<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/" xmlns:dc="http://purl.org/dc/elements/1.1/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/" xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/" xmlns:media="http://search.yahoo.com/mrss/"><channel><title>Vizag Fishermen Missing: విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు గల్లంతు, మరో వ్యక్తిని కాపాడిన సిబ్బంది</title><atom:link href="https://telugu.abplive.com/andhra-pradesh/feed" rel="self" type="application/rss+xml"/><link>https://telugu.abplive.com/</link><description/><lastBuildDate>Tue, 7 Jul 2026 07:03:48 +0530</lastBuildDate><language>en-US</language><sy:updatePeriod>hourly</sy:updatePeriod><sy:updateFrequency>1</sy:updateFrequency><generator>https://telugu.abplive.com</generator><item><title><![CDATA[Vizag Boat Accident: ఆ ఒక్క స్విచ్ ఆన్ చేసి ఉంటే.. ఆరుగురు మత్స్యకారులు బతికేవాళ్లు! వైజాగ్ బోటు ప్రమాదంలో షాకింగ్ నిజాలు!]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/visakhapatnam/vizag-boat-accident-fisherman-missing-transponder-life-jacket-negligence-252723</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/visakhapatnam/vizag-boat-accident-fisherman-missing-transponder-life-jacket-negligence-252723#respond</comments><pubDate>Tue, 7 Jul 2026 06:04:18 +0530 </pubDate><dc:creator><![CDATA[ Nagesh GV ]]></dc:creator><category><![CDATA[ విశాఖపట్నం ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/visakhapatnam/vizag-boat-accident-fisherman-missing-transponder-life-jacket-negligence-252723</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Vizag Boat Accident:&lt;/strong&gt; కడలి అలలపై సాగే పయనంలో వారికి ప్రతీ క్షణం ప్రమాదమే... అణుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిందే. ప్రమాదకరమైన మత్స్యకారుల జీవితాన్ని ప్రాణాపాయం నుంచి రక్షించేందుకు కొన్ని ఏర్పాట్లు ఉన్నాయి. అత్యవసర సమయంలో ప్రాణాలను నిలబెట్టే లైఫ్&amp;zwnj; జాకెట్లు.. తమ పడవ ప్రమాదంలో చిక్కుకుంటే గ్రౌండ్&amp;zwnj;కు సమాచారం అందించే ట్రాన్స్&amp;zwnj;పాండర్లు వారి వద్ద ఉన్నాయి. కానీ విశాఖ బోటు గల్లంతు ఉదంతంలో ఇవేమీ వాడకపోవడంతో ఆరుగుర వ్యక్తుల ప్రాణాలపై సందిగ్ధత నెలకొంది. ఇప్పటికే మూడు రోజులు అవ్వడంతో వీరు ప్రాణాలతో ఉండే అవకాశాలు దాదాపు లేనట్లే. ఆ పరికరాలను వాడి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదన్న చర్చ ఇప్పుడు జరుగుతోంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;సముద్రం ఉగ్రరూపం దాల్చితే ప్రాణాలు దక్కడం అద్భుతమే. కానీ, చేతిలోనే ప్రాణాలను కాపాడే ఆయుధాలు ఉండి కూడా.. వాడకుండా సముద్ర గర్భంలో కలిసిపోతే అంతకంటే ఘోరమైన దారుణం మరొకటి ఉండదు. సరిగ్గా ఇదే నిర్లక్ష్యం ఇప్పుడు వైజాగ్ తీరంలో ఆరుగురు మత్స్యాకారుల ప్రాణాలను ముంచేసింది. వేటకు వెళ్లిన బోటు మునిగిపోయి ఆరుగురు ఫిషర్&amp;zwnj;మెన్ గల్లంతైన ఘటన వెనుక.. ప్రకృతి వైపరీత్యం తో పాటు మనవ తప్పిదం కూడా ఎక్కువగా కనిపిస్తోంది.&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/07/a6e124727ca91fc0091e7cc61ce5cb3c1783386357260233_original.jpg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;సముద్రం అల్లకల్లోలంగా ఉన్నప్పుడు.. తుపాను హెచ్చరికలు ఉన్నప్పుడు అసలు సమద్రంలోకి వెళ్లడమే మొదటి తప్పు. వాతావరణం బాగా లేదని వాతావరణ శాఖ హెచ్చరికలు &amp;nbsp;జారీ అవుతున్నా కూడా వీళ్లు బోటుతో లోపలకు వెళ్లారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;ప్రాణాధారాన్ని వదిలేశారు...&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;ప్రమాదం జరిగినప్పుడు సముద్రం నడిబొడ్డు నుంచి శాటిలైట్ ద్వారా తీరానికి ఆర్తనాదం పంపే అద్భుతమైన పరికరం..ట్రాన్స్&amp;zwnj;పాండర్' (Transponder). బోటు మునిగిపోతున్నా, ఇంజన్ ఫెయిల్ అయినా ఈ ట్రాన్స్&amp;zwnj;పాండర్ బటన్ నొక్కితే చాలు.. క్షణాల మీద కోస్ట్&amp;zwnj;గార్డ్&amp;zwnj;కు లొకేషన్&amp;zwnj;తో సహా అలర్ట్ వెళ్తుంది. కానీ, వైజాగ్ ప్రమాదంలో అసలు ఆ లింకే కట్ అయింది. వైజాగ్ బోటు ప్రమాదం గురించి మత్స్యకారుల నుంచి అలాంటి సమాచారం గ్రౌండ్ స్టేషన్&amp;zwnj;కు రాలేదు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/07/d15856825592e9feb6941c51ead5ec591783386411681233_original.png&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;గల్లంతైన వారిలో ప్రాణాలతో బయటపడిన కర్రి చిన్న&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;95ాశాతం మంది ట్రాన్స్&amp;zwnj;పాండర్ వాడటం లేదు. (Transponder Not Using)&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఈ ట్రాన్స్&amp;zwnj;పాండర్లను ప్రభుత్వమే సరఫరా చేసి ప్రతీ బోటుకు అమర్చారు. అయితే నూటికి 95శాతం ట్రాన్స్&amp;zwnj;పాండర్లను ఆఫ్ చేస్తున్నారని... నార్త్ ఆంధ్రా కోస్టల్ సెక్యూరిటీ ఐజీ గోపీనాథ్ జెట్టీ చెబుతున్నారు &quot; ఈ ట్రాన్స్&amp;zwnj;పాండర్లను వాడటంలో ఫిషర్&amp;zwnj;మెన్&amp;zwnj;లలో విముఖత ఉంది. దీనిని అనవసరం అని భావిస్తున్నవాళ్లు కొందరైతే.. దానితో బోటులోని ఎనర్జీ ఖర్చు అవుతుందనుకునేవాళ్లు మరొకొంతమంది. వాస్తవానికి ట్రాన్స్&amp;zwnj;పాండర్ రన్ చేయడానికి పెద్దగా ఇంధనం ఖర్చవదు. ట్రాన్స్&amp;zwnj;పాండర్&amp;zwnj;ను ఆన్ చేస్తే.. తమ కదలికలపై ప్రభుత్వం నిఘా ఉంచుతుందని.. కంట్రోల్ మొత్తం వారి చేతుల్లోకి వెళుతుందనే అపోహ కూడా ఉంది.&quot; అని&amp;nbsp; గోపీనాథ్ చెప్పారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;లైఫ్ జాకెట్ ఉందా? ఉంటే ఎందుకు వేసుకోలేదు?&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;మరో ప్రధాన అనుమానం ఏంటంటే.. అసలు బోటులో **లైఫ్ జాకెట్లు** ఉన్నాయా? ఒకవేళ ఉన్నా, వాటిని మత్స్యకారులు ఎందుకు వేసుకోలేదు..? సముద్రంలో ఈత వచ్చిన వాళ్లకైనా సరే, ప్రమాద సమయంలో అలల ఉధృతికి తట్టుకోవాలంటే లైఫ్ జాకెట్ తప్పనిసరి. కానీ వీళ్లు వాటిని వాడినట్లు లేదు. ఈ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన కరి శ్రీను.. ఒక్కడే ఈదుకుంటూ రాగలిగాడు.. మిగిలిన వాళ్లు ప్రకృతి తలొంచారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;బోటులో ఉన్న ట్రాన్స్&amp;zwnj;పాండర్ స్విచ్ ఆన్ చేయడానికి అయ్యే సమయం కేవలం ఒక్క సెకను. కానీ ఆ ఒక్క సెకను నిర్లక్ష్యం.. ఇవాళ ఆరుగురి కుటుంబాల్లో తీరని నిశ్శబ్దాన్ని మిగిల్చింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఇది మిగిలిన వారికి ఓ పాఠం &amp;nbsp;కావాలి. ట్రాన్స్&amp;zwnj;పాండర్లను వాడటం, లైఫ్ జాకెట్లు ధరించడం ఎంత ముఖ్యమో తెలుసుకోవాలి.&amp;nbsp;&lt;br /&gt;&amp;nbsp;ఇకపై వేటకు వెళ్లే ప్రతి బోటులో లైఫ్ జాకెట్లు ధరించడం, ట్రాన్స్&amp;zwnj;పాండర్లు ఆన్ చేయడం మ్యాండేటరీ చేయాలి. రూల్స్ బ్రేక్ చేస్తే లైసెన్స్ రద్దు చేసేలా కఠిన చర్యలు తీసుకోవాల్సిన సమయం వచ్చింది.