<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/" xmlns:dc="http://purl.org/dc/elements/1.1/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/" xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/" xmlns:media="http://search.yahoo.com/mrss/"><channel><title>nellore</title><atom:link href="https://telugu.abplive.com/nellore/feed" rel="self" type="application/rss+xml"/><link>https://telugu.abplive.com/</link><description/><lastBuildDate>Thu, 10 Sep 2026 05:44:09 +0530</lastBuildDate><language>en-US</language><sy:updatePeriod>hourly</sy:updatePeriod><sy:updateFrequency>1</sy:updateFrequency><generator>https://telugu.abplive.com</generator><item><title><![CDATA[AP Municipal Corporations: ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్ల వార్డుల పునర్విభజన షెడ్యూల్ విడుదల]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/ap-municipal-administration-releases-schedule-for-ward-delimitation-in-corporations-258072</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/ap-municipal-administration-releases-schedule-for-ward-delimitation-in-corporations-258072#respond</comments><pubDate>Fri, 4 Sep 2026 17:00:52 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ ఆంధ్రప్రదేశ్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/ap-municipal-administration-releases-schedule-for-ward-delimitation-in-corporations-258072</guid><description><![CDATA[&lt;p&gt;Ward Delimitation in Corporations | అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డుల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియకు పురపాలక శాఖ డైరెక్టర్ షెడ్యూల్&amp;zwnj; విడుదల చేశారు. దీనికి సంబంధించి తక్షణమే ప్రతిపాదనలు పంపాలని అన్ని ప్రధాన కార్పొరేషన్లకు ఆదేశాలు జారీ చేశారు. 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుని ఈ వార్డుల పునర్విభజనను చేపట్టనున్నారని సమాచారం. ఈ ప్రతిపాదనలపై రేపటి నుంచి 7 రోజుల పాటు (ఈ నెల 11వ తేదీ వరకు) ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు స్వీకరించనున్నట్లు పురపాలక శాఖ తెలిపింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఆ తర్వాత పురపాలక డైరెక్టర్ పరిశీలించి ఆమోదం తెలిపిన అనంతరం సెప్టెంబర్ 13న డీలిమిటేషన్ వార్డుల తుది ప్రకటన వెలువడనుంది. మరుసటి రోజు, అంటే ఈ నెల 14న ఆంధ్రప్రదేశ్ అధికారిక గెజిట్&amp;zwnj;లో వార్డుల పునర్విభజన ప్రకటనను ప్రచురిస్తారు. ఈ ఆదేశాలు జీవీఎంసీ (విశాఖపట్నం), విజయవాడ, మచిలీపట్నం, కర్నూలు, &amp;nbsp;గుంటూరు, నెల్లూరు, ఒంగోలు, తిరుపతి, కడప, ఏలూరు, అనంతపురం, చిత్తూరు వంటి రాష్ట్రంలోని ప్రముఖ కార్పొరేషన్లన్నింటికీ వర్తిస్తాయని అధికారులు వెల్లడించారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;a class=&quot;&quot; href=&quot;https://feeds.abplive.com/testfeeds/Hindi/PdfFiles/6ddc6765c6c2c0b1fa3ae6b3b256d4a2.pdf&quot; target=&quot;_blank&quot; rel=&quot;noopener&quot;&gt;మున్సిపల్&amp;zwnj; కార్పొరేషన్లలో వార్డుల పునర్విభజనకు షెడ్యూల్&amp;zwnj; &lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;strong&gt;39 పట్టణ స్థానిక సంస్థలలో (ULB) వార్డుల పునర్విభజన పూర్తయ్యే కాలపరిమితి..&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;పార్వతీపురం: 03.09.2026&amp;nbsp;&lt;br /&gt;సాలూరు: 03.09.2026&lt;br /&gt;నర్సీపట్నం: 03.09.2026&lt;br /&gt;విజయవాడ: 03.09.2026&lt;br /&gt;రామచంద్రపురం: 03.09.2026&lt;br /&gt;జగ్గయ్యపేట: 03.09.2026&lt;br /&gt;మాచర్ల: 03.09.2026&lt;br /&gt;వినుకొండ: 03.09.2026&lt;br /&gt;సత్తెనపల్లి: 03.09.2026&lt;br /&gt;మార్కాపురం: 03.09.2026&amp;nbsp;&lt;br /&gt;చీరాల: 03.09.2026&lt;br /&gt;చిత్తూరు: 03.09.2026&lt;br /&gt;అనంతపురం: 03.09.2026&lt;br /&gt;కర్నూలు: 03.09.2026&lt;br /&gt;ప్రొద్దుటూరు: 03.09.2026&lt;br /&gt;రాయచోటి: 03.09.2026&lt;br /&gt;రాయదుర్గం: 03.09.2026&lt;br /&gt;పుట్టపర్తి: 03.09.2026&lt;br /&gt;బద్వేల్: 03.09.2026&lt;br /&gt;నగరి: 03.09.2026&lt;br /&gt;పుత్తూరు: 03.09.2026&lt;br /&gt;కదిరి: 03.09.2026&lt;br /&gt;ఎర్రగుంట్ల: 03.09.2026&lt;br /&gt;జమ్మలమడుగు: 03.09.2026&lt;br /&gt;పలమనేరు: 03.09.2026&lt;br /&gt;తిరుపతి: 03.09.2026&lt;br /&gt;జీవీఎంసీ (జివిఎంసి): 08.09.2026&lt;br /&gt;ఏలూరు: 08.09.2026&lt;br /&gt;మచిలీపట్నం: 08.09.2026&lt;br /&gt;పెడన: 08.09.2026&lt;br /&gt;పిఠాపురం: 08.09.2026&lt;br /&gt;ఒంగోలు: 08.09.2026&lt;br /&gt;చిలకలూరిపేట: 15.09.2026&lt;br /&gt;నెల్లూరు: 15.09.2026&lt;br /&gt;గుంటూరు: 08.09.2026&lt;br /&gt;కడప: 08.09.2026&lt;br /&gt;ధర్మవరం: 08.09.2026&lt;br /&gt;తాడిపత్రి: 08.09.2026&lt;br /&gt;నంద్యాల: 08.09.2026&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/04/7e74e3c411fc391952f63df474faa8971788521079598233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Nellore News: సర్వేపల్లి కాలువకట్ట నిర్వాసితుల 60 ఏళ్ల నిరీక్షణకు తెర.. 1,215 కుటుంబాలకు శాశ్వత పట్టాలు  ]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/nellore/ap-cabinet-approves-house-site-pattas-for-1215-families-on-sarvepalli-canal-bank-in-nellore-258068</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/nellore/ap-cabinet-approves-house-site-pattas-for-1215-families-on-sarvepalli-canal-bank-in-nellore-258068#respond</comments><pubDate>Fri, 4 Sep 2026 16:21:02 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ నెల్లూరు ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/nellore/ap-cabinet-approves-house-site-pattas-for-1215-families-on-sarvepalli-canal-bank-in-nellore-258068</guid><description><![CDATA[&lt;p&gt;నెల్లూరు నగరంలోని సర్వేపల్లి కాలువకట్టపై నివసిస్తున్న పేద నిర్వాసితుల 6 దశాబ్దాల నాటి కన్నీళ్లకు చివరికి తెరపడింది. ఈ ప్రాంతంలో నివసిస్తున్న 1,215 పేద కుటుంబాలకు శాశ్వత ఇంటి పట్టాలు మంజూరు చేసేందుకు ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కేబినెట్ నిర్ణయంతో నిరుపేదల జీవితాల్లో కొత్త వెలుగులు వచ్చాయి. గతంలో ఎప్పుడు ఇళ్లు తొలగిస్తారోనన్న భయంతో, నిద్రలేని రాత్రులు గడిపిన బాధితులకు కూటమి ప్రభుత్వ నిర్ణయంతో శాశ్వత భరోసా లభించింది. దశాబ్దాలుగా అధికారుల చుట్టూ తిరిగినా పరిష్కారం కాని ఈ క్లిష్టమైన సమస్యకు ప్రభుత్వం పరిష్కారం చూపింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ గత నెల 8వ తేదీన కాలువకట్ట ప్రాంతంలో పర్యటించారు. నిర్వాసితుల కష్టాలను చూసి చలించిన