Mudragada Padmanabham Funeral:మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో వరుస వివాదాలు అనుచరులకు ఆందోళన కలిగిస్తున్నాయి. ఉదయం కుమార్తె రాక సందర్భంగా కిర్లంపూడిలో హడావిడి నడిచింది. ఇప్పుడు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలపై ఇష్యూ నడుస్తోంది. అలాంటి అధికారిక లాంఛనాలకు ముద్రగడకు అవసరం లేదని వైసీపీ నేతలు కొట్టిపారేస్తున్నారు. మరణించిన ప్రజాప్రతినిధులకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేయడం సంప్రదాయమని మంత్రులు చెబుతున్నారు. దీంతో వివాదం ఏ స్థాయికి వెళ్తుందని ఆయన అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Continues below advertisement

అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలపై వివాదం

కాకినాడ జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ఏర్పాట్లు చేస్తున్నారు. మాజీ మంత్రి కావడంతో అధికారిక లాంఛనాలతో అంతిసంస్కారాలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే దీనికి కుటుంబ సభ్యులు అంగీకరించడం లేదని వైసీపీ నేతలు ప్రకటించారు. ఆ పార్టీ సీనియర్ నేత జక్కంపూడి రాజా దీనిపై మీడియాతో మాట్లాడారు. ముద్రగడ ఎప్పడూ అధికారం కోసం పాకులాడలేదని తెలిపారు. అందుకే అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు వద్దని కుటుంబ సభ్యులు చెప్పినట్టు వెల్లడించారు. ఇంటి ఆవరణంలో సాధారణంగా ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారని ప్రకటించారు.   

ప్రభుత్వంపై వైసీపీ విమర్శలు

అంతేకాకుండా ప్రభుత్వంపై జక్కంపూడి విమర్శలు కూడా చేశారు. ముద్రగడ బతికున్నప్పుడు కచ్చితంగా వేధించారని ఆరోపించారు. ప్రజాసమస్యలపై పోరాడిన వ్యక్తిని ఇబ్బంది పెట్టారని, ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే ప్రభుత్వ లాంఛనాలు అవసరం లేదని కుటుంబ సభ్యులు చెప్పినట్టు వెల్లడించారు. 

Continues below advertisement

అంతకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చర్చించుకొని ముద్రగడ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ఆదేశించారు. ముద్రగడ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఒకసారి ఎంపీగా పని చేసిన ఆయనకు దక్కాల్సిన గౌరవం అందివ్వాలని ప్రభుత్వం యోచించింది. ఇప్పుడు కుటుంబ సభ్యులు వద్దని చెప్పారని వైసీపీ నేతలు ప్రకటించడంతో సరికొత్త వివాదానికి దారి తీసింది.  

వైసీపీ నేతలు ప్రకటనపై పర్యాటక మంత్రి కందుల దుర్గేష్‌ కౌంటర్ ఇచ్చారు. మంత్రిగా, ప్రజాప్రతినిధిగా రాష్ట్ర ప్రజలకు ముద్రగడ పద్మనాభం చేసిన సేవలకు గుర్తింపుగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అన్నారు. మృతి విషయంలో రాజకీయాలు చేయడం మంచిది కాదని అభిప్రాయపడ్డారు. 

ఉదయం కుమార్తెను రానివ్వను కుటుంబం, వైసీపీ నేతలు 

ఉదయం కూడా ముద్రగడను చూసేందుకు వచ్చిన కుమార్తె క్రాంతిని కుటుంబ సభ్యులు, వైసీపీ నేతలు అడ్డుకున్నారు. బతికి ఉన్నప్పుడు ఆయన్ని ఇబ్బంది పెట్టిన కుమార్తెకు చివరి చూపు చూసే అర్హత లేదని కూడా నినాదాలు చేశారు. అంతేకాకుండా 2024లో ముద్రగడ చేసిన కామెంట్స్‌ను గుర్తు చేశారు. అప్పట్లో నెలకొన్ని వివాదాలపై స్పందించిన ముద్రగడ తనకు కుమార్తె లేరని ప్రకటించారు. తాను మరణిస్తే చివరి చూపు కోసం కూడా రావద్దని ప్రకటించారు. అందుకే ఆమెను అనుతించేందుకు కుటుంబ సభ్యులు, వైసీపీ నేతలు అంగీకరించేదు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకొని ముద్రగడ కుమార్తె క్రాంతిని అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు.