీ ఆర్డినరీ కేటగిరీ బస్సులు ఉన్నాయి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;img src=&quot;https://pbs.twimg.com/media/HPv6u3qbAAAxLoT?format=jpg&amp;amp;name=large&quot; alt=&quot;Image&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;గతంలో బస్&amp;zwnj; ప్రయాణాల్లో మహిళల వాటా 40 శాతంగా ఉండగా, ఈ పథకం అమలు తర్వాత అది 62 శాతానికి పెరిగింది. ఈ పథకం వల్ల రహదారి ప్రమాదాలు కూడా గణనీయంగా తగ్గాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/15/2ce2ed3882c03b064df25f1e49447a3d1786783731360215_original.jpg" width="220"/></item></channel></rss>