AP Matsyakara Bharosa 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమం కోసం 'మత్స్యకార భరోసా పథకం' అమలు చేస్తుంది. ప్రతి సంవత్సరం మత్స్యకార భరోసా పథకం కింద ప్రతి మత్స్యకారుడికి రూ.20,000 ఆర్థిక సాయం అందిస్తుంది. చేపల వేట నిషేధం సమయంలో మత్స్యకారులకు ఈ సాయం అందిస్తుంది.  రెండు నెలల పాటు చేపల వేట నిషేధం సమయంలో  మత్స్యకారులు జీవనోపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్థికసాయం చేస్తుంది.  

Continues below advertisement

ఏటా వేసవిలో 61 రోజుల పాటు సముద్రంలో వేట నిషేధం ఉంటుంది. ఈ సమయంలో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లడం చట్టరీత్యా నేరం. ఆదాయం లేని ఈ రెండు నెలలు మత్స్యకార కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు పడకుండా రాష్ట్ర ప్రభుత్వం నగదు సాయం అందిస్తోంది.  

మత్స్యకార భరోసా పథకం  

సీఎం చంద్రబాబు ఏప్రిల్ 2025లో మత్స్యకార భరోసా పథకాన్ని ప్రారంభించారు. మత్స్యకార భరోసా కింద చేపల వేట నిషేధ సమయంలో నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో రూ.20,000 జమ చేస్తారు.  ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు (61 రోజులు) పాటు వేట నిషేధం ఉంటుంది. ఈ సమయంలో మత్స్యకారులకు ఆర్థిక సాయం అందిస్తారు. 

Continues below advertisement

అర్హతలు 

  • మత్స్యకారులకు వయోపరిమితి 18 నుంచి 60 సంవత్సరాలు
  • మత్స్యశాఖలో నమోదు అయిన బోట్లలో పనిచేసే వారు లేదా బోటు యజమానులు అర్హులు.
  • వేట నిషేధ సమయంలో సముద్రంలో వేటకు వెళ్లనివారు. 
  • వేట నిషేధ సమయంలో వేటకు వెళ్తే బోటు రిజిస్ట్రేషన్ రద్దు అవుతుంది. ఈ పథకానికి అనర్హులుగా ప్రకటిస్తారు.  
  • లబ్దిదారుడి బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ (NPCI) అయి ఉండాలి. 
  • ఇతర పథకాల ద్వారా లబ్ధి పొందిన వారు ఈ పథకానికి అనర్హులు
  • మత్స్యకారుడు ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి.  

కావాల్సిన డాక్యుమెంట్స్ 

మత్స్యకార గుర్తింపు కార్డుఆధార్ కార్డుబ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్బోటు యాజమానులైతే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఫిషింగ్ లైసెన్స్ ఫొటోకాపీ 

దరఖాస్తు విధానం

  • ఏపీ మత్స్యకార భరోసా పథకం 2026 లబ్దిదారుల ఎంపిక విధానం ఇలా ఉంటుంది.  
  • ఏప్రిల్ 17 నుంచి గ్రామ,వార్డు సచివాలయాల ద్వారా మత్స్యకారుల వివరాల సేకరిస్తారు. 
  • మత్స్యశాఖ అధికారులు దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులను గుర్తిస్తారు.
  • అర్హుల జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తారు.
  • తుది జాబితా ఖరారు చేసిన తర్వాత సీఎం చేతుల మీదుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా నేరుగా ఖాతాల్లో డబ్బులు వేస్తారు.  

మరిన్ని ప్రయోజనాలు  

  1. సముద్రంలో వేట నిషేధం సమయంలో కుటుంబ అవసరాలకు, పిల్లల చదువులకు రూ. 20,000 ఆర్థిక భద్రత కల్పించనున్నాయి.  
  2. ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పులు చేయకుండా ఈ డబ్బులు ఉపయోగపడతాయి.  
  3. ఈ పథకం కింద నమోదు చేసుకున్న వారికి ‘ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన’ (PMMSY) ద్వారా ప్రమాద బీమా కల్పిస్తారు.  
  4. అర్హులైన వారికి ప్రభుత్వం నుంచి అదనంగా డీజిల్ సబ్సిడీ ప్రయోజనాలు అందిస్తారు.   

చెల్లింపు స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి? 

  • అర్హులైన లబ్ధిదారులు egsws.ap.gov.in వెబ్‌సైట్‌లో ఏపీ మత్స్యకార భరోసా పథకం స్టేటస్ ను చెక్ చేసుకోవచ్చు.  
  • మీ ఆధార్ నెంబర్‌, క్యాప్చా కోడ్‌ను నమోదు చేసి, వివరాలను సబ్‌మిట్ చేస్తే చెల్లింపు వివరాలు తెలుస్తాయి.