ఆయన, నెల రోజుల్లో శాశ్వత పట్టాలు ఇప్పిస్తానని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. సంకల్పం గట్టిదైతే సాధించలేనిది ఏదీ లేదని నిరూపిస్తూ, మున్సిపల్, ఇరిగేషన్, రెవెన్యూ శాఖలకు చెందిన అధికారులను సమన్వయం చేసి ప్రక్రియను వేగవంతం చేశారు. గతంలో భగత్&amp;zwnj;సింగ్ కాలనీలోని 1,400 కుటుంబాలకు న్యాయం చేశారు. ఇప్పుడు కాలువకట్ట నిర్వాసితులకు పట్టాలకు మార్గం సుగమం చేసి పేదల కళ్లల్లో ఆనందం చూశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/04/1018c8517e4ac889fc402b9190d784881788518874872233_original.jpeg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపిందన్న వార్త తెలియగానే కాలువకట్ట పరిసర ప్రాంతాలైన చిల్డ్రన్స్ పార్క్ రోడ్డు, స్టోన్ హౌస్ పేట, బాలాజీనగర్, శెట్టిగుంట రోడ్&amp;zwnj;లలో సంబరాలు చేసుకున్నారు. &amp;nbsp;స్థానిక లబ్ధిదారులు సీఎం &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారాయణ ఫ్లెక్సీలకు పాలాభిషేకాలు చేసి, పూలవర్షం కురిపించారు. స్వీట్లు పంచి, రంగులు చల్లుకుంటూ బాణాసంచా కాల్చి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇన్నేళ్లకు తమ పిల్లల భవిష్యత్తుకు రక్షణ లభించిందని, మంత్రి నారాయణకు రుణపడి ఉంటామని నిర్వాసితులు భావోద్వేగానికి గురయ్యారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/04/566761214086d63a7c94ecb467dcf5a41788518922897233_original.jpeg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఈ విజయోత్సవ వేడుకల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నెల్లూరు నగర మేయర్ దేవరకొండ సుజాత, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్&amp;zwnj;పర్సన్ తాళ్ళపాక అనూరాధ, నెల్లూరు &lt;a title=&quot;టీడీపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/tdp&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;టీడీపీ&lt;/a&gt; అధ్యక్షుడు మామిడాల మధులతో పాటు పలువురు కార్పొరేటర్లు, &lt;a title=&quot;జనసేన&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Janasena&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;జనసేన&lt;/a&gt; నేతలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని మరోసారి రుజువైందని స్థానిక నాయకులు కొనియాడారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/04/ba13ae12644ef4e270f183ece18c0da21788518808691233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[ISRO మరో అరుదైన ఘనత, EOS 05 ప్రయోగం సక్సెస్.. రక్షణ, విపత్తు రంగాల్లో గేమ్ ఛేంజర్]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/tirupati/isro-achieves-historic-success-with-gslv-f17-accomplished-its-mission-with-eos-05-satellite-launch-258015</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/tirupati/isro-achieves-historic-success-with-gslv-f17-accomplished-its-mission-with-eos-05-satellite-launch-258015#respond</comments><pubDate>Fri, 4 Sep 2026 07:24:59 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ తిరుపతి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/tirupati/isro-achieves-historic-success-with-gslv-f17-accomplished-its-mission-with-eos-05-satellite-launch-258015</guid><description><![CDATA[&lt;p&gt;GSLV F17 accomplished its mission with EOS 05 Satellite Launch |&amp;nbsp;తిరుపతి: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) మరో విజయాన్ని అందుకుంది. రక్షణ, విపత్తు నిర్వహణ రరంగాల్లో అత్యంత కీలకమైన ఈఓఎస్&amp;zwnj;-05 (జీశాట్&amp;zwnj; 1ఏ) శాటిలైట్&amp;zwnj;ను విజయవంతంగా ప్రయోగించింది సత్తా చాటింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) రెండవ ప్రయోగ వేదిక నుంచి శుక్రవారం (సెప్టెంబర్ 4) తెల్లవారుజామున 2:55 గంటలకు జీఎస్&amp;zwnj;ఎల్&amp;zwnj;వీ-ఎఫ్&amp;zwnj;17 వాహకనౌక నింగిలోకి దూసుకెళ్ళింది. సరిగ్గా 18 నిమిషాల వ్యవధిలో అంటే 3 గంటల 13 నిమిషాలకు 2,367 కేజీల బరువున్న జీశాట్&amp;zwnj; 1ఏ ఉపగ్రహాన్ని రాకెట్ అత్యంత కచ్చితత్వంతో సబ్&amp;zwnj;-జియో సింక్రోనస్ ట్రాన్స్&amp;zwnj;ఫర్ ఆర్బిట్&amp;zwnj;లోకి ప్రవేశపెట్టింది. 51.7 మీటర్ల ఎత్తు, 420.5 టన్నుల బరువు కలిగిన ఈ రాకెట్&amp;zwnj;తో చేపట్టిన ఇస్రో శాస్త్రవేత్తలు జీఎస్&amp;zwnj;ఎల్&amp;zwnj;వీ సిరీస్&amp;zwnj;లో చేసిన 19వ ప్రయోగం ఇది అని తెలిపారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/04/d70cf1c8639b814d26c0e0ce2cffec181788487623928233_original.jpg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;ఒకే ఫ్రేమ్&amp;zwnj;లో దక్షిణాసియా మొత్తం.. అంతరిక్షంలో అద్భుతం&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఈఓఎస్&amp;zwnj;-05 ఉపగ్రహం భూస్థిర కక్ష్యలో ఉంటూనే మొత్తం దక్షిణాసియాను ఒకే ఫ్రేమ్&amp;zwnj;లో, ప్రతి 10 నిమిషాలకు ఒకసారి భారత ఉపఖండాన్ని మొత్తం ఫొటో తీయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. సాధారణంగా సన్ సింక్రోనస్ ఆర్బిట్, లో ఎర్త్ ఆర్బిట్&amp;zwnj;లో ఉండే ఉపగ్రహాలు ఒక ఏరియాను ఫొటో తీసేందుకు రోజుల నుంచి వారాలపాటు టైమ్ తీసుకుంటాయి. లేటెస్ట్ శాటిలైట్ మాత్రం నిమిషాల వ్యవధిలో అద్భుతమైన ఫొటోలు తీయగలదు. ఇందులో అమర్చిన ఎంఎక్స్&amp;zwnj;-వీఎన్&amp;zwnj;ఆర్&amp;zwnj; పేలోడ్ ఒక పిక్సెల్&amp;zwnj;కు 42 మీటర్ల స్పేషియల్ రిజల్యూషన్&amp;zwnj;ను అందిస్తుంది. భూస్థిర కక్ష్యలో ఇంతటి అత్యుత్తమ రిజల్యూషన్ కలిగిన కెమెరాను కలిగిన ప్రపంచంలోనే తొలి ఉపగ్రహంగా ఈఓఎస్ 05 శాటిలైట్ నిలిచింది. ప్రస్తుతం ఉన్న ఇస్రో సామర్థ్యం కంటే దీని పిక్సెల్ డెన్సిటీ 567 రెట్లు మెరుగ్గా ఉంటుంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;blockquote class=&quot;twitter-tweet&quot;&gt;
&lt;p dir=&quot;ltr&quot; lang=&quot;en&quot;&gt;Mission Success! &lt;br /&gt;&lt;br /&gt;GSLV-F17 has successfully accomplished its mission, placing EOS-05 into the intended orbit. &lt;br /&gt;&lt;br /&gt;Sharing a few memorable moments from the lift-off. &lt;br /&gt;&lt;br /&gt;For more information:&lt;a href=&quot;https://t.co/VneB2jgZoY&quot;&gt;https://t.co/VneB2jgZoY&lt;/a&gt;&lt;a href=&quot;https://x.com/hashtag/GSLVF17?src=hash&amp;amp;ref_src=twsrc%5Etfw&quot;&gt;#GSLVF17&lt;/a&gt; &lt;a href=&quot;https://x.com/hashtag/EOS05?src=hash&amp;amp;ref_src=twsrc%5Etfw&quot;&gt;#EOS05&lt;/a&gt; &lt;a href=&quot;https://x.com/hashtag/ISRO?src=hash&amp;amp;ref_src=twsrc%5Etfw&quot;&gt;#ISRO&lt;/a&gt; &lt;a href=&quot;https://t.co/kv0zB6V5Vi&quot;&gt;pic.twitter.com/kv0zB6V5Vi&lt;/a&gt;&lt;/p&gt;
