Wednesday morning encounter:  ఆంధ్రప్రదేశ్ ఏజెన్సీ ప్రాంతంలోని రంపచోడవరం అటవీ ప్రాంతంలో  బుధవారం ఉదయం జరిగిన ఎన్ కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు చనిపోయారు. వారిలో దేవ్ జీ, ఆజాద్ తో సహా పలువురు కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారన్న ప్రచారం జరిగింది. అయితే చనిపోయిన వారిలో టెక్ శంకర్ ఒక్కరే కీలకమైన నేతల అని ఏపీ ఇంటలిజెన్స్ ఏడీజీ లడ్హా ప్రకటించారు.   

Continues below advertisement

మారేడుమిల్లికి  ఐదు కిలోమీటర్ల దూరంలో  బుధవారం ఉదయం మరో ఎన్ కౌంటర్  

ఈ ఎదురుకాల్పులు రంపచోడవరం మండలం జీఎం వలసా ప్రాంతంలో జరిగాయి. ఏపీ పోలీసులు, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్ఓజీ), గ్రేహౌండ్స్ మొదలైన భద్రతా బలగాలు కలిసి నిర్వహించిన ఆపరేషన్‌లో మావోయిస్టులు తమ ఆయుధాలతో ఎదురుదాడి చేయడంతో  కాల్పులు జరిగాయి. చివరికి ఏడుగురు మావోయిస్టులు చనిపోయారు.  చనిపోయిన వారిలో  మెట్టూరు జోగరావు  అలియాస్ టెక్ శంకర్ ఉన్నారు. : శ్రీకాకుళం జిల్లాకు చెందిన టెక్ శంకర్ ఆంధ్ర-ఒడిశా బార్డర్ (ఏఒబి) ప్లూటూన్ కమాండర్. ఐఈడీలు, ఆయుధాల తయారీ, కమ్యూనికేషన్ నిపుణుడు.         

Continues below advertisement

తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ ఉన్నారని ప్రచారం - కానీ టెక్ శంకర్ హతం                   

మృతుల్లో మావోయిస్టు అగ్రనేత, పార్టీ ప్రధాన కార్యదర్శి తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్ జీ ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఆయన సెక్యూరిటీ టీం అంతా పట్టుబడటంతో ఆయనను కూడా పట్టుకున్నారని..  ఎన్ కౌంటర్ చేస్తారని కొంత మంది ఆరపణలుచేశారు.  అయితే ఈ ప్రచారాన్ని పోలీసులు ఖండించారు. కాగా, మృతులు అంతా చత్తీస్ గడ్ రాష్ట్రానికి చెందిన వారేనని పోలీసులు చెబుతున్నారు. మొత్తం నలుగురు పురుషులు, ముగ్గురు మహిళలు ఈ ఎన్కౌంటరులో చనిపోయారు. జోగారావు, జ్యోతితో పాటు సురేశ్, గణేష్, వాసు, అనిత, షమ్మిగా మిగిలిన వారిని గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి తరలించారు.   ఎదురుకాల్పుల స్థలంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు, IEDలు, కమ్యూనికేషన్ డివైస్‌లు  స్వాధీనం చేసుకున్నారు.              

షెల్టర్ కోసం చత్తీస్ ఘడ్ నుంచి ఏపీకి వస్తున్న మావోయిస్టులు - లొంగిపోవాలని లడ్హా పిలుపు         ఏపీలో మావోయిస్ట్ కార్యకలాపాలు తగ్గుముఖం పట్టినా, చత్తీస్‌గఢ్, తెలంగాణ నుంచి వారు రాష్ట్రంలోకి ప్రవేశించి కొత్తగా బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నారని పోలీసులు  చెబుతున్నారు. . NTR, కృష్ణ, ఏలూరు, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో 50 మంది మావోయిస్టులు, వారి సహాయకులు అరెస్టయ్యారు. వీరిలో సీనియర్ నేతలు, లాజిస్టిక్స్ హ్యాండ్లర్లు, కమ్యూనికేషన్ ఆపరేటర్లు, ఆర్మ్డ్ ప్లూటూన్ సభ్యులు, పార్టీ క్యాడర్లు ఉన్నారు. మాడ్వీ  హిద్మాతో సన్నిహితంగా ముడిపడినవారే ఎక్కువగా అరెస్టయ్యారు. ఈ ఆపరేషన్లు ప్రజలకు ఎలాంటి హాని జరగకుండా నిర్వహించామని, మావోయిస్టుల నుంచి భారీ మొత్తంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నామని ఏడీజీ లడ్డా పేర్కొన్నారు.