<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/" xmlns:dc="http://purl.org/dc/elements/1.1/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/" xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/" xmlns:media="http://search.yahoo.com/mrss/"><channel><title>amravati</title><atom:link href="https://telugu.abplive.com/amravati/feed" rel="self" type="application/rss+xml"/><link>https://telugu.abplive.com/</link><description/><lastBuildDate>Mon, 27 Jul 2026 11:06:22 +0530</lastBuildDate><language>en-US</language><sy:updatePeriod>hourly</sy:updatePeriod><sy:updateFrequency>1</sy:updateFrequency><generator>https://telugu.abplive.com</generator><item><title><![CDATA[Rains In AP, Telangana: వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ - మత్స్యకారులకు వార్నింగ్]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/depression-in-bay-of-bengal-apsdma-issues-rain-alert-for-north-coastal-andhra-pradesh-254588</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/depression-in-bay-of-bengal-apsdma-issues-rain-alert-for-north-coastal-andhra-pradesh-254588#respond</comments><pubDate>Sun, 26 Jul 2026 18:22:24 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ అమరావతి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/amravati/depression-in-bay-of-bengal-apsdma-issues-rain-alert-for-north-coastal-andhra-pradesh-254588</guid><description><![CDATA[&lt;p&gt;Depression in Bay of Bengal | అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దాంతో వాతావరణం ఒక్కసారిగా కూల్ కావడంతో సేద తీరుతున్నారు. అయితే వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. రాగల 24 గంటల్లో ఇది తీవ్ర వాయుగుండంగా మారి, ఒడిశాలోని పారాదీప్, పశ్చిమ బెంగాల్&amp;zwnj;లోని సాగర్ ద్వీపాల మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఏపీలోని తీరప్రాంతాల్లో ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయి.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;సోమవారం ఈ జిల్లాల్లో వర్షాలు&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;బంగాళాఖాతంలోని వాయుగుండం ప్రభావంతో సోమవారం (27-07-2026) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది.&lt;/p&gt;
&lt;blockquote class=&quot;twitter-tweet&quot;&gt;
&lt;p dir=&quot;ltr&quot; lang=&quot;te&quot;&gt;🔴వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. రాగల 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారి రేపు పారాదీప్ - సాగర్ ద్వీపాల మధ్య తీరం దాటే అవకాశం ఉందని &lt;a href=&quot;https://x.com/hashtag/APSDMA?src=hash&amp;amp;ref_src=twsrc%5Etfw&quot;&gt;#APSDMA&lt;/a&gt; MD ప్రఖర్ జైన్ తెలిపారు. ​&lt;br /&gt;🚨 ముఖ్యమైన సూచనలు : &lt;br /&gt;▪️ ఉత్తరాంధ్ర తీరం వెంబడి 55-65 kmph వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం. &lt;a href=&quot;https://t.co/s6vUPwqBMs&quot;&gt;pic.twitter.com/s6vUPwqBMs&lt;/a&gt;&lt;/p&gt;
&amp;mdash; Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) &lt;a href=&quot;https://x.com/APSDMA/status/2081295743785353347?ref_src=twsrc%5Etfw&quot;&gt;July 26, 2026&lt;/a&gt;&lt;/blockquote&gt;
&lt;p&gt;
&lt;script src=&quot;https://platform.x.com/widgets.js&quot; async=&quot;&quot; charset=&quot;utf-8&quot;&gt;&lt;/script&gt;
&lt;/p&gt;
&lt;p&gt;ఈ వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని అధికారులు తెలిపారు. వాతావరణం ముప్పుగా మారినందున బుధవారం (జులై 29) వరకు మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ సముద్రంలో వేటకు వెళ్లరాదని కఠిన హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాకుండా, సముద్రంలో అలల ఉధృతి తీవ్రంగా ఉండే ప్రమాదం ఉన్నందున 7 మీటర్ల కంటే తక్కువ వెడల్పు ఉన్న చిన్న పడవలను వినియోగించడం సురక్షితం కాదని స్పష్టం చేశారు.&lt;/p&gt;
&lt;p&gt;Also Read: &lt;a href=&quot;https://telugu.abplive.com/telangana/hyderabad/helpline-launched-for-indiramma-towers-hyderabad-cp-sajjanar-warns-public-against-fake-calls-and-links-254573&quot; target=&quot;_blank&quot; rel=&quot;noopener&quot;&gt;Indiramma Towers Helpline Number: ఇందిరమ్మ టవర్స్&amp;zwnj; కోసం స్పెషల్ హెల్ప్&amp;zwnj;లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;వాతావరణంలో చోటుచేసుకుంటున్న ఈ అకస్మాత్తు మార్పుల దృష్ట్యా తీరప్రాంత ప్రజలు, మత్స్యకారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఏపీఎస్&amp;zwnj;డీఎంఏ సూచించింది. అధికారులు స్థానిక పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని, ప్రజలు అత్యవసర సహాయం లేదా సమాచారం కోసం విపత్తుల నిర్వహణ సంస్థ సూచనలను పాటించాలని కోరారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;హైదరాబాద్ వాసులకు రెయిన్ అలర్ట్..&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;హైదరాబాద్ నగరవాసులకు తీవ్ర వాతావరణ హెచ్చరిక జారీ అయింది. నగరంలోని ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లో అతి భారీ మేఘావృతం మరింత వేగంగా రూపాంతరం చెందుతోంది. దీని ప్రభావంతో ముఖ్యంగా మధ్య, తూర్పు, దక్షిణ హైదరాబాద్ ప్రాంతాల్లో రాత్రి 7:15 గంటల నుంచి అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్ హెచ్చరించారు.&lt;/p&gt;