&amp;mdash; ISRO (@isro) &lt;a href=&quot;https://x.com/isro/status/2095649303251607909?ref_src=twsrc%5Etfw&quot;&gt;September 3, 2026&lt;/a&gt;&lt;/blockquote&gt;
&lt;p&gt;
&lt;script src=&quot;https://platform.x.com/widgets.js&quot; async=&quot;&quot; charset=&quot;utf-8&quot;&gt;&lt;/script&gt;
&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;రక్షణ, విపత్తు రంగాలకు కీలకమైన ప్రయోగం&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఇస్రో చేసిన ఈ తాజా ప్రయోగం దేశ భద్రత, &amp;nbsp;విపత్తుల నిర్వహణలో గేమ్&amp;zwnj; ఛేంజర్&amp;zwnj;గా మారనుందని చెప్పవచ్చు. సరిహద్దుల్లో శత్రు దేశాల సైనిక స్థావరాలను అత్యంత సులువుగా పసిగట్టడంతో పాటు, వరదలు, తుపాన్లు, కార్చిచ్చుల వంటి విపత్తుల తీవ్రతను రియల్- టైమ్&amp;zwnj;లో అంచనా వేయడానికి శాటిలైట్ తోడ్పడుతుంది. అలాగే పంటల ఆరోగ్యం, అటవీ ప్రాంతాలు, నీటి వనరులలో కాలుష్యం, ఖనిజ సంపద వివరాలను దీనిలోని హైపర్, మల్టీ స్పెక్ట్రల్ కెమెరాలు గుర్తించి వివరాలు అందిస్తాయని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు.&lt;/p&gt;
&lt;p&gt;2021 ఆగస్టులో చేసినా ప్రయోగం సక్సెస్ కాలేదు. కానీ ఇస్రో శాస్త్రవేత్తలు పట్టు విడవకుండా ప్రయత్నించి విజయం సాధించి దేశం గర్వించేలా చేశారు. గతంలో జీఎస్&amp;zwnj;ఎల్&amp;zwnj;వీ-ఎఫ్&amp;zwnj;10 వైఫల్యం వల్ల జీశాట్&amp;zwnj;-1 శాటిలైట్ కక్ష్యను చేరుకోలేకపోయింది. ఇస్రో మరింత మెరుగైన టెక్నాలజీతో ఈఓఎస్&amp;zwnj;-05ను ప్రయోగించి విజయాన్ని అందుకుని సత్తా చాటింది. కాగా, ఈ ప్రయోగం చేస్తున్న సమయానికి కుండపోత వర్షం కురుస్తోంది. అయినప్పటికీ లాంచ్ వ్యూ గ్యాలరీకి 1,500 మంది వరకు వచ్చిన సందర్శకులు వానలో తడుస్తూనే ఈ అద్భుత ఘట్టాన్ని తిలకించి ఇస్రో శాస్త్రవేత్తలను ఉత్సాహపరిచారు. దేశాన్ని గర్వించేలా చేసిన ప్రయోగాన్ని వీక్షిస్తూ చప్పట్లతో ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/04/af24b99be8d3506f8fc0f7d3889077541788485839746233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Kotamreddy On Vijayasai Reddy Sajjala Issue: చొక్కా పట్టుకుని కొట్టారు.. విజయసాయిరెడ్డి-సజ్జల వివాదంపై కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/ap-politics-kotamreddy-reacts-to-vijayasai-reddy-vs-sajjala-row-claims-physical-altercation-257786</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/ap-politics-kotamreddy-reacts-to-vijayasai-reddy-vs-sajjala-row-claims-physical-altercation-257786#respond</comments><pubDate>Tue, 1 Sep 2026 14:52:36 +0530 </pubDate><dc:creator><![CDATA[ Satyaprasad Bandaru ]]></dc:creator><category><![CDATA[ ఆంధ్రప్రదేశ్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/ap-politics-kotamreddy-reacts-to-vijayasai-reddy-vs-sajjala-row-claims-physical-altercation-257786</guid><description><![CDATA[&lt;p&gt;Kotamreddy On Vijayasai Reddy Sajjala Issue: మంగళగిరిలో 2022లో జరిగిన వైసీపీ ప్లీనరీలో &amp;nbsp;సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి తనపై నేరుగా భౌతికంగా దాడి చేశారని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఈ విషయం వైసీపీ అధినేత వైఎస్ జగన్&amp;zwnj;కు తెలిసినా ప్రేక్షకపాత్ర వహించారని విజయసాయి రెడ్డి ఓ లేఖ విడుదల చేశారు. &amp;nbsp;వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు &amp;nbsp;స&amp;zwnj;జ్జల రామ&amp;zwnj;కృష్ణారెడ్డి, విజ&amp;zwnj;య&amp;zwnj;సాయిరెడ్డి మ&amp;zwnj;ధ్య ఆధిప&amp;zwnj;త్య పోరు తీవ్రస్థాయిలో నడిచింది. ఈ నేప&amp;zwnj;థ్యంలో 2022 వైసీపీ ప్లీన&amp;zwnj;రీ స&amp;zwnj;భా వేదిక&amp;zwnj;పై ఎవ&amp;zwnj;రెవ&amp;zwnj;రు కూర్చోవాల&amp;zwnj;నే ప్రొటోకాల్ వ్యవ&amp;zwnj;హారంలో వీరి మధ్య విభేదాలు త&amp;zwnj;లెత్తాయని తెలుస్తోంది. ఈ సంద&amp;zwnj;ర్భంగా విజ&amp;zwnj;య&amp;zwnj;సాయిరెడ్డి, స&amp;zwnj;జ్జల రామ&amp;zwnj;కృష్ణారెడ్డి మ&amp;zwnj;ధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోగా.. విజ&amp;zwnj;య&amp;zwnj;సాయిరెడ్డిపైకి స&amp;zwnj;జ్జల దూసుకెళ్లి దాడి చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. తాజాగా విజయసాయిరెడ్డి రాసిన లేఖతో ఈ విషయం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ విషయంపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మంగళవారం స్పందించారు.&lt;br /&gt;&lt;br /&gt;Also Read:&amp;nbsp; &lt;a title=&quot;కాకినాడలో లవ్ జిహాద్ కలకలం! ఆరుగురితో సహజీవనం చేసి మత మార్పిడి.. భర్తపై వివాహిత ఆరోపణలు&quot; href=&quot;https://telugu.abplive.com/crime/forced-religious-conversion-and-harassment-case-alleged-against-kakinada-man-atn-257750&quot; target=&quot;_self&quot;&gt;కాకినాడలో లవ్ జిహాద్ కలకలం! ఆరుగురితో సహజీవనం చేసి మత మార్పిడి.. భర్తపై వివాహిత ఆరోపణలు&lt;/a&gt;&lt;/p&gt;
&lt;h3&gt;చొక్కా పట్టుకుని కొట్టారు - కోటంరెడ్డి&amp;nbsp;&lt;/h3&gt;
&lt;p&gt;విజయసాయిరెడ్డి నెల్లూరు ఎంపీగా పోటీ చేసినప్పుడు తనపై ఎంత నీచంగా, ఘోరంగా మాట్లాడారో అందరికీ తెలుసని కోటంరెడ్డి అన్నారు. తన సొంత ఊరిలో కూడా సభపెట్టారన్నారు. తనకు విజయసాయిరెడ్డి, సజ్జలపై ఏం ద్వేషం లేదన్నారు. కానీ వాస్తవం అందరికీ తెలియాలన్నారు. విజయసాయిని సజ్జల కొట్టింది నిజమేనని చెప్పారు. &amp;nbsp;మంగళగిరిలో ప్లీనరీ జరిగేటప్పుడు వేదికపై ఎవరితో మాట్లాడించాలనే దానిపై విజయసాయి, సజ్జల మధ్య వివాదం తలెత్తిదన్నారు. మాటామాటా పెరగడంతో.. సజ్జల.. విజయసాయిరెడ్డి చొక్కా పట్టున్నారన్నారు. విజయసాయిరెడ్డి 72 అవమానాలు జరిగాయని చెప్పారని, తనకు ఒక్కడికే తెలిసిన మరో ఘోర అవమానం ఉందన్నారు. తన సొంతూరైన తాళ్లపూడికి వచ్చినప్పుడు కాకుపల్లి సెంటర్&amp;zwnj;లో విజయసాయికి వంద వెహికల్స్&amp;zwnj;తో ఘన స్వాగతం పలికారన్నారు. దానిపై విజయసాయిని సజ్జల నీచాతినీచంగా దూషించారన్నారు. ఆ మాటలు తన నోటితో చెప్పలేనని కోటంరెడ్డి తెలిపారు.&amp;nbsp;&lt;br /&gt;&lt;br /&gt;Also Read: &lt;a title=&quot; క్యాడర్ అంచనాలు ఆకాశంలో - స్థానిక ఎన్నికల్లో జనసేనకు లిట్మస్ టెస్ట్ !&quot; href=&quot;https://telugu.abplive.com/politics/janasena-tdp-local-body-elections-seat-sharing-cadre-dissatisfaction-257735&quot; target=&quot;_self&quot;&gt; క్యాడర్ అంచనాలు ఆకాశంలో - స్థానిక ఎన్నికల్లో జనసేనకు లిట్మస్ టెస్ట్ !&lt;/a&gt;&lt;/p&gt;
&lt;h3&gt;వైసీపీ క్రెడిట్ చోరీ&lt;/h3&gt;
&lt;p&gt;&amp;nbsp;కూటమి ప్రభుత్వ ఘనవిజయం ఒకచరిత్ర, వైసీపీ ఘోర పరాజయం కూడా చారిత్రక ఘట్టమని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్&amp;zwnj; రెడ్డి అన్నారు. కుల, మతాల మధ్య చిచ్చు పెడుతూ వైసీపీ వికృత రాజకీయం చేస్తుందని మండిపడ్డారు. హిందు మతానికి ఘోర అపచారం జరిగిందని ఎలా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. ఆలయాల్లో రథాలు తగలబడినప్పుడు, విగ్రహాల తలలు తెగ్గొట్టినప్పుడు, సింహాలు చోరీకి గురైనప్పుడు వైసీపీ నేతల నోళ్లు మూసుకుపోయాయా అని ప్రశ్నించారు. ఏపీకి పరిశ్రమలు, పెట్టుబడులు రాకూడదని వైసీపీ ఫేక్ వీడియోలతో ప్రచారాలు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. వైసీపీ క్రెడిట్&amp;zwnj; చోరీ చూస్తుంటే నాగార్జునసాగర్, సోమశిల, తెలుగు గంగ ప్రాజెక్టులు కట్టింది కూడా &lt;a title=&quot;జగన్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/cm-jagan&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;జగన్&lt;/a&gt; అని చెప్పేట్లు ఉన్నారని కోటంరెడ్డి ఎద్దేవా చేశారు.&lt;/p&gt;
&lt;p&gt;Also Read: &lt;a title=&quot;ఇంటి వద్దకే ఆర్టీసీ బస్సు.. వినూత్న ప్రయోగానికి ఆర్టీసీ నిర్ణయం&quot; href=&quot;https://telugu.abplive.com/andhra-pradesh/vijayawada/apsrtc-doorstep-bus-service-rtc-to-pick-up-passengers-directly-from-home-257774&quot; target=&quot;_self&quot;&gt;ఇంటి వద్దకే ఆర్టీసీ బస్సు.. వినూత్న ప్రయోగానికి ఆర్టీసీ నిర్ణయం&lt;/a&gt;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/01/755226f2f19acc6395f5cc6209f9e58717882533245371409_original.png" width="220"/></item><item><title><![CDATA[Veligonda Project: వెలిగొండ రెండో ఫేజ్‌ 2028 నాటికి పూర్తి! తొలి దశ ప్రారంభోత్సవ వేదికపై నుంచే చంద్రబాబు ప్రకటన! ]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/nellore/chandrababu-pooola-subbaiah-veligonda-irrigation-project-prakasam-district-257713</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/nellore/chandrababu-pooola-subbaiah-veligonda-irrigation-project-prakasam-district-257713#respond</comments><pubDate>Mon, 31 Aug 2026 14:53:05 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ నెల్లూరు ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/nellore/chandrababu-pooola-subbaiah-veligonda-irrigation-project-prakasam-district-257713</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Veligonda Project:&amp;nbsp;&lt;/strong&gt;దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ, ఫ్లోరెడ్&amp;zwnj;, కరవుతో అలమటించిన ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంత రాతను మార్చే చారిత్రక ఘటం ఆవిష్కృతమైంది. పూల సుబ్బయ్య వెలిగొండ సాగునీటి ప్రాజెక్టు తొలిదశను ఆంధ్రప్రదేశ్&amp;zwnj; ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారికంగా ప్రారంభించి, జాతికి అంకితం చేశారు. నల్లమల కొండలను తొలిచి కృష్ణా జలాలను తరలించే ఈ భగీరథ ప్రయత్నం ఎట్టకేలకు సాకారమైన నల్లమల సాగర్&amp;zwnj;లో జలసిరిగా రూపాంతరం చెందింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;సోమవారం ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలోని వెలిగొండ ప్రాజెక్టు వద్ద ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ..&quot; తానే 30 ఏళ్ల క్రితం పునాది వేసిన ప్రాజెక్టును, మళ్లీ తానే స్వయంగా పూర్తి చేసి జాతికి అంకితం చేయడం తన జీవితంలో అత్యంత అరుదైన, చారిత్రక అదృష్టమని సగర్వంగా ప్రకటించారు. కరవు నేలపై కృష్ణమ్మ సరికొత్త చరిత్ర లఖించిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రాజెక్టు చరిత్ర చెబుతూ 1996లో తాను శంకుస్థాపన చేశానని వివరించారు. మూడు దశాబ్దాలపాటు ఎన్నో సవాళ్లు, ఆటంకాలు ఎదురైనప్పటికీ, చివరకు తొలి దశను పూర్తి చేసి ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని స్పష్టం చేశారు.&amp;nbsp;&lt;br /&gt;&quot;నాడు నేను చేసిన సంకల్పం నేడు నల్లమల సాగర్&amp;zwnj;లో కృష్ణమ్మ జలసిరిగా సాక్షాత్కరించింది. కొండలు అడ్డొచ్చినా సరే, వాటిని తొలిచి ముందుకు సాగాం. ఎన్నో సమస్యలు, సవాళ్లు వాటన్నింటినీ అధిగమించి ఈ కరవు నేలకు కృష్ణా జలాలను తీసుకొచ్చాం. ఇది మా ప్రభుత్వ కమిట్&amp;zwnj;మెంట్&amp;zwnj;&quot; అని చంద్రబాబు పేర్కొన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;శ్రీశైలం మల్లన్న సన్నిధి నుంచి బయల్దేరిన కృష్ణా జలాలు, మార్కాపురం చెన్నకేశవ స్వామి కొలువైన ఈ నేలకు హారతి ఇచ్చేలా నీటిని తీసుకురావడం వెనుక ఎంతో మంది కృషి ఉందని కొనియాడారు. ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతల్లో బ్రహ్మాండమైన టీమ్&amp;zwnj; లీడర్&amp;zwnj;గా వ్యవహరించిన మంత్రి నిమ్మల రామానాయుడుని ప్రజల సమక్షంలోనే అభినందించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములను, ఇళ్లను త్యాగం చేసిన ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృతజ్ఞత తెలిపారు. ప్రాజెక్టు పరిధిలోని 11 గ్రామాల ప్రజల త్యాగం వల్లే లక్షలాది మంది జీవితాల్లో వెలుగులు వచ్చాయని కొనియాడారు. వారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు.&lt;/p&gt;
&lt;p&gt;నిర్వాసితుల సంక్షేమం, పునరావాసానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చంద్రబాబు వివరించారు. ఈ ప్రాజెక్టు పునరావాసం కోసం ఇప్పటివరకు భారీగా నిధులను ఖర్చు చేసినట్లు వెల్లడించారు. ప్రాజెక్టు నిర్వాసితుల కోసం మొత్తం రూ. 1,071 కోట్లు కేటాయించి పంపిణీ చేసినట్లు తెలిపారు. ఇటీవల నిర్వాసితులకు రూ. 165 కోట్లు చెల్లించామని స్పష్టం చేశారు. నిర్వాసిత కుటుంబాలకు అదనంగా రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తున్నట్లు సీఎం ప్రకటించారు.&lt;/p&gt;
&lt;p&gt;వెలిగొండ ప్రాజెక్టు బంగారు కొండగా మారబోతోందని ముఖ్యమంత్రి అభివర్ణించారు. కరవు, ఫ్లోరైడ్ మహమ్మారితో దశాబ్దాలుగా నలిగిపోయిన మార్కాపురం, పరిసర ప్రాంత ప్రజల దాహార్తిని, సాగునీటి అవసరాలను తీర్చడానికి ఈ ప్రాజెక్టు అత్యంత కీలకం కానుంది. వెలిగొండ ప్రాజెక్టులో గరిష్టంగా 53 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే సదుపాయం ఉందని సీఎం వెల్లడించారు. దటి దశ పనులను మొత్తం రూ.7,983 కోట్ల వ్యయంతో విజయవంతంగా పూర్తి చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. నీటి నిల్వ ద్వారా భూగర్భ జలాలు పెరగడమే కాకుండా, తాగునీరు, &amp;nbsp;సాగునీటి కొరత శాశ్వతంగా తీరుతుందని భావిస్తున్నారు.&lt;/p&gt;
&lt;p&gt;దేశంలోని, రాష్ట్రంలోని ప్రధాన నదులైన గోదావరి, కృష్ణా, తుంగభద్ర, పెన్నా, కావేరి నదులను పరస్పరం అనుసంధానించాలని చంద్రబాబు ప్రతిపాదించారు . ఈ నదుల అనుసంధానం ద్వారా నాలుగు దక్షిణాది రాష్ట్రాల్లోని కోట్ల ఎకరాల పంట పొలాలు సుసంపన్నం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టును రాబోయే పుష్కరాలకు ముందే పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఆ తర్వాతే మార్కాపురంలో కృష్ణా పుష్కరాలను అత్యంత వైభవంగా జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;వెలిగొండ ప్రాజెక్టు పనులను వాస్తవంగా పూర్తి చేయకుండానే, కేవలం సినిమా సెట్టింగులు, తప్పుడు ప్రచారాలతో ప్రజలను మోసం చేయడానికి వైసీపీ నేతలు ప్రయత్నించారని చంద్రబాబు మండిపడ్డారు. ఈ విలువైన ఐదేళ్ల కాలాన్ని వారు పూర్తిగా నిర్లక్ష్యం చేసి గాలికొదిలేశారని, వారి ఫేక్ ప్రచారాలను చూస్తే ఆవేదన కలుగుతోందని అన్నారు. 2024 ఎన్నికల తర్వాత రాష్ట్రానికి పట్టిన గ్రహణం వీడిందని, అభివృద్ధి పథంలో మళ్లీ ముందడుగు పడిందని చంద్రబాబు స్పష్టం చేశారు.&lt;/p&gt;
