అన్వేషించండి

AP CM Chandrababu: 2 రోజులపాటు తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి ఏపీ సీఎం చంద్రబాబు

Tamil Nadu Assembly Elections | ఏపీ సీఎం చంద్రబాబు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఎన్డీయే అభ్యర్థుల విజయం కోసం ఓటు వేయాలని ప్రజలను కోరనున్నారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. ఎన్డీఏ (NDA) కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ఆయన రెండు రోజుల పాటు అక్కడ విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ నెల 20, 21 తేదీల్లో జరిగే ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా, కూటమి తరపున ఏపీ సీఎం చంద్రబాబు పలు కార్యక్రమాల్లో పాల్గొని ప్రసంగించనున్నారు.

ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం, ఏపీ సీఎం చంద్రబాబు సోమవారం (ఏప్రిల్ 20న) మధ్యాహ్నం రాజధాని అమరావతి నుండి బయలుదేరి తమిళనాడులోని కోయంబత్తూరు చేరుకుంటారు. అక్కడి నుండి హోసూరు, చెన్నై, ఆవడి వంటి కీలక ప్రాంతాల్లో పర్యటిస్తారు. ముఖ్యంగా హోసూరు సమీపంలోని తాలిలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొని చంద్రబాబు ప్రసంగించనున్నారు. అలాగే ఆవడిలో నిర్వహించే రోడ్ షో ద్వారా ఎన్డీఏ అభ్యర్థులకు మద్దతు తెలపనున్నారు. పర్యటనలో రెండో రోజైన 21వ తేదీన మధురై మరియు సాత్తూర్ ప్రాంతాల్లో నిర్వహించే ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో ఆయన పాల్గొంటారు.

మహిళా రిజర్వేషన్ సాధించేవరకూ పోరాటం ఆగదు: ప్రధాని మోదీ

మహిళా బిల్లు విషయంలో ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, మహిళలకు సాధికారత కల్పించే వరకు తమ పోరాటం ఆగదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. మహిళా బిల్లు ఆమోదం పొందకుండా పార్లమెంటులో కాంగ్రెస్, డీఎంకే (DMK) కూటమి నీచ రాజకీయాలకు పాల్పడిందని విమర్శించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం కోయంబత్తూరులో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం దక్కే వరకు ఎన్డీయే అలుపెరగని పోరాటం చేస్తుందని, ఇది కేవలం ఆరంభం మాత్రమేనని ప్రకటించారు.

పేద మహిళలు ఎంపీలు, ఎమ్మెల్యేలు అయ్యేవారు..

బిల్లు ఆమోదం పొంది ఉంటే ఎందరో పేద కుటుంబాల మహిళలు ఎంపీలు, ఎమ్మెల్యేలుగా ఎదిగే అవకాశం ఉండేదని, కానీ ప్రతిపక్షాలు ఆ అవకాశాన్ని అడ్డుకున్నాయని మోదీ ఆరోపించారు. ముఖ్యమంత్రి స్టాలిన్ తన కుటుంబ సభ్యులు తప్ప ఇతరులు నాయకులుగా ఎదగడాన్ని సహించలేకపోతున్నారని విమర్శించారు. డీఎంకే నేతలు నల్ల దుస్తులు ధరించి నిరసనలు తెలిపినంత మాత్రాన వారి వెనుక ఉన్న దుష్ట ఆలోచనలను ప్రజలు గమనించరనుకోవడం పొరపాటు అని మండిపడ్డారు. డీఎంకే నేతలు ఎక్కడ కనిపించినా మహిళా బిల్లును ఎందుకు అడ్డుకున్నారని నిలదీయాలని మోదీ ఓటర్లకు పిలుపునిచ్చారు.

డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటేనే తమిళనాడు అభివృద్ధి

తమిళనాడు అభివృద్ధి చెందాలంటే కేంద్రంలో, రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉండాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. రెండు చోట్లా ఒకే కూటమి ప్రభుత్వం ఉంటే పథకాలు వేగంగా ప్రజలకు అందుతాయని, అభివృద్ధి పనులు ఊపందుకుంటాయని వివరించారు. తమిళనాడు ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోసం భారతీయ జనతా పార్టీ (BJP) అనేక గ్యారంటీలను ఇస్తోందని, ప్రజలు విజ్ఞతతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. ప్రధాని మోదీ పాల్గొన్న ఈ ప్రచార సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె. పళనిసామి, బీజేపీ నేత అన్నామలై తదితర ప్రముఖ నేతలు పాల్గొన్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Collectors meeting second day: ఆగస్టు 15న రెండున్నర లక్షల ఇళ్ల గృహప్రవేశాలు - కలెక్టర్లకు చంద్రబాబు దిశానిర్దేశం
ఆగస్టు 15న రెండున్నర లక్షల ఇళ్ల గృహప్రవేశాలు - కలెక్టర్లకు చంద్రబాబు దిశానిర్దేశం
Janasena Politics: ఆ విషయంలో జనసేన ఘోరంగా ఫెయిల్... విజయ్ తో కంపేర్ చేస్తూ ట్రోల్ చేస్తున్నా పార్టీ నుండి కౌంటర్ ఏది?
ఆ విషయంలో జనసేన ఘోరంగా ఫెయిల్... విజయ్ తో కంపేర్ చేస్తూ ట్రోల్ చేస్తున్నా పార్టీ నుండి కౌంటర్ ఏది?
AP CM Chandrababu: రాయలసీమ ఇక ‘రాయల్’ సీమ.. ఏపీకి దిగ్గజ సంస్థ రావడంపై సీఎం చంద్రబాబు ఆసక్తికర పోస్ట్
రాయలసీమ ఇక ‘రాయల్’ సీమ.. ఏపీకి దిగ్గజ సంస్థ రావడంపై సీఎం చంద్రబాబు ఆసక్తికర పోస్ట్
TVK In AP: కాంగ్రెస్‌తో కలిసి ఏపీలోనూ టీవీకే పోటీ చేస్తుందా? సోషల్ మీడియాలో హడావుడి దేనికి సంకేతం?
కాంగ్రెస్‌తో కలిసి ఏపీలోనూ టీవీకే పోటీ చేస్తుందా? సోషల్ మీడియాలో హడావుడి దేనికి సంకేతం?
Advertisement

వీడియోలు

Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్
Abhishek Sharma: అభిషేక్ శర్మ vs పంజాబ్: ఇది బ్యాటింగ్ కాదు.. తాండవం
Medchal Infant Kidnap: '50 CC కెమెరాలతో గంటల్లో పట్టుకున్న పోలీసులు.
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Collectors meeting second day: ఆగస్టు 15న రెండున్నర లక్షల ఇళ్ల గృహప్రవేశాలు - కలెక్టర్లకు చంద్రబాబు దిశానిర్దేశం
ఆగస్టు 15న రెండున్నర లక్షల ఇళ్ల గృహప్రవేశాలు - కలెక్టర్లకు చంద్రబాబు దిశానిర్దేశం
Bengal CM Suvendu Adhikari: బెంగాల్ కొత్త సీఎం సువేందు అధికారి - శనివారమే ప్రమాణం
బెంగాల్ కొత్త సీఎం సువేందు అధికారి - శనివారమే ప్రమాణం
Janasena Politics: ఆ విషయంలో జనసేన ఘోరంగా ఫెయిల్... విజయ్ తో కంపేర్ చేస్తూ ట్రోల్ చేస్తున్నా పార్టీ నుండి కౌంటర్ ఏది?
ఆ విషయంలో జనసేన ఘోరంగా ఫెయిల్... విజయ్ తో కంపేర్ చేస్తూ ట్రోల్ చేస్తున్నా పార్టీ నుండి కౌంటర్ ఏది?
Kodangal Revanth Reddy: కొడంగల్‌ను బంగారు తునకగా మార్చుకుందాం - ప్రజలకు రేవంత్ పిలుపు
కొడంగల్‌ను బంగారు తునకగా మార్చుకుందాం - ప్రజలకు రేవంత్ పిలుపు
Trisha Web Series : గుండెలో 16సార్లు పొడిచి చంపేస్తాడు - సైకో కిల్లర్‌ను త్రిష ఎలా పట్టుకుంది?... ట్రెండింగ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్
గుండెలో 16సార్లు పొడిచి చంపేస్తాడు - సైకో కిల్లర్‌ను త్రిష ఎలా పట్టుకుంది?... ట్రెండింగ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్
AP CM Chandrababu: రాయలసీమ ఇక ‘రాయల్’ సీమ.. ఏపీకి దిగ్గజ సంస్థ రావడంపై సీఎం చంద్రబాబు ఆసక్తికర పోస్ట్
రాయలసీమ ఇక ‘రాయల్’ సీమ.. ఏపీకి దిగ్గజ సంస్థ రావడంపై సీఎం చంద్రబాబు ఆసక్తికర పోస్ట్
Nora Fatehi Apology : పాటలో బూతు పదాలు - అపాలజీతో ఆగని బాలీవుడ్ బ్యూటీ... అనాథ బాలికల చదువు కోసం...
పాటలో బూతు పదాలు - అపాలజీతో ఆగని బాలీవుడ్ బ్యూటీ... అనాథ బాలికల చదువు కోసం...
Jubilee Hills Murder Case: జూబ్లీహిల్స్‌లో దారుణం- మాజీ డీజీపీ భార్య హత్య - నేపాలీ గ్యాంగ్ ఘాతుకం!
జూబ్లీహిల్స్‌లో దారుణం- మాజీ డీజీపీ భార్య హత్య - నేపాలీ గ్యాంగ్ ఘాతుకం!
Embed widget