&lt;p&gt;తొలుత పటాన్&amp;zwnj;చెరు, లింగంపల్లి, రామచంద్రాపురం (RC పురం), బచుపల్లి, నిజంపేట్, బీరంచెరువు, మియాపూర్ ప్రాంతాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత క్రమంగా సెర్లింగంపల్లి, నల్లగండ్ల, కొండాపూర్, కూకట్&amp;zwnj;పల్లి, కుత్బుల్లాపూర్, గాజులరామారం ప్రాంతాలకు ఈ వర్షాలు విస్తరించనున్నాయి.నగరంలో వర్ష తీవ్రత క్రమంగా ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించే అవకాశమున్నందున, ప్రయాణికులు మరియు నగర ప్రజలు తమ ప్రయాణాలను, పనులను దానికి తగినట్లుగా ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అవసరమైతే తప్ప బయటకు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అప్రమత్తం చేశారు.&lt;/p&gt;
&lt;p&gt;తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. మెదక్ జిల్లా అంతటా ఇప్పటికే భారీ వర్షాలు ప్రారంభమవ్వగా, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డిలోని కొన్ని ప్రాంతాలు, సిద్దిపేట జిల్లాలకు విస్తరించనుందని హెచ్చరించారు. నిర్మల్, జగిత్యాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తీవ్రమైన వర్షాలు కురుస్తున్నాయి. ఈ తుఫాను మేఘాలు మరింత బలపడి రానున్న గంటల్లో కరీంనగర్, భూపాలపల్లి, వరంగల్ రూరల్, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలను కూడా వర్షాలు ముంచెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/26/46bf3c4e30f05c36453223fc91812ae91785070129026233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/ap-cm-chandrababu-visits-nandamuri-balakrishna-at-aig-hospital-following-surgery-in-hyderabad-254556</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/ap-cm-chandrababu-visits-nandamuri-balakrishna-at-aig-hospital-following-surgery-in-hyderabad-254556#respond</comments><pubDate>Sun, 26 Jul 2026 12:21:50 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ ఆంధ్రప్రదేశ్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/ap-cm-chandrababu-visits-nandamuri-balakrishna-at-aig-hospital-following-surgery-in-hyderabad-254556</guid><description><![CDATA[&lt;p&gt;Chandrababu Visits Balakrishna at Hospital | హైదరాబాద్&amp;zwnj;: టీడీపీ ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. హైదరాబాద్&amp;zwnj;లోని గచ్చిబౌలిలో ఉన్న ప్రముఖ ఏఐజీ (AIG) ఆసుపత్రికి స్వయంగా వెళ్లి అక్కడ చికిత్స పొందుతున్న హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణను పరామర్శించారు. ఆదివారం ఉదయం 11 గంటలకు ఆసుపత్రికి చేరుకున్న సీఎం చంద్రబాబు, డాక్టర్లను అడిగి తన వియ్యంకుడు బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. బాలకృష్ణకు అందిస్తున్న వైద్య సేవలతో పాటు, కోలుకోవడానికి పట్టనున్న సమయం గురించి డాక్టర్లతో ప్రత్యేకంగా చర్చించారు.&lt;/p&gt;
&lt;p&gt;సర్జరీ సక్సెస్ అయిందని, ఏ ఇబ్బంది లేదని డాక్టర్లు చంద్రబాబుకు తెలిపారు. గాయం, సర్జరీ నుంచి కోలుకోవడానికి తగినంత విశ్రాంతి తీసుకోవాలని బాలకృష్ణకు సూచించారు. కొన్ని రోజులపాటు కార్యక్రమాలు వాయిదా వేసుకోవాలని సూచించిన చంద్రబాబు.. వేగంగా కోలుకుని బాలకృష్ణ తిరిగి ప్రజా జీవితంలోకి రావాలని ఆకాంక్షించారు. సాయంత్రం హైదరాబాద్ నుంచి బయలుదేరనున్న ఏపీ సీఎం &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; రాత్రి 8:40కి ఉండవల్లి నివాసానికి చేరుకోనున్నారని అధికారులు తెలిపారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/26/ce7a470a8feebccf4f39259a3021ad851785072537767233_original.jpeg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;షూటింగ్ సమయంలో గాయపడిన నటుడు బాలకృష్ణ&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;కాకినాడ పోర్టు పరిసరాల్లో జరుగుతున్న ఒక సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలో గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ ప్రమాదవశాత్తు గాయపడ్డారు. యాక్షన్ సీన్స్ చేస్తున్న సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో ఆయన ఎడమ మోకాలి భాగంలో తీవ్రమైన వాపు రావడం, మోకాలి చుట్టూ ఉన్న కణజాలాల్లోకి రక్తం చేరడాన్ని డాక్టర్లు గుర్తించారు. సర్జరీ అవసరమని సూచించారు. వెంటనే మెరుగైన వైద్యం కోసం కాకినాడ నుంచి హైదరాబాద్&amp;zwnj;కు వచ్చి ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. మోకాలి కండరాల్లో ఏమైనా చిన్నపాటి చీలిక ఏర్పడి ఉండవచ్చని భావించిన డాక్టర్ల టీమ్, గత కొన్ని రోజులుగా బాలకృష్ణకు చికిత్స అందిస్తున్నారు. డాక్టర్లు