<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/" xmlns:dc="http://purl.org/dc/elements/1.1/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/" xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/" xmlns:media="http://search.yahoo.com/mrss/"><channel><title>rajamundry</title><atom:link href="https://telugu.abplive.com/rajamundry/feed" rel="self" type="application/rss+xml"/><link>https://telugu.abplive.com/</link><description/><lastBuildDate>Thu, 10 Sep 2026 22:20:28 +0530</lastBuildDate><language>en-US</language><sy:updatePeriod>hourly</sy:updatePeriod><sy:updateFrequency>1</sy:updateFrequency><generator>https://telugu.abplive.com</generator><item><title><![CDATA[Nidadavole Junction: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. నిడదవోలులో లోకమాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్‌ప్రెస్‌కు హాల్ట్]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/rajamundry/visakhapatnam-mumbai-ltt-express-gets-new-halt-at-nidadavole-junction-in-andhra-pradesh-258222</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/rajamundry/visakhapatnam-mumbai-ltt-express-gets-new-halt-at-nidadavole-junction-in-andhra-pradesh-258222#respond</comments><pubDate>Sun, 6 Sep 2026 14:40:09 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ రాజమండ్రి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/rajamundry/visakhapatnam-mumbai-ltt-express-gets-new-halt-at-nidadavole-junction-in-andhra-pradesh-258222</guid><description><![CDATA[&lt;p&gt;Andhra Pradesh Railway Updates | నిడదవోలు: తూర్పు తీరంలో విజయవాడ &amp;ndash; కటక్ నగరాల మధ్య వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడంలో భాగంగా కీలక అడుగు పడింది. ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే ప్రాజెక్టు&amp;rsquo;లో భాగంగా ఏర్పాటైన చారిత్రాత్మక నిడదవోలు రైల్వే జంక్షన్ వేదికగా ఆదివారం సరికొత్త అధ్యాయం మొదలైంది. విశాఖపట్నం - ముంబై లోకమాన్య తిలక్ టెర్మినస్ (LTT) ఎక్స్&amp;zwnj;ప్రెస్ (18519/18520)కు నిడదవోలు జంక్షన్&amp;zwnj;లో నూతనంగా కల్పించిన హాల్ట్ సదుపాయాన్ని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి &amp;nbsp;కందుల దుర్గేష్, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరిలు నేటి ఉదయం పచ్చజెండా ఊపి అధికారికంగా ప్రారంభించారు. అనంతరం మంత్రి దుర్గేష్ రైలు ప్రయాణికులకు అభివాదం చేశారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/06/6fbe17a035b766844032f2a30b4c2ed41788685885929233_original.jpeg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల రాష్ట్రానికి ప్రయోజనం&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. నిడదవోలు నియోజకవర్గ ప్రజల కల అయిన లోకమాన్య తిలక్ టెర్మినస్ (LTT) ఎక్స్&amp;zwnj;ప్రెస్ హాల్ట్&amp;zwnj; సాధనలో కీలకపాత్ర పోషించిన ఎంపీ పురందేశ్వరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో నిడదవోలు జంక్షన్&amp;zwnj;లో మరిన్ని ప్రముఖ ఎక్స్&amp;zwnj;ప్రెస్ రైళ్లకు హాల్టింగ్ కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న డబుల్ ఇంజిన్ (NDA) సర్కార్ రాష్ట్రాభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తోందని, అందులో భాగంగానే ఈ రైలు నిలుపుదల సాధ్యమైందని పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీ పురందేశ్వరి తూర్పుగోదావరి జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల సమగ్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారని కొనియాడారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/06/bfec6f4fa8972a92a2c1951b900451dc1788685929866233_original.jpeg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;నిడదవోలు ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు కమ్యూనిటీ హాల్స్ ఏర్పాటుకు ఎంపీ పురదేశ్వరి అందిస్తున్న సహకారానికి నియోజకవర్గ ప్రజల తరపున మంత్రి కందుల ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రాంత వాసుల సౌకర్యార్థం 'జన్మభూమి ఎక్స్&amp;zwnj;ప్రెస్', కోకనాడ ఎక్స్&amp;zwnj;ప్రెస్ రైళ్లకు కూడా నిడదవోలులో హాల్ట్ కల్పించడంపై ఇప్పటికే ఎంపీ పురందేశ్వరి రైల్వే జనరల్ మీటింగ్&amp;zwnj;లో చర్చలు జరిపారని మంత్రి వివరించారు. ఈ ఎల్.టి.టి ఎక్స్&amp;zwnj;ప్రెస్ స్టాప్ హాల్ట్ ద్వారా నిడదవోలు పట్టణంతో పాటు, చుట్టుపక్కల నియోజకవర్గాల ప్రజలకు మేలు కలుగుతుంది. ముఖ్యంగా వ్యాపారులకు, సుదూర ప్రాంతాలకు ప్రయాణించే ప్రయాణికులకు తీవ్ర ఉపశమనం కలగడంతో పాటు రవాణా సౌలభ్యం కలగనుందన్నారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/06/ad3848661977daa4d86e524a797ce11b1788685557305233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Janasena Coordination Committees: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు జనసేన పార్టీ సమన్వయ కమిటీ.. కోఆర్డినేటర్లు వీరే]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/pawan-kalyan-jana-sena-prepares-for-ap-local-body-elections-with-coordination-committees-258193</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/pawan-kalyan-jana-sena-prepares-for-ap-local-body-elections-with-coordination-committees-258193#respond</comments><pubDate>Sun, 6 Sep 2026 09:29:58 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ అమరావతి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/amravati/pawan-kalyan-jana-sena-prepares-for-ap-local-body-elections-with-coordination-committees-258193</guid><description><![CDATA[&lt;p&gt;JanaSena for AP Local Body Elections | అమరావతి: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేయడంతో పాటు నాయకులు, జనసైనికులు, వీర మహిళలను సన్నద్ధం చేసేందుకు జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం &lt;a title=&quot;పవన్ కల్యాణ్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Pawan-Kalyan&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;పవన్ కల్యాణ్&lt;/a&gt; కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా లోక్&amp;zwnj;సభ నియోజకవర్గాల వారీగా ప్రత్యేక సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసినట్లు జనసేన సెంట్రల్ ఆఫీసు ఒక ప్రకటన విడుదల చేసింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఈ కమిటీల నిర్వహణ కోసం ప్రతి లోక్&amp;zwnj;సభ నియోజకవర్గానికి ఒక సమన్వయకర్తతో పాటు ముగ్గురు కమిటీ సభ్యులను నియమించారు. వీరికి సహాయంగా ఉండేందుకు ఆయా లోక్&amp;zwnj;సభ పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఒకరిని ఎంపిక చేసి సహాయక బృందాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల విధివిధానాల కోసం నియమించిన కమిటీ సభ్యులకే ఈ లోక్&amp;zwnj;సభ నియోజకవర్గాల సమన్వయ బాధ్యతలను కూడా అప్పగించారు. ఈ కమిటీలు జనసేన పార్టీ అనుసరించే సిద్ధాంతాలు, విధివిధానాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడమే కాకుండా, కూటమి పక్షాలతో పూర్తి సమన్వయం కొనసాగించేలా పర్యవేక్షిస్తాయి. ఎంపిక చేసిన సభ్యులందరికీ ఈ నెల 9న మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;జనసేన కోఆర్డినేటర్లు ఎవరంటే&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;స్థానిక ఎన్నికల సమన్వయ బాధ్యతల కోసం నియోజకవర్గాల వారీగా ప్రముఖ నేతలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోఆర్డినేషన్ బాధ్యతలు అప్పగించారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు లోకం నాగమాధవి, అరకుకు కె.రవికుమార్, విశాఖపట్నం, అనకాపల్లిలకు చెన్నుబోయిన వంశీకృష్ణ యాదవ్ కోఆర్డినేటర్లుగా వ్యవహరించనున్నారు. అలాగే కాకినాడ, రాజమహేంద్రవరం బాధ్యతలను కొటికలపూడి గోవిందరావు (చినబాబు), అమలాపురం, ఏలూరు బాధ్యతలను బొలిశెట్టి శ్రీనివాస్, నరసాపురం, మచిలీపట్నం బాధ్యతలను మండలి బుద్ధప్రసాద్&amp;zwnj;కు అప్పగించారు.&lt;/p&gt;
&lt;p&gt;విజయవాడ, గుంటూరులకు మంత్రి కందుల దుర్గేశ్, బాపట్ల, నరసరావుపేటలకు వల్లభనేని బాలశౌరి, ఒంగోలు, నెల్లూరులకు తమ్మిరెడ్డి శివశంకర్ సమన్వయకర్తలుగా వ్యవహరిస్తారు. ఇక రాయలసీమ విషయానికి వస్తే నంద్యాలకు యనమల భాస్కర్, కర్నూలు, హిందూపురానికి చిలకం మధుసూదన్&amp;zwnj;రెడ్డి, అనంతపురానికి సామినేని ఉదయభాను, కడప, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో దేవ వరప్రసాద్, తిరుపతి, చిత్తూరు నియోజకవర్గాలకు పి.ధర్మరాజులు &lt;a title=&quot;జనసేన&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Janasena&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;జనసేన&lt;/a&gt; కోఆర్డినేటర్లుగా బాధ్యతలు నిర్వహించనున్నారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/06/69287e6242a7a17426bc979f7a7a8f951788667155072233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Family Jumps Into Godavari River: గోదావరిలో దూకి మరో కుటుంబం ఆత్మహత్యాయత్నం.. ఒకర్ని కాపాడిన జాలర్లు, ముగ్గురి కోసం గాలింపు]]></title><link>https://telugu.abplive.com/crime/another-family-jumps-into-godavari-river-at-chinchinada-bridge-in-west-godavari-andhra-pradesh-258117</link><comments>https://telugu.abplive.com/crime/another-family-jumps-into-godavari-river-at-chinchinada-bridge-in-west-godavari-andhra-pradesh-258117#respond</comments><pubDate>Sat, 5 Sep 2026 11:44:28 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ క్రైమ్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/crime/another-family-jumps-into-godavari-river-at-chinchinada-bridge-in-west-godavari-andhra-pradesh-258117</guid><description><![CDATA[&lt;p&gt;West Godavari Crime News | యలమంచిలి: మరో కుటుంబం గోదావరిలో దూకి ఆత్మహత్యకు యత్నించింది. ఇటీవల ఏఈ నూకరాజు కుటుంబం గోదావరిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన మరువక ముందే మరో విషాదం చోటుచేసుకుంది. భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలతో కలిసి గోదావరి నదిలోకి దూకారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని యలమంచిలి మండలం &amp;nbsp;చించినాడ బ్రిడ్జి వద్ద ఓ కుటుంబం గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపుతోంది.&lt;/p&gt;