&lt;p&gt;గత ప్రభుత్వ వైఫల్యాలను సరిదిద్దుతూ, రాబోయే కాలంలో వెలిగొండ ప్రాజెక్టును పూర్తిగా అందుబాటులోకి తెస్తామని సీఎం ప్రకటించారు. ఇందులో భాగంగా 2028 నాటికి వెలిగొండ ఫేజ్-2 పనులను కూడా పూర్తిగా పూర్తి చేస్తామని సీఎం &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; నాయుడు హామీ ఇచ్చారు. కరవును తరిమికొట్టి, వెలిగొండను నిజమైన బంగారు కొండగా మార్చే వరకు కూటమి ప్రభుత్వం విశ్రమించదని స్పష్టం చేస్తూ ముఖ్యమంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/31/59228222ad4be8ddff43cb916eb2c7b31788168121389215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Veligonda Project: 'వెలిగొండకి YSR వెలుగైతే, చంద్రబాబు చీకటి' షర్మిలా రెడ్డి తీవ్ర విమర్శలు ]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/nellore/andhra-pradesh-congress-sharmila-veligonda-project-first-phase-rajasekhar-reddy-257704</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/nellore/andhra-pradesh-congress-sharmila-veligonda-project-first-phase-rajasekhar-reddy-257704#respond</comments><pubDate>Mon, 31 Aug 2026 14:21:45 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ నెల్లూరు ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/nellore/andhra-pradesh-congress-sharmila-veligonda-project-first-phase-rajasekhar-reddy-257704</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Veligonda Project:&amp;nbsp;&lt;/strong&gt;మూడు దశాబ్దాలకు వెలిగొండ మొదటి దశ పూర్తి కావడం శుభసూచకమేనని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్&amp;zwnj; షర్మిల ప్రకటించారు. ⁠తీవ్ర కరువురక్కసి కోరల్లో చిక్కుకున్న ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు ⁠ఇకనైనా సాగు, తాగు నీరు మరింత మెరుగ్గా అందుతాయని ఆశిద్దామని అన్నారు. అయితే ఈ సమయంలో స్మరించుకోవాల్సిన వైఎస్ గురించి పట్టించుకోకపోవడంపై ఆమె మండిపడ్డారు. వెలిగొండకు వెలుగు వైఎస్ అయితే, చీకటి చంద్రబాబు అని ఎద్దేవా చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;వెలిగొండ ప్రాజెక్టు విషయంలో ⁠స్మరించుకోవలసింది మహానేత డాక్టర్ వైఎస్సార్ ఆశయం, కృషిని అని అన్నారు. ⁠వెలిగొండకు వెలుగు ఆయనేనని స్పష్టం చేశారు. మూడు దశాబ్దాల వెలిగొండ ప్రజాస్వప్నంపై మహానేతది చెరగని సంతకం చేశారని చెప్పారు. ⁠కాగితాల నుంచి క్షేత్రస్థాయికి, కాలువల నుంచి సొరంగాల వరకు సింహభాగం పనులు పూర్తి YSR పాలనలోనే అయ్యిందని గుర్తు చేశారు. నాలుగున్నర లక్షల ఎకరాలకు సాగునీరు, 23 లక్షల మంది ప్రజలకు తాగునీరు నేడు అందుతుందంటే, అపర భగీరథుడు రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞ ఫలితమేనని అభిప్రాయపడ్డారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;వెలిగొండపై చంద్రబాబువి కొండంత అబద్ధాలని ఆగ్రహం వ్యక్తం చేశారు షర్మిల. ⁠కట్టిన కష్టం YSRది అయితే, రాజకీయ ప్రచారం చంద్రబాబుదని ఎద్దేవా చేశారు. ⁠ప్రాజెక్ట్ తానే విజన్ అని చెప్పుకోవడం ఈ శతాబ్దపు అతిపెద్ద జోక్&amp;zwnj;గా అభివర్ణించారు. ⁠సంకల్పం పేరుతో ఆనాడు 1996 మార్చి 5న బాబు వేసింది కేవలం ఓ రాయి మాత్రమేనన, ⁠అనుమతులు లేకుండా, నిధులు ఇవ్వకుండా, ⁠అడ్వైజరీ కమిటీల పేరుతో DPRల ముసుగులో ⁠9 ఏళ్ల కాలయాపన తప్పా కమిట్మెంట్ లేదని విమర్శించారు. ⁠శిలాఫలకం తప్పా తట్టెడు మట్టి ఎత్తింది లేదన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;రాయి నుంచి కరవు సీమకు జలవసంతం వెనుక వైఎస్&amp;zwnj;ఆద్&amp;zwnj;దే భగీరథ ప్రయత్నమని షర్మిల చెప్పుకొచ్చారు. &quot;⁠2004లో అధికారంలో వచ్చిన వెంటనే మొదలు పెట్టిన బ్రహోత్తర సంకల్పం. ⁠చిన్న ప్రాజెక్టుగా ఉన్న వెలిగొండను భారీ ప్రాజెక్టుగా , ⁠రీ డిజైన్ చేసిన మహనీయుడు రాజశేఖర్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పక్షాన ముఖ్యమంత్రి చంద్రబాబుకి సూటిగా సవాల్ విసురుతున్నాం. వెలిగొండ ప్రాజెక్టుకు 82 శాతం పూర్తి చేసింది YSR. ⁠ట్విన్ టన్నెల్స్, నల్లమల సాగర్, మూడు ప్రధాన డ్యాములతో భారీ ప్రాజెక్టుగా తీర్చిదిద్దింది YSR. ⁠22 కిలోమీటర్&amp;zwnj; మేర సొరంగాల నిర్మాణం పూర్తి అయ్యింది నాడు YSR పాలనలోనే , YSR హయాంలో జలయజ్ఞం కింద వెలిగొండకి 4వేల కోట్ల రూపాయల ఖర్చు చేసి సింహభాగం పనులు పూర్తి, &amp;nbsp;⁠గొట్టిపాడు, సుంకేసుల డ్యాముల నిర్మాణం కోసం భూసేకరణ పూర్తి చేసి పరిహారం అందించి, పనులు పూర్తి చేసింది YSR.&quot; అని తెలిపారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;తానే శంకుస్థాపన చేసి, తానే పూర్తి చేశానని గొప్పలు చెప్పుకొనే ముందు ⁠చంద్రబాబు ఆత్మ పరిశీలన చేసుకోవాలని షర్మిల సూచించారు. ⁠వెలిగొండ ప్రాజెక్ట్ కష్టం, చెమట దివంగత ముఖ్యమంత్రి YSRది అయితే, ⁠10 శాతం పనులు చేసి క్రెడిట్ తమదే అంటూ చెప్పుకోవడానికి సిగ్గుపడాలని దెప్పిపొడిచారు. &amp;ldquo;వెలిగొండకు నిజంగా YSR వెలుగైతే, చంద్రబాబు చీకటి. &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; నిజాయితీపరులే అయితే, ⁠మీ ఛాతిలో ఉన్నది నిజంగా గుండేనే అయితే, ⁠శంకుస్థాపన చేసిన సంకల్పం మీదే అవ్వచ్చు, ⁠కానీ సాకారం చేసింది మాత్రం &lt;a title=&quot;కాంగ్రెస్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Congress&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కాంగ్రెస్&lt;/a&gt; ముఖ్యమంత్రి YSR అని గుర్తు చేసుకోవాలి.&quot; అని అన్నారు. రెండో దశ పనులు, నిజాయితీ, నిబద్ధతతో పూర్తిస్థాయి పునరావాసంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని అని షర్మిల విజ్ఞప్తి చేస్తున్నాం.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/31/026e406848e22adccb8e9271268682ff1788166248744215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవ వేదికపై పూల సుబ్బయ్య కుటుంబానికి పెద్ద పీట! కుమార్తెలను సన్మానించిన చంద్రబాబు]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/nellore/poola-subbaiah-family-veligonda-project-chandrababu-markapuram-district-vilasini-sunanda-257701</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/nellore/poola-subbaiah-family-veligonda-project-chandrababu-markapuram-district-vilasini-sunanda-257701#respond</comments><pubDate>Mon, 31 Aug 2026 13:55:10 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ నెల్లూరు ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/nellore/poola-subbaiah-family-veligonda-project-chandrababu-markapuram-district-vilasini-sunanda-257701</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Veligonda Project:&amp;nbsp;&lt;/strong&gt;పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు తొలి దశ ప్రారంభోత్సవం చాలా ఎమోషనల్&amp;zwnj;గా సాగింది. 