చేసిన సర్జరీ సైతం సక్సెస్ అయినట్లు తెలియడంతో కుటుంబసభ్యులు, నందమూరి ఫ్యాన్స్, &lt;a title=&quot;టీడీపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/tdp&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;టీడీపీ&lt;/a&gt; నేతలు, కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఆయన వేగంగా కోలుకుంటున్నారని ఏఐజీ వైద్యులు వెల్లడించారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe style=&quot;border: none; overflow: hidden;&quot; src=&quot;https://www.facebook.com/plugins/post.php?href=https%3A%2F%2Fwww.facebook.com%2FABPDesam%2Fposts%2Fpfbid02Xpp5afjjCdpqGDC3KYa4cyr54HKG1vMru81pMwW9n8ywadn7cwZZGXTyfLWk3ghTl&amp;amp;show_text=true&amp;amp;width=500&quot; width=&quot;500&quot; height=&quot;711&quot; frameborder=&quot;0&quot; scrolling=&quot;no&quot; allowfullscreen=&quot;allowfullscreen&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;
&lt;p&gt;Also Read: &lt;a href=&quot;https://telugu.abplive.com/andhra-pradesh/amravati/apcc-chief-ys-sharmila-recovering-post-abdominal-surgery-reasons-behind-her-absence-in-ap-politics-254547&quot; target=&quot;_blank&quot; rel=&quot;noopener&quot;&gt;YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్&amp;zwnj;కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;6 వారాలపాటు రెస్ట్, షూటింగ్&amp;zwnj;లకు బ్రేక్&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ &amp;nbsp;ఎన్&amp;zwnj;బీకే111 సెట్స్&amp;zwnj;లో జరిగిన గాయానికి సుమారు మూడు గంటల పాటు ఏఐజీ డాక్టర్లు సర్జరీ చేశారు. ప్రస్తుతం బాలయ్య మోకాలికి నీ క్యాప్ అమర్చారు. ఏ సమస్యలు లేకుండా ఆపరేషన్ పూర్తయిందని ఏఐజీ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అయితే ఆరు వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్లు తెలుస్తోంది. దాంతో దాదాపు నెలన్నరపాటు అన్ని షూటింగ్ పనులు, రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉండే అవకాశాలున్నాయి.&lt;/p&gt;
&lt;p&gt;తన మూవీ షూటింగ్&amp;zwnj;లో గాయపడిన నందమూరి బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ 'NBK111' దర్శకుడు గోపీచంద్ మలినేని బెంగళూరులోని కాటేరమ్మ ఆలయంలో 18 మంది వేద పండితులతో భారీ హోమం నిర్వహించారు. ఈ పూజలో అభిమానులు కూడా పాల్గొన్నారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/26/7088bc58587f2c80711dbee1ba96ac561785048514170233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/apcc-chief-ys-sharmila-recovering-post-abdominal-surgery-reasons-behind-her-absence-in-ap-politics-254547</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/apcc-chief-ys-sharmila-recovering-post-abdominal-surgery-reasons-behind-her-absence-in-ap-politics-254547#respond</comments><pubDate>Sun, 26 Jul 2026 11:35:57 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ అమరావతి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/amravati/apcc-chief-ys-sharmila-recovering-post-abdominal-surgery-reasons-behind-her-absence-in-ap-politics-254547</guid><description><![CDATA[&lt;p&gt;అమరావతి: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గత కొన్ని రోజులుగా మీడియాలోగానీ, కార్యక్రమాల్లో కనిపించడం లేదు. దాంతో ఆమె ఏమయ్యారు, ఎక్కడున్నారు అని చర్చ జరుగుతున్న సమయంలో కీలక అప్డేట్ వచ్చింది. వైఎష్ షర్మిలకు ఇటీవల సర్జరీ జరిగింది. ప్రస్తుతం ఆమె వేగంగా కోలుకుంటున్నారు. ఇదే విషయాన్ని షర్మిల తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసి వెల్లడించారు. అబ్డామినల్ సర్జరీ చేయించుకున్న తాను రికవరీ అవుతున్నానంటూ బెడ్ మీద ఉన్న ఫొటో షేర్ చేసి హెల్త్ అప్డేట్ ఇచ్చారు. తాను త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన కుటుంబసభ్యులు, పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.&lt;/p&gt;
&lt;p&gt;ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇటీవల పొత్తికడుపునకు సంబంధించిన శస్త్రచికిత్స (అబ్డామినల్ సర్జరీ) చేయించుకున్నారు. ప్రస్తుతం ఆమె హైదరాబాద్&amp;zwnj;లో ఉన్నట్లు సమాచారం. సర్జరీ ఎక్కడ, ఎప్పుడు జరిగిందనే అంశాలను ఆమె గానీ, పార్టీ నేతలుగానీ వెల్లడించలేదు. సర్జరీ అనంతరం డాక్టర్ల సూచనల మేరకు ఆమె ప్రస్తుతం పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకుంటున్నారు. తన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, తాను కోలుకోవాలని ఆకాంక్షించిన వారికి ధన్యవాదాలు తెలిపారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;blockquote class=&quot;twitter-tweet&quot;&gt;
&lt;p dir=&quot;ltr&quot; lang=&quot;en&quot;&gt;I&amp;rsquo;m happy to share that I&amp;rsquo;m recovering well from the necessary abdominal surgery I recently had.&lt;br /&gt;A big thank you to all my well-wishers for your kind thoughts and support. &lt;a href=&quot;https://t.co/WZgk6FmSRs&quot;&gt;pic.twitter.com/WZgk6FmSRs&lt;/a&gt;&lt;/p&gt;
