ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం సందర్భంగా టీడీపీ సభ్యులు గందరగోళం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తుండగా టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. గవర్నర్ ప్రసంగంలో అన్ని పచ్చి అబద్ధాలే ఉన్నాయని నినాదాలు చేశారు. ప్రసంగానికి పదే పదే అడ్డు తగిలారు. అసత్యాలు భరించలేకపోతున్నామని నినాదాలు చేశారు. చివరికి గవర్నర్ ప్రసంగాన్ని టీడీపీ సభ్యులు బైకాట్ చేశారు.