30 ఏళ్ల నుంచి కలగా మిగిలిపోయిన ప్రాజెక్టులో నేడు నీరు పారుతోంది. దీన్ని ఆ ప్రాంత ప్రజలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే ఈ ప్రాజెక్టు పూర్తి అవ్వడానికి కారణమైన నిర్వాసితులను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. వారికి సభా వేదికపై ప్రత్యేక స్థానం కల్పించారు. వారి త్యాగాలను రాష్ట్రం ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటుందని అన్నారు. అదే టైంలో ఈ ప్రాజెక్టు రూపకల్పనలో భాగస్వామి అయిన పూల సుబ్బయ్యను స్మరించుకున్నారు. ఆయన కుటుంబాన్ని వేదికపై ఘనంగా సన్మానించారు. &amp;nbsp;&lt;br /&gt;&amp;nbsp;&lt;br /&gt;పూల సుబ్బయ్య కుమార్తెలు విలాసిని, సునందను సభా వేదికపై ముఖ్యమంత్రి చంద్రబాబు సన్మానించారు. &amp;nbsp;వెలిగొండ ప్రాజెక్టు కోసం ఉద్యమించిన పూల సుబ్బయ్య సేవలను ఈ సందర్భంగా చంద్రబాబు స్మరించుకున్నారు. సన్మానం తర్వాత మాట్లాడిన పూల సుబ్బయ్య కుమార్తె విలాసిని తన తండ్రి పూల సుబ్బయ్యను, సీఎం చంద్రబాబును మార్కాపురం జిల్లా ప్రజలు మరిచిపోలేరన్నారు. సీఎం చంద్రబాబు కాళ్లకు నమస్కరించిన పూల సుబ్బయ్య కుమార్తెలు ఆశీర్వాదం చేసుకున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తారని... చూస్తామని తాము ఎప్పుడూ అనుకోలేదన్నారు పూల సుబ్బయ్య కుమార్తె. తమ కుటుంబం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. మార్కాపురం జిల్లా తరహాలోనే ప్రతి జిల్లానూ సీఎం &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు పూల సుబ్బయ్య రెండో కుమార్తె విలాసిని.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/31/4b7d16ed3dcf315ba5075f1ed1f6ce381788164655653215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Pawan Kalyan On Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలి దశ ప్రారంభోత్సవంపై ఎక్స్‌లో స్పందించిన పవన్ కల్యాణ్‌!]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/nellore/veligonda-project-inauguration-pawan-kalyan-chandrababu-irrigation-drinking-257694</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/nellore/veligonda-project-inauguration-pawan-kalyan-chandrababu-irrigation-drinking-257694#respond</comments><pubDate>Mon, 31 Aug 2026 13:08:13 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ నెల్లూరు ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/nellore/veligonda-project-inauguration-pawan-kalyan-chandrababu-irrigation-drinking-257694</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Pawan Kalyan On Veligonda Project:&amp;nbsp;&lt;/strong&gt;వెలిగొండ ప్రాజెక్టు తొలి దశ ప్రారంభమైన సందర్భంగా ఆంధ్రప్రదేశ్&amp;zwnj; డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్&amp;zwnj; ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పానికి, కూటమి పనితీరుకు నిదర్శనమని అభిప్రాయపడ్డారు. ఎక్స్&amp;zwnj;వేదికగా ఆయన తన శుభాకాంక్షలను తెలియజేశారు. &quot;&lt;/p&gt;
&lt;p&gt;వెలిగొండ ప్రాజెక్టు తొలి దశ ప్రారంభం చారిత్రక ఘట్టమని పవన్ తెలిపారు. నాలుగు జిల్లాల ప్రజల దశాబ్దాల కల నేటితో నెరవేరిందన్నారు. 119 వేల ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి తాగునీరు అందుతుందని తెలిపారు. నల్లమల కొండలను ఛేదించి కరవు ప్రాంతాలకు నీరు చేరుతుందని పేర్కొన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;వెలిగొండ ప్రాజెక్టులో భాగమైన ప్రతి ఒక్కరికీ పవన్ కల్యాణ్ అభినందించారు. &quot;వెలిగొండ ప్రాజెక్టు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు. ఇంజినీర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతు సంఘాలకు ప్రత్యేక అభినందనలు. వెలిగొండ కోసం 7,300 మందికిపైగా నిర్వాసితులు భూములు, ఇళ్లు కోల్పోయారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;నిర్వాసితుల త్యాగాలు మరువలేనివని పవన్ గుర్తు చేశారు. అందుకే వారి బాగోగుల కోసం కూటమి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించిందని పేర్కొన్నారు. &quot;నిర్వాసితులకు పరిహారం కోసం రూ.905 కోట్లు విడుదల చేసిన కూటమి ప్రభుత్వం. ఇప్పటికే నిర్వాసితులకు రూ.768 కోట్లు చెల్లింపులు పూర్తి అయ్యాయి. వెలిగొండ కోసం భూములు త్యాగం చేసిన నిర్వాసితులకు ప్రత్యేక కృతజ్ఞతలు.&quot; అని అన్నారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;blockquote class=&quot;twitter-tweet&quot; data-media-max-width=&quot;560&quot;&gt;
&lt;p dir=&quot;ltr&quot; lang=&quot;te&quot;&gt;కూటమి ప్రభుత్వ సంకల్పానికి సజీవ సాక్ష్యం వెలిగొండ ప్రాజెక్టు&lt;br /&gt;&lt;br /&gt;&amp;bull; నాలుగు జిల్లాల ప్రజల దశాబ్దాల కల సాకారానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు&lt;br /&gt;&lt;br /&gt;నల్లమల కొండలను చీల్చుకుంటూ కృష్ణమ్మ కరవు పీడిత ప్రాంతాలకు చేరనున్న చారిత్రాత్మక ఘట్టమైన వెలిగొండ తొలి దశ ప్రారంభోత్సవాన్ని&amp;hellip;&lt;/p&gt;
&amp;mdash; Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) &lt;a href=&quot;https://x.com/APDeputyCMO/status/2094314652239057061?ref_src=twsrc%5Etfw&quot;&gt;August 31, 2026&lt;/a&gt;&lt;/blockquote&gt;
&lt;script src=&quot;https://platform.x.com/widgets.js&quot; async=&quot;&quot; charset=&quot;utf-8&quot;&gt;&lt;/script&gt;
&lt;p&gt;వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కృషిని కూడా &lt;a title=&quot;పవన్ కల్యాణ్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Pawan-Kalyan&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;పవన్ కల్యాణ్&lt;/a&gt; కీర్తించారు. ఆయన చేతులో మీదుగా శంకుస్థాపన చేసుకున్న ప్రాజెక్టు నేడు పూర్తి అయ్యి నేడు స్టార్ట్ అవ్వడంపై సంతోషం వ్యక్తం చేశారు. &quot;1996లో ఉమ్మడి ఏపీ సీఎంగా వెలిగొండకు చంద్రబాబు శంకుస్థాపన చేశారు. &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; సంకల్పంతోనే నేడు వెలిగొండ తొలి దశ ప్రారంభమైంది. వెలిగొండ నీటితో కరవు ప్రాంతాల్లో నీటి ప్రవాహంతో ప్రజల్లో ఆనంద వెల్లివిరిస్తోంది&quot;&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో జల్&amp;zwnj; జీవన్&amp;zwnj; మిషన్&amp;zwnj;కు వెలిగొండ కీలక నీటి వనరు అని పవన్ తెలిపారు. ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు అందించాలన్న ప్రధాని మోదీ సంకల్పంలో వెలిగొండ కీలకమన్నారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయడంలో కష్టపడిన మంత్రి నిమ్మల రామానాయుడు, అధికారులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. కూటమి ప్రభుత్వ సంకల్పానికి వెలిగొండ ప్రాజెక్టు సజీవ సాక్ష్యమని పవన్ తన సోషల్ మీడియా సందేశంలో వెల్లడించారు.