జర్నలిస్టుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ తొలిసారిగా జర్నలిజంలో సర్టిఫికేట్ కోర్సు ప్రారంభించింది. నెల్లూరు విక్రమసింహపురి విశ్వవిద్యాలయం సహకారంతో ఈ కోర్సు నిర్వహిస్తోంది. కోర్సు రూపకల్పన , తరగతుల నిర్వహణ ప్రెస్ అకాడమీ చూసుకుంటే… పరీక్షలు మాత్రం విక్రమసింహపురి విశ్వవిద్యాలయం నిర్వహించి సర్టిఫికెట్లు అందించనుంది.




రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి ఉన్న జర్నలిస్టులు ఎవరైనా ఈ కోర్సులో అడ్మిషన్ తీసుకోవచ్చు. కోర్సులో భాగంగా విద్యార్థులకు అవసరమైన మెటీరియల్ అందించడంతో పాటు ఆన్ లైన్ లో తరగతులు  నిర్వహించనున్నారు. ఇప్పటికే పాత్రికేయ వృత్తిలో ఉన్నవారు, ఆ రంగంలోకి ప్రవేశించాలనుకున్నవారు… ప్రాథమిక అంశాలపై అవగాహన పెంచుకునేందుకు ఈ కోర్సు ఉపయోగపడుతుందన్నారు.




జర్నలిజంలో వస్తున్న మార్పులు, చోటు చేసుకుంటున్న అనేక అంశాలపై నిపుణులైన అధ్యాపకులు రాసే పాఠ్యాంశాలతో పాటు నిష్ణాతులైన జర్నలిస్టులు నిర్వహించే తరగతుల వల్ల లబ్ధిపొందే అవకాశం ఉంటుందని ప్రెస్ అకడామీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో వివిధ విశ్వవిద్యాలయాలతో అవగాహాన ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో ఆయా యూనివర్సిటీల సహకారంతో ఈ కోర్సులు నిర్వహిస్తున్నామన్నారు.




కేవలం మూడు నెలలే…


రెండేళ్లు కాదు…ఏడాది కాదు… జర్నలిజం సర్టిఫికేట్ కోర్సు కేవలం మూడు నెలలు మాత్రమే. 3 నెలల కాల పరిమితితో నిర్వహించే జర్నలిజం సర్టిఫికెట్ కోర్సులో అడ్మిషన్ తీసుకున్న వారికి ఆన్ లైన్ లో తరగతులు ముగిశాక నెల్లూరులో విక్రమసింహపురి విశ్వవిద్యాలయం పరీక్షలు నిర్వహిస్తోంది. విద్యార్థుల సంఖ్య ఆధారంగా పరీక్ష కేంద్రాలను యూనివర్సిటీ నిర్ణయిస్తుంది.  విద్యార్థులు అడ్మిషన్ ధరఖాస్తులో రాసే ఫోన్ నంబర్ కు మెయిల్ ఐడీకి ఎప్పడికప్పుడు సమాచారం అందిస్తుంటామన్నారు విక్రమసింహాపురి విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఎల్.విజయ్ కృష్ణా రెడ్డి.




సర్టిఫికెట్ కోర్సు ఇన్ జర్నలిజం:


విద్యార్హత                                                : ఇంటర్మీడియట్


నోటిఫికేషన్ విడుదల            : 22-07-2021       


దరఖాస్తు చివరి గడువు       : 20-08-2021


తరగుతులు ప్రారంభం          : సెప్టెంబర్ రెండో వారం


అసైన్మెంట్ల సమర్పణ            : నవంబర్ రెండో వారం


తుది పరీక్షలు                     : డిసంబర్ మొదటి వారం


జర్నలిస్టులకు కోర్సు ఫీజు      : రూ. 1500/-




జర్నలిస్టులు కాకుండా ఈ వృత్తిలో ఆసక్తి గల వారెవరైనా ఈ కోర్సులో చేరే అవకాశం వుంది. వారికి కనీసం విద్యార్హత


డిగ్రీతో పాటు కోర్సు ఫీజు రూ. 3000/- నిర్ణయించారు. ఈ కోర్సుకి సంబంధించి ఇంకా ఏమైనా సందేహాలుంటే సంప్రదించాల్సిన ఫోన్ నంబర్: 91541 04393


మెయిల్ ఐడీ                         : pressacademycontact@gmail.com


ఇంకెందుకు ఆలస్యం...సంవత్సరాలు వెచ్చించి యూనివర్శిటీల చుట్టూ తిరిగే కన్నా ఎంచక్కా మూడునెలల్లో జర్నలిజం కోర్సుకి అప్లై చేసేసుకోండి. ఇప్పటికే జర్నలిస్టుగా కొనసాగుతున్న వారికి ఓ సాటిస్ ఫ్యాక్షన్ అయితే...జర్నలిజంలో చేరాలి అనుకునే వారికి తక్కువ సమయంలో మంచి మార్గం అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.