Nidadavolu - Duvvada Railway Line: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. నిడదవోలు - దువ్వాడ మధ్య 10వేల కోట్లతో కొత్త రైల్వే లైన్
ఏపీకి కేంద్రం భారీ ఊరటనిస్తూ నిడదవోలు- దువ్వాడ మధ్య అదనంగా మరో రెండు రైల్వే లైన్ల (3, 4 లైన్లు) నిర్మాణానికి రూ. 9,889 కోట్లు విడుదల చేసింది.

ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. నిడదవోలు- దువ్వాడ మధ్య కొత్తగా మరో రెండు రైల్వే లైన్లు వేయడం కోసం రూ.9,889 కోట్లు విడుదల చేస్తూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆల్రెడీ ఫంక్షన్ లో ఉన్న రెండు లైన్లకు తోడు 3,4 రైల్వే లైన్ వేయడం కోసం ఈ బడ్జెట్ ను కేటాయించారు. ఈ రెండు పట్టణాల మధ్య మొత్తం రైల్వే లైన్ పొడవు 198 km కాగా రెండు వైపులా కలిపి 458 km గా నిర్మించబోతున్నారు. ఈ రైల్వే లైన్ ఈస్ట్ గోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి,విశాఖపట్నం జిల్లాలను కవర్ చేస్తుంది.
ఏపీలోని ఈస్ట్ కోస్ట్ తీరం వెంబడి ఉన్న విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం కోట్లనుపోర్ట్ లలోని సరుకు రవాణాని దృష్టిలో పెట్టుకుని ఈ రైల్వేలైన్ నిర్మిస్తున్నారు. చెన్నై హౌరా మధ్య ఉన్న రైల్వే లైన్ లలో పెరిగిపోయిన రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ కొత్త రైల్వే లైన్ శాంక్షన్ చేశారు.
గోదావరిపై క్రొత్త రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం
నిడదవోలు -దువ్వాడ మధ్య కేంద్రం నిర్మిస్తున్న మూడు, నాలుగు రైల్వే లైన్ లలో భాగం గా గోదావరి నదిపై రాజమండ్రి వద్ద క్రొత్త రైల్వే బ్రిడ్జి నిర్మిస్తారు. అది కూడా ఈ ప్రాజెక్టులో భాగం. కొత్త బ్రిడ్జి గోదావరిపై 4.3 km పొడవు ఉంటుంది. అలాగే 2.6 ఏడు కిలోమీటర్ల లైన్ వయాడెక్ట్ మీదుగా వెళుతుంది. మూడు చోట్ల బైపాస్ లైన్ నిర్మిస్తారు. ఓవరాల్ గా ఇప్పుడు ఆల్రెడీ ఉన్న రైల్వే లైన్ కంటే నిడదవోలు - దువ్వాడ మధ్య 8 కిలోమీటర్ల తక్కువ దూరం ఉండేలా 3,4 లైన్ లు వేస్తారు.
ప్రధానంగా పోర్టుల కనెక్టివిటీ, సరుకు రవాణా తో పాటు అన్నవరం అంతర్వేది ద్రాక్షారామం లాంటి పుణ్యక్షేత్రాల కు దగ్గరగా టెంపుల్ టూరిజం ప్రమోట్ చేసేందుకు ఈ లైన్ నిర్మిస్తున్నట్టు రైల్వే తెలిపింది. ఆల్రెడీ విజయవాడ నుంచి నిడదవోలు వరకూ ఏలూరు మీదుగా రెండు లైన్ లు, భీమవరం మీదుగా మరో రెండు లైన్ లు ఉన్నాయి. ఇవి నాలుగు లైన్ లు నిడదవోలు జంక్షన్ లో కలుస్తాయి. నిడదవోలు నుంచి దువ్వాడ మంచి ఆల్రెడీ ఉన్న రెండు లైన్ లకు కొత్తగా మూడు నాలుగు రైల్వే లైన్లు కలవడం వల్ల టోటల్గా విజయవాడ విశాఖపట్నం మధ్య 4 లైన్ లు ఏర్పడి నట్టు అవుతాయి. దీనితో సరుకు రవాణా ఈజీ అవ్వడంతో పాటు మరికొన్ని కొత్త ట్రైన్లు నడిపే అవకాశం ఉంటుంది.
ఉత్తర ప్రదేశ్ కు 15 వేల కోట్లు కేటాయింపు
ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ -సీతాపూర్ మధ్య కూడా 3,4 రైల్వే లైన్ లు వేయడం కోసం కేంద్ర క్యాబినెట్ 14,926కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ రెండు లైన్లకు కలిపి 859 km మేర ట్రాక్ వేస్తారు.ఈ రెండు నగరాల మధ్య మెషినరీ, ఫార్మా, ఇత్తడి వస్తువులు, ఎలెక్ట్రానిక్స్, ఫర్నీచర్, ఇంజనీరింగ్ వస్తువుల విడిభాగాలు, టెక్స్ టైల్స్ ఇలాంటి అనేక పారిశ్రామిక సరుకు రవాణా జరుగుతూ ఉంటుంది. ఎప్పటినుంచో ఈ రెండు సిటీస్ మధ్య మూడు నాలుగు లైన్లు నిర్మించాలని డిమాండ్ ఉంది. ఇన్నాళ్లకు కేంద్ర కేబినెట్ ఆ దిశగా నిర్ణయం తీసుకుంది. ఏపీ ఉత్తరప్రదేశ్ కలిపి మొత్తం 15 జిల్లాల్లో 1317 కిమీ పొడవున ఈ మూడు నాలుగు రైల్వే లైన్ లు నిర్మించడానికి 24,815 కోట్లు కేటాయిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
ట్రెండింగ్ వార్తలు





















