YSRCP News:   కంటి పరిక్షలు కోసమే చంద్రబాబుకు కోర్టు బెయిల్ ఇచ్చిందని, మళ్లీ చంద్రబాబు నాయుడు జైల్ కు పోవడం‌ ఖాయంమని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి జోస్ంయ చెప్పారు. మళ్లీ జైలుకు వెళ్లకుండా ఉండేందుకు   రేపు గుండెనొప్పి వస్తుందని చెబుతాడని ఆరోపించారు.  బుధవారం తిరుపతి కలెక్టర్ కార్యాలయం వద్దకు వచ్చిన నారాయణ స్వామి మీడియాతో మాట్లాడారు.  భువనేశ్వరి చంద్రబాబును పెళ్ళాడిన తర్వాత ఎలా నిజం గెలస్తా వచ్చిందో ఆమె ఆలోచించించిమె చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.


భువనేశ్వరి నిజం చెప్పాలన్న నారాయణ స్వామి                                          


నారా భువనేస్వరకి జన్మనిచ్చిన తండ్రి తెలుగుదేశం పార్టీని స్ధాపించారన్నారు.  కాంగ్రెస్ పార్టీని భూస్ధాపితం చేసి చరిత్రను సృష్టించిన వాడని, అదే విధంగా బీసీల కోసం తపన పడిన వ్యక్తని, ఒక్క పైసా ఖర్చులేకుండా పార్టీని పైకి తీసుకుని వచ్చారని , కేవలం ఎనిమిది నెలల్లోనే పార్టీని స్ధాపించి సీఎం అయిన మహా నాయకుడు‌ ఎన్టీఆర్ అని ఆయన కొనియాడారు.   భువనేశ్వరి భర్త కాంగ్రెస్ లో ఉంటే, అల్లుడని టిడిపికి తీసుకొచ్చిన తర్వాత ఎన్టీఆర్ ను చంద్రబాబు ఏం చేసాడో భువనేశ్వరి నిజం చెప్పాలని నారాయణ డిమాండ్ చేశారు . 


ఇన్నాళ్లూ కోర్టలను మేనేజే చేసిన చంద్రబాబు                   


ఔరంగజేబును తల దన్నే వ్యక్తి చంద్రబాబు ఒక్కడేనని, ఔరంగజేబు పదవి కోసం తండ్రిని జైల్ లో‌ పెట్టడమే‌ కాకుండా, సోదరులను చంపిన నికృష్టుడు ఔరంగజోబు అని, ఔరంగజేబు లాంటి ఆలోచన కలిగి నాయకుడు చంద్రబాబు అని, ఇన్నాళ్ళు చంద్రబాబు కోర్టులను మ్యానెజ్ చేసుకుంటూ వచ్చాడని, ఇప్పుడు కంటి పరీక్ష కోసం మాత్రమే చంద్రబాబుకు కోర్టు  చంద్రబాబుకు బెయిల్ ఇచ్చిందే గానీ, పరీక్షలు తరువాత మళ్ళీ చంద్రబాబు జైలు కే పోవాలన్నారు.. ఈ రోజు కంటి పరీక్షలు అన్నారు.. రేపు హార్ట్ ఎటాక్ అంటారు..మళ్ళీ కిడ్ని అంటారు.. తరువాత దేశంలోని రోగాలు ఉన్నాయాని చెబుతూ బెయిల్ కోసం డ్రామాలు ఆడుతారని ఆయన విమర్శించారు. మరి కళ్ళు, లివర్, హార్ట్ పని చేయకుండా ఉండేవారు ఎలా రాష్టాన్ని పరిపాలిస్తాడని ఆయన ప్రశ్నించారు. 


టీడీపీ నేతలు హమాస్ ఉగ్రవాదులు                          


హమాస్ ఉగ్రవాదుల్లా టిడిపి నేతలు ఆలోచిస్తున్నారని, చంద్రబాబుది అవినీతి‌ గ్రూపులని, నిజం గెలవాలనే భువనేశ్వరి, చంద్రబాబు చేసినా మోసాన్ని గ్రహించాలని, చంద్రబాబు చేసినా అక్రమాలు, దౌర్జన్యాలు నిజామా కాదా అనేది భువనేశ్వరి చెప్పాలని ఏపి డెప్యూటీ సీఎం‌ నారాయణ స్వామి‌ డిమాండ్ చేశారు. చంద్రాబబుపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంలో  నారాయమ స్వామి ముందు ఉంటారు. ఈ క్రమంలో ఒక్కో సారి నోరు జారి చంద్రబాబు పేరు స్థానంలో జగన్ పేరు ను చెబుతూ ఉంటారు.