Petrol-Diesel Price, 24 October: మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలు పైపైకి.. నేడు మీ నగరంలో ఎంత పెరిగిందంటే..
శ్రీకాకుళం ఇంధన మార్కెట్లో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.114.64గా ఉంది. గత ధరతో పోలిస్తే లీటరుకు రూ.0.72 పైసలు పెరిగింది. డీజిల్ ధర శ్రీకాకుళంలో రూ.107.06గా ఉంది.
కొద్ది రోజులుగా ఇంధన ధరలు మన దేశంలో క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా నేడు కూడా కొన్ని నగరాల్లో వ్యత్యాసం చోటు చేసుకుంది. హైదరాబాద్లోనూ మరోసారి ధరలు ఎగబాకాయి. హైదరాబాద్లో నేడు పెట్రోల్ ధర లీటరుకు రూ.0.37 పైసలు పెరిగి రూ.111.55 అయింది. డీజిల్ ధర రూ.0.40 పైసలు పెరిగి రూ.104.70గా ఉంది. ఇక వరంగల్లో పెట్రోల్ ధర లీటరుకు రూ.0.50 పైసలు తగ్గి రూ.111.27 అయింది. డీజిల్ ధర రూ.0.57 పైసలు పెరిగి రూ.104.43 గా ఉంది. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.
కరీంనగర్లో పెట్రోల్ ధర ముందు రోజు ధరతో పోలిస్తే రూ.0.36 పైసలు పెరిగి.. రూ.111.71గా ఉంది. డీజిల్ ధర రూ.0.38 పైసలు పెరిగి రూ.104.85 కు చేరింది. నిజామాబాద్లోనూ ఇంధన ధరలు కాస్త పెరిగాయి. పెట్రోల్ ధర లీటరుకు రూ.0.30 పైసలు పెరిగి రూ.112.95 గా ఉంది. డీజిల్ ధర రూ.0.30 పైసలు పెరిగి రూ.106 గా ఉంది. కొన్ని రోజులుగా ఇక్కడ ఇంధన ధరల్లో ఎక్కువగా హెచ్చుతగ్గులు ఉంటున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో ఇలా...
ఇక విజయవాడ మార్కెట్లో పెట్రోల్ ధరలు తాజాగా కాస్త తగ్గింది. ప్రస్తుతం రూ.113.49 గా ఉంది. పెట్రోల్ ధర రూ.0.19 పైసలు తగ్గింది. డీజిల్ ధర రూ.0.81 పైసలు పెరిగి రూ.106.23కి చేరింది. అయితే, అమరావతి ప్రాంతంలో కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా పెరుగుతూనే ఉన్నాయి.
విశాఖపట్నం ఇంధన మార్కెట్లో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.111.96గా ఉంది. గత ధరతో పోలిస్తే లీటరుకు రూ.0.27 పైసలు తగ్గింది. డీజిల్ ధర విశాఖపట్నంలో రూ.105.65గా ఉంది. విశాఖలో కూడా కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో సరాసరిన రూ.0.60 పైసలకు పైబడి హెచ్చు తగ్గులు ఉంటున్నాయి.
తిరుపతిలో ఇంధన ధరలు పెరిగాయి. లీటరు పెట్రోలు ధర ప్రస్తుతం రూ.1.15 పైసలు పెరిగి.. రూ.114.55 కు చేరింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో పెరుగుదల కనిపిస్తుంది. ఇక డీజిల్ ధర రూ.106.97గా ఉంది. డీజిల్ ధర లీటరుకు రూ.1.10 పైసలు పెరిగింది. క్రమంగా పెరుగుతూ వస్తున్న ముడిచమురు ధరలే ఇంధన ధరలు ఎగబాకేందుకు కారణంగా తెలుస్తోంది.
ధరల పెరుగుదలకు కారణం ఏంటంటే..
గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. ఆ సమయంలో బ్యారెల్ ముడి చమురు ధర 32.33 డాలర్ల వద్దే ఉండేది. ఆ తర్వాత క్రమంగా ముడి చమురు ధర పెరుగుతూ, స్వల్పంగా తగ్గుతూ తాజాగా అక్టోబరు 20 నాటి ధరల ప్రకారం 82.96 డాలర్ల వద్ద ఉంది. వీటి ధరలు పెరుగుతున్నా కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలు మాత్రం ఆ పెంచిన పన్నులను తగ్గించలేదు. అందుకే ఇంధన ధరలు మన దేశంలో జీవితాల గరిష్ఠానికి చేరుతూ సామాన్యులను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.
Also Read: Gold-Silver Price: పసిడి మరింత పైపైకి, అదే దారిలో వెండి కూడా.. మీ నగరంలో ధరలివీ..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
and tablets