&lt;p&gt;కుటుంబం గోదావరి నదిలోకి దూకినట్లు గమనించిన వెంటనే అక్కడే ఉన్న జాలర్లు వివాహితను కాపాడారు. ఆమె భర్తతో పాటు ఇద్దరు పిల్లల కోసం గోదావరిలో గాలింపు చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని గజ ఈతగాళ్ల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. ఆర్థిక సమస్యలతో కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;వీరు ఎక్కడి నుంచి వచ్చారు..&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఆత్మహత్యకు యత్నించింది తణుకుకు చెందిన నంబూరి శ్రీనివాస్ కుటుంబం. శనివారం (సెప్టెంబర్ 5న) ఉదయం యలమంచిలి మండలంలోని చించినాడ బ్రిడ్జి వద్దకు వచ్చింది. ఆపై భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలతో కలిసి ఒక్కసారిగా పైనుంచి గోదావరి నదిలోకి దూకింది. ఇది గమనించిన జాలర్లు శ్రీనివాస్&amp;zwnj; భార్య పద్మినిని రక్షించారు. శ్రీనివాస్&amp;zwnj;తో పాటు కొడుకు వెంకటేశ్వర్&amp;zwnj;, కుమార్తె నిత్యశ్రీ గల్లంతయ్యారు. జాలర్లు రక్షించిన తరువాత పద్మినిని చికిత్స కోసం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/05/d97deac5d23076f16e318b68be4d172b1788592395525233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Pawan Kalyan On Fire: సగం కాలుష్యం మీవల్లే, ట్యాక్స్‌లకు ఎగనామం- ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌పై పవన్ కళ్యాణ్ ఆగ్రహం]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/rajamundry/andhra-pradesh-deputy-cm-pawan-kalyan-charges-andhra-paper-limited-with-tax-evasion-and-godavari-pollution-258078</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/rajamundry/andhra-pradesh-deputy-cm-pawan-kalyan-charges-andhra-paper-limited-with-tax-evasion-and-godavari-pollution-258078#respond</comments><pubDate>Fri, 4 Sep 2026 18:10:21 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ రాజమండ్రి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/rajamundry/andhra-pradesh-deputy-cm-pawan-kalyan-charges-andhra-paper-limited-with-tax-evasion-and-godavari-pollution-258078</guid><description><![CDATA[&lt;p&gt;Andhra Pradesh Deputy CM Pawan Kalyan |&amp;nbsp;రాజమహేంద్రవరంలోని ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్ యథేచ్ఛగా కాలుష్యాన్ని వెదజల్లుతూ, పన్నులు చెల్లించకుండా తీవ్ర బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దాదాపు పుష్కరకాలం నుంచి స్థానిక సంస్థలకు రూ. 21.34 కోట్ల వరకు పన్నులు ఎగ్గొడుతూ, నోటీసులు ఇచ్చిన ప్రతిసారీ కోర్టులను ఆశ్రయించి టైం వేస్ట్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. 2016 తర్వాత కాతేరు గ్రామ పంచాయతీకి గానీ, రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్&amp;zwnj;కు గానీ ఒక్క రూపాయి పన్ను కూడా చెల్లించకపోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.&lt;/p&gt;
&lt;p&gt;రాజమహేంద్రవరంలో ఉత్పత్తయ్యే మొత్తం 70 మిలియన్ లీటర్ల ద్రవ వ్యర్థాలలో సగం, అంటే 35 మిలియన్ లీటర్ల వ్యర్థాలను ఒక్క ఆంధ్రా పేపర్స్ పరిశ్రమే విడుదల చేస్తోందని పవన్ కళ్యాణ్ తెలిపారు ఈ పరిశ్రమ విడుదల చేసే నీటిలో బయో కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (BOD) నిర్ణీత ప్రమాణాల కంటే 20 శాతం, ఫాస్ఫేట్ 6 శాతం, సల్ఫైడ్స్ కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాల కంటే ఏకంగా 70 శాతం అధికంగా ఉన్నాయని పరీక్షల్లో నిర్ధారణ అయిందన్నారు. దీనివల్ల గోదావరి నదిలో ఆక్సిజన్ శాతం తగ్గి జలచరాలు, పర్యావరణ వ్యవస్థ దెబ్బతింటున్నాయని, భూగర్భ జలాలు కలుషితమై స్థానిక ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.&lt;/p&gt;
&lt;p&gt;సమస్యలను సరిదిద్దుకునేందుకు కూటమి ప్రభుత్వం ముందస్తుగా షోకాజ్ నోటీసులు ఇచ్చారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారుల ద్వారా పలుమార్లు చర్చలు జరిపినప్పటికీ పరిశ్రమ యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందనా లేదని ఆయన తెలిపారు. నిబంధనల ప్రకారం పరిశ్రమ కార్యకలాపాలను నిలిపివేయడం, సీజ్ చేయడం లేదా లైసెన్స్ రద్దు చేసే అవకాశాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించిందని, ఇకపై ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. వెంటనే ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్&amp;zwnj;కి సమన్స్ జారీ చేసి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను పవన్ కళ్యాణ్ ఆదేశించారు.&lt;/p&gt;
&lt;p&gt;ఈ ఉల్లంఘనలపై కోర్టులలో ఉన్న కేసుల విచారణను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అడ్వకేట్ జనరల్, ప్రభుత్వ న్యాయవాదులకు డిప్యూటీ సీఎం సూచించారు. 'స్వచ్ఛ గోదావరి- పవిత్ర పుష్కరాలు' థీమ్&amp;zwnj;తో గోదావరి నదిని కాలుష్యం నుంచి కాపాడుకునేందుకు పర్యావరణ వేత్తలు, పౌర సమాజం భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రజా ప్రయోజనాలు, పర్యావరణ పరిరక్షణకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని పవన్ కళ్యాణ్ పునరుద్ఘాటించారు.&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/04/8de2f5b4ea40f3a00b118f68b5ed06971788525194732233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[AP Municipal Corporations: ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్ల వార్డుల పునర్విభజన షెడ్యూల్ విడుదల]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/ap-municipal-administration-releases-schedule-for-ward-delimitation-in-corporations-258072</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/ap-municipal-administration-releases-schedule-for-ward-delimitation-in-corporations-258072#respond</comments><pubDate>Fri, 4 Sep 2026 17:00:52 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ ఆంధ్రప్రదేశ్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/ap-municipal-administration-releases-schedule-for-ward-delimitation-in-corporations-258072</guid><description><![CDATA[&lt;p&gt;Ward Delimitation in Corporations | అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డుల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియకు పురపాలక శాఖ డైరెక్టర్ షెడ్యూల్&amp;zwnj; విడుదల చేశారు. దీనికి సంబంధించి తక్షణమే ప్రతిపాదనలు పంపాలని అన్ని ప్రధాన కార్పొరేషన్లకు ఆదేశాలు జారీ చేశారు. 