TDP News :   ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ పూర్తి స్థాయిలో సర్వీస్ రూల్స్ ఉల్లంఘించారని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు రామ్మోహన్ నాయుడు ఫిర్యాదు చేశారు.  సర్వీస్ రూల్స్ అతిక్రమించి మ‌రీ సంజయ్ వైసీపీకి అనుకూలంగా ప‌నిచేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.  ఆల్ ఇండియ‌న్ స‌ర్వీస్ రూల్స్ మేర‌కు రాజ‌కీయ ప‌క్షపాతాలు లేకుండా ప‌నిచేయాల్సిన సీఐడీ చీఫ్ అన్నింటినీ ఉల్లంఘించార‌ని హోం మంత్రికి ఆధారాలతో ఫిర్యాదు చేశారు. వైసీపీ కార్యక‌ర్త మాదిరిగా ప‌నిచేస్తున్న ఐపీఎస్ అధికారి సంజ‌య్, సీఎం వైఎస్ జ‌గ‌న్ కోసం ప్రతిప‌క్షాల‌పై బుర‌ద చ‌ల్లుతున్నారని ఫిర్యాదులో ఎంపీ రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేస్తూ సీఐడీ చీఫ్ సంజయ్ వ్యవహరిస్తున్నారని రామ్మోహన్ నాయుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. సర్వీస్ రూల్స్ అతిక్రమిస్తున్నారు అని ఆరోపించారు.ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ ప్రకారం రాజకీయ పక్షపాతం లేకుండా పనిచేయాల్సిందిపోయి అన్నింటిని ఉల్లంఘిస్తున్నారు అని ఆరోపించారు.


స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ కేసులో ప్రతిపక్షనేత చంద్రబాబుని అరెస్టు చేసి విచార‌ణ చేయాల్సిన అధికారి, ఎటువంటి విచార‌ణ జ‌ర‌ప‌కుండానే స‌ర్వీసు నిబంధ‌న‌ల‌కి వ్యతిరేకంగా దేశ‌వ్యాప్తంగా ప్రెస్ మీట్లు పెడుతూ ఆరోప‌ణ‌లు చేయ‌డం తీవ్రమైన నేరంగా ఎంపీ రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ద‌ర్యాప్తు అంశాలు రూపొందించి కోర్టుల‌కి నివేదించాల్సిన బాధ్యత కలిగిన ఐపీఎస్ అధికారి ఫ‌క్తు వైసీపీ నేత‌లాగ ఢిల్లీ, హైద‌రాబాద్, అమ‌రావ‌తిలో ప్రెస్ మీట్లు పెడుతూ ప్రతిప‌క్ష నేత‌పై త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తున్నారన్నారు. అలాగే ద‌ర్యాప్తులో గోప్యంగా ఉంచాల్సిన అంశాలను మీడియాకి విడుద‌ల చేస్తున్నారని ఫిర్యాదులో ఎంపీ రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. సీఐడీ చీఫ్ సంజ‌య్ ఉల్లంఘించిన స‌ర్వీస్ రూల్స్, అతిక్రమించిన నిబంధ‌న‌లు ఆధారాల‌ను హోం మంత్రికి ఎంపీ రామ్మోహ‌న్ నాయుడు పంపించార‌ు. సీఐడీ చీఫ్ సంజయ్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.


స్కిల్ స్కాంలో చంద్రబాబును ఎనిమిదో తేదీన అరెస్టు చేసిన రోజున.. ఆయను విజయవాడ తీసుకు రాక ముందే మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుపై వ్యక్తిగత విమర్శలు కూడా చేశారు. తర్వాత పలు చోట్ల ప్రెస్ మీట్ పెట్టారు. అవసరం లేకపోయినా హైదరాబాద్ ఢిల్లీల్లోనూ ప్రెస్ మీట్లు పెట్టడం వివాదాస్పదమయింది. కోర్టుకు సమర్పించాల్సిన సన్నితమైన అంశాలను కూడా మీడియా ముందు ప్రదర్శించడంతో న్యాయనిపుణులు విస్మయానికి గురయ్యారు. ఇదే అంశంపై ఇప్పుడు.. రామ్మోహన్ నాయుడు హోంమంత్రికి ఫిర్యాదు చేశారు. 


సీఐడీ చీఫ్ వ్యవహారశైలిపై టీడీపీ నేతలు తీవ్రమైన  విమర్శలు చేస్తున్నారు.  వైఎస్ఆర్‌సీపీ కార్యకర్త మాదిరి వ్యవహరిస్తున్నారని అంటున్నారు.  సీఐడీ చీఫ్ హోదాలో ఆయన పెట్టే ప్రెస్ మీట్లలో రాజకీయ విమర్శలు చేస్తూండటంతో  .. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని టీడీపీ నిర్ణయించుకున్నట్లుగా  తెలుస్తోంది.