Pawan Kalyan Yatra: ఈ నెల 10వ తేదీ నుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర మూడో విడత ప్రారంభం కాబోతుంది. విశాఖపట్నం నగరంలో ఈ యాత్ర మొదలవుతుంది. అదే రోజు పట్టణంలో వారాహి వాహనం నుంచి సభ నిర్వహిస్తారు. ఇదే నెల 19వ తేదీ వరకూ ఈ యాత్ర సాగనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ యాత్రలో భాగంగా క్షేత్ర స్థాయి పరిశీలనలు, విశాఖలో చోటు చేసుకొంటున్న భూకబ్జాలకు సంబంధించిన అంశాలపై పవన్ కల్యాణ్ చర్చిస్తారు. పర్యావరణాన్ని ధ్వంసం చేసిన ప్రాంతాలను పవన్ కల్యాణ్ సందర్శిస్తారు. అలాగే విశాఖలో జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.






అంతకు ముందే వారాహి విజయ యాత్ర మూడో విడతకు సంబంధించి జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్.. మూడు కమిటీలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. యాత్ర నిర్వహణలో జాగరూకతతో ఉండాలని సూచించారు.