అన్వేషించండి

PM Modi on Cyclone Montha: చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్.. మొంథా తుపాను ప్రభావంపై ఆరా, సాయం చేస్తామని భరోసా

ఏపీలో మొంథా తుపాను ప్రభావంపై ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్ చేసి వివరాలు ఆరా తీశారు. కేంద్ర సాయం చేస్తుందని హామీ ఇచ్చారు.

 Cyclone Montha: అమరావతి: ఊహించినట్లుగానే ఏపీలో పలు జిల్లాల్లో మొంథా తుపాన్ ప్రభావం చూపుతోంది. కోస్తా జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరుతో పాటు ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాను తీరం దగ్గరకు వచ్చే కొద్ది తీవ్ర ప్రభావం చూపుతోంది. గడిచిన 6 గంటల్లో గంటకు 18 కి.మీ వేగంతో మొంథా తుపాన్ కదులుతోందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రస్తుతానికి చెన్నైకి 520కి.మీ, కాకినాడకి  570 కి.మీ, విశాఖపట్నంకి  600 కి.మీ దూరంలో కేంద్రీకృతం అయింది. 

మొంథా తుపాను పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మంగళవారం ఉదయానికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉంది. తుపాను ప్రభావంతో తీరం వెంబడి గంటకు 90-110 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండండి ప్రఖర్ జైన్ సూచించారు. 

ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రధాని ఫోన్ 
మొంథా తుఫాన్ ఏపీపై ప్రభావం చూపుతున్న తరుణంలో సీఎం చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. మొంథా తుఫాన్ పరిస్థితిపై మోదీ ఆరా తీశారు. తుఫాన్ సమయంలో కేంద్రం పూర్తిస్థాయిలో సహకరిస్తుందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. సీఎం కార్యాలయంలో సమన్వయ బాధ్యతను కూటమి ప్రభుత్వం మంత్రి లోకేష్ కి అప్పగించింది. సీఎం ఆఫీసు నుంచే తుఫాన్ ప్రభావంపై లోకేష్ అందరు మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలను, ఇతర ఉన్నతాధికారులతో సమన్వయం చేస్తున్నారు. మొంథా తుపాను ప్రభావాన్ని ఎప్పటికప్పుడూ అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. ఎక్కడా నిర్లక్ష్యం వహించరాదని, వరద పరిస్థితిపై సీఎం ఆఫీసుకు అప్ డేట్ ఇవ్వాలని సూచించారు.  

బాపట్ల జిల్లా కలెక్టరేట్‌తో పాటు డివిజన్‌, మండలం కేంద్రాల్లో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేసి తుపాను పరిస్థితిని సమీక్షిస్తున్నారు కలెక్టర్‌ వినోద్‌కుమార్‌, తుపాను ప్రత్యేక అధికారి వేణుగోపాల్‌రెడ్డి. ఏమైనా సాయం కావాలంటే బాపట్ల కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌ 08643 220226కు ఫోన్‌ చేయాలని అధికారులకు సూచించారు. సూర్యలంక బీచ్‌కు వెళ్లే మార్గాన్ని అధికారులు మూసివేశారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని మత్స్యకారులను హెచ్చరించారు. నిత్యావసర సరకులు, అత్యవసర మందులను అధికారులు సిద్ధం చేశారు. కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. 

మొంథా తుపాను నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు చర్యలు.
మొంథా తుపాను దృష్ట్యా అక్టోబర్ 30 వరకు అధికారులకు సెలవులు రద్దు చేసింది ఏపీ ప్రభుత్వం. సహాయ చర్యల నిమిత్తం రూ.19 కోట్లు విడుదల చేసి తుపాను పరిస్థితిని ఎదుర్కొనేందుకు ముందుగానే సిద్ధమైంది. ఎస్డీఆర్ఎఫ్, ఏపీఎస్‌డీఎంఏ కేంద్రాలు, 16 శాటిలైట్ ఫోన్లు ఏర్పాటు చేశారు. 57 తీర ప్రాంత మండలాల పరిధిలో 219 తుపాను షెల్టర్లు.. సముద్రంలో 62 మెకనైజ్డ్ బోట్లను ఒడ్డుకు రప్పించేందుకు ఏర్పాట్లు చేశారు. సముద్ర తీరాల్లో పర్యాటకుల రాకపోకలపై నిషేధం విధించి కట్టుదిట్టంగా చర్యలు తీసుకుంటున్నారు. అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరులో విద్యాసంస్థలకు ఎల్లుండి వరకు సెలవులు ప్రకటించారు. ప.గో, ఏలూరు, బాపట్ల, కడపలో విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవులు ఇచ్చారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Rising Summit: PPP మోడల్‌ అనివార్యం - గ్లోబల్ సమ్మిట్ లో భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు
PPP మోడల్‌ అనివార్యం - గ్లోబల్ సమ్మిట్ లో భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు
Ram Mohan Naidu: ఇండిగోపై ప్రారంభమైన చర్యలు - అనుభవించి తీరాల్సిందే - లోక్ సభలో రామ్మోహన్ నాయుడు ప్రకటన
ఇండిగోపై ప్రారంభమైన చర్యలు - అనుభవించి తీరాల్సిందే - లోక్ సభలో రామ్మోహన్ నాయుడు ప్రకటన
Kalvakuntla Kavitha: కల్వకుంట్ల కవితపై కూకట్ పల్లి ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు - బీఆర్ఎస్ ఇక మాటకు మాట చెప్పాలని డిసైడ్ అయిందా ?
కల్వకుంట్ల కవితపై కూకట్ పల్లి ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు - బీఆర్ఎస్ ఇక మాటకు మాట చెప్పాలని డిసైడ్ అయిందా ?
Advocate Rakesh Kishore: సీజేఐ మీద షూ విసిరిన లాయర్‌కు చెప్పు దెబ్బ- ఢిల్లీ కోర్టు వద్ద అనూహ్య ఘటన
సీజేఐ మీద షూ విసిరిన లాయర్‌కు చెప్పు దెబ్బ- ఢిల్లీ కోర్టు వద్ద అనూహ్య ఘటన
Advertisement

వీడియోలు

Smriti In Nets After Wedding Cancellation | బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న స్మృతి మంధాన
SKY about Sanju Samson as Opener | టీమ్ పై కీలక వ్యాఖ్యలు చేసిన SKY
Gambhir about Team India Batting Order | గంభీర్ కొత్త స్టేట్మెంట్ అర్థం ఏంటి..?
Irfan Pathan Comments on Captain Shubman Gill | గిల్‌కు కీలక సూచన చేసిన ఇర్ఫాన్ పఠాన్‌
Irfan Pathan Comments on Shubman Gill | గిల్‌కు కీలక సూచన చేసిన ఇర్ఫాన్ పఠాన్‌
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Rising Summit: PPP మోడల్‌ అనివార్యం - గ్లోబల్ సమ్మిట్ లో భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు
PPP మోడల్‌ అనివార్యం - గ్లోబల్ సమ్మిట్ లో భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు
Ram Mohan Naidu: ఇండిగోపై ప్రారంభమైన చర్యలు - అనుభవించి తీరాల్సిందే - లోక్ సభలో రామ్మోహన్ నాయుడు ప్రకటన
ఇండిగోపై ప్రారంభమైన చర్యలు - అనుభవించి తీరాల్సిందే - లోక్ సభలో రామ్మోహన్ నాయుడు ప్రకటన
Kalvakuntla Kavitha: కల్వకుంట్ల కవితపై కూకట్ పల్లి ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు - బీఆర్ఎస్ ఇక మాటకు మాట చెప్పాలని డిసైడ్ అయిందా ?
కల్వకుంట్ల కవితపై కూకట్ పల్లి ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు - బీఆర్ఎస్ ఇక మాటకు మాట చెప్పాలని డిసైడ్ అయిందా ?
Advocate Rakesh Kishore: సీజేఐ మీద షూ విసిరిన లాయర్‌కు చెప్పు దెబ్బ- ఢిల్లీ కోర్టు వద్ద అనూహ్య ఘటన
సీజేఐ మీద షూ విసిరిన లాయర్‌కు చెప్పు దెబ్బ- ఢిల్లీ కోర్టు వద్ద అనూహ్య ఘటన
Akhanda 2 Release Updates: 'అఖండ 2'కు లైన్ క్లియర్... మద్రాస్ హైకోర్టులోని ఎరోస్ కేసులో నిర్మాతలకు ఊరట
'అఖండ 2'కు లైన్ క్లియర్... మద్రాస్ హైకోర్టులోని ఎరోస్ కేసులో నిర్మాతలకు ఊరట
Pilot Rostering Issues: భారత్‌లో పైలట్‌ల కొరతకు కారణాలేంటీ? యువత అటువైపుగా ఎందుకు ఆసక్తి చూపడం లేదు?
భారత్‌లో పైలట్‌ల కొరతకు కారణాలేంటీ? యువత అటువైపుగా ఎందుకు ఆసక్తి చూపడం లేదు?
Amaravati Farmers: అమరావతి రైతులు ముందుకొచ్చి తమ ప్లాట్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి: మంత్రి నారాయణ
అమరావతి రైతులు ముందుకొచ్చి ప్లాట్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి: మంత్రి నారాయణ
ఫోర్త్ సిటీ కాదు..ఫ్యూచర్ సిటీ! 4 అంటే మరణం, అపశకునమా? రేవంత్ రెడ్డి అందుకే ఈ పేరు ఖరారు చేశారా?
ఫోర్త్ సిటీ కాదు..ఫ్యూచర్ సిటీ! 4 అంటే మరణం, అపశకునమా? రేవంత్ రెడ్డి అందుకే ఈ పేరు ఖరారు చేశారా?
Embed widget