అన్వేషించండి

Vallabhaneni Vamsi: వంశీ బెయిల్‌‌పై సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం - వదిలి పెట్టకూడదని ప్రయత్నం

Vamsi: వల్లభనేని వంశీకి వెకేషన్ కోర్టు ఇచ్చిన బెయిల్ పై సుప్రీంకోర్టుకు వెళ్లాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. మట్టి అక్రమ తవ్వకాలతో రూ.195 కోట్లు నష్టం జరిగిందని విజిలెన్స్ అధికారులు గుర్తించారు.

Vallabhaneni Vamsi No Bail:  వైసీపీ  నేత వల్లభనేని వంశీకి మట్టి అక్రమ తవ్వకాలకేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ ఇచ్చిన బెయిల్‌పై సుప్రీంకోర్ట్‌కు వెళ్లాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.   సుప్రీంకోర్ట్‌లో ఉన్న అడ్వకేట్ ఆన్ రికార్డ్స్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 2019 నుంచి 2024 వరకు గన్నవరం నియోజకవర్గంలో జరిగిన మట్టి అక్రమ తవ్వకాలపై విజిలెన్స్ దర్యాప్తు చేసింది.  ప్రభుత్వానికి రూ.195 కోట్లు నష్టం జరిగిందని విజిలెన్స్ అధికారులు నిర్దారదించారు.   నివేదిక మేరకు ఏపీ పోలీసులు కేసు నమోదు  చేశారు.  

ఏసీబీ నమోదు చేసిన ఈ కేసులో పీటీ వారెంట్ అమలు చేస్తున్నారని హైకోర్ట్‌ను వంశీ ఆశ్రయించారు. వేకేషన్ కోర్ట్‌లో వంశీకి హైకోర్ట్ బెయిల్ ఇచ్చింది. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రభుత్వానికి నివేదిక అందజేశారు.   ఇంతటి భారీ నష్టం కలిగిన కేసులో హైకోర్ట్ బెయిల్ ఇవ్వడాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వెంటనే చర్యలు చేపట్టాలని ప్రభుత్వం అడ్వకేట్ ఆన్ రికార్డ్స్‌కు ఆదేశాలు ఇస్తూ హోమ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జీవో జారీ చేశారు. హైకోర్ట్ వంశీ‌కి ఇచ్చిన బెయిల్‌ని రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్ట్‌లో సోమవారం స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేయనుంది.  

ఇవీ ఆరోపణలు

వెదురుపావులూరు, కొండపావులూరులో 300 ఎకరాలకు పైగా విస్తరించి ఉన్న కొండ ప్రాంతాన్ని భారీ పేలుళ్లతో పిండి చేసినట్లుగా అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు.  సూరంపల్లి గ్రామంలోని సర్వే నెంబర్‌ 526లోని 500 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న తోకతిప్పను కూడాతవ్వేశారని గ్రామస్తులు అనేక సార్లు ఫిర్యాదులు చేశారు. మల్లవల్లిలోని సర్వే నెంబర్‌ 11లో  175 ఎకరాల్లో గ్రానైట్ ను పోర్టు పనుల పేరుతో తవ్వుకున్నారు. గన్నవరం మండలం పరిధిలోనే ముస్తాబాద, చనుపల్లివారిగూడెం కొండలను కూడా అనధికారికంగా మైనింగ్ చేశారని అధికారులు గుర్తింంచారు. అన్నీ వంశీ వెనుకుండి చేయించారని భావిస్తున్నారు. మట్టి తవ్వకంపైనా ఆరోపణలు ఉన్నాయి.  నాలుగు మండలాల పరిధిలో 80 శాతానికి పైగా చెరువులను ఎలాంటి అనుమతులు లేకుండా అడ్డగోలుగా తవ్వారన్న ఆరోపణలు ఉన్నాయి.   

ఫిబ్రవరి 13 నుంచి  జైల్లోనే వంశీ       

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఫిర్యాదు దారుడు అయిన సత్యవర్థన్ ను కిడ్నాప్ చేసి బెదిరించి..  కేసును ఉపసంహరించకునేలా చేశారన్న కేసులో అరెస్టు చేశారు. ఆ తర్వాత పాత కేసులన్నీ వరుసగా ఆయనపై బయటకు వచ్చాయి. పీటీ వారెంట్లు జారీ చేసి అరెస్టు చేశారు. ఆయనపై నమోదైన కేసుల్లో నకిలీ పట్టాలపై కేసులో మాత్రమే జైల్లో ఉన్నారు. అన్ని కేసుల్లో బెయిల్ వచ్చింది. పీటీ వారెంట్ అమలు చేయక ముందే .. మట్టి తవ్వకాల కేసులో హైకోర్టులో బెయిల్ వచ్చింది. అందుకే ఈ అంశంపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. పీటీ వారెంట్ అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశిస్తే. మరికొంత కాలం జైల్లో ఉండి.. ఆ కేసులోనూ ఆయన బెయిల్ తెచ్చుకోవాల్సి ఉంటుంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Assembly: జీఎస్టీ తగ్గింపుతో ఏపీ ప్రజలకు 8 వేల కోట్ల ఆదాయం మిగులు-కేంద్రానికి ఏపీ అసెంబ్లీ కృతజ్ఞతల తీర్మానం
జీఎస్టీ తగ్గింపుతో ఏపీ ప్రజలకు 8 వేల కోట్ల ఆదాయం మిగులు-కేంద్రానికి ఏపీ అసెంబ్లీ కృతజ్ఞతల తీర్మానం
Komatireddy Rajagopal Reddy:  వైఎస్ఆర్‌సీపీలో చేరడం లేదు - ర్యాలీగా విజయవాడ వెళ్తోంది ఫంక్షన్‌కే - కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్లారిటీ
వైఎస్ఆర్‌సీపీలో చేరడం లేదు - ర్యాలీగా విజయవాడ వెళ్తోంది ఫంక్షన్‌కే - కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్లారిటీ
Deccan Gold Mine Company : ఏపీ పంట పండింది - కర్నూలు జిల్లాలో బంగారు గనులు - ఏడాదికి వెయ్యి కేజీలు !
ఏపీ పంట పండింది - కర్నూలు జిల్లాలో బంగారు గనులు - ఏడాదికి వెయ్యి కేజీలు !
Adani Group: అదానీ గ్రూప్‌కు సెబీ క్లీన్ చిట్, హిండెన్‌బర్గ్ ఆరోపణలకు ఆధారాల్లేవని ప్రకటన-స్పందించి అదానీ
అదానీ గ్రూప్‌కు సెబీ క్లీన్ చిట్, హిండెన్‌బర్గ్ ఆరోపణలకు ఆధారాల్లేవని ప్రకటన-స్పందించి అదానీ
Advertisement