&amp;mdash; YS Sharmila (@realyssharmila) &lt;a href=&quot;https://x.com/realyssharmila/status/2081240323293069319?ref_src=twsrc%5Etfw&quot;&gt;July 26, 2026&lt;/a&gt;&lt;/blockquote&gt;
&lt;p&gt;
&lt;script src=&quot;https://platform.x.com/widgets.js&quot; async=&quot;&quot; charset=&quot;utf-8&quot;&gt;&lt;/script&gt;
&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;షర్మిల ఏమయ్యారు, ఎక్కడున్నారో అని చర్చ..&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;నీట్ పేపర్ లీక్&amp;zwnj;కు కేంద్రం బాధ్యత తీసుకోవాలని, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఇటీవల దేశవ్యాప్తంగా నిరసన చేపట్టింది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా పేపర్ లీకేజీల ఆందోళనను కాంగ్రెస్ ముమ్మరం చేసింది. ఈ క్రమంలో ఏపీలో గవర్నర్ బంగ్లా ముట్టడి సహా కీలక నిరసన కార్యక్రమాలు చేపట్టినా వైఎస్ షర్మిల ఎక్కడా కనిపించలేదు. దాంతో ఆమె కాంగ్రెస్ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్నారని, అందుకే పార్టీ కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాల్లో పాల్గొనలేదని ప్రచారం జరిగింది. పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగినా ఆమె విజయవాడ రాకపోవడం ఫై అందరికీ చాలా అనుమానాలు వచ్చాయి. ఆమెకు &lt;a title=&quot;కర్ణాటక&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Karnataka&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కర్ణాటక&lt;/a&gt; నుంచి వస్తుందనుకున్న రాజ్యసభ సీటు చివరి నిమిషంలో ఆమెకు నిరాశే ఎదురైంది. అదే కారణంతో పార్టీ నిరసన కార్యక్రమాల్లో, ఢిల్లీలో జరిగిన ఆందోళనల్లో సైతం షర్మిల కనిపించలేదని ప్రచారం జరిగింది.&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe title=&quot;YouTube video player&quot; src=&quot;https://www.youtube.com/embed/Zj6LRbaPqLQ?si=m9GyeCLSmpkK5IpJ&quot; width=&quot;560&quot; height=&quot;315&quot; frameborder=&quot;0&quot; allowfullscreen=&quot;allowfullscreen&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;
&lt;p&gt;Also Read: &lt;a href=&quot;https://telugu.abplive.com/andhra-pradesh/rajamundry/ap-devotee-dies-after-getting-stuck-in-moksha-marga-cave-during-arunachalam-giri-pradakshina-254535&quot; target=&quot;_blank&quot; rel=&quot;noopener&quot;&gt;Arunachalam Giri Pradakshina: అరుణాచల గిరిప్రదక్షిణలో విషాదం.. మోక్షమార్గంలో చిక్కుకుని ఏపీ భక్తుడు మృతి&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న షర్మిల క్షేత్రస్థాయిలో కనిపించకపోవడం సైతం ఊహాగానాలకు ఊతమిచ్చింది. మరోవైపు ఆమె ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు లాంటి వివరాలు బయటకు రాకపోవడంతో రాజ్యసభ సీటు దక్కని కారణంగానే షర్మిల సైలెంట్ అయ్యారన్న వ్యాఖ్యలకు బలం చేకూరింది. కానీ అస్వస్థత కారణంగా ఆమె పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారని తాజా ప్రకటనతో స్పష్టమైంది. సర్జరీ తరువాత పూర్తిగా కోలుకున్నాక ఏపీ &lt;a title=&quot;కాంగ్రెస్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Congress&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కాంగ్రెస్&lt;/a&gt; కార్యక్రమాలతో పాటు, క్షేత్రస్థాయిలో పోరాటం కొనసాగిస్తారని తెలుస్తోంది.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/26/eef04b2eb75dc2c4d722dc1d135125381785045927645233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Arunachalam Giri Pradakshina: అరుణాచల గిరిప్రదక్షిణలో విషాదం.. మోక్షమార్గంలో చిక్కుకుని ఏపీ భక్తుడు మృతి]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/rajamundry/ap-devotee-dies-after-getting-stuck-in-moksha-marga-cave-during-arunachalam-giri-pradakshina-254535</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/rajamundry/ap-devotee-dies-after-getting-stuck-in-moksha-marga-cave-during-arunachalam-giri-pradakshina-254535#respond</comments><pubDate>Sun, 26 Jul 2026 00:02:16 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ రాజమండ్రి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/rajamundry/ap-devotee-dies-after-getting-stuck-in-moksha-marga-cave-during-arunachalam-giri-pradakshina-254535</guid><description><![CDATA[&lt;p&gt;Arunachalam Giri Pradakshina: తిరువణ్ణామలై: జీవితంలో ఒక్కసారైనా అరుణాచలం వెళ్లి గిరి ప్రదక్షిణ చేయాలని భక్తులు భావిస్తారు. కానీ తన కోరిక తీర్చుకునేందుకు కుటుంబంతో కలిసి వెళ్లిన ఓ భక్తుడు మోక్ష మార్గంలో ఇరుక్కుని ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని నింపింది. ఏపీలోని రాజమండ్రికి చెందిన భక్తులు స్వామివారి సన్నిధికి వచ్చి ప్రాణాలు కోల్పోవడం ఇతర భక్తులను ఆందోళనకు గురిచేస్తోంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;కుటుంబంతో కలిసి స్వామి వారి దర్శనానికి వెళ్లిన ఏపీ భక్తుడు&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరువణ్ణామలై అరుణాచలేశ్వరస్వామి ఆలయ గిరిప్రదక్షిణ మార్గంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లోని తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన మణికుమార్ (36) అనే భక్తుడు తన కుటుంబ సభ్యులతో కలిసి అరుణాచలేశ్వరుని దర్శనానికి వచ్చారు. స్వామివారి దర్శనం అనంతరం వారు భక్తిశ్రద్ధలతో గిరిప్రదక్షిణ ప్రారంభించారు.&lt;/p&gt;
&lt;p&gt;ప్రదక్షిణ దారిలో ఉన్న ఇడుక్కి పిళ్లైయార్ ఆలయాన్ని దర్శించుకున్న సమయంలో, అక్కడ ఉండే అతి చిన్న మోక్షమార్గం గుండా వెళ్లేందుకు మణికుమార్ ప్రయత్నించారు. ఈ గుహ గుండా వెళ్తే కుటుంబ కష్టాలు తీరుతాయని భక్తులు నమ్ముతారు. అయితే ఆ చిన్న గుహ గుండా వెళ్తుండగా ఆయన మధ్యలోనే చిక్కుకుపోయారు. బయటకు రావడం సాధ్యం కాక, కఠిన పరిస్థితుల్లో గాలి ఆడకపోవడంతో ఊపిరాడక భక్తుడు స్పృహ కోల్పోయారు.&lt;/p&gt;
&lt;p&gt;Also Read: &lt;a href=&quot;https://telugu.abplive.com/spirituality/the-44-energy-points-of-arunachalam-giri-pradakshina-path-know-in-details-part-2-165656&quot; target=&quot;_blank&quot; rel=&quot;noopener&quot;&gt;Arunachalam Giri Pradakshina : అరుణాచల గిరిప్రదక్షిణ అంటే అలా చుట్టి వచ్చేయడం కాదు ఈ 44 ఎనర్జీ పాయింట్స్ చూడాల్సిందే!&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;వెంటనే గమనించిన స్థానిక భక్తులు, కుటుంబ సభ్యులు అతికష్టం మీద ఆయనను బయటకు తీసి, అంబులెన్స్ ద్వారా తిరువణ్ణామలై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయనను పరీక్షించిన డాక్టర్లు అప్పటికే మణికుమార్ మృతి చెందినట్లు ధృవీకరించారు. ఈ విషాద ఘటనపై తిరువణ్ణామలై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/25/0a04cc956d737bae84e8ff0c0f480e801785004130133233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[ధర్మేంద్ర ప్రధాన్ లాగా AP DSC అక్రమాలపై నారా లోకేష్ రాజీనామా చేస్తారా?: YS Jagan సూటి ప్రశ్న]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/will-nara-lokesh-resign-over-ap-dsc-irregularities-ys-jagan-questions-nda-standards-254534</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/will-nara-lokesh-resign-over-ap-dsc-irregularities-ys-jagan-questions-nda-standards-254534#respond</comments><pubDate>Sat, 25 Jul 2026 23:49:12 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ అమరావతి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/amravati/will-nara-lokesh-resign-over-ap-dsc-irregularities-ys-jagan-questions-nda-standards-254534</guid><description><![CDATA[&lt;p&gt;YS Jagan Mohan Reddy | అమరావతి: &amp;lsquo;నీట్&amp;zwnj; ప్రశ్నాపత్రం లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్&amp;zwnj; పదవికి రాజీనామా చేయడం ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో నైతికతకు, బాధ్యతాయుతమైన జవాబుదారీతనానికి ప్రతీకగా నిలుస్తోందని&amp;rsquo; వైఎస్సార్&amp;zwnj;సీపీ అధినేత వైఎస్&amp;zwnj; జగన్&amp;zwnj;మోహన్&amp;zwnj;రెడ్డి పేర్కొన్నారు. కేంద్రంలో ఒక విద్యాశాఖ మంత్రి బాధ్యత వహిస్తూ నిష్క్రమించిన తీరును ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;3.5 లక్షల మంది టీచర్ అభ్యర్థులను మోసం చేశారు&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఇదే క్రమంలో ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో ప్రశ్నలు గుప్పించారు. రాష్ట్రంలో దాదాపు 3.5 లక్షల మంది ఉపాధ్యాయ అభ్యర్థుల భవిష్యత్తును ఫణంగా పెడుతూ, డీఎస్సీ పరీక్ష నిర్వహణలో అంతులేని అక్రమాలు చోటుచేసుకున్నాయని వైఎస్&amp;zwnj; జగన్&amp;zwnj; ఆరోపించారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం చూపించిన నైతిక బాధ్యతను పాటిస్తూ, రాష్ట్రంలో అదే కూటమి ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేస్తారా అని జగన్&amp;zwnj; నిలదీశారు. లేక ఎన్డీఏ ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే రాజకీయ ప్రమాణాలు, విలువలు మరియు జవాబుదారీతనానికి పూర్తిగా పాతర వేస్తూ, ముఖ్యమంత్రి నారా &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; నాయుడు తన కొడుకు నారా లోకేష్ పదవిని కాపాడుకోవడానికే మొగ్గు చూపుతారా అని వైఎస్ జగన్&amp;zwnj;మోహన్&amp;zwnj;రెడ్డి ఘాటుగా ప్రశ్నించారు.&lt;/p&gt;