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/31/4ed30575dc6fb9b30ea9ac68f81a4d8c1788161836701215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Veligonda Project Starts Chandra Babu: వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ ప్రారంభం! కెనాల్ ఒడ్డున కృష్ణమ్మకు చంద్రబాబు సాష్టాంగ నమస్కారం!]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/nellore/chandrababu-naidu-poola-subbaiah-veligonda-project-krishna-jalalu-jalaharati-nallamala-sagar-257686</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/nellore/chandrababu-naidu-poola-subbaiah-veligonda-project-krishna-jalalu-jalaharati-nallamala-sagar-257686#respond</comments><pubDate>Mon, 31 Aug 2026 12:09:10 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ నెల్లూరు ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/nellore/chandrababu-naidu-poola-subbaiah-veligonda-project-krishna-jalalu-jalaharati-nallamala-sagar-257686</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Veligonda Project Starts Chandra Babu:&amp;nbsp;&lt;/strong&gt;పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశను ఆంధ్రప్రదేశ్&amp;zwnj; ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభంతో ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల ప్రజల 30 ఏళ్ళ కల సాకారమైంది. దోర్నాల మండలం గంటవాని పల్లె వద్ద వెలిగొండ ప్రాజెక్టు సొరంగాల నుంచి వచ్చిన కృష్ణా జలాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక పూజలు నిర్వహించి జల హారతి ఇచ్చి స్వాగతం పలికారు. నల్లమల కొండల్లోని రెండు &amp;nbsp;సొరంగాల నుంచి గంటవాని పల్లె ఆక్విడెక్టుకు చేరుకుని నల్లమల సాగర్ కు కృష్ణమ్మ పరుగులు పెట్టింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/31/7b64603683f55f02672c198045dfb0041788163583042215_original.jpeg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;వెలిగొండ తొలిదశ ప్రాజెక్టుతో 1.19 లక్షల ఎకరాలకు సాగు నీరు, 4 లక్షల మందికి తాగునీరు అందనుంది. వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి పెద్ద ఎత్తున ఆ ప్రాంత రైతులు, ప్రజలు హాజరయ్యారు. మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నిమ్మల రామానాయుడు, స్థానిక ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారు. జలహారతి కార్యక్రమానికి హాజరైన కందుల దుర్గేష్, పార్ధసారధి, అనగాని సత్యప్రసాద్ &lt;a title=&quot;బీజేపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/BJP&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;బీజేపీ&lt;/a&gt; రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, ఎంపీ మాగుంట తదితర ప్రజా ప్రతినిధులు, అధికారులు కూడా వచ్చారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/31/673eeb0a85f2624891a9d9d04661ece31788163617779215_original.jpeg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;కృష్ణజాలలు తమ ప్రాంతానికి రావడంతో మార్కాపురం ప్రజలు, రైతులు స్వాగతించారు. గంటవానిపల్లి సమీపంలో వెలిగొండ ఫీడర్ కెనాల్ వద్ద సీఎం చంద్రబాబు నిర్వహించిన జలహారతిని సభా ప్రాంగణం నుంచే మార్కాపురం రైతులు, మహిళలు &amp;nbsp;ఆసక్తిగా తిలకించారు. నీళ్లలోకి దిగి కృష్ణమ్మకు సీఎం చంద్రబాబు హారతి ఇచ్చారు. కృష్ణమ్మకు పసుపు, కుంకుమ, చీరను సమర్పించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/31/78476b071739a118836826aa19fec1b51788163644722215_original.jpeg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;జలహారతి ఇచ్చే ప్రదేశం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబుకు తమ సాంప్రదాయ పద్దతిలో గిరిజన మహిళలు స్వాగతం పలికారు. జలహారతి అనంతరం సీఎంకు ముఖ్యమంత్రికి శ్రీశైలం మల్లిఖార్జునస్వామి చిత్రపటాన్ని పండితులు అందించారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/31/96bd86cec66f21e4da9e5f37a537b1261788163707962215_original.jpeg&quot; /&gt;&lt;br /&gt;వెలిగొండ ఫీడర్ కెనాల్ వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు. జలహరతి ఇచ్చిన అనంతరం కెనాల్ ఒడ్డున కృష్ణమ్మకు సాష్టాంగ ప్రణామం చేశారు. &amp;nbsp;సీఎం చంద్రబాబు సాష్టాంగ నమస్కారం చేయడంతో పెద్ద ఎత్తున హర్షధ్వానాలు వ్యక్తం చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/31/f6d2c053bc0b6780d3412ff1c3af6c4b1788163722701215_original.jpeg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;వెలిగొండ ప్రాజెక్టు తొలి విడత పూర్తి చేసి నీటిని విడుదల చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పైలాన్ ఆవిష్కరించారు. నల్లమల కొండల్ని చీల్చుకుంటూ కాలువల్లోకి ప్రవహించిన కృష్ణమ్మకు పుష్పాలతో మహిళలు ఘన స్వాగతం పలికారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/31/4325a0412816c143f9d88ca9d336e46e1788163763127215_original.jpeg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;ప్రత్యేక పూజలు నిర్వహించి, జలహారతి ఇచ్చిన అనంతరం పవిత్ర జలాలను మంత్రులు, అధికారులపై సీఎం &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; చల్లారు. శ్రీశైలం మల్లన్న పాదాల చెంత నుంచి వెలిగొండ జంట సొరంగాల ద్వారా నల్లమల సాగర్ కాలువలకు చేరుకున్న కృష్ణా జలాలకు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వాగతం పలికారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/31/d95de20d9c0338fc1ebf7e2d4e8dc5311788163738536215_original.jpeg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/31/52ff28d26d3495860beeb4f1fd5802f31788163786743215_original.jpeg&quot; /&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/31/db60f4b1ea2b525afa3942eadfd956bd1788163805916215_original.jpeg&quot; /&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/31/283d1da3541c2f8dc76c7890386cd6221788163822717215_original.jpeg&quot; /&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/31/29be4232136348e3ec2236921f2576551788163836654215_original.jpeg&quot; /&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/31/4cf0cfac761c2823fc3751c7e2c997e51788163851585215_original.jpeg&quot; /&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/31/46585610ba3068542462668861c8dac31788163865168215_original.jpeg&quot; /&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/31/5e3e3cdbee1ef64c00842abe138c49ce1788163879717215_original.jpeg&quot; /&gt;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/31/018b163e499dba77e97842ae73c1a37f1788158316973215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Who is Pula Subbaiah: ఎవరీ పూల సుబ్బయ్య? వెలిగొండ ప్రాజెక్టుకు ఆయన పేరు ఎందుకు పెట్టారు?]