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుని ఈ వార్డుల పునర్విభజనను చేపట్టనున్నారని సమాచారం. ఈ ప్రతిపాదనలపై రేపటి నుంచి 7 రోజుల పాటు (ఈ నెల 11వ తేదీ వరకు) ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు స్వీకరించనున్నట్లు పురపాలక శాఖ తెలిపింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఆ తర్వాత పురపాలక డైరెక్టర్ పరిశీలించి ఆమోదం తెలిపిన అనంతరం సెప్టెంబర్ 13న డీలిమిటేషన్ వార్డుల తుది ప్రకటన వెలువడనుంది. మరుసటి రోజు, అంటే ఈ నెల 14న ఆంధ్రప్రదేశ్ అధికారిక గెజిట్&amp;zwnj;లో వార్డుల పునర్విభజన ప్రకటనను ప్రచురిస్తారు. ఈ ఆదేశాలు జీవీఎంసీ (విశాఖపట్నం), విజయవాడ, మచిలీపట్నం, కర్నూలు, &amp;nbsp;గుంటూరు, నెల్లూరు, ఒంగోలు, తిరుపతి, కడప, ఏలూరు, అనంతపురం, చిత్తూరు వంటి రాష్ట్రంలోని ప్రముఖ కార్పొరేషన్లన్నింటికీ వర్తిస్తాయని అధికారులు వెల్లడించారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;a class=&quot;&quot; href=&quot;https://feeds.abplive.com/testfeeds/Hindi/PdfFiles/6ddc6765c6c2c0b1fa3ae6b3b256d4a2.pdf&quot; target=&quot;_blank&quot; rel=&quot;noopener&quot;&gt;మున్సిపల్&amp;zwnj; కార్పొరేషన్లలో వార్డుల పునర్విభజనకు షెడ్యూల్&amp;zwnj; &lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;strong&gt;39 పట్టణ స్థానిక సంస్థలలో (ULB) వార్డుల పునర్విభజన పూర్తయ్యే కాలపరిమితి..&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;పార్వతీపురం: 03.09.2026&amp;nbsp;&lt;br /&gt;సాలూరు: 03.09.2026&lt;br /&gt;నర్సీపట్నం: 03.09.2026&lt;br /&gt;విజయవాడ: 03.09.2026&lt;br /&gt;రామచంద్రపురం: 03.09.2026&lt;br /&gt;జగ్గయ్యపేట: 03.09.2026&lt;br /&gt;మాచర్ల: 03.09.2026&lt;br /&gt;వినుకొండ: 03.09.2026&lt;br /&gt;సత్తెనపల్లి: 03.09.2026&lt;br /&gt;మార్కాపురం: 03.09.2026&amp;nbsp;&lt;br /&gt;చీరాల: 03.09.2026&lt;br /&gt;చిత్తూరు: 03.09.2026&lt;br /&gt;అనంతపురం: 03.09.2026&lt;br /&gt;కర్నూలు: 03.09.2026&lt;br /&gt;ప్రొద్దుటూరు: 03.09.2026&lt;br /&gt;రాయచోటి: 03.09.2026&lt;br /&gt;రాయదుర్గం: 03.09.2026&lt;br /&gt;పుట్టపర్తి: 03.09.2026&lt;br /&gt;బద్వేల్: 03.09.2026&lt;br /&gt;నగరి: 03.09.2026&lt;br /&gt;పుత్తూరు: 03.09.2026&lt;br /&gt;కదిరి: 03.09.2026&lt;br /&gt;ఎర్రగుంట్ల: 03.09.2026&lt;br /&gt;జమ్మలమడుగు: 03.09.2026&lt;br /&gt;పలమనేరు: 03.09.2026&lt;br /&gt;తిరుపతి: 03.09.2026&lt;br /&gt;జీవీఎంసీ (జివిఎంసి): 08.09.2026&lt;br /&gt;ఏలూరు: 08.09.2026&lt;br /&gt;మచిలీపట్నం: 08.09.2026&lt;br /&gt;పెడన: 08.09.2026&lt;br /&gt;పిఠాపురం: 08.09.2026&lt;br /&gt;ఒంగోలు: 08.09.2026&lt;br /&gt;చిలకలూరిపేట: 15.09.2026&lt;br /&gt;నెల్లూరు: 15.09.2026&lt;br /&gt;గుంటూరు: 08.09.2026&lt;br /&gt;కడప: 08.09.2026&lt;br /&gt;ధర్మవరం: 08.09.2026&lt;br /&gt;తాడిపత్రి: 08.09.2026&lt;br /&gt;నంద్యాల: 08.09.2026&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/04/7e74e3c411fc391952f63df474faa8971788521079598233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Godavari Water to North Andhra: ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు.. పోలవరం లెఫ్ట్ కెనాల్ నుంచి నీటి విడుదల.. గోదారమ్మకు చంద్రబాబు సాష్టాంగ నమస్కారం]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/rajamundry/ap-cm-chandrababu-releases-godavari-water-to-anakapalli-via-polavaram-left-canal-257896</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/rajamundry/ap-cm-chandrababu-releases-godavari-water-to-anakapalli-via-polavaram-left-canal-257896#respond</comments><pubDate>Wed, 2 Sep 2026 16:27:29 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ రాజమండ్రి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/rajamundry/ap-cm-chandrababu-releases-godavari-water-to-anakapalli-via-polavaram-left-canal-257896</guid><description><![CDATA[&lt;p&gt;పాయకరావుపేట: ఉత్తరాంధ్ర వాసుల సుదీర్ఘకాల స్వప్నాన్ని సాకారం చేసింది ఏపీ ప్రభుత్వం. పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లి జిల్లాకు సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం గోదావరి నీటిని విడుదల చేశారు. కాలువలో 111వ కిలోమీటర్ వరకు ముందుగానే నీటిని తరలించి నిల్వ ఉంచగా, పాయకరావుపేట రెగ్యులేటర్&amp;zwnj;ను మంత్రి నిమ్మల రామానాయుడు రైతులతో కలిసి స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. అనంతరం అక్కడే ముఖ్యమంత్రి &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; నాయుడు పుష్కర జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, జలహారతి సమర్పించారు. జలహారతి అనంతరం గోదావరి జలాలకు సాష్టాంగ నమస్కారం చేసి చల్లగా చూడాలని ప్రార్తించారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/02/63eacb4110f49fce4c27a863df741a331788346166043233_original.jpg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;పోలవరం ప్రాజెక్టు ప్రధాన జలాశయ నిర్మాణాన్ని 2027 జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం, అంతకంటే ముందే ఎత్తిపోతల పథకాల ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంతానికి నీటిని తరలించే ప్రక్రియను చేపట్టింది. 2004 నుంచి ఈ కాలువ నిర్మాణానికి మొత్తం రూ. 4,038 కోట్లు వెచ్చించగా, ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్ల వ్యవధిలోనే రూ. 1,710.08 కోట్లను ఖర్చు చేసి పనులు వేగవంతం చేసింది. కొండలు, కోనలు, రహదారులు మరియు రైల్వే ట్రాక్&amp;zwnj;ల వంటి కఠినమైన భౌగోళిక సవాళ్లను అధిగమించి నీటిని మళ్లించడంలో ఇంజినీరింగ్ నైపుణ్యం, కార్మికుల కృషి కీలక పాత్ర పోషించాయి.&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/02/cbcdcb4a5932217208381b0726fd127e1788346192328233_original.jpg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;పోలవరం జిల్లా దేవీపట్నం మండలం నేలకోట వద్ద ప్రారంభమయ్యే ఈ ఎడమ కాలువ విశాఖపట్నం వరకు 213.409 కిలోమీటర్ల పొడవున ఉంది. ప్రధాన డ్యామ్ పూర్తికాకపోయినప్పటికీ, గతంలో నిర్మించిన పుష్కర, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాల ద్వారా గోదావరి వరద నీటిని ఎడమ కాలువలోకి తరలిస్తున్నారు. గోదావరికి వరద ఉన్న సమయంలో పుష్కర పథకం నుంచి 1,400 క్యూసెక్కులు, పురుషోత్తపట్నం నుంచి 3,500 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసే అవకాశం ఉంది. అందులో కొంత భాగాన్ని ప్రస్తుతం అనకాపల్లి జిల్లా అవసరాలకు రాష్ట్ర ప్రభుత్వం మళ్లిస్తోంది.&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/02/93772a8fe7d34c807c940c91fc882b711788346286501233_original.jpg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;తుని సమీపంలో పోలవరం ఎడమ కాలువ అక్విడెక్టు వద్ద పవిత్ర గోదావరి జలాలకు జలహారతి ఇచ్చి నీటిని విడుదల చేయడం ఉత్తరాంధ్ర అభివృద్ధిలో ఒక చారిత్రాత్మక ఘట్టంగా చెప్పవచ్చు. పురుషోత్తపట్నం పంప్&amp;zwnj;హౌస్ నుంచి ఎత్తిపోసిన నీటిని ఉత్తరాంధ్రకు తరలిస్తున్నారు. మొదటి దశలో అనకాపల్లి, విశాఖ దిశగా మళ్లించడం ద్వారా దశాబ్దాల నీటి ఎద్దడికి శాశ్వత పరిష్కారం లభించనుంది.&lt;/p&gt;
&lt;p&gt;ఈ ప్రాజెక్టు ద్వారా తొలిదశలోనే అనకాపల్లి జిల్లాలోని 110 చెరువులను నింపడంతో పాటు 1.48 లక్షల ఎకరాలకు నేరుగా సాగునీరు అందిస్తారు. ఏలేరు ఆయకట్టు స్థిరీకరణతో కలిపి మొత్తంగా 2.87 లక్షల ఎకరాలకు నీటి భరోసా లభిస్తుండగా, 143 గ్రామాల్లోని 4.23 లక్షల మందికి తాగునీటి సమస్య తీరనుంది. భవిష్యత్తులో ఈ నీటిని విశాఖలోని మేఘాద్రిగెడ్డ, అక్కడి నుంచి విజయనగరం జిల్లా గడిగెడ్డ వరకు మళ్లించడం ద్వారా ఉత్తరాంధ్ర పారిశ్రామిక రంగానికి, తాగునీటి సమస్యలకు పరిష్కారం లభించినట్లే.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/02/3351f71a067014c6221288eea93f25141788345906201233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Polavaram Project News: 45.72 మీటర్ల వరకు పోలవరం నిర్మాణం..  2027 జూన్‌కల్లా ఫేజ్-1 పనులు పూర్తి: కేంద్రం ]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/rajamundry/central-government-sanctions-funds-for-polavaram-phase-1-targeting-completion-by-june-2027-257850</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/rajamundry/central-government-sanctions-funds-for-polavaram-phase-1-targeting-completion-by-june-2027-257850#respond</comments><pubDate>Wed, 2 Sep 2026 11:27:55 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ రాజమండ్రి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/rajamundry/central-government-sanctions-funds-for-polavaram-phase-1-targeting-completion-by-june-2027-257850</guid><description><![CDATA[&lt;p&gt;Andhra Pradesh Top Stories | అమరావతి: ఏపీకి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన కీలక అప్డేట్ వచ్చింది. తొలి దశ కింద కేంద్ర ప్రభుత్వం అందించే నిధులు 41.15 మీటర్ల నీటి నిల్వ మట్టానికే పరిమితమైనప్పటికీ, సివిల్ పనులు మాత్రం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం (FRL) అయిన 45.72 మీటర్ల వరకు కొనసాగుతాయని కేంద్రం స్పష్టం చేసింది. వైసీపీ ఎంపీ పీవీ మిథున్ రెడ్డి లోక్&amp;zwnj;సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్&amp;zwnj;భూషణ్ చౌధరి ఈ వివరాలను లిఖితపూర్వకంగా వెల్లడించారు.&lt;/p&gt;
&lt;p&gt;ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులను 2027 జూన్ నాటికి పూర్తి చేయాలని స్పష్టమైన లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన సభకు తెలిపారు.&amp;nbsp;ఎంపీ మిథున్ రెడ్డి పోలవరం ఫేజ్-1 నిధుల ఆమోదం, ఇప్పటివరకు విడుదల చేసిన గ్రాంట్లు, 2027 నాటికి నీటి నిల్వ లక్ష్యం, కాలువల నెట్&amp;zwnj;వర్క్ పై కేంద్రాన్ని ప్రశ్నలు అడిగారు. వాటితోపాటు విద్యుత్ కేంద్రం, సహాయ పునరావాస బకాయిల వివరాలు &amp;nbsp;ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్పిస్తున్న తాజా ప్రాజెక్టు నివేదికలు, యుటిలైజేషన్ సర్టిఫికెట్ల పురోగతిపై కేంద్ర మంత్రి సమాధానాలు ఇచ్చారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;2023 నాటి ధరల ప్రకారం 30,436.95 కోట్ల నిధులు&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;కేంద్ర మంత్రి తెలిపిన వివరాల ప్రకారం, 41.15 మీటర్ల ఎలివేషన్ లెవెల్ వరకు నీటిని నిల్వ చేసే పోలవరం ఫేజ్ 1 పనులకు 2023 నాటి ధరల అంచనాల ప్రకారం రూ. 30,436.95 కోట్ల నిధులు అందించడానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ ఆమోదించిన మొత్తం బడ్జెట్&amp;zwnj;లో ఇంకా కేంద్రం నుంచి రాష్ట్రానికి చెల్లించాల్సిన బాకీ గ్రాంట్ రూ. 12,157.53 కోట్లుగా ఉంది. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ. 5,512.40 కోట్లు, గత ఆర్థిక సంవత్సరం 2025-26 లో రూ. 2,810.22 కోట్లను ప్రాజెక్ట్ పనుల కోసం విడుదల చేసింది.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;2027 జూన్&amp;zwnj;కల్లా పోలవరం ఫేజ్ 1 పూర్తి&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;ప్రస్తుతం 41.15 మీటర్ల వరకు నీటిని నిల్వ చేసే క్రమంలో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం సజావుగా సాగుతోందని కేంద్ర మంత్రి వివరించారు. గ్యాప్-1, గ్యాప్-2లలో ప్రధాన డ్యామ్ నిర్మాణంతో పాటు భూసేకరణ, సహాయ పునరావాస పనులు మొత్తం 2027 జూన్&amp;zwnj;కల్లా పూర్తి చేస్తామని వెల్లడించారు. అయితే కేంద్ర గ్రాంట్ 41.15 మీటర్ల వరకు ఉండే ఫేజ్-1 పరిధిలోని సివిల్ పనులు, 45.72 మీటర్ల వరకు భూసేకరణ, పునరావాస కార్యక్రమాలు, కాలువల నిర్మాణానికే వర్తిస్తుందని తెలిపారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నిర్మాణ వ్యయాన్ని మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే స్వయంగా భరించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అలాగే ఏపీ ప్రభుత్వం అవసరమైన టెక్నికల్ డాక్యుమెంట్లు, యుటిలైజేషన్ సర్టిఫికెట్లను సకాలంలో సమర్పిస్తోందని ఆయన తెలిపారు.&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/02/36574cadd227f884271eb02723a884391788328502798233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Polavaram Latest News: ఏజెన్సీలో మలేరియా మాత్రలు వికటించి చిన్నారి మృతి, మరో 53 మందికి అస్వస్థత- అప్రమత్తమైన ప్రభుత్వం]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/rajamundry/polavaram-collector-intensifies-medical-services-in-gollaguppa-following-several-illness-257817</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/rajamundry/polavaram-collector-intensifies-medical-services-in-gollaguppa-following-several-illness-257817#respond</comments><pubDate>Wed, 2 Sep 2026 07:01:33 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ రాజమండ్రి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/rajamundry/polavaram-collector-intensifies-medical-services-in-gollaguppa-following-several-illness-257817</guid><description><![CDATA[&lt;p&gt;Gollaguppa Illness Issue |&amp;nbsp;ఏటపాక: పోలవరం జిల్లా &amp;nbsp;ఏటపాక మండలం గొల్లగుప్ప గ్రామంలో మలేరియా నివారణకు పంపిణీ చేసిన క్లోరోక్విన్&amp;zwnj; ట్యాబ్లెట్లు వేసుకోవడంతో 54 మంది అస్వస్థతకు లోనయ్యారు. వీరిలో ఒక బాలిక మృతిచెందగా, మిగతా వారి పరిస్థితి నిలకడగా ఉంది. ఈ ఘటనపై ప్రభుత్వం అప్రమత్తమై వెంటనే చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ కె. దినేష్&amp;zwnj;కుమార్ తెలిపారు. బాధితులకు సకాలంలో మెరుగైన వైద్యం అందించడంతో పాటు, ప్రత్యేక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి నిరంతరం వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.&lt;/p&gt;
&lt;p&gt;గొల్లగుప్ప గ్రామంలో మొత్తం 253 మంది నివసిస్తున్నారు. వీరిలో అస్వస్థతకు గురైన వారిని గుర్తించి అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, అవసరమైతే ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారని కలెక్టర్ పేర్కొన్నారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;గొల్లగుప్ప ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;పోలవరం జిల్లా గొల్లగుప్ప ఘటనపై సిఎం &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; సమీక్షించారు. క్లోరోక్విన్ ట్యాబ్లెట్లు వికటించి ఒక బాలిక చనిపోయిందనే సమాచారంపై వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ తో ఆయన మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. గొల్లగుప్పలో మొత్తం 71 మందికి మందులు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. 47 మంది చిన్నారులు, ఏడుగురు పెద్దవారు అస్వస్థతకు గురయ్యారని, ప్రత్యేక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నట్లు సీఎంకు వివరించారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/02/0fe6e2623b349242ff9a81dc56c280e91788312113399233_original.jpeg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;&amp;nbsp;30 మందిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలింపు&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;అస్వస్థతకు గురైన వారిలో 30 మందిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో చిన్నారులు, పెద్దవారు కూడా ఉన్నారు. అయితే పరిస్థితి విషమించడంతో 7 ఏళ్ల మడివి జమున మృతి చెందింది. ఈ చిన్నారి జీపీఎస్&amp;zwnj; పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. చికిత్స పొందుతున్న మిగిలిన బాధితుల ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఆసుపత్రి వైద్యులతో జిల్లా అధికారులు సమన్వయం చేసుకుంటూ, మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు చేపట్టారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;strong&gt;లక్ష్మీపురం పీహెచ్&amp;zwnj;సీలో 24 మందికి వైద్య సేవలు&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;అస్వస్థకు గురైన వారిలో 24 మందికి లక్ష్మీపురం పీహెచ్&amp;zwnj;సీలో వైద్య సేవలు అందిస్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్య సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. పీహెచ్&amp;zwnj;సీలో ప్రాథమిక స్క్రీనింగ్&amp;zwnj; పరీక్షలు నిర్వహించి, అవసరాన్ని బట్టి వైద్య సేవలు అందిస్తున్నారు. పరిస్థితి పూర్తిగా అదుపులో ఉన్నట్లు అధికారులు తెలిపారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;గొల్లగుప్ప గ్రామంలో ప్రత్యేకంగా మెడికల్ క్యాంప్&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;బాధితులకు తక్షణ వైద్య సేవలు అందించేందుకు అధికారులు గొల్లగుప్పలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. రాష్ట్రస్థాయి నుంచి ఒక మెడికల్ టీం, కాకినాడ నుంచి నిపుణుల వైద్య బృందం, రాజమహేంద్రవరం నుంచి మరో మెడికల్ టీం ఇక్కడికి చేరుకుని వైద్య పరీక్షలు నిర్వహిస్తోంది. వీరితో పాటు ముగ్గురు పెడియాట్రిషియన్లు కూడా అందుబాటులో ఉన్నారని అధికారులు తెలిపారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/02/6c6c5046967da54d7629cd612fc0def41788312128331233_original.jpeg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;&amp;nbsp;వైద్య శాఖ అప్రమత్తం&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;రాష్ట్రస్థాయి అధికారుల ఆదేశాల మేరకు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. గొల్లగుప్ప గ్రామంలో వైద్య సేవలను విస్తృతం చేయడంతో పాటు, బాధితుల ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు వివరాలు సేకరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనపై ఎప్పటికప్పుడూ పర్యవేక్షణ చేస్తోందని కలెక్టర్ తెలిపారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;&amp;nbsp;ఆసుపత్రులు, గ్రామాన్ని సందర్శించిన ఐటీడీఏ పీవో&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;జిల్లా కలెక్టర్ కె. దినేష్&amp;zwnj;కుమార్ ఆదేశాల మేరకు ఐటీడీఏ పీవో శుభం నోఖ్వాల్, ఏఎస్పీ హేమంత్ బండిరేవు వద్ద గ్రామస్తులతో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. అస్వస్థతకు గురైన వారిని సకాలంలో ఆసుపత్రులకు తరలించేలా చర్యలు చేపట్టారు. ఐటీడీఏ పీవో శుభం నోఖ్వాల్ మంగళవారం రాత్రి భద్రాచలం ఏరియా ఆసుపత్రిని, అనంతరం లక్ష్మీపురం పీహెచ్&amp;zwnj;సీకి వెళ్లి &amp;nbsp;బాధితుల ఆరోగ్య పరిస్థితిని స్వయంగా పరిశీలించారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/02/2baf72f5e624c6fab3acb1c77b440f231788311385201233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[AP Local Body Elections: గొడ్డలి పార్టీకి ఓటమి భయం.. స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవాలపై ఏపీ సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/rajamundry/cm-chandrababu-slams-opposition-in-mogalthuru-meeting-highlights-local-governance-and-ai-integration-257796</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/rajamundry/cm-chandrababu-slams-opposition-in-mogalthuru-meeting-highlights-local-governance-and-ai-integration-257796#respond</comments><pubDate>Tue, 1 Sep 2026 16:52:33 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ రాజమండ్రి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/rajamundry/cm-chandrababu-slams-opposition-in-mogalthuru-meeting-highlights-local-governance-and-ai-integration-257796</guid><description><![CDATA[&lt;p&gt;Andhra Pradesh Top News | మొగల్తూరు బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ప్రతిపక్ష వైసీపీ వైఖరిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా ఎన్డీఏ కూటమి విజయం తథ్యమన్నారు. ఆ ఓటమి భయంతోనే ప్రతిపక్షాలు స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు. ఏకగ్రీవ ఎన్నికలను ప్రోత్సహించడం, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో చైర్మన్లు, మేయర్ల ఎన్నికలను ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించడం ద్వారా &amp;lsquo;ఆయారామ్-గయారామ్&amp;rsquo; కల్చర్ లేకుండా 5 ఏళ్లపాటు స్థిరమైన పాలన సాగేలా చర్యలు తీసుకున్నామని గుర్తుచేశారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;గొడ్డలి పార్టీ బెదిరింపులకు పాల్పడుతోంది.. ఏకగ్రీవాలు తప్పవు..&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఏకగ్రీవం అయితే ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వమని గొడ్డలి పార్టీ నాయకుడు బెదిరింపులకు పాల్పడుతున్నారు. వాస్తవానికి ఎన్నికల్లో ఏకగ్రీవాలను ప్రభుత్వాలే ప్రోత్సహించాయన్నారు. ఇకనుంచి మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల చైర్మన్, మేయర్ల ఎన్నికను సైతం ప్రత్యక్ష విధానంలోకి తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. 1996 నుంచి బీసీలకు ఉన్న 34 శాతం రిజర్వేషన్లను గత ప్రభుత్వం తగ్గించిందని, దాన్ని మళ్లీ పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తే కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.&lt;/p&gt;
&lt;p&gt;ఓటర్ల జాబితా రివిజన్ (SIR) ప్రక్రియ పూర్తయ్యే వరకు స్థానిక ఎన్నికలు జరగకుండా నిలిపివేయాలని కోర్టులను ఆశ్రయించడం వెనుక చిత్తుగా ఓడిపోతామనే భయమే కారణమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాలు, స్థానిక సంస్థల అభివృద్ధికి కేంద్రం నుంచి సకాలంలో నిధులు రావాలన్నా, క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారమవ్వాలన్నా ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు వార్డు సభ్యులు, సర్పంచులు కూడా ఉండాలని స్పష్టం చేశారు. ఎన్నికల్లో డబ్బు పంపిణీ చేసే సంస్కృతికి స్వస్తి పలకాలని, సమాజంలో వ్యాపించిన ఈ కలుషిత వాతావరణాన్ని ప్రజలందరూ కలిసి కడిగేయాలని, వివేకంగా ఆలోచించి అడుగేయాలని పిలుపునిచ్చారు.&lt;/p&gt;