&lt;p&gt;Also Read:&amp;nbsp;&lt;a href=&quot;https://telugu.abplive.com/news/india/pralhad-joshi-appointed-as-new-education-minister-after-dharmendra-pradhan-resignation-254528&quot; target=&quot;_blank&quot; rel=&quot;noopener&quot;&gt;Pralhad Joshi: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి&lt;/a&gt;&amp;nbsp;&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;జగన్ ట్వీట్&amp;zwnj;పై నెటిజన్ల రియాక్షన్ వైరల్&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;నీట్ లీకేజీ ఉదంతాన్ని ఉటంకిస్తూ AP విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైఎస్సార్&amp;zwnj;సీపీ అధినేత వైఎస్ జగన్&amp;zwnj; చేసిన ట్వీట్&amp;zwnj;పై సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి భిన్నమైన, ఘాటైన స్పందనలు వ్యక్తమవుతున్నాయి. &lt;a title=&quot;జగన్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/cm-jagan&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;జగన్&lt;/a&gt; వేసిన ప్రశ్నలపై నెటిజన్లు ప్రధానంగా వైఎస్సార్&amp;zwnj;సీపీ గత ఎన్నికల ఫలితాలను, ప్రస్తుత పరిణామాలను ప్రస్తావిస్తూ కౌంటర్లు ఇస్తున్నారు. &quot;అన్నా.. నిరసనగా మనకున్న ఆ 11 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉపఎన్నికలకు వెళ్దాం, మన సత్తా ఏంటో మరోసారి నిరూపించుకుందాం&quot; అంటూ కొందరు నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు విసిరారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;రాజకీయ ప్రయోజనాల కోసం వైసీపీ చేస్తున్న ఆరోపణలు&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;మరికొందరు నెటిజన్లు నీట్ పరీక్షకు, ఏపీ డీఎస్సీకి పోలిక లేదని స్పష్టం చేస్తున్నారు. నీట్ పేపర్ లీక్ కావడం, దానివల్ల పరీక్ష రద్దు కావడం అనేది వాస్తవమని.. కానీ ఏపీ డీఎస్సీలో అక్రమాలు జరిగాయనడం కేవలం వైఎస్సార్&amp;zwnj;సీపీ రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్న ఆరోపణలు మాత్రమేనని పేర్కొంటున్నారు. అభ్యర్థులు లేవనెత్తిన ప్రతి ఆరోపణకూ సంబంధిత విద్యాశాఖ అధికారులు ఇప్పటికే పూర్తి వివరాలతో స్పష్టతనిచ్చారని గుర్తుచేస్తున్నారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;అక్రమాలు జరిగితే ఈపాటికే రోడ్డెక్కేవారు&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;డీఎస్సీలో నిజంగానే అక్రమాలు జరిగి ఉంటే నిరుద్యోగులు, అభ్యర్థులు ఈపాటికే రోడ్లెక్కి పెద్ద ఎత్తున ధర్నాలు చేసేవారని, ఉద్యోగాలు సాధించిన వారంతా ప్రస్తుతం సంతోషంగా ఉన్నారని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. డీఎస్సీపై సీబీఐ విచారణ కోరుతూ వైఎస్సార్&amp;zwnj;సీపీ కోర్టును ఆశ్రయించడాన్ని ప్రస్తావిస్తూ.. ప్రజలకు నిజానిజాలు తెలుసని, వచ్చే ఎన్నికల్లో ఇప్పుడు ఉన్న ఆ 11 సీట్లు కూడా ఎలా వస్తాయో చూస్తామంటూ నెటిజన్లు హెచ్చరిస్తున్నారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/25/abd5e19b0447b1e2e70e43ffe14c35331785002798596233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Guntur Latest News: న్యాయం కోసం టీడీపీ ఆఫీస్‌ వద్ద కదిరికి చెందిన ఓ కుటుంబం ఆందోళన: సీఐపై సంచలన ఆరోపణలు!]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/kadiri-family-protest-mangalagiri-nagendrababu-kandikunta-prasad-injustice-254454</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/kadiri-family-protest-mangalagiri-nagendrababu-kandikunta-prasad-injustice-254454#respond</comments><pubDate>Sat, 25 Jul 2026 10:45:46 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ అమరావతి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/amravati/kadiri-family-protest-mangalagiri-nagendrababu-kandikunta-prasad-injustice-254454</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Guntur Latest News:&lt;/strong&gt; న్యాయం చేయాల్సిన పోలీసు అధికారి, అండగా నిలవాల్సిన ప్రజాప్రతినిధి కలిసి తమను వేధిస్తున్నారంటూ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ప్రాంతానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు తీవ్ర ఆందోళనకు దిగారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎదుట ఉన్న ఫ్లెక్సీల ఇనుప అంచుల పైకి ఎక్కి వారు నిరసన వ్యక్తం చేశారు. బాధితులను దేవాంగుల గౌతమి, ఆమె భర్త భార్గవ్ రాజు, వారి ఇద్దరు పిల్లలు శాలిని, మోక్షగా గుర్తించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;కదిరిలోని తమ ఇంటి పక్కన ఉన్న స్థలం విషయంలో వివాదం నెలకొందని, ప్రత్యర్థులు తమ ఇంటికి వెళ్లే దారికి అడ్డంగా కంచె వేసి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై న్యాయం చేయాలని కదిరి రూరల్ సీఐ నాగేంద్రబాబును ఆశ్రయిస్తే, ఆయన ప్రత్యర్థులకు కొమ్ముకాస్తూ తమను ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలని బెదిరించారని కన్నీటిపర్యంతమయ్యారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;స్థానిక ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ ఒత్తిడి వల్లే సీఐ నాగేంద్రబాబు తమపై ఈ విధంగా ప్రవర్తిస్తూ బెదిరింపులకు దిగుతున్నారని వారు ఆరోపించారు. స్థానికంగా ఎక్కడా న్యాయం జరగకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఈ కుటుంబం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకుని, అక్కడ తమ ఆవేదనను తెలియజేస్తూ టవర్ ఎక్కి నిరసనకు దిగింది. తమకు జరిగిన అన్యాయంపై ముఖ్యమంత్రి &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్&amp;zwnj; తక్షణమే స్పందించి న్యాయం చేయాలని, లేనిపక్షంలో తాము ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటామని సెల్ఫీ వీడియోల ద్వారా బాధితులు హెచ్చరించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఈ ఘటనతో టీడీపీ కార్యాలయ పరిసరాల్లో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటుచేసుకోగా, రంగంలోకి దిగిన పోలీసులు, పార్టీ నాయకులు వారికి సర్ది చెప్పారు. ఈ సమస్యపై కచ్చితంగా న్యాయం చేస్తామని గట్టిగా హామీ ఇవ్వడంతో బాధితులు శాంతించి టవర్ కిందికి దిగారు. అనంతరం పార్టీ ముఖ్య నేతలను కలిసి తమ గోడును వెళ్లబోసుకునేందుకు వారు &lt;a title=&quot;టీడీపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/tdp&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;టీడీపీ&lt;/a&gt; ఆఫీసులోకి వెళ్లారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;కదిరి నియోజకవర్గ పరిధిలోని కమతంపల్లికి చెందిన ఇదే కుటుంబం మొన్న రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంటామని చెప్పిన సెల్ఫీ వీడియో వైరల్ అయ్యింది. తమ సొంత ఇంటికి వెళ్లే దారిని ప్రత్యర్థులు కంచె వేసి పూర్తిగా మూసివేశారని, న్యాయం కోసం అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తాము ఈ నిర్ణయం తీసుకుంటున్నామని కూడా తెలిపారు.&amp;nbsp; &amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;కమతంపల్లి &amp;nbsp;గ్రామానికి చెందిన భాగ్యరాజ్ తన &amp;nbsp;ఇంటికి వెళ్లే దారిని కంచెతో క్లోజ్ చేశాడని దీని వల్ల రోజూ నరకం చూస్తున్నామని, అధికారులు పట్టించుకోలేదని ఈ కుటుంబం ఆరోపిస్తోంది. మొదట వీడియో ఇంటి వద్ద తీసుకున్నారు. తర్వాత వీడియో రైల్వే ట్రాక్ వద్ద నిలబడి సోషల్ మీడియాలో షేర్ చేశారు. వైరల్ అవుతున్న వీడియోలు చూసిన స్థానికులు వారిని ఓదార్చి శాంతింపజేశారు. దీనంతటికీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్&amp;zwnj;తో పాటు స్థానిక సీఐ ప్రధాన కారణమని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇదే ఆరోపణలు టీడీపీ ఆఫీస్&amp;zwnj; వద్ద కూడా ధర్నా చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/25/f09b2353d3dbc8d5399984166ca49a811784956455540215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[AP TET 2026 Hall Tickets Download:ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!]]></title><link>https://telugu.abplive.com/jobs/ap-tet-2026-hall-tickets-download-andhra-pradesh-cse-ap-gov-in-tet2dsc-apcfss-in-candidates-login-254445</link><comments>https://telugu.abplive.com/jobs/ap-tet-2026-hall-tickets-download-andhra-pradesh-cse-ap-gov-in-tet2dsc-apcfss-in-candidates-login-254445#respond</comments><pubDate>Sat, 25 Jul 2026 09:23:41 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ జాబ్స్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/jobs/ap-tet-2026-hall-tickets-download-andhra-pradesh-cse-ap-gov-in-tet2dsc-apcfss-in-candidates-login-254445</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;AP TET 2026 Hall Tickets Download:&amp;nbsp;&lt;/strong&gt;ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లో నిర్వహిస్తున్న టెట్&amp;zwnj; 2026కు సంబంధించిన హాల్&amp;zwnj;టికెట్స్&amp;zwnj; వెబ్&amp;zwnj;సైట్&amp;zwnj;లో అందుబాటులోకి వచ్చాయి. గత నెలలో నోటిఫికేషన్ విడుదలైంది. నెలరోజుల పాటు అప్లికేషన్స్&amp;zwnj;ను ఆహ్వానించారు. ఇప్పటికే అప్లై చేసుకున్న వారికి హాల్&amp;zwnj;టికెట్స్&amp;zwnj;ను ఇవాల్టి నుంచి జారీ చేస్తున్నారు. అభ్యర్థులు తమ ఐడీ, పాస్&amp;zwnj;వర్డ్&amp;zwnj;ను యూజ్ చేసి హాల్&amp;zwnj;టికెట్స్&amp;zwnj;ను డౌన్&amp;zwnj;లోడ్ చేసుకోవచ్చు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఏపీ టెట్&amp;zwnj; 2026 కోసం మొత్తం 2, 13, 520 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. మొత్తంగా 2, 37, 165 దరఖాస్తులు వచ్చినట్టు కన్వీనర్&amp;zwnj; ఎంవీ కృష్ణారెడ్డి ప్రకటించారు. ఈ నెల 15 నుంచి మాక్&amp;zwnj;టెస్టులు కూడా వెబ్&amp;zwnj;సైట్&amp;zwnj;లో ఉంచారు. ఇప్పుడు హాల్&amp;zwnj;టికెట్స్ కూడా అర్థరాత్రి నుంచి అందుబాటులోకి తీసుకొచ్చినట్టు వెల్లడించారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఆగస్టు 5వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ టెట్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఈసారి ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లోనే కాకుండా హైదరాబాద్, బెంగళూరు, బరంపురం లాంటి ప్రాంతాల్లో కూడా సెంటర్&amp;zwnj;లు ఇచ్చారు. రోజూ రెండు పూటల రెండు పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు పరీక్ష ఉంటుంది. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5 గంటల వరకు ఎగ్జామ్&amp;zwnj; నిర్వహిస్తారు. పరీక్షలు రాసే అభ్యర్థులు ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని సూచిస్తున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;ఏపి టెట్&amp;zwnj; హాల్&amp;zwnj;టికెట్లు ఎలా డౌన్&amp;zwnj;లోడ్ చేసుకోవాలి?&lt;/h2&gt;
&lt;p&gt;ఆంధ్రప్రదేశ్&amp;zwnj; విద్యాశాఖ అధికారులు అధికారిక వెబ్&amp;zwnj;సైట్&amp;zwnj;లో ఏపీ టెట్ 2026 హాల్&amp;zwnj;టికెట్స్&amp;zwnj; ఉంచారు. వీటిని డౌన్&amp;zwnj;లోడ్ చేసుకోవడానికి ఈ కింది స్టెప్స్&amp;zwnj; ఫాలో అవ్వాలి&amp;nbsp;&lt;/p&gt;
&lt;ul&gt;
&lt;li&gt;ముందుగా అధికారిక &lt;a title=&quot;http://cse.ap.gov.in&quot; href=&quot;http://cse.ap.gov.in&quot; target=&quot;_self&quot;&gt;http://cse.ap.gov.in&lt;/a&gt;⁠, &lt;a title=&quot;http://tet2dsc.apcfss.in&quot; href=&quot;http://tet2dsc.apcfss.in&quot; target=&quot;_self&quot;&gt;http://tet2dsc.apcfss.in&lt;/a&gt;⁠ వెబ్&amp;zwnj;సైట్ల ఒకదాంట్లో లాగిన్ అవ్వాలి.&amp;nbsp;&lt;/li&gt;
&lt;li&gt;అందులో క్యాండిడేట్&amp;zwnj; లాగిన్ అనే విభాగంపై క్లిక్ చేయాలి&amp;nbsp;&lt;/li&gt;
&lt;li&gt;వెంటనే యూజర్&amp;zwnj; నేమ్&amp;zwnj; అడుగుతుంది.&amp;nbsp;&lt;/li&gt;
&lt;li&gt;యూజర్&amp;zwnj; నేమ్&amp;zwnj; అడిన ప్రాంతంలో గతంలో అప్లై చేసినప్పుడు వచ్చిన ఐడీ ఎంటర్ చేయాలి.&amp;nbsp;&lt;/li&gt;
&lt;li&gt;యూజర్&amp;zwnj; నేమ్&amp;zwnj; టీడీతో ప్రారంభమవుతుంది.&amp;nbsp;&lt;/li&gt;
&lt;li&gt;తర్వాత మీరు అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు ఇచ్చిన పాస్&amp;zwnj;వర్డ్ ఎంటర్ చేయాలి.&amp;nbsp;&lt;/li&gt;
&lt;li&gt;అనంతరం అక్కడే ఇచ్చిన ఆరు అంకెల క్యాప్చా కోడ్&amp;zwnj;ను కూడా పక్కనే ఇచ్చిన బాక్స్&amp;zwnj;లో ఎంటర్ చేయాలి.&amp;nbsp;&lt;/li&gt;
&lt;li&gt;లాగిన్ అనే బటన్&amp;zwnj;పై ప్రెస్&amp;zwnj; చేయాలి.&amp;nbsp;&lt;/li&gt;
&lt;li&gt;వెంటనే మీ ప్రొఫైల్&amp;zwnj;కు వెళ్తుంది.&amp;nbsp;&lt;/li&gt;
&lt;li&gt;ప్రొఫైల్&amp;zwnj;లో ఎడమ చేతివైపు &amp;nbsp;Services అని ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి.&amp;nbsp;&lt;/li&gt;
&lt;li&gt;అందులో హాల్&amp;zwnj;టికెట్స్ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.&amp;nbsp;&lt;/li&gt;
&lt;li&gt;వెంటనే పక్కనే హాల్&amp;zwnj;టికెట్&amp;zwnj; బాక్స్ కనిపిస్తుంది.&amp;nbsp;&lt;/li&gt;
&lt;li&gt;హాల్&amp;zwnj;టికెట్స్ బాక్స్&amp;zwnj;లో డౌన్&amp;zwnj;లోడ్ సింబల్&amp;zwnj;తో టెక్స్ట్&amp;zwnj; ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి.&amp;nbsp;&lt;/li&gt;
&lt;li&gt;అలా క్లిక్ చేస్తే మీ హాల్&amp;zwnj;టికెట్&amp;zwnj; స్క్రీన్&amp;zwnj;పై కనిపిస్తుంది.&amp;nbsp;&lt;/li&gt;
&lt;li&gt;హాల్&amp;zwnj;టికెట్ పక్కనే డౌన్&amp;zwnj;లోడ్&amp;zwnj;, ప్రింట్&amp;zwnj;, సేవ్ ఆప్షన్స్ కనిపిస్తాయి.&lt;/li&gt;
&lt;li&gt;మీరు డౌన్&amp;zwnj;లోడ్ చేసుకొన్న తర్వాత ప్రింట్ చేసుకుంటే మీ హాల్&amp;zwnj;టికెట్ మీ చేతిలోకి వస్తుంది.&amp;nbsp;&lt;/li&gt;
&lt;/ul&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/25/a1321273e7249c3f6f9a4e255146abb61784951469472215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Breaking News: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి]]></title><link>https://telugu.abplive.com/news/today-top-stories-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-25th-july-2026-254437</link><comments>https://telugu.abplive.com/news/today-top-stories-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-25th-july-2026-254437#respond</comments><pubDate>Sat, 25 Jul 2026 07:22:12 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ న్యూస్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/today-top-stories-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-25th-july-2026-254437</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Top Stories Today | ఈరోజు వార్తల ముఖ్యాంశాలు&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;h2&gt;కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి&lt;/h2&gt;
&lt;p&gt;కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషికి తాత్కాలికంగా బాధ్యతలు అప్పగించారు. కాక్రోచ్ జనతా పార్టీ, జెన్ జీ ఆందోళనతో కేంద్రం దిగొచ్చింది. నీట్ పేపర్ లీక్ విషయంలో నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కేంద్రం సుమోటోగా తీసుకుని, సీబీఐ ఈ కేసు దర్యాప్తు చేస్తుందని రాజీనామా తరువాత ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు.&lt;/p&gt;
&lt;h2&gt;ఇది యువత సాధించిన విజయం.. క్రెడిట్&amp;nbsp;కాంగ్రెస్ ఖాతాలో&amp;nbsp;వేసుకోదు: రేవంత్ రెడ్డి&lt;/h2&gt;
&lt;p&gt;ఇది యువత విజయం, యువత తలుచుకుంటే సాధించనది అంటూ ఏమీ లేదని.. ఈ విజయాన్ని కాంగ్రెస్ ఖాతాలో వేసుకోవడం లేదన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై &lt;a title=&quot;తెలంగాణ కాంగ్రెస్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Telangana-Congress&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;తెలంగాణ కాంగ్రెస్&lt;/a&gt; హర్షం వ్యక్తం చేసింది. పార్టీలకు అతీతంగా అంతా యువతకు మద్దతు తెలిపారