AP Liquor Fine: మద్యం ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తే భారీ జరిమానా, లైసెన్స్ రద్దు! ఉత్తర్వులు జారీ

AP Liquor Sales | ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం మద్యం అక్రమాలపై చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తే రూ.5 లక్షల జరిమానా విధిస్తామని నోటిఫికేషన్ జారీ చేసింది.

Continues below advertisement

Liquor Sales in Andhra Pradesh | అమరావతి: ఏపీలో మద్యం అక్రమాలపై కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా మద్యం అక్రమంగా విక్రయిస్తే, అధిక ధరలకు విక్రయిస్తే భారీ జరిమానాలు విధించాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎవరైనా మద్యాన్ని ఎంఆర్‌పీ కంటే ఎక్కువకు విక్రయిస్తే రూ.5 లక్షలు జరిమానా విధించాలని ఎక్సైజ్ శాఖ (AP Excise Department) నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం సోమవారం నాడు జరిమానాలపై నోటిఫికేషన్‌ జారీ చేసింది. 
లైసెన్స్ సైతం రద్దు చేస్తామని హెచ్చరిక
అధిక ధరలకు మద్యం విక్రయిస్తే భారీ జరిమానా విధిస్తామని ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఇదే తప్పు మరోసారి చేస్తే ఆ మద్యం దుకాణం లైసెన్స్ సైతం రద్దు చేస్తామని హెచ్చరించింది. ఈ విషయాలను ఎపీ ఎక్సైజ్‌ చట్టం సెక్షన్‌ 47(1) ప్రకారం నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. పర్మిషన్ లేని వాళ్లు బెల్ట్ షాపులు నడిపితే తాను బెల్ట్ తీయాల్సి వస్తోందని చంద్రబాబు అనంతపురం నేమకల్లులో పాల్గొన్న గ్రామసభలో ఇదివరకే స్పష్టం చేశారు. 

Continues below advertisement

ఏపీలో అక్టోబర్ 16 నుంచి నూతన మద్యం పాలసీ అమలులోకి వచ్చింది. మద్యం షాపులకు ఏపీ ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది. తరువాత అన్ని జిల్లాల్లో కలెక్టర్, ఉన్నతాధికారుల సమక్షలో లాటరీ డ్రా నిర్వహించి మద్యం షాపులను విజేతలకు కేటాయించారు. ప్రస్తుతం మద్యం షాపులు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 వరకూ తెరిచి ఉంటాయి. వైసీపీ హయాంలో అందుబాటులో లేని డిజిటల్ పేమెంట్స్ ఏపీలో మళ్లీ అందుబాటులోకి తెచ్చారు. దాంతో నగదు చెల్లింపు సమస్యకు కూటమి ప్రభుత్వం చెక్ పెట్టింది. 

లక్కీ డ్రా లాటరీతో మద్యం షాపులు కేటాయింపు
3,396 షాపులకుగానూ 89,882 దరఖాస్తులు వచ్చాయి. వీటి ద్వారా ఏపీ ప్రభుత్వానికి రూ.1797.64 కోట్ల ఆదాయం సమకూరింది. అక్టోబర్ 14న కలెక్టర్ల ఆధ్వర్యంలో లాటరీ తీసి మద్యం షాపుల విజేతల్ని ప్రకటించారు. మద్యం షాపులు దక్కించుకున్న వారికి బెదిరింపులు సైతం వచ్చాయి. కొన్ని చోట్ల అయితే మద్యం షాపులు దక్కించుకున్న కొందరు కిడ్నాప్ అయ్యారని ప్రచారం జరిగింది. అయితే ఏపీ ప్రభుత్వం ఎంతో పారదర్శకంగా మద్యం షాపుల కేటాయింపు జరిగిందని సీఎం చంద్రబాబు అన్నారు. అక్రమాలు జరగితే సహించేది లేదని.. మద్యం షాపులను స్వేచ్ఛగా, ఎలాంటి భయాలు లేకుండా నిర్వహించాలన్నారు. 

Also Read: Metro Rail In Vizag and Vijayawada: విశాఖ, విజయవాడ ప్రజలకు శుభవార్త, మెట్రోరైల్ ప్రాజెక్టు డీపీఆర్‌లకు ఏపీ ప్రభుత్వం ఆమోదం

Continues below advertisement