అన్వేషించండి

Nara Lokesh Slams Jagan: జనం ఛీకొట్టినా జగన్ డ్రామాలు మానడం లేదు- నంద్యాలలో YSR విగ్రహం ధ్వంసంపై నారా లోకేష్

YSR Statue Vandalism in Nandyal | ఏపీ ప్రజలు ఛీకొడుతున్నా వైఎస్ జగన్ డ్రామాలు మానడం లేదని, కుట్రలు చేస్తున్నారంటూ నంద్యాలలో వైఎస్సార్ విగ్రహం ధ్వంసం ఘటనపై మంత్రి నారా లోకేష్ ఘాటుగా స్పందించారు.

నంద్యాలలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి (YSR) విగ్రహం ధ్వంసమైన ఘటనపై ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి, టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్నాయి. నంద్యాలలో వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితుడు జమ్ములయ్య... వైసీపీ నేతల ముఖ్య అనుచరుడేనని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలిందని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే వైసీపీ నేతలు ఈ తరహా కుట్రలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.

జగన్నాటకాలు చూసి జనం ఛీకొడుతున్నారు: నారా లోకేష్ మండిపాటు
గతంలో జరిగిన కొన్ని సంఘటనలను ప్రస్తావిస్తూ వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి మరణాన్ని గుండెపోటుగా చిత్రీకరించడం, కోడికత్తి దాడి, ఎన్నికల ప్రచారంలో గులకరాయి డ్రామాలు వంటి నాటకాల రాయుడైన జగన్.. ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ లబ్ధి కోసం మరో కొత్త డ్రామాకు తెరలేపారంటూ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో నెలకొన్న ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీసేందుకు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకే సైకో జగన్ తన గొడ్డలి పార్టీ కార్యకర్తలను రంగంలోకి దింపారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇలాంటి కుట్రపూరిత రాజకీయాలను చూసి ప్రజలు ఇప్పటికే ఛీకొట్టినా, జగన్ మాత్రం తన క్షుద్ర రాజకీయాలు మానడం లేదని, ఎన్నిసార్లు తప్పు చేస్తూ దొరికిపోయినా ఇలాంటి నీచ రాజకీయాలు చేయడం సిగ్గుచేటని నారా లోకేష్ దుయ్యబట్టారు.కూటమి ప్రభుత్వం ప్రజల కోసం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే వైసీపీ అధినేత జగన్ మాత్రం పదే పదే డ్రామాలాడుతూ దొరికిపోతున్నారని ఎద్దేవా చేశారు.

Also Read: Satyasai district NH Tenders: సత్యసాయి జిల్లా హైవే టెండర్లలో రిగ్గింగ్ కలకలం - ఢిల్లీకి చేరిన అధికారుల అక్రమాల చిట్టా!

వైఎస్సార్ విగ్రహాల ధ్వంసం.. ఆమరణ దీక్షకు దిగుతానని షర్మిల హెచ్చరిక
దివంగత కాంగ్రెస్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి (YSR) విగ్రహాలపై దాడులు జరగడం అత్యంత దారుణమని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రంగా మండిపడ్డారు. నంద్యాల జిల్లా శ్రీనివాస సెంటర్ వద్ద వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనను ఆమె తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో ఇలాంటి దాడులు జరుగుతుంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం చోద్యం చూడటం సిగ్గుచేటని దుయ్యబట్టారు. ఈ దాడులు చంద్రబాబు రాజకీయ కక్ష సాధింపు చర్యలకు స్పష్టమైన నిదర్శనమని ఆమె ఆరోపించారు.

పోలీసులు ఎందుకు ఆపడం లేదు..
పట్టపగలు ఓ సైకో విగ్రహంపై దాడి చేస్తుంటే అక్కడే ఉన్న పోలీసులు కనీసం ఆపడానికి ప్రయత్నించకపోవడం హేయమైన చర్య అని షర్మిల మండిపడ్డారు. నిందితుడికి మానసిక స్థితి బాగోలేదని, అతను మనిషే కాదని చెబుతూ, కాంగ్రెస్ శ్రేణులను సంయమనం పాటించాలని పోలీసులు ఉచిత సలహాలు ఇవ్వడం తగదని హితవు పలికారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితుడిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని, ఆ సైకో వెనుక ఉండి నడిపించింది ఎవరో పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి తేల్చాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించి, పాత విగ్రహం స్థానంలో ప్రభుత్వ ఖర్చులతోనే కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేయించాలని షర్మిల డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ విగ్రహాలపై జరుగుతున్న దాడులను అరికట్టే పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. నంద్యాలలో ధ్వంసమైన వైఎస్సార్ విగ్రహాన్ని వెంటనే పునఃప్రతిష్ఠించకపోతే, అదే శ్రీనివాస సెంటర్ వద్ద తాను స్వయంగా ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని సీఎం చంద్రబాబును ఆమె హెచ్చరించారు.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Annadata Sukhibhava Status: ఏపీలో అన్నదాత సుఖీభవపై లేటెస్ట్ అప్‌డేట్! ఖరీఫ్‌ ఇన్‌స్టాల్‌మెంట్ ఎప్పుడు ఇస్తారంటే?
ఏపీలో అన్నదాత సుఖీభవపై లేటెస్ట్ అప్‌డేట్! ఖరీఫ్‌ ఇన్‌స్టాల్‌మెంట్ ఎప్పుడు ఇస్తారంటే?
Sarvepalli Radhakrishnan Vidyarthi Mitra Kit:ఆంధ్రప్రదేశ్‌లో స్కూల్స్ రీఓపెన్‌కు అంతా సిద్ధం! కొత్త యూనిఫామ్, విద్యార్థి మిత్ర కిట్లు ఎప్పుడిస్తారు?
ఆంధ్రప్రదేశ్‌లో స్కూల్స్ రీఓపెన్‌కు అంతా సిద్ధం! కొత్త యూనిఫామ్, విద్యార్థి మిత్ర కిట్లు ఎప్పుడిస్తారు?
Thalliki Vandanam Scheme AP: ఏపీలో తల్లికి వందనం లబ్ధిదారులకు గుడ్ న్యూస్! డబ్బులు పడే ముందు ఈ పని పూర్తి చేయండి!
ఏపీలో తల్లికి వందనం లబ్ధిదారులకు గుడ్ న్యూస్! డబ్బులు పడే ముందు ఈ పని పూర్తి చేయండి!
Breaking News: పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- కవిత సంచలన వ్యాఖ్యలు
పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement

వీడియోలు

Hardik Pandya Ruled Out of ODI | ఆఫ్ఘాన్ వన్డే సిరీస్‌కు హార్దిక్ దూరం ?
Womens T20 World Cup 2026 | మహిళల టీ20 వరల్డ్‌కప్‌కు టీమిండియా రెడీ
Who is Cricketer Bharti Fulmali | ట్రోలర్స్ నోర్లు మూయించిన మహిళా క్రికెటర్
Seniors Complain Against Gautam Gambhir | గౌతమ్ గంభీర్‌పై బీసీసీఐకి ఫిర్యాదు ?
Manav's Father Left Stadium Out Of Nervousness | కొడుకు మ్యాచ్ చూడకుండానే వెళ్లిన తండ్రి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TMC Congress Merger: కాంగ్రెస్‌లో తృణమూల్ విలీనం ప్రచారం - ఫైటర్ దీదీ అంత త్వరగా చేతులెత్తేస్తారా?
కాంగ్రెస్‌లో తృణమూల్ విలీనం ప్రచారం - ఫైటర్ దీదీ అంత త్వరగా చేతులెత్తేస్తారా?
Vizag Steel Plant: వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో మరో ప్రమాదం.. ఎస్ఎంఎస్1లో ల్యాడిల్‌ నుంచి పడిపోయిన ఉక్కు ద్రవం
వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో మరో ప్రమాదం.. ఎస్ఎంఎస్1లో ల్యాడిల్‌ నుంచి పడిపోయిన ఉక్కు ద్రవం
Rajinikanth vs Vijay Rivalry: దళపతి విజయ్‌కు పోటీగా అల్లుడిని రంగంలోకి దింపుతున్న రజనీకాంత్‌! ఆసక్తిగా మారుతున్న తమిళనాడు రాజకీయాలు!
దళపతి విజయ్‌కు పోటీగా అల్లుడిని రంగంలోకి దింపుతున్న రజనీకాంత్‌! ఆసక్తిగా మారుతున్న తమిళనాడు రాజకీయాలు!
Varalaxmi Sarathkumar : రామ్ చరణే వచ్చారు... మీరెందుకు రారు? - అడుక్కున్నా కానీ... వరలక్ష్మిపై డైరెక్టర్ తీవ్ర ఆగ్రహం
రామ్ చరణే వచ్చారు... మీరెందుకు రారు? - అడుక్కున్నా కానీ... వరలక్ష్మిపై డైరెక్టర్ తీవ్ర ఆగ్రహం
AP Alliance Government 2 Years Performance: కూటమి పాలనకు రెండేళ్లు- చంద్రబాబు, పవన్ కల్యాణ్ మార్క్ పాలన ప్రజల్ని మెప్పించిందా?
కూటమి పాలనకు రెండేళ్లు- చంద్రబాబు, పవన్ కల్యాణ్ మార్క్ పాలన ప్రజల్ని మెప్పించిందా?
Kidney Problems : కిడ్నీ ఫెయిల్యూర్‌కు ముందే కనిపించే లక్షణాలు ఇవే.. ఈ వార్నింగ్ సిగ్నల్స్ లైట్ తీసుకోకండి
కిడ్నీ ఫెయిల్యూర్‌కు ముందే కనిపించే లక్షణాలు ఇవే.. ఈ వార్నింగ్ సిగ్నల్స్ లైట్ తీసుకోకండి
Donald Trump: హర్మూజ్ గురించి డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. ఇరాన్‌కు తెలియకుండా అంతపని చేశారా!
హర్మూజ్ గురించి డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. ఇరాన్‌కు తెలియకుండా అంతపని చేశారా!
Annamalai We The Leaders : తమిళనాడు బీజేపీ ఖాళీ! అన్నామలై వెంటే కీలక నేతలు! దిల్లీ పెద్దల వ్యూహాత్మక మౌనం వెనుక అసలు కథ!
తమిళనాడు బీజేపీ ఖాళీ! అన్నామలై వెంటే కీలక నేతలు! దిల్లీ పెద్దల వ్యూహాత్మక మౌనం వెనుక అసలు కథ!
Embed widget