&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/07/17a25b417399cc8555db375a641578de1783362859300198_original.png" width="220"/></item><item><title><![CDATA[Vizag Fishermen Missing: సురక్షితంగా తీరానికి చేరుకున్న మత్స్యకారుడు కర్రి చిన్న! మిగతావారి కోసం కొనసాగుతున్న గాలింపు! ]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/visakhapatnam/fisherman-karri-chinna-reaches-shore-safely-search-continues-for-others-252715</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/visakhapatnam/fisherman-karri-chinna-reaches-shore-safely-search-continues-for-others-252715#respond</comments><pubDate>Mon, 6 Jul 2026 22:13:04 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ విశాఖపట్నం ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/visakhapatnam/fisherman-karri-chinna-reaches-shore-safely-search-continues-for-others-252715</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Vizag Fishermen Missing:&amp;nbsp;&lt;/strong&gt;విశాఖలో గత వారం చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల బోటు బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు గల్లంతయ్యారు. అయితే అందులో ఒక మత్స్యకారుడు ఈదుకుంటూ వెళ్లి అటుగా వచ్చిన విదేశీ నౌకను పట్టుకొని ప్రాణాలు కాపాడుకున్నాడు. మిగతా వారి ఆచూకీ ఇంకా తెలియడం లేదు. అయితే ప్రాణాలతో బయటపడ్డ మత్స్యకారుడిని ఒడ్డుకు తీసుకొచ్చేందుకు వాతావరణం సహకరించలేదు. దీంతో 24 గంటల పాటు శ్రమించి అతన్ని కుటుంబం చెంతకు చేర్చారు. మిగతా వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;ఈదుకుంటూ ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;విశాఖకు చెందిన కొందరు మత్స్యకారులు గత &amp;nbsp;వారం వేటకు వెళ్లారు. చేపలు పట్టుకున్న తర్వాత తిరుగుపయనమయ్యారు. ఇదే విషయాన్ని ఇంట్లో వాళ్లకు చెప్పారు. వేట బాగా పడిందని, మరింత ముందుకు వెళ్లేందుకు వాతావరణం సహకరించడం లేదని అందుకే తిరిగి వచ్చేస్తున్నట్టు సమాచారం ఇచ్చారు. అయితే ఇలా కుటుంబ సభ్యులతో మాట్లాడిన కాసేపటికే వారి బోటు బోల్తా పడింది. ఇందులో ఏడుగురు కూడా చాలా సమయం బోటుపైనే ఉండిపోయారు. క్రమంగా బోటు ముగినిపోతుండటంతో వారి వద్ద ఉన్న వాటితో ఈదుకుంటూ బయటపడే మార్గం కోసం అన్వేషించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;మృత్యుంజయుడిగా కర్రి చిన్న&lt;/h2&gt;
&lt;p&gt;ఏడుగురు ఒకే దిక్కున ఈదుకుంటూ వచ్చారు. గంటల తరబడి ఈదారు. ఈ క్రమంలోనే అలసిపోయారు. దీంతో వారు తలోదిక్కు విడిపోయారు. అయితే వీరిలో కర్రి చిన్న అనే వ్యక్తి మాత్రం తన ఎదురుగా వస్తున్న షిప్&amp;zwnj;ను గమనించాడు. అంతే అతి కష్టమ్మీద అతను షిప్ వద్దకు చేరుకున్నాడు. వారు అతన్ని గమనించి కాపాడారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;అతి కష్టమ్మీద ఒడ్డుకు చేర్చిన అధికారులు&lt;/h2&gt;
&lt;p&gt;అక్కడి నుంచి కోస్ట్&amp;zwnj;గార్డ్ సిబ్బందికి సమాచారం చేరవేశారు. అయితే మిగతా వారు గల్లంతైనట్టు తెలిపారు. సాయంత్రానికి వచ్చేస్తామని చెప్పిన వారు రాత్రి అయినా రాకపోయేసరికి టెన్షన్&amp;zwnj; మొదలైంది. అయితే చివరకు అధికారులు వచ్చి అసలు విషయం చెప్పేసరికి అంతా షాక్ తిన్నారు. కర్రి చిన్నతో మాట్లాడిన ఆయన కుటుంబ సభ్యులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయితే అతన్ని అక్కడి నుంచి ఒడ్డుకు తీసుకొచ్చేందుకు మాత్రం అధికారులు చాలా శ్రమించాల్సి వచ్చింది. వాతావరణ పరిస్థితులు అనుకూలించలేదు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;ఫ్యామిలీ చెంతకు చిన్న&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;ప్రతికూల పరిస్థితుల్లో కూడా క&amp;zwnj;ర్రి చిన్న&amp;zwnj;ను అధికారులు సురక్షితంగా కుటుంబ వద్దకు చేర్చారు. నేవీ హెలీకాఫ్ట&amp;zwnj;ర్ సాయంతో ఐఎన్ఎస్ డేగాకు సుమారు సాయంత్రం 7.00 గంట&amp;zwnj;ల ప్రాంతంలో ర&amp;zwnj;క్ష&amp;zwnj;ణ సిబ్బంది అతన్ని తీసుకొచ్చారు. వైద్య పరీక్ష&amp;zwnj;లు పూర్తి చేసిన వైద్యులు, ఆరోగ్యంగానే ఉన్న&amp;zwnj;ట్లు నిర్దారించారు. అవసరమైన చికిత్స కోసం అంబులెన్స్&amp;zwnj;లో షీలానగర్&amp;zwnj;లోని కిమ్స్ ఐకాన్ ఆస్పత్రికి తరలించారు. చిన్న రాకతో కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే చిన్నతో వెళ్లిన వారి ఆచూకి ఇంకా దొరక్కపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;మిగతా వారి కోసం కొనసాగుతున్న గాలింపు&lt;/h2&gt;
&lt;p&gt;సముద్రంలో గల్లంతైన మిగతా మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వారు ఎటు వెళ్లి ఉంటారో అని అన్ని వైపుల జల్లెడ పడుతున్నారు. అటు ఒడిశా నుంచి ఇటు తమిళనాడు కోస్ట్ గార్డ్ అధికారులకు సమాచారం చేరవేశారు. గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను జిల్లా కలెక్టర్&amp;zwnj; అభిషిక్త్&amp;zwnj; కిషోర్, ఇతర అధికారులు పరామర్శించారు. ధైర్యం చెప్పారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;బాధితులను పరామర్శించిన జిల్లా కలెక్టర్&lt;/h2&gt;
&lt;p&gt;ప్రమాదం నుంచి బయటపడి సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్న చిన్నాను ఆయన భార్య, కుటుంబ సభ్యులను కూడా జిల్లా కలెక్టర్&amp;zwnj; పరామర్శించారు. ఈ మొత్తం ప్రక్రియలో జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ నేవీ, కోస్ట్ గార్డ్ అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం వహిస్తూ రక్షణ చర్యలను పర్యవేక్షించారు. గల్లంతైన మిగిలిన మత్స్యకారుల ఆచూకీ లభించే వరకు గాలింపు చర్యలు నిరంతరంగా కొనసాగుతాయని తెలిపారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/06/4b8578a882a0015fa7b93be4a6fb48351783356049722215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Vizag Fishermen Rescue Operation: వైజాగ్‌ మత్య్సకారుల కోసం చేపట్టిన ​రెస్క్యూ ఆపరేషన్‌కు వాతావరణం ఆటంకం! ఆందోళనలో కుటుంబ సభ్యులు!]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/visakhapatnam/weather-hampers-rescue-operation-for-vizag-fishermen-252700</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/visakhapatnam/weather-hampers-rescue-operation-for-vizag-fishermen-252700#respond</comments><pubDate>Mon, 6 Jul 2026 18:35:11 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ విశాఖపట్నం ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/visakhapatnam/weather-hampers-rescue-operation-for-vizag-fishermen-252700</guid><description><![CDATA[&lt;p&gt;Vizag Fishermen Rescue Operation: విశాఖపట్నం తీర ప్రాంతంలో మత్స్యకారుల బోట్ ఒకటి తప్పిపోయిన ఉదంతంపై ఇండియన్ కోస్ట్ గార్డ్, నేవీ, ఏపీ కోస్టల్ సెక్యూరిటీ పోలీసులు సంయుక్తంగా ముమ్మరంగా సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారని విశాఖ రేంజ్ ఐజీ గోపినాథ్&amp;zwnj; జెట్టి వెల్లడించారు. అయితే ఈ గాలింపునకు వాతావరణం పెద్ద అడ్డంకిగా మారింది. సముద్రంలో కోస్ట్&amp;zwnj;గార్డ్ బోటులు కూడా వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. మరోవైపు మత్స్యకారుల కోసం కుటుంబాలు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;​గత 4వ తేదీ అర్ధరాత్రి 11 గంటల ప్రాంతంలో మత్స్యకార కమ్యూనిటీ నుంచి బోట్ మిస్ అయినట్లు సమాచారం అందిందని ఐజీ గోపినాథ్&amp;zwnj; జెట్టి తెలిపారు. వెంటనే స్పందించిన పోలీస్ యంత్రాంగం.. విశాఖపట్నంలోని రీజినల్ ఆపరేషన్స్ సెంటర్, రీజినల్ ఆపరేషన్స్ స్టేషన్లకు ఈమెయిల్ ద్వారా సమాచారాన్ని చేరవేసి అలర్ట్ చేశామన్నారు. నిన్న (ఆదివారం) ఉదయం నుంచే ఇండియన్ నేవీకి చెందిన రెండు షిప్పులు, కోస్ట్ గార్డ్&amp;zwnj;కు చెందిన రెండు షిప్పులు రంగంలోకి దిగి బోట్ మిస్సయిన ప్రాంతంలో గాలింపు చర్యలు ప్రారంభించాయని పేర్కొన్నారు. వీటితోపాటు కోస్ట్ గార్డ్&amp;zwnj;కు చెందిన డోర్నియర్ ఎయిర్&amp;zwnj;క్రాఫ్ట్, నేవీ హెలికాప్టర్ కూడా నిన్నటి నుంచి నిరంతరాయంగా ఆపరేషన్&amp;zwnj;లో పాల్గొంటున్నాయని ఐజీ వివరించారు.&lt;/p&gt;
&lt;h2&gt;​ఒక మత్స్యకారుడు సురక్షితం&lt;/h2&gt;
&lt;p&gt;​ప్రమాదానికి గురైన బోటులో మొత్తం ఏడుగురు మత్స్యకారులు ఉన్నట్లు సమాచారం కాగా, వారిలో 'కర్రి చిన్న' అనే ఒక మత్స్యకారుడిని ఆదివారం ఉదయం 7:30 గంటల ప్రాంతంలో పనామా రిజిస్ట్రేషన్ కలిగిన 'యూనివర్స్ వెల్త్' అనే మర్చంట్ వెజిల్ సురక్షితంగా రక్షించిందని ఐజీ గోపినాధ్ జెట్టి తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆ నౌకలోనే సురక్షితంగా ఉన్నారని, అతడిని ఒడ్డుకు తీసుకురావడానికి నిన్నటి నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు.&lt;/p&gt;
&lt;h2&gt;​రెస్క్యూ ఆపరేషన్&amp;zwnj;కు వాతావరణం ఆటంకం&lt;/h2&gt;
&lt;p&gt;​సముద్రంలో అలల తీవ్రత ఎక్కువగా ఉండటం, దాదాపు 4 మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగసిపడుతుండటం వల్ల రెస్క్యూ ఆపరేషన్&amp;zwnj;కు కొంత ఆటంకం కలుగుతోందని ఐజీ పేర్కొన్నారు. కోస్ట్ గార్డ్ లేదా నేవీ షిప్పులు ఆ మర్చంట్ వెజిల్ దగ్గరకు వెళ్తే ఒకదానికొకటి ఢీకొనే ప్రమాదం ఉందని, పైగా గాలి వేగం కూడా గంటకు 50 కిలోమీటర్ల మేర ఉండటంతో హెలికాప్టర్ ద్వారా కూడా రక్షించడం ప్రస్తుతానికి రిస్క్&amp;zwnj;తో కూడుకున్న పని అని వివరించారు.&lt;/p&gt;
&lt;p&gt;​వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ, కోస్ట్ గార్డ్, నేవీ అధికారులు తదుపరి రెస్క్యూ ప్లాన్ చేస్తున్నారన్నారు. తాము కూడా పర్సనల్&amp;zwnj;గా రేంజ్ ఐజీ కార్యాలయం నుంచి ఎస్పీ కోస్టల్ సెక్యూరిటీ, ఇతర ఉన్నతాధికారులతో కలిసి రెస్క్యూ ఆపరేషన్&amp;zwnj;ను నిరంతరం సమీక్షిస్తున్నామని చెప్పారు. అన్ని శాఖల స్టేక్&amp;zwnj;హోల్డర్స్&amp;zwnj;తో కోఆర్డినేట్ చేసుకుంటూ ఆపరేషన్ కొనసాగిస్తున్నామని, సదరు మత్స్యకారుడిని సురక్షితంగా విశాఖ తీరానికి తీసుకురావడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని ఐజీ గోపినాథ్&amp;zwnj; జెట్టి స్పష్టం చేశారు.&lt;/p&gt;
&lt;h2&gt;వెయ్యికళ్లతో ఎదురు చూస్తున్న ఫ్యామిలీస్&amp;zwnj;&lt;/h2&gt;
&lt;p&gt;గల్లంతైన మత్స్యకారుల కోసం కుటుంబ సభ్యులు ఆశగా ఎదురు చూస్తున్నారు. తమ వారిని సురక్షితంగా తీసుకురావాలని అధికారులకు రిక్వస్ట్ చేస్తున్నారు.ఇప్పుడు వేటకు వెళ్లిన వాళ్లే తమ కుటుంబాలకు ఆధారమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేట బాగా జరిగింది వచ్చేస్తున్నామని చెప్పిన కాసేపటికే వారి ఫోన్&amp;zwnj;లు స్విచ్ఛాఫ్ అయ్యాయని బాధిత కుటుంబాలు బోరుమంటున్నాయి. &amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/06/75913f2676deb35b6473b5c3ee37cdeb1783343060854215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Joseph Ravan Remand Report:  నక్సలిజం వైపు వెళ్లేలా యువతకు సందేశాలు - జోసఫ్ రావణ్‌ రిమాండ్ రిపోర్టులో సంచలన  విషయాలు!]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/youtuber-joseph-ravan-remanded-under-uapa-act-police-report-details-252697</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/youtuber-joseph-ravan-remanded-under-uapa-act-police-report-details-252697#respond</comments><pubDate>Mon, 6 Jul 2026 17:34:08 +0530 </pubDate><dc:creator><![CDATA[ Raja Sekhar Allu ]]></dc:creator><category><![CDATA[ ఆంధ్రప్రదేశ్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/youtuber-joseph-ravan-remanded-under-uapa-act-police-report-details-252697</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;AP Police Action On Social Media Threats UAPA:&lt;/strong&gt; డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుటుంబంపై, సనాతన ధర్మంపై సోషల్ మీడియా వేదికగా అత్యంత అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన యూట్యూబర్ బచ్చలకూరి జోసఫ్ అలియాస్ 'ప్రశ్న రావణ్' &amp;nbsp;చుట్టూ చట్టపరమైన ఉచ్చు మరింత బిగుసుకుంది. &amp;nbsp; తాజాగా అతనిపై అత్యంత కఠినమైన దేశద్రోహ వ్యతిరేక చట్టం ఉపా ను ప్రయోగించారు. ఈ కేసులో జోసఫ్&amp;zwnj;ను సోమవారం &amp;nbsp;న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా.. కోర్టు అతనికి 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఈ మేరకు నిందితుడిని కఠిన భద్రత మధ్య జైలుకు తరలించారు.&lt;/p&gt;
&lt;p&gt;అధికారిక వర్గాల నుంచి లభించిన పోలీసు రిమాండ్ రిపోర్టు ప్రకారం.. జోసఫ్ రావణ్ చేసిన వ్యాఖ్యలు కేవలం ఒక రాజకీయ నాయకుడిని లేదా ఒక సామాజికవర్గాన్ని దూషించే పరిధిని దాటిపోయాయి. రాష్ట్రంలో ఉద్దేశపూర్వకంగా కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టడం ద్వారా పెద్ద ఎత్తున అల్లర్లు సృష్టించడానికి ఇతను తెరవెనుక వ్యూహం రచించినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. విదేశీ శక్తులు లేదా దేశ విచ్ఛిన్నకర శక్తుల నుంచి వీరికి ఏవైనా ఫండింగ్ అందుతుందా? అనే కోణంలో దర్యాప్తు చేసిన పోలీసులు.. ప్రాథమిక ఆధారాలు లభించడంతోనే దేశ భద్రతకు ముప్పు కలిగించే చర్యల కింద 'ఉపా' చట్టంలోని కఠిన సెక్షన్లను రిమాండ్ రిపోర్టులో చేర్చినట్లుగా పోలీసులు తెలిపారు.&lt;br /&gt;&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;ఇటీవల ఏలూరులో జరిగిన దళిత క్రైస్తవ సమావేశంలో రావణ్ రెచ్చగొట్టేలా మాట్లాడారు. రావణ్ అవమానకరమైన, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. పదవుల్లో ఉన్న వారిని రావణ్ దూషించారు. రావణ్&amp;zwnj;, వ్యవస్థలపై ప్రజల్లో ద్వేషం, వైషమ్యాలు సృష్టిస్తున్నారు.మావోయిస్ట్ హిడ్మాను కీర్తిస్తూ రావణ్&amp;zwnj; ప్రసంగాలు చేశారు. మావోయిస్టు భావజాలాన్ని రావణ్ ఫోన్&amp;zwnj;లో గుర్తించాం. దేవుళ్లను అవమానించడం, కించపరచడమే లక్ష్యంగా రావణ్ పని చేస్తున్నారు. రావణ్ పేరు పెట్టుకోవడం కూడా అందులో భాగమే. రావణ్&amp;zwnj;కు సహకరిస్తున్న వ్యక్తులు ఎవరో తేల్చాల్సి ఉంది. నిందితుడు రావణ్&amp;zwnj; విచారణకు సహకరించటం లేదని పోలీసులు తెలిపారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;జోసఫ్ రావణ్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా పదే పదే సాయుధ తిరుగుబాట్లను ప్రేరేపించేలా, ప్రభుత్వ వ్యవస్థలను కూల్చివేయాలనేలా మాట్లాడిన వీడియోలను పోలీసులు కోర్టుకు సమర్పించారు. వాక్ స్వాతంత్య్రం ముసుగులో సమాజంలో తీవ్రవాద ఆలోచనలను చొప్పించే ప్రయత్నం ఇక్కడ జరిగిందని పోలీసులు నిరూపించారు. &amp;nbsp;రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్న మరికొన్ని సంచలన వివరాల ప్రకారం.. ఈ నిందితుడు కేవలం ఒక సాధారణ యూట్యూబర్ కాదని, ఒక పక్కా ప్రణాళిక ప్రకారం వ్యవస్థలను టార్గెట్ చేసే &amp;nbsp;సైబర్ టెర్రరిజం కు పాల్పడ్డాడని వివరించారు. ముఖ్యంగా డిప్యూటీ సీఎం &lt;a title=&quot;పవన్ కల్యాణ్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Pawan-Kalyan&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;పవన్ కల్యాణ్&lt;/a&gt; భార్యపై లైవ్ పెట్టి దాడి చేస్తానంటూ ప్రకటించడం వెనుక.. అభిమానులను రెచ్చగొట్టి రాష్ట్రవ్యాప్తంగా అల్లర్లు సృష్టించాలనే కుట్ర ఉందని పేర్కొన్నారు. నిందితుడి మొబైల్ ఫోన్, ల్యాప్&amp;zwnj;టాప్ డేటాను విశ్లేషించగా.. కొన్ని అరాచక శక్తులతో ఇతనికి నిరంతరం సంబంధాలు ఉన్నట్లు డిజిటల్ సాక్ష్యాలు లభించాయని, అందుకే సాధారణ బెయిల్ రాని విధంగా ఉపా చట్టాన్ని వర్తింపజేశామని పోలీసులు రిపోర్టులో స్పష్టం చేశారు.&lt;/p&gt;
&lt;p&gt;జోసఫ్ రావణ్&amp;zwnj;కు 14 రోజుల రిమాండ్ విధించడంతో.. అతని వెనుక ఉండి నడిపించిన రాజకీయ మాస్టర్ మైండ్స్ గుండెల్లో ఇప్పుడు రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ 14 రోజుల రిమాండ్ సమయంలో నిందితుడిని మరింత లోతుగా విచారించేందుకు పోలీసులు త్వరలోనే పోలీస్ కస్టడీ &amp;nbsp;పిటిషన్ వేయనున్నారు. సోషల్ మీడియా దుర్భాషలను, దేశ వ్యతిరేక శక్తుల కుట్రలను అణచివేయడానికి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక టాస్క్ ఫోర్స్.. ఈ కేసు ద్వారా సోషల్ మీడియా ముసుగులో ఉన్న అరాచక శక్తులకు గట్టి హెచ్చరిక పంపినట్లయింది. ఎంతటి వారైనా దేశ భద్రతతో, సమాజ శాంతితో ఆడుకుంటే ఉపా &amp;nbsp;వంటి కఠిన చట్టాల కింద జీవితాంతం కటకటాల వెనక్కే వెళ్లాల్సి వస్తుందని ఈ పరిణామం రుజువు చేస్తోంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe class=&quot;vidfyVideo&quot; style=&quot;border: 0px;&quot; src=&quot;https://telugu.abplive.com/web-stories/health/who-invented-the-condom-252681&quot; width=&quot;631&quot; height=&quot;381&quot; scrolling=&quot;no&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/06/e2372f97477a18f7438ecdbfcebf30d11783339411169228_original.png" width="220"/></item><item><title><![CDATA[Sugali Parvathi Devi On Pawan Kalyan:  సుగాలి ప్రీతి కేసులో బిగ్ ట్విస్ట్! మోసం చేశారని పవన్ కల్యాణ్‌పై ఫిర్యాదు!]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/vijayawada/sugali-parvati-devi-has-filed-a-complaint-against-andhra-pradesh-deputy-cm-pawan-kalyan-alleging-fraud-in-sugali-preethi-case-252693</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/vijayawada/sugali-parvati-devi-has-filed-a-complaint-against-andhra-pradesh-deputy-cm-pawan-kalyan-alleging-fraud-in-sugali-preethi-case-252693#respond</comments><pubDate>Mon, 6 Jul 2026 16:19:46 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ విజయవాడ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/vijayawada/sugali-parvati-devi-has-filed-a-complaint-against-andhra-pradesh-deputy-cm-pawan-kalyan-alleging-fraud-in-sugali-preethi-case-252693</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Sugali Parvathi Devi On Pawan Kalyan: &lt;/strong&gt;సుగాలి ప్రీతి కేసులో ఆమె తల్లి పార్వతీదేవి పోరాటం కొనసాగుతోంది. ఆమె మరోసారి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం &lt;a title=&quot;పవన్ కల్యాణ్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Pawan-Kalyan&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;పవన్ కల్యాణ్&lt;/a&gt;&amp;zwnj;ను మరోసారి టార్గెట్ చేశారు. తన కుమార్తె మరణాన్ని రాజకీయంగా వాడుకున్నారని మండిపడ్డారు. అంతే కాకుండా న్యాయం చేస్తానని చెప్పి మోసం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడ పోలీసులతో వాగ్వాదానికి దిగారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;&quot;మొదటి సంతకమని మోసం చేశారు&quot;&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్&amp;zwnj;పై కేసు నమోదు చేయాలని సుగాలి ప్రీతి తల్లి పార్వతీదేవి గన్నవరం పోలీసులను ఆశ్రయించారు. చీటింగ్, నమ్మక ద్రోహం సహా పలు ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. అధికారంలోకి వస్తే మొదటి సంతకం &amp;nbsp;సుగాలి ప్రీతి కేసుపైనే పెడతానని తనకు మాట ఇచ్చారని వెల్లడించారు. డిప్యూటీ సీఎం అయిన తర్వాత మాట మార్చారు అని సుగాలి పార్వతీదేవి ఆరోపించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/06/6870e3875f4832eeac9910d2173d5a471783334843682215_original.png&quot; /&gt;&lt;/p&gt;
&lt;h2&gt;&quot;డబ్బుల కోసం నిందితులతో కుమ్మక్కయ్యారు&quot;&lt;/h2&gt;
&lt;p&gt;తన కుమార్తె మరణాన్ని రాజకీయానికి వాడుకుని పవన్ మోసం చేశారని ఫిర్యాదులో వెల్లడించారు. పవన్ కళ్యాణ్ పై చీటింగ్ , నమ్మకద్రోహం , బహిరంగ విమర్శ, ఆదివాసీ బిడ్డ మరణంపై అసత్య ఆరోపణలు చేశారు., డబ్బులు తీసుకొని నిందితులతో కుమ్మక్కైన విధానం, మొదటి సంతకం అంటూ మోసం చేసిన తీరుపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్&amp;zwnj;లో తెలిపారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/06/0f609db08e5beb6e379b8777b553c9551783334867323215_original.png&quot; /&gt;&lt;/p&gt;
&lt;h2&gt;పవన్ మాట మార్చారంటూ తీవ్ర విమర్శలు&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;అనంతరం మీడియాతో మాట్లాడుతూ పవన్&amp;zwnj; కల్యాణ్&amp;zwnj;, జనసేన నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. &quot;డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన రాజకీయాల కోసం నా బిడ్డ మరణాన్ని వాడుకున్నారు. నా బిడ్డ మరణంపై ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడినా ఆధారాలతో మాట్లాడమని పవన్ చెబుతున్నారు. అందుకే నేను పవన్ మాట్లాడిన వీడియోల ఆధారంగానే ప్రశ్నిస్తున్నా, సుగాలి ప్రీతిని మానభంగం చేసి చంపేశారని ఓసారి మాట్లాడతారు . సుగాలి ప్రీతి కేసులో ఎలాంటి ఆధారాలు లేవని నిందితులకు క్లీన్ చిట్ ఇస్తున్నారు. అధికారంలోకి వస్తే మొదటి సంతకం సుగాలి ప్రీతి కేసు విచారణ పై చేస్తానన్నారు. అధికారంలోకి వచ్చి డిప్యూటీ సీఎం అవ్వగానే పవన్ కళ్యాణ్&amp;zwnj; మాట మార్చారు. డీఎన్ఏలు లేవు , నిందితులు లేరు , అసలు రేప్ జరగలేదు, సాక్ష్యాలు లేకపోతే ఏం చేస్తానంటున్నారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/06/e74fef9af5116d435e1edca5f5ffe3661783334897732215_original.png&quot; /&gt;&lt;/p&gt;
&lt;h2&gt;న్యాయం చేసే వరకు వదిలిపెట్టబోమంటూ ప్రకటన&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;న్యాయం చేయమని అడిగినప్పుడల్లా తనపై ఎదురు దాడి చేస్తున్నారని సుగాలీ పార్వతీ దేవి మండిపడ్డారు. జనసేన నేతలను ఉసిగొలుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారంతా తనపై మాటల దాడులు చేస్తున్నారని గుర్తు చేశారు. &quot;నేను నా న్యాయం చేయమని అడిగినప్పుడల్లా పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడతారు. జనసేన వాళ్లను ఉసిగొల్పుతారు. ఆ వెంటనే &lt;a title=&quot;జనసేన&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Janasena&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;జనసేన&lt;/a&gt; నేతలు నా పై దాడులకు దిగుతారు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ నాకు న్యాయం చేయాలి&quot; అని అన్నారు.&lt;/p&gt;
&lt;p&gt;ఫిర్యాదు తీసుకునే విషయంలో పోలీస్ స్టేషన్&amp;zwnj;లో కాసేపు గందరగోళం నెలకొంది. చివరకు సుగాలి పార్వతీ దేవి నుంచి పోలీసులు ఫిర్యాదు తీసుకున్నారు. దీంతో ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయారు.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/06/09b5858b172bad9e6a055f5aeb1b46421783334377163215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Software Engineer Murder: భీమవరంలో ఘోరం.. తనను దూరం పెడుతుందని కత్తితో పొడిచి టెకీ దారుణ హత్య]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/rajamundry/software-engineer-ananthavani-brutally-murdered-by-auto-driver-in-bhimavaram-west-godavari-atn-252664</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/rajamundry/software-engineer-ananthavani-brutally-murdered-by-auto-driver-in-bhimavaram-west-godavari-atn-252664#respond</comments><pubDate>Mon, 6 Jul 2026 11:59:00 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ రాజమండ్రి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/rajamundry/software-engineer-ananthavani-brutally-murdered-by-auto-driver-in-bhimavaram-west-godavari-atn-252664</guid><description><![CDATA[&lt;p&gt;భీమవరం: తల్లికి అనారోగ్యం కారణంగా స్వగ్రామంలో ఉంటూ సాఫ్ట్&amp;zwnj;వేర్ ఇంజినీర్&amp;zwnj;గా చేస్తున్న యువతి ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురయ్యారు. కుటుంబంలో సంపాదించే ఒక్కరు ఆమెనే కావడంతో ఆ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం తాడేరు గ్రామానికి చెందిన యువతి కొత్తపల్లి అనంతవాణి(32) హత్యకు గురైంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్&amp;zwnj;లోని ఓ కంపెనీలో సాఫ్ట్&amp;zwnj;వేర్&amp;zwnj; ఇంజినీర్&amp;zwnj;గా పనిచేస్తున్న అనంతవాణి, తన తల్లి తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో గత ఏడాది స్వగ్రామానికి తిరిగి వచ్చారు. ఆమె తండ్రి దివ్యాంగుడు కాగా, తల్లి అనారోగ్యంతో పూర్తిగా మంచానికే పరిమితమయ్యారు. అప్పటినుంచి ఆమె వర్క్&amp;zwnj;ఫ్రం హోం చేస్తూ తల్లిదండ్రుల బాగోగులు చూసుకుంటున్నారు. ఈ క్రమంలో కొర్రపాడుకు చెందిన ఆటో డ్రైవర్&amp;zwnj; తాడేపల్లి శ్యామ్&amp;zwnj;బాబుతో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా స్నేహమై, ఆ తర్వాత ప్రేమగా మారింది. అయితే, ప్రియుడు శ్యామ్&amp;zwnj;బాబుకు గతంలోనే పెళ్లయి ముగ్గురు పిల్లలు ఉన్నారని ఆలస్యంగా తెలుసుకుంది. తాను మోసపోయానని గ్రహించి, అప్పటినుంచి శ్యాం బాబును &amp;nbsp;పూర్తిగా దూరం పెట్టడం ప్రారంభించారు.&lt;/p&gt;
&lt;p&gt;దీంతో అనంతవాణిపై తీవ్ర పగ పెంచుకున్న శ్యామ్&amp;zwnj;బాబు ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున నేరుగా ఆమె ఇంటికి వెళ్లి తలుపు తట్టాడు. అనంతవాణి నిద్రలేచి తలుపు తీయగా శ్యామ్&amp;zwnj;బాబు తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. కత్తిపోట్లతో తీవ్రరక్తస్రావం అయిన అనంతవాణిని గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే దురదృష్టవశాత్తూ మార్గమధ్యంలోనే చనిపోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. పోస్టుమార్టం తరువాత అనంతవాణి మృతదేహాన్ని పోలీసులు ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనపై ఆమె తండ్రి వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదుతో ఏఎస్సై వైవీ సత్యనారాయణ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;కుటుంబానికి ఏకైక ఆధారం ఆమె..&lt;/strong&gt;&lt;br /&gt;అనంతవాణి ఆ కుటుంబానికి ఏకైక ఆర్థిక ఆధారంగా నిలిచారు. దీంతో ఆమె సాఫ్ట్&amp;zwnj;వేర్ ఉద్యోగం చేస్తూ వచ్చిన జీతంతోనే తల్లిదండ్రులను పోషిస్తున్నారు. బ్యాంకు లోన్ తీసుకుని కుటుంబం కోసం ఇల్లు కట్టిందని స్థానికులు తెలిపారు. అనారోగ్యంతో ఉన్న తల్లిని కంటికి రెప్పలా చూసుకునేందుకే ఆమె హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి జాబ్ చేస్తున్నారు. కుమార్తెపై దాడి చేసి చంపుతున్నా అడ్డుకునే పరిస్థితులో లేమని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారని స్థానికులు చెప్పుకొచ్చారు.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/06/d265b22d8d185a911fdc45f992bd52931783318827548233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Kesineni Nani Vs Kesineni Chinni: విజయవాడలో కాల్ మనీ రాకెట్ - ఎంపీ కేశినేని చిన్నిపై సీఎం చంద్రబాబుకు కేశినేని నాని సంచలన లేఖ]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/vijayawada/kesineni-nani-writes-sensational-letter-to-cm-chandrababu-alleging-call-money-syndicate-by-mp-kesineni-chinni-252662</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/vijayawada/kesineni-nani-writes-sensational-letter-to-cm-chandrababu-alleging-call-money-syndicate-by-mp-kesineni-chinni-252662#respond</comments><pubDate>Mon, 6 Jul 2026 11:14:04 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ విజయవాడ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/vijayawada/kesineni-nani-writes-sensational-letter-to-cm-chandrababu-alleging-call-money-syndicate-by-mp-kesineni-chinni-252662</guid><description><![CDATA[&lt;p&gt;Kesineni Nani Letter To CM Chandrababu | విజయవాడ: కేశినేని బ్రదర్స్ మధ్య వివాదం సీఎం చంద్రబాబు వరకు వెళ్లింది. కొంతకాలం నుంచి &lt;a title=&quot;టీడీపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/tdp&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;టీడీపీ&lt;/a&gt; ఎంపీ కేశినేని చిన్ని, ఆయన సోదరుడు మాజీ ఎంపీ కేశినేని నాని మధ్య వివాదం కొనసాగుతోంది. ఆరోపణలు, విమర్శలు చేసుకుంటూ ఇప్పుడు ప్రభుత్వానికి ఫిర్యాదు చేసే వరకు వెళ్లింది. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో కాల్ మనీ సిండికేట్ తిరిగి కోరలు చాస్తోందని, అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఎంపీ కేశినేని చిన్ని, ఆయన సన్నిహితుడు ముల్పూరి కిశోర్ అరాచకాలు సాగిస్తున్నారని మాజీ ఎంపీ కేశినేని నాని ముఖ్యమంత్రి చంద్రబాబుకి సంచలన లేఖ రాశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;గాయత్రీ నగర్&amp;zwnj;కు చెందిన మహిళా వ్యాపారవేత్త చాగర్ల గాయత్రిని ఎంపీ కేశినేని చిన్ని, ఆయన ముఖ్య అనుచరుడు ముల్పూరి కిశోర్ ఇద్దరూ నేరుగా ఫోన్లలో బెదిరిస్తున్నారని నాని తీవ్ర ఆరోపణలు చేశారు. బాధితురాలు తన వ్యాపార అవసరాల కోసం రూ. 5 కోట్లు అప్పుగా తీసుకుని, అసలు వడ్డీ కలిపి మొత్తం రూ. 21 కోట్లు చెల్లించినప్పటికీ నిందితులు వెనిగళ్ల హర్షవర్ధన్, వెనిగళ్ల హరినాథ్ లు వదలకుండా అదనంగా మరో రూ. 5 కోట్లు డిమాండ్ చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;సేల్ డీడ్&amp;zwnj;ను రద్దు చేయడం లేదు, డాక్యుమెంట్స్ ఇవ్వకుండా వేధింపులు&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;అప్పు తీసుకున్న సమయంలో కేవలం గ్యారెంటీ కోసమే కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలోని తన 11 ఎకరాల వ్యవసాయ పొలాన్ని నిందితుల పేరిట సేల్ డీడ్ చేశారని, రూ. 21 కోట్లు పూర్తిగా తిరిగి చెల్లించినా ఆ సేల్ డీడ్&amp;zwnj;ను రద్దు చేయకుండా, పొలం పత్రాలు ఇవ్వకుండా నిరాకరిస్తున్నారని నాని తెలిపారు. ఎంపీ కేశినేని చిన్ని అధికారిక హోదాను అడ్డుపెట్టుకుని, ఫోర్జరీ పత్రాల ద్వారా ఆ భూమిని ఇతరులకు అమ్మేయడానికి, రికార్డులను బలవంతంగా మార్చి మ్యుటేషన్ చేయించడానికి రెవెన్యూ అధికారులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని ధ్వజమెత్తారు. బాధితురాలు గాని, ఆమె పొలం కార్మికులు గాని ఆ భూమిలోకి అడుగుపెడితే చంపేస్తామని గూండాలు నేరుగా బెదిరిస్తున్నారని ఎండగట్టారు. గత మే 27న బాధితురాలి ఇంట్లోకి చొరబడి, ఆమెపై, ఆమె కుమార్తెలపై భౌతిక దాడికి దిగి, సంతకాల కోసం అత్యాచారం మరియు ప్రాణ బెదిరింపులకు పాల్పడిన నిందితులపై మాచవరం పోలీస్ స్టేషన్ లో FIR నమోదైనప్పటికీ, ఎంపీ కార్యాలయం ఒత్తిడితో పోలీసులు నిందితులను అరెస్ట్ చేయకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు.&lt;/p&gt;
&lt;p&gt;Also Read: &lt;a href=&quot;https://telugu.abplive.com/andhra-pradesh/visakhapatnam/6-fishermen-missing-after-boat-capsizes-near-visakhapatnam-coast-252644&quot; target=&quot;_blank&quot; rel=&quot;noopener&quot;&gt;Vizag Fishermen Missing: విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు గల్లంతు, మరో వ్యక్తిని కాపాడిన సిబ్బంది&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;ప్రైవేట్ గూండా సైన్యంగా టాస్క్ ఫోర్స్ పోలీసులు&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;ముల్పూరి కిశోర్ సిటీ టాస్క్ ఫోర్స్ పోలీసులను తన ప్రైవేట్ గూండా సైన్యంగా మార్చుకున్నారని, వారి మాట వినని సామాన్య విజయవాడ పౌరులను అర్ధరాత్రి వేళల్లో అనధికారిక తనిఖీలతో, చట్టవిరుద్ధ స్టేషన్ నిర్బంధాలతో వేధిస్తూ నగరంలో భయాందోళన వాతావరణం సృష్టిస్తున్నారని కేశినేని నాని ఆరోపించారు. కాల్ మనీ దందాతో పాటు నియోజకవర్గంలో అక్రమ ఇసుక రవాణా, ఫ్లై యాష్ అక్రమ డంపింగ్, గ్రావెల్ మైనింగ్ మరియు గ్రామీణ ప్రాంతాల్లో భారీ జూద స్థావరాలను నడుపుతూ ముల్పూరి కిశోర్ సమాంతర చీకటి ఆర్థిక వ్యవస్థను నడుపుతున్నారని ఎండగట్టారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;పీడీ యాక్ట్ ప్రయోగించి జైలుకు పంపాలి&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఈ క్రమంలో విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని సామాన్య ప్రజలను కాపాడటానికి, వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్న హ్యాబిచువల్ అఫెండర్ ముల్పూరి కిశోర్ పై తక్షణమే పీడీ యాక్ట్ ప్రయోగించి జైలుకు పంపాలని కేశినేని నాని డిమాండ్ చేశారు. గతంలో 2015 లో విజయవాడలో కాల్ మనీ సిండికేట్ నడుము విరిచినట్లే, ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు తక్షణమే రంగంలోకి దిగి ఎంపీ కార్యాలయం రక్షణ కవచాన్ని ఛేదించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎంపీ మరియు ఆయన అనుచరుడి నుండి నేరుగా ప్రాణభయం ఎదుర్కొంటున్న శ్రీమతి చాగర్ల గాయత్రి కుటుంబానికి, ఆమె పొలం కార్మికులకు తక్షణమే రౌండ్-ది-క్లాక్ పోలీస్ రక్షణ కల్పించడంతో పాటు ఆమె 11 ఎకరాల ఆస్తి కబ్జా అవ్వకుండా రక్షణ ఇవ్వాలని, అలాగే రాజకీయ ఒత్తిళ్లకు లొంగి నిందితులకు కొమ్ముకాస్తూ, అమాయకులను వేధించిన టాస్క్ ఫోర్స్, స్థానిక పోలీసు అధికారిపై విభాగాంతర దర్యాప్తు జరపాలని సీఎం &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt;ను తన లేఖలో కోరారు.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/06/cbc9bd3416ec16b4112ed0579713a6d31783316554489233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Breaking News: ఏపీ లిక్కర్ రవాణా స్కామ్ కేసులో రాజ్ కెసిరెడ్డి బెయిల్ పిటిషన్- విచారణ 13కి వాయిదా!]]></title><link>https://telugu.abplive.com/news/today-top-stories-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-6th-july-2026-252660</link><comments>https://telugu.abplive.com/news/today-top-stories-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-6th-july-2026-252660#respond</comments><pubDate>Mon, 6 Jul 2026 10:34:22 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ న్యూస్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/today-top-stories-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-6th-july-2026-252660</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Top Stories | ఈరోజు వార్తల ముఖ్యాంశాలు..&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;h2&gt;AP Liquor Scam: ఏపీ లిక్కర్ రవాణా స్కామ్ కేసులో రాజ్ కెసిరెడ్డి బెయిల్ పిటిషన్- విచారణ 13కి వాయిదా!&lt;/h2&gt;
&lt;p&gt;AP Liquor Scam: ఏపీ లిక్కర్ రవాణా స్కామ్ కేసులో రాజ్ కెసిరెడ్డి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని నాంపల్లి కోర్టులో A-2 రాజ్ కెసిరెడ్డి పిటిషన్ వేశారు. బెయిల్ పిటిషన్&amp;zwnj;పై విచారణను నాంపల్లి కోర్టు &amp;nbsp;ఈ నెల 13కు వాయిదా వేసింది. నిందితులు వాసుదేవరెడ్డి, రాజ్ కెసిరెడ్డి, కారుమూరి సునీల్&amp;zwnj;ను వారం రోజులు కస్టడీ కోరుతూ ఈడీ మరో పిటిషన్ వేసింది. దీనిపై విచారణ రేపటికి వాయిదా పడింది. &amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;కన్నెపల్లి పంప్ హౌస్ మోటర్లు ఆన్ చేయండి, ఏదైనా జరిగితే బీఆర్ఎస్&amp;zwnj;దే బాధ్యత &amp;ndash; జగదీష్ రెడ్డి&lt;/h2&gt;
&lt;p&gt;కన్నెపల్లి పంప్ హౌస్ మోటర్లను వెంటనే ఆన్ చేయడం ద్వారా రాష్ట్రాన్ని సూపర్ ఎల్&amp;zwnj;నినో ప్రభావం నుండి, కరవు పరిస్థితుల నుండి రక్షించవచ్చని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. పంప్ ఆన్ చేసి నీళ్లు నింపాలని, ప్రాజెక్టుకు ఏమైనా జరిగితే &lt;a title=&quot;బీఆర్ఎస్ పార్టీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/BRS-Party&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;బీఆర్ఎస్ పార్టీ&lt;/a&gt;దే బాధ్యత అని, రాజీకీయాల నుంచి తప్పుకుంటామని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తాము చేపట్టిన కన్నెపల్లి పంప్ హౌస్ సందర్శనపై ప్రభుత్వం తరఫున నలుగురు మంత్రులు స్పందించారని ఆయన గుర్తు చేశారు. అయితే, ఆ మంత్రులలో ఒక్కరు కూడా తెలంగాణ బిడ్డలమనే కనీస అవగాహన, బాధ్యతతో మాట్లాడలేకపోయారని ఆయన తీవ్రంగా విమర్శించారు.&lt;/p&gt;
&lt;p&gt;రైతుల ప్రయోజనాలను పక్కనబెట్టి మంత్రులంతా కేవలం పాత సొల్లు, బూతు పురాణాలతోనే కాలక్షేపం చేస్తూ రాజకీయం చేస్తున్నారని జగదీష్ రెడ్డి మండిపడ్డారు. ప్రాణహిత నది గోదావరిలో కలిసే ప్రదేశంలోనే ఎల్లప్పుడూ నీళ్లు అందుబాటులో ఉంటాయనే శాస్త్రీయ దృక్పథంతోనే మాజీ ముఖ్యమంత్రి &lt;a title=&quot;కేసీఆర్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/kcr&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కేసీఆర్&lt;/a&gt; సరిగ్గా అదే ప్రాంతంలో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని ఆయన సమర్థించారు.&lt;/p&gt;
&lt;h2&gt;రేపు, ఎల్లుండి వైఎస్సార్ జిల్లాలో వైయస్ జగన్ పర్యటన&lt;/h2&gt;
&lt;p&gt;వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు, ఎల్లుండి (జూలై 7, 8 తేదీల్లో) వైఎస్సార్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రేపు (జూలై 7న) పులివెందులలోని భాకరాపురం క్యాంప్ కార్యాలయంలో నిర్వహించే ప్రజాదర్భార్&amp;zwnj;లో పాల్గొని, ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తారు. అనంతరం ఎల్లుండి (జూలై 8న) వైఎస్సార్ జయంతిని పురస్కరించుకుని ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని ఘనంగా నివాళులర్పిస్తారు. ఈ కార్యక్రమాలు ముగిసిన తర్వాత ఆయన ఇడుపులపాయ నుంచి నేరుగా బెంగళూరుకు తిరుగు ప్రయాణమవుతారు.&lt;/p&gt;
&lt;h2&gt;సంథ్య థియేటర్ ఘటన.. అల్లు అర్జున్&amp;zwnj;కు స్వల్ప ఊరట..&lt;/h2&gt;
&lt;p&gt;సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసుపై సోమవారం నాంపల్లి కోర్టు లో విచారణ జరిగింది. టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ కు వర్చువల్ గా అటెండ్ అవ్వడానికి నాంపల్లి కోర్టు అనుమతించింది. నేడు జరిగిన విచారణకు కొంత మంది నిందితులు వ్యక్తిగత కారణాలతో విచారణకు హాజరు కాకపోవడంతో తదుపరి విచారణ ఈ నెల 29 కి వాయిదా వేసింది. 23 మంది నిందితులకు 500 పేజీల ఛార్జ్ షీట్ కాపీలను పబ్లిక్ ప్రాసిక్యూటర్ అందజేశారు. ముంబై షూటింగ్ లో ఉండడం తో అల్లు అర్జున్2కు వర్చువల్ గా హాజరుకు కోర్టు పర్మిషన్ ఇచ్చింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;&lt;strong&gt;ఆక్వా రైతుల పోరాటానికి వైఎస్సార్సీపీ సంఘీభావం.. ఈ 15న భీమవరంలో వైఎస్ జగన్ పర్యటన&lt;/strong&gt;&lt;/h2&gt;
&lt;p&gt;ఆక్వా రైతుల పోరాటానికి వైఎస్సార్సీపీ పూర్తి సంఘీభావం ప్రకటించింది. ఇందులో భాగంగా ఈ నెల 15వ తేదీన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భీమవరంలో పర్యటించనున్నారు. ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి డిమాండ్లకు మద్దతుగా ఈ పర్యటన సాగనుంది. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఆక్వా రైతులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని వైఎస్ జగన్ డిమాండ్ చేయనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన నేరుగా ఆక్వా రైతులతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకోనున్నారు. భీమవరంలో జరగబోయే వైఎస్ &lt;a title=&quot;జగన్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/cm-jagan&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;జగన్&lt;/a&gt; పర్యటనను విజయవంతం చేసేందుకు వైఎస్సార్సీపీ శ్రేణులు ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి&lt;/p&gt;
&lt;h2&gt;&lt;strong&gt;పులివెందులలో రోడ్డుపైనే ఊడిపోయిన స్కూల్ బస్ టైర్లు&lt;/strong&gt;&lt;/h2&gt;
&lt;p&gt;కడప జిల్లా పులివెందులలో ఒక స్కూల్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. బస్సు వెళ్తుండగా అకస్మాత్తుగా రెండు టైర్లు విడిపోయాయి. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది విద్యార్థులు ఉన్నప్పటికీ, ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బస్సుల ఫిట్నెస్ టెస్ట్ ఎందుకు చేయడం లేదని, ప్రైవేటుకు బాధ్యతలు అప్పగించడం వల్లే ఇలాంటి నిర్లక్ష్యం జరుగుతోందని విమర్శలు వస్తున్నాయి.&lt;/p&gt;
&lt;h2&gt;విజయవాడలో కాల్ మనీ రాకెట్&amp;ndash; ఎంపీ కేశినేని చిన్ని, ముల్పూరి కిశోర్&amp;zwnj;లపై సీఎంకు కేశినేని నాని లేఖ&lt;/h2&gt;
&lt;p&gt;విజయవాడలో &quot;కాల్ మనీ&quot; సిండికేట్ పేరిట ఎంపీ కేశినేని చిన్ని, ఆయన అనుచరుడు ముల్పూరి కిశోర్ సాగిస్తున్న అరాచకాలపై మాజీ ఎంపీ కేశినేని నాని ముఖ్యమంత్రికి లేఖ రాశారు. చాగర్ల గాయత్రి అనే మహిళ రూ. 5 కోట్ల అప్పుకు రూ. 21 కోట్లు చెల్లించినా, అదనంగా మరో రూ. 5 కోట్లు డిమాండ్ చేస్తూ ఆమె 11 ఎకరాల భూమిని కబ్జా చేయడానికి, ప్రాణాలతో బెదిరించడానికి ఎంపీ అనుచరులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కిశోర్&amp;zwnj;పై తక్షణమే పీడీ యాక్ట్ ప్రయోగించాలని, బాధితురాలి కుటుంబానికి రక్షణ కల్పించాలని నాని డిమాండ్ చేశారు.&lt;/p&gt;
&lt;h2&gt;ఒక్క బిల్డింగ్ కూల్చితే వంద కడతాం: అక్బరుద్దీన్ ఒవైసీ&lt;/h2&gt;
&lt;p&gt;హైదరాబాద్: &amp;lsquo;అనాథలు, పేదలకు ఉచిత విద్యనందిస్తున్న భవంతిని కూల్చితే, మరో పది భవంతులు నిర్మిస్తానని&amp;rsquo; చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. బండ్లగూడలో విద్యార్థులకు ఉచిత పుస్తకాలు, దుస్తుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ముస్లింలలో నిరక్షరాస్యతను దూరం చేస్తున్నందుకే కొందరు తనపై కక్ష గట్టారని ఆరోపించారు. ఒకవేళ భవంతులు కోల్పోయినా, విద్యార్థులను చెట్ల కింద కూర్చోబెట్టైనా చదువు చెప్పిస్తానని ఆయన భావోద్వేగంగా పేర్కొన్నారు.&lt;/p&gt;
&lt;h2&gt;&lt;strong&gt;116 ఏళ్ల వృద్ధురాలికి శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించిన టీటీడీ&lt;/strong&gt;&lt;/h2&gt;
&lt;p&gt;ఇటీవల కాలినడకన తిరుమలకు వెళ్తూ సోషల్ మీడియాలో వైరల్ అయిన 116 ఏళ్ల వృద్ధురాలు నవనీతమ్మకు టీటీడీ ప్రత్యేక దర్శన భాగ్యం కల్పించింది. ఆమె భక్తికి చలించిన టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు, ఆమె వివరాలు కనుక్కోవాలని కోరగా.. విజిలెన్స్ అధికారులు ఆమెను చెన్నైకి చెందిన నవనీతమ్మగా గుర్తించారు.&lt;/p&gt;
&lt;p&gt;చైర్మన్ ఆదేశాల మేరకు సోమవారం ఆమె కుటుంబ సభ్యులకు వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేయగా, టీటీడీ ఈఓ ముద్దాడ రవిచంద్ర ఆమెకు పట్టువస్త్రాలు, ప్రసాదాలు అందించి, కాళ్లకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ అద్భుత అవకాశానికి నవనీతమ్మ కుటుంబ సభ్యులు టీటీడీకి ధన్యవాదాలు తెలిపారు.&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/06/bf7cce46c29c35ecccad4f1e266826e21783313067366233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Tirumala News: 116 ఏళ్ల వృద్ధురాలికి శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించిన టీటీడీ]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/tirupati/ttd-chairman-br-naidu-arranges-vip-break-darshan-in-tirumala-for-116-year-old-devotee-252649</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/tirupati/ttd-chairman-br-naidu-arranges-vip-break-darshan-in-tirumala-for-116-year-old-devotee-252649#respond</comments><pubDate>Mon, 6 Jul 2026 08:30:30 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ తిరుపతి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/tirupati/ttd-chairman-br-naidu-arranges-vip-break-darshan-in-tirumala-for-116-year-old-devotee-252649</guid><description><![CDATA[&lt;p&gt;TTD Chairman BR Naidu | తిరుపతి: ఇటీవల కాలినడకన తిరుమలకు కొండపైకి వెళ్తున్న ఒక వందేళ్లు పైగా వయసున్న వృద్ధురాలి వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. శ్రీవేంకటేశ్వర స్వామిపై ఆ 116 ఏళ్ల వృద్ధురాలికి ఉన్న అచంచలమైన భక్తికి ముఖ్యమంత్రి &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt;, అలాగే టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు చలించిపోయారు. ఆ వృద్ధ భక్తురాలితో పాటు ఆమె కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా శ్రీవారి దర్శనం చేయించాలని టీటీడీ చైర్మన్ నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఆమె వివరాలు తెలిస్తే తనకు తెలియజేయాలంటూ ఆయన &amp;nbsp;సోషల్ మీడియా ఎక్స్ ద్వారా నెటిజన్లను విజ్ఞప్తి చేశారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;రంగంలోకి విజిలెన్స్ అధికారులు &amp;ndash; నవనీతమ్మగా గుర్తింపు&lt;/strong&gt;&lt;br /&gt;చైర్మన్ విజ్ఞప్తిపై టీటీడీ విజిలెన్స్ అధికారులు తక్షణమే స్పందించి వివరాల కోసం ప్రయత్నించారు. ఆ వృద్ధురాలిని తమిళనాడు రాజధాని చెన్నైకి చెందిన నవనీతమ్మగా గుర్తించారు. చైర్మన్ ఆదేశాల మేరకు విజిలెన్స్ సిబ్బంది ఆమెను, ఆమె కుటుంబ సభ్యులను సంప్రదించి తిరుమల దర్శనానికి అవసరమైన ఏర్పాట్లు చేశారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/06/f1904d9a780a6cb7998ade8b165e3ee61783306023006233_original.jpg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe title=&quot;YouTube video player&quot; src=&quot;https://www.youtube.com/embed/XfbQLv0EZJ4?si=FpGNNNaudo3k_v8R&quot; width=&quot;560&quot; height=&quot;315&quot; frameborder=&quot;0&quot; allowfullscreen=&quot;allowfullscreen&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;
&lt;p&gt;Also Read: &lt;a href=&quot;https://telugu.abplive.com/spirituality/madurai-meenakshi-temple-architecture-why-does-goddess-appear-in-a-green-hue-know-in-telugu-252602&quot; target=&quot;_blank&quot; rel=&quot;noopener&quot;&gt;మధురై మీనాక్షి అమ్మవారు ఆకుపచ్చ రంగులో ఎందుకు దర్శనమిస్తారు?&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం &amp;ndash; మురిసిపోయిన కుటుంబ సభ్యులు&lt;/strong&gt;&lt;br /&gt;టీటీడీ చైర్మన్ నిర్ణయం ప్రకారం సోమవారం ఉదయం వృద్ధురాలైన నవనీతమ్మతో పాటు ఆమె కుటుంబ సభ్యులకు చైర్మన్ కార్యాలయ సిబ్బంది ప్రత్యేకంగా విఐపీ బ్రేక్ దర్శన భాగ్యాన్ని కల్పించారు. బయోమెట్రిక్ కౌంటర్ వద్ద సిబ్బంది దగ్గరుండి ఆమెను ఆలయంలోనికి తీసుకెళ్లారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో టీటీడీ ఈఓ ముద్దాడ రవిచంద్ర సమక్షంలో వేద పండితులు ఆమెకు వేదాశీర్వచనం చేశారు.&lt;/p&gt;
&lt;p&gt;ఈఓ రవిచంద్ర స్వయంగా వృద్ధురాలికి పట్టువస్త్రం కప్పి, తీర్థప్రసాదాలను అందజేశారు. అంతటితో ఆగకుండా ఆ శతాధిక వృద్ధురాలి కాళ్లకు నమస్కరించి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా నవనీతమ్మ మనవడు దిక్పతీ మాట్లాడుతూ.. &amp;lsquo;ఆ శ్రీనివాసుడి రూపంలో టీటీడీ చైర్మన్ &amp;nbsp;మా అమ్మమ్మకు, మా కుటుంబానికి ఇంతటి అద్భుతమైన దర్శన భాగ్యం కల్పించారు. టీటీడీకి, చైర్మన్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు&amp;rsquo; అంటూ భావోద్వేగానికి లోనయ్యారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/06/d4b4f2248dfdb930d0304ed3be4cb3de1783305627352233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Vizag Fishermen Missing: విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు గల్లంతు, మరో వ్యక్తిని కాపాడిన సిబ్బంది]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/visakhapatnam/6-fishermen-missing-after-boat-capsizes-near-visakhapatnam-coast-252644</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/visakhapatnam/6-fishermen-missing-after-boat-capsizes-near-visakhapatnam-coast-252644#respond</comments><pubDate>Mon, 6 Jul 2026 07:48:45 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ విశాఖపట్నం ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/visakhapatnam/6-fishermen-missing-after-boat-capsizes-near-visakhapatnam-coast-252644</guid><description><![CDATA[&lt;p&gt;Fishermen Missing In Vizag Coast | విశాఖపట్నం చేపల రేవు నుంచి సముద్రంలో వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారుల్లో ఒకరు ప్రాణాలతో బయటపడగా.. ఆరుగురు గల్లంతయ్యారు. మత్స్యకారులు తిరిగి వస్తున్న సమయంలో వీరు ప్రయాణిస్తున్న బోటు శనివారం మధ్యాహ్నం ప్రమాదానికి గురైంది. రేవుకు సుమారు పది నాటికల్ మైళ్ల దూరంలో ఎగిసిపడిన ఒక భారీ అల బలంగా ఢీకొట్టడంతో బోటు తలకిందులైంది. ఈ ప్రమాదంలో ఆరుగురు మత్స్యకారులు సముద్రంలో గల్లంతవగా, బోటు యజమాని కారి చిన్న మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;7 గంటల పాటు సాగిన పోరాటం&lt;/strong&gt;&lt;br /&gt;విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాం గ్రామానికి చెందిన కారి చిన్న (బోటు యజమాని), సీతోడు, చిన్నయ్య, చిన్న అమ్మోరు, అప్పలరాజు, గరగయ్య, భీమిలి మండలానికి చెందిన బండియ్యలు ఉపాధి కోసం విశాఖపట్నం వచ్చి ఇక్కడే నివసిస్తున్నారు. ఈ ఏడుగురు జులై 1న వేటకు వెళ్లారు. శనివారం మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి వస్తుండగా అలల ధాటికి బోటు తిరగబడిన తర్వాత మత్స్యకారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రాత్రి 9 గంటల వరకు ఆ బోటును పట్టుకుని సాయం కోసం ఎదురుచూశారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/06/7d11e94915266e741f1a131f2ad0db961783304300535233_original.png&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఈ క్రమంలో బోటు కూడా మునిగిపోవడంతో వారంతా నీటిపై తేలుతూ ఈత కొట్టారు. దూరంగా పోర్టు యాంకరేజ్ పాయింట్ వద్ద ఉన్న మర్చంట్ నౌక కనిపించడంతో నలుగురు ఆ వైపుగా వెళ్లారు. తీవ్ర అలల తాకిడిని తట్టుకుంటూ బోటు యజమాని కారి చిన్న ఆ నౌక యాంకర్ గొలుసును గట్టిగా పట్టుకోగా, అతడి అరుపులు విన్న నౌక సిబ్బంది లైఫ్&amp;zwnj;జాకెట్ విసిరి రక్షించారు. మిగిలిన వారు అలల ఉధృతికి కొట్టుకుపోయారని చిన్న తెలిపాడు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;కన్నీరుమున్నీరవుతున్న కుటుంబాలు&lt;/strong&gt;&lt;br /&gt;గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల కోసం కోస్టుగార్డు నౌకలు, హెలికాప్టర్లు, మెరైన్ పోలీసులు, నేవీ సిబ్బంది రంగంలోకి దిగి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. బోటు చివరిసారిగా ప్రయాణించిన దిశ, సిగ్నల్స్ ఆధారంగా కాకినాడ నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. కాగా, గల్లంతైన వారిలో ఆరుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో తీవ్ర విషాదం నెలకొంది. అలల ఉధృతి అధికం కావడంతో ఇంటికి వచ్చేస్తున్నాం అని శనివారం మధ్యాహ్నం ఫోన్ చేసిన వారు ఎంతకు తిరిగి రాకపోవడంతో, బాధితుల భార్యలు, పిల్లలు, బంధువులు చేపల రేవు వద్ద కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గంటలో తీరానికి చేరుకుంటామని చెప్పారు. కానీ బోటు తిరగబటడంతో వారు గల్లంతై ప్రమాదంలో చిక్కుకున్నారు.&lt;/p&gt;
&lt;p&gt;Also Read:&amp;nbsp;&lt;a href=&quot;https://telugu.abplive.com/andhra-pradesh/vijayawada/uapa-and-sedition-case-registered-against-youtuber-prashna-ravan-in-gannavaram-252599&quot; target=&quot;_blank&quot; rel=&quot;noopener&quot;&gt;Prashna Ravan Sedition Case: ప్రశ్న రావణ్&amp;zwnj;పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;ప్రమాదం గురించి సమాచారం అందుకున్న సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. కుప్పం పర్యటనలో ఉన్న సీఎం &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt;.. విశాఖ కలెక్టర్, సీపీలతో మాట్లాడి నేవీ, మెరైన్ పోలీసుల సమన్వయంతో గాలింపు ముమ్మరం చేయాలని ఆదేశించారు. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి అచ్చెన్నాయుడు మత్స్యశాఖ అధికారులను అప్రమత్తం చేయగా, హోంమంత్రి అనిత, ఇన్&amp;zwnj;ఛార్జి మంత్రి బాల వీరాంజనేయస్వామి ఘటనపై ఆరా తీశారు. కాగా, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చేపలరేవుకు చేరుకుని బాధిత కుటుంబాలను పరామర్శించి, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.&lt;br /&gt;&lt;br /&gt;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/06/13d0f4096364067e22b7fc58d06705631783304051950233_original.jpg" width="220"/></item></channel></rss>