వీడియోలు

India vs China Water war | చైనా మెగా డ్యాంకి ఇండియా కౌంటర్ ప్లాన్ అదుర్స్ | ABP Desam
యూఏఈతో మ్యాచ్ ఆలస్యం.. పాక్‌కి భారీ ఫైన్ వేయబోతున్న ICC?
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు మంధాన.. చరిత్ర సృష్టించిన మిస్ క్రికెటర్
పాక్ ఓవర్ యాక్షన్.. యూఏఈతో మ్యాచ్‌కి గంట ఆలస్యంగా టీం
UAE పై గట్టెక్కిన పాక్.. INDIAతో మ్యాచ్ కి డేట్ ఫిక్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Assembly: జీఎస్టీ తగ్గింపుతో ఏపీ ప్రజలకు 8 వేల కోట్ల ఆదాయం మిగులు-కేంద్రానికి ఏపీ అసెంబ్లీ కృతజ్ఞతల తీర్మానం
జీఎస్టీ తగ్గింపుతో ఏపీ ప్రజలకు 8 వేల కోట్ల ఆదాయం మిగులు-కేంద్రానికి ఏపీ అసెంబ్లీ కృతజ్ఞతల తీర్మానం
Komatireddy Rajagopal Reddy:  వైఎస్ఆర్‌సీపీలో చేరడం లేదు - ర్యాలీగా విజయవాడ వెళ్తోంది ఫంక్షన్‌కే - కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్లారిటీ
వైఎస్ఆర్‌సీపీలో చేరడం లేదు - ర్యాలీగా విజయవాడ వెళ్తోంది ఫంక్షన్‌కే - కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్లారిటీ
Deccan Gold Mine Company : ఏపీ పంట పండింది - కర్నూలు జిల్లాలో బంగారు గనులు - ఏడాదికి వెయ్యి కేజీలు !
ఏపీ పంట పండింది - కర్నూలు జిల్లాలో బంగారు గనులు - ఏడాదికి వెయ్యి కేజీలు !
Adani Group: అదానీ గ్రూప్‌కు సెబీ క్లీన్ చిట్, హిండెన్‌బర్గ్ ఆరోపణలకు ఆధారాల్లేవని ప్రకటన-స్పందించి అదానీ
అదానీ గ్రూప్‌కు సెబీ క్లీన్ చిట్, హిండెన్‌బర్గ్ ఆరోపణలకు ఆధారాల్లేవని ప్రకటన-స్పందించి అదానీ
Hyderabad Rains: ఆఫీసులు, పనుల కోసం బయటకొచ్చిన హైదరాబాద్ వాసులకు బ్యాడ్ న్యూస్ - వర్షంలో మళ్లీ ఇరుక్కున్నట్లే !
ఆఫీసులు, పనుల కోసం బయటకొచ్చిన హైదరాబాద్ వాసులకు బ్యాడ్ న్యూస్ - వర్షంలో మళ్లీ ఇరుక్కున్నట్లే !
YS Jagan: ఆందోళనలకు సిద్ధం కండి - క్యాడర్‌కు జగన్ పిలుపు
ఆందోళనలకు సిద్ధం కండి - క్యాడర్‌కు జగన్ పిలుపు
ANR Movies: అక్కినేని ఐకానిక్ మూవీస్ రీ రిలీజ్ - ఈ థియేటర్లలో ఫ్రీ టికెట్స్
అక్కినేని ఐకానిక్ మూవీస్ రీ రిలీజ్ - ఈ థియేటర్లలో ఫ్రీ టికెట్స్
Bengaluru: పరుపు తెచ్చుకుని మరీ నడి రోడ్డు మీద సెటిలయ్యాడు - బెంగళూరులో డోంట్ కేర్ బ్యాచ్ - వైరల్ వీడియో
పరుపు తెచ్చుకుని మరీ నడి రోడ్డు మీద సెటిలయ్యాడు - బెంగళూరులో డోంట్ కేర్ బ్యాచ్ - వైరల్ వీడియో
Embed widget