Jagan asked people to be with Him  for good   :  ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు జరుగుతున్న మంచి కొనసాగాలంటే మీ బిడ్డకు అండగా ఉంటాలని వైసీపీ అధినేత జగన్ ప్రజల్ని కోరారు. మేమంతా సిద్ధం సీఎం జగన్‌ బస్సు యాత్ర శనివారం ఉదయం తుగ్గలికి చేరుకుంది. అక్కడి ప్రజలతో సీఎం జగన్‌ ముఖాముఖి నిర్వహించారు.  గతంలో లంచాల పాలన ఉండేదని.. గత 58 నెలలుగా వివక్ష లేకుండా పాలన కొనసాగుతోందన్నారు. 


ఐదేళ్లలో అభివృద్ధి చేశామన్న  జగన్                                                                                   


ఈ 58 నెలల పాలనలో గ్రామాల్లో అభివృద్ధి జరిగిందన్నారు.  తుగ్గలి, రాతన పరిధిలో 10 వేల జనాభా ఉంది.  ఈ రెండు గ్రామాల సచివాలయాల పరిధిలో అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి నగదు జమ చేశామని స్పష్టం చేశారు.   గతంలో ఏ పథకం కావాలన్నా లంచాలు అడిగే పాలన చూశారు. కానీ, వైఎస్సార్‌సీపీ పాలనలో కులం, మతం, ప్రాంతం చూడకుండా సాయం చేశామని గుర్తు చేశారు. 


బటన్ నొక్కి అందరి ఖాతాల్లోకి డబ్బులు జమ                                               


బటన్‌ నొక్కడం ద్వారా.. నేరుగా తుగ్గలి, రతన గ్రామాల్లో 95 శాతం ఇళ్లకు లబ్ధి చేకూరిందన్నారు.  తుగ్గలిలో గ్రామంలో అనేక కార్యక్రమాలు చేపట్టామని..  జగన్నన్న విద్యాదీవెన ద్వారా రెండు గ్రామాలకు రూ.2 కోట్లకు పైగా నిధులు అందించామన్నారు.  ఒక్క తుగ్గలి పరిధిలో వివిధ పథకాల రూపంలో రూ. 29 కోట్ల 65 లక్షల నిధులు మంజూరు చేశామని తెలిపారు.  రాతన గ్రామానికి పథకాల రూపంలో రూ. 26 కోట్లు 59 లక్షలు అందజేశామని సీఎం జగన్‌ చెప్పారు.  వైసీపీ ఓటు వేయని వారికి కూడా సంక్షేమ పథకాలు అందించామన్నారు. 


మంచి కొనసాగాలంటే మీ బిడ్డకు అండగా ఉండాలని విజ్ఞప్తి                                        


గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం చేసి చూపిస్తున్నామని.. జగన్ తెలిపారు.  గత ప్రభుత్వం హయాంలో జన్మభూమి కమిటీలదే రాజ్యమని ఆరోపించారు.  వలంటీర్ల ద్వారా ప్రతీ పథకం ఇంటి వద్దకే అందేలా చూస్తున్నామని..  ప్రతి ఇంటి తలుపు తట్టి సంక్షేమం అందించామన్నారు.  గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి తేడా గమనించాలని ప్రజల్ని కోరారు.   రైతు భరోసా, ఆర్బీకేల ద్వారా రైతన్నలకు అండగా ఉన్నామని..  విద్యావిధానంలో మార్పు తీసుకొచ్చాం ..ఆరోగ్యశ్రీ పరిధి విస్తరించామని ప్రజలకు చెప్పారు.  నాడు-నేడుతో బడుల రూపురేఖలు మారాయి.. ప్రతీరంగంలో.. ప్రతీ దశలోనూ మార్పు కనిపిస్తోందన్నారు.  మంచి కొనసాగాలంటే మీ బిడ్డకు తోడుగా ఉండాలని కోరారు.