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/nellore/veligonda-project-poola-subbaiah-krishna-waters-prakasam-district-fluoride-problem-nallamala-tunnels-257677</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/nellore/veligonda-project-poola-subbaiah-krishna-waters-prakasam-district-fluoride-problem-nallamala-tunnels-257677#respond</comments><pubDate>Mon, 31 Aug 2026 10:48:01 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ నెల్లూరు ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/nellore/veligonda-project-poola-subbaiah-krishna-waters-prakasam-district-fluoride-problem-nallamala-tunnels-257677</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Who is Pula Subbaiah:&amp;nbsp;&lt;/strong&gt;ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల రంగానికి సంబంధించిన చరిత్రను పరిశీలిస్తే ఎన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు కనిపిస్తాయి. అయితే, వాటిలో పశ్చిమ ప్రకాశం జిల్లా ప్రజల దశాబ్ధాల కలల సాకారమైన వెలిగొండ ప్రాజెక్టు అత్యంత విశిష్టమైంది. దశాబ్ధాలుగా ఫ్లోరైడ్ రక్కసి కోరల్లో చిక్కుకుని, కనీసం తాగడానికి చుక్క నీరు లేక, వ్యవసాయానికి సాగునీరు అందక నరకయాతన అనుభవించిన ఆ కరవు నేలకు కృష్ణా నది జలాలను తరలించే ఒక మహా యజ్ఞమే ఈ ప్రాజెక్టు. నల్లమల అటవీ ప్రాంతంలో దట్టమైన కొండలను తొలిచి, అద్భుతమైన ఇంజినీరింగ్&amp;zwnj; నైపుణ్యంతో నిర్మించిన సుదీర్ఘమైన ట్విన్ టన్నెల్స్&amp;zwnj; ద్వారా శ్రీశైలం ఫోర్షోర్&amp;zwnj; నుంచి నీటిని మళ్లించే ఈ భారీ ప్రాజెక్టు పేరు వినగానే తెలుగు ప్రజల మదిలో మెదిలే ఏకైక పేరు - పూల సుబ్బయ్య.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లోని ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతం అంటేనే కరవు కాటకాలకు కేరాఫ్ అడ్రెస్&amp;zwnj;గా నిలిచేది. ముఖ్యంగా మార్కాపురం, యర్రగొండుపాలెం, గిద్దలూరు, కనిగిరి, దర్శి ప్రాంతాల్లో తీవ్రమైన నీటి కొరత ఉండేది. తాగడానికి కనీసం గుక్కెడు మంచినీరు దొరక్క ప్రజలు అల్లాడిపోయేవారు. నీటి కోసం వందల అడుగుల లోతుకు బోర్లు వేసినప్పటికీ, ఆ బోరు బావుల నుంచి వచ్చే నీటిలో ప్రమాదకరమైన స్థాయిలో ఫ్లోరైడ్&amp;zwnj; మూలకాలు ఉండటం ఆ ప్రాంత ప్రజలకు శాపంగా మారింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఈ విషపూరితమైన ఫ్లోరైడ్ నీటిని తాగడం వల్ల చిన్న వయసులోనే పిల్లల పళ్లు పసుపు రంగులోకి మారిపోయేవి. ఎంతో మంది ప్రజలు ఎముకల బలహీనతతో కాళ్లు చేతులు వంకర్లు పోయి శారీరక వైకల్యానికి గురయ్యేవారు. గ్రామానికి గ్రామాలే వికలాంగుల ఆవాసాలు దర్శనమిచ్చేవి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఆ ప్రాంత ప్రజల ఘోరమైన కష్టాలను, వారి శారీరక నరకయాతనను కళ్లారా చూసిన పూల సుబ్బయ్య పరిష్కార మార్గాల కోసం వెతికారు. కృష్ణా నదీ జాలలను తమ మెట్ట ప్రాంతానికి తరలించడమే మేలని నమ్మారు. శ్రీశైలం జలాశయం నిండిన ప్రతీసారి వరద నీరు వృథాగా సముద్రంలోకి కలిసిపోతుందని గ్రహించి వాటిని నల్లమల కొండల అవతలి వైపు ఉన్న తమ కరవు పీడిత ప్రాంతాలకు మళ్లించవచ్చని పట్టుబట్టారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;అసలు ఎవరీ పూల సుబ్బయ్య?&lt;/h2&gt;
&lt;p&gt;పూల సుబ్బయ్య సీపీఐకు చెందిన ఈ అగ్రనేత అత్యంత సాధారణ, నిరుపేద కుటుంబంలో జన్మించారు. చిన్నతనం నుంచే నిరుపేదల సమస్యలను చూస్తూ పెరిగిన ఆయన, విద్యార్థి దశ నుంచి ప్రజా సమస్యలపై గళమెత్తారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఆయన నిబద్ధను గుర్తించిన ప్రజలు ఆయనను తమ ప్రతినిధిగా ఎన్నుకున్నారు. గిద్దలూరు, మార్కాపురం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఆయన శాసనసభలో ఎమ్మెల్యేగా అడుగు పెట్టారు. ఎమ్మెల్యేగా పని చేసినప్పటికీ పూల సుబ్బయ్య తనకంటూ ఆస్తులు సంపాదించుకోలేదు. సాధారణ ప్రజల కంటే సింపుల్&amp;zwnj;గా జీవించారు. పశ్చిమ ప్రకాశం మెట్ట ప్రాంత ప్రజల దాహార్తిని తీర్చడమే ధ్యేయంగా ఆయన తన జీవితాంతం పాదయాత్రలు, ధర్నాలు చేశారు. అసెంబ్లీ లోపల, వెలుపల కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారు. నల్లమల దట్టమైన అడవుల గుండా భారీ సొరంగ మార్గాలను తవ్వ, కృష్ణా జలాలలను నిల్వ చేసే వెలిగొండ ప్రాజెక్టు ప్రాథమి రూపురేఖలను దశాబ్దాల క్రితమే ఊహించి ప్రతిపాదించిన అద్భుత దార్శనికుడు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పశ్చిమ ప్రకాశం జిల్లాకు కృష్ణా నది నీటిని మళ్లించడం సాధారణ విషయం కాదు. ఈ రెండు ప్రాంతాల మధ్య దట్టమైన నల్లమల కొండలు ఆటంకంగా నిలిచాయి. అయితే, ఆ కొండలను తొలిచి రాతి గుహల గుండా నీటిని తీసుకెళ్లాలనే విప్లవాత్మకమైన ఇంజనీరింగ్&amp;zwnj; ఆలోచనను పూల సుబ్బయ్య ముందుకు తెచ్చారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఈ భారీ ప్రాజెక్టు అసాధ్యం కాదని, శాస్త్రీయంగా సాధ్యమేనని నిరూపించడానికి పూల సుబ్బయ్య ప్రకాశం జిల్లాలోని ప్రతి గ్రామాన్ని కాలినడకన చుట్టి వచ్చారు. గ్రామీణ ప్రజలను చైతన్యపరుస్తూ, వారిని భాగస్వామ్యంగా చేస్తూ వెలిగొండ సాధన సమితి ఏర్పాటు చేసి బృహత్తర ఉద్యమాన్ని నడిపారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;పూల సుబ్బయ్య నిరంతర పోరాటాల ఫలితంగానే ప్రభుత్వం దిగివచ్చి వెలిగొండ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై సర్వే నిర్వహించడానికి ఆదేశాలు జారీ చేసింది. ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాథమిక రూపురేఖలు సిద్దమైనప్పటికీ, దురదృష్టవశాత్తు ప్రాజెక్టు శంకుస్థాపన కాకముందే పూల సుబ్బయ్య కన్నుమూశారు. కానీ ఆయన నాటిన ఉద్యమ బీజం ప్రకాశం జిల్లా గుండెల్లో సజీవంగా నిలిచిపోయింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఒక ప్రజాప్రతినిధి తన జీవిత కాలాన్ని కేవలం ఒక ప్రాజెక్టు సాధన కోసం, ప్రజల నీటి అవసరాల కోసమే ధారపోస్తే, ఆ ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టడమే నిజమైన గౌరవం. అందుకే ఆంధ్రప్రదేశ్&amp;zwnj; ప్రభుత్వం వెలిగొండ ప్రాజెక్టుకు అధికారికంగా&quot; పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుగా నామకరణం చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;రాజకీయం అంటే కేవలం ఓట్లు, సీట్లు, పదవులు మాత్రమే కాదని, ప్రజల ప్రాథమిక సమస్యల పరిష్కారం కోసమే సాగించే ప్రాణప్రదమైన పోరాటమని పూల సుబ్బయ్య తన జీవితం ద్వారా నిరూపించారు. ఇప్పుడు వెలిగొండ ప్రాజెక్టు సాకారమవుతుండటం ఆ ప్రాంత ప్రజలంతా పూల సుబ్బయ్యను స్మరించుకుంటున్నారు. &amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/31/1c7f8e6c57f681211df5ca49cbe226bb1788153409531215_original.jpg" width="220"/></item></channel></rss>