&lt;p&gt;ప్రజా పాలనలో అత్యాధునిక సాంకేతికతను జోడిస్తూ విప్లవాత్మక మార్పులు తెస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు &amp;lsquo;ఏఐ ట్యూటర్&amp;rsquo;, ప్రజల ఆరోగ్యాన్ని పర్యవేక్షించేందుకు AI Doctor వంటి అధునాతన డిజిటల్ వ్యవస్థలను అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని 1.60 కోట్ల కుటుంబాలకు నాణ్యమైన సేవలను ఆన్&amp;zwnj;లైన్ వేదికగా వేగంగా అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.&lt;/p&gt;
&lt;p&gt;పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; నాయుడు, సరిగ్గా 31 ఏళ్ల క్రితం (1995 సెప్టెంబరు 1న) తాను తొలిసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చారిత్రక ఘట్టాన్ని గుర్తుచేసుకున్నారు. ప్రజల ఆప్యాయతకు ఎన్ని జన్మలెత్తినా రుణం తీర్చుకోలేనని భావోద్వేగానికి లోనయ్యారు. సంక్షేమం అనేది పేదలను ఆర్థికంగా నిలబెట్టేలా ఉండాలని, తాత్కాలిక ఉపశమనానికే పరిమితం కాకూడదని పేర్కొన్నారు. ఉచిత బస్సు ప్రయాణం, &amp;lsquo;దీపం&amp;rsquo; కింద ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు వంటి కూటమి ప్రభుత్వ పథకాలను వివరిస్తూ, రాష్ట్ర అభివృద్ధికి ప్రజలు, మేధావులు సలహాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/01/fb3cb3bbccea3103820015885c7041361788261625320233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[CM Chandrababu: 31 ఏళ్ల కిందట సీఎంగా తొలిసారి.. ప్రజల రుణం ఎన్నటికీ తీర్చుకోలేను: పింఛన్ల పంపిణీలో సీఎం చంద్రబాబు]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/rajamundry/ap-cm-chandrababu-distributes-pensions-in-mogalthuru-recalls-31-year-political-milestone-257788</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/rajamundry/ap-cm-chandrababu-distributes-pensions-in-mogalthuru-recalls-31-year-political-milestone-257788#respond</comments><pubDate>Tue, 1 Sep 2026 14:56:34 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ రాజమండ్రి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/rajamundry/ap-cm-chandrababu-distributes-pensions-in-mogalthuru-recalls-31-year-political-milestone-257788</guid><description><![CDATA[&lt;p&gt;NTR Bharosa Pension Scheme |&amp;nbsp;మొగల్తూరు: &amp;nbsp;&lt;a title=&quot;టీడీపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/tdp&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;టీడీపీ&lt;/a&gt; జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు నేడు చాలా మరపురాని రోజు. సరిగ్గా 31 ఏళ్ల క్రితం (1995 సెప్టెంబరు 1న) తాను ఆంధ్రప్రదేశ్&amp;zwnj;కు తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారని గుర్తుచేసుకున్నారు. తన 48 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో మొగల్తూరు ప్రాంతానికి చాలాసార్లు వచ్చానని, ప్రజలు తనపై చూపుతున్న ఆప్యాయతకు ఎన్ని జన్మలెత్తినా రుణం తీర్చుకోలేనని సీఎం చంద్రబాబు భావోద్వేగానికి లోనయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో ఏర్పాటు చేసిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;రాష్ట్రంలో సంక్షేమాలు, అభివృద్ధి మరింత సమర్థవంతంగా సాగేందుకు ప్రజలు, మేధావులు సలహాలు, సూచనలు ఇవ్వాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. సంక్షేమ పథకాలు కేవలం తాత్కాలిక ఉపశమనం అందించడమే కాకుండా, పేదవారిని ఆర్థికంగా నిలబెట్టే విధంగా ఉండాలని ఆకాంక్షించారు. &amp;nbsp;కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించాం, దీపం పథకం కింద ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;దేశంలో ఎక్కడా లేని విధంగా సామాజిక పింఛన్ల పెంపును అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. వృద్ధులకు రూ.4000, దివ్యాంగులకు రూ.6 వేలు సహా ఇతర వర్గాలకు లబ్ది చేకూరుతుందన్నారు. ఆర్టీసీలో మహిళా కండక్టర్ల తరహాలోనే త్వరలోనే మహిళా డ్రైవర్లను కూడా రంగంలోకి దించుతామని ఏపీ సీఎం ప్రకటించారు. బిసి వర్గాల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, వడ్డెర సామాజిక వర్గానికి మైనింగ్ లీజులు, గౌడ కులానికి మద్యం షాపుల కేటాయింపుల్లో ప్రాధాన్యత కల్పించామని వివరించారు.&lt;/p&gt;
&lt;p&gt;వైసీపీ పాలనలో రాష్ట్ర వ్యవస్థలు అన్ని తీవ్రంగా దెబ్బతిన్నాయని, డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాల (Mega DSC)పై వైసీపీ ఏకంగా 350 కేసులు వేసి అడ్డుకునే యత్నం చేసిందని &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన నష్టాన్ని భర్తీ చేస్తూ కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని మళ్లీ అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తోందన్నారు. నిరుపేదలకు సరైన చేయూతనిస్తే వారు అద్భుతాలు సాధించగలరని దీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ, రాష్ట్ర మంత్రులు గొట్టిపాటి రవికుమార్, నిమ్మల రామానాయుడు, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తదితర ప్రముఖులు పాల్గొన్నారు.&lt;br /&gt;&lt;br /&gt;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/01/dcfa3dd0d9e6923669da128ee94530291788254568922233_original.jpg" width="220"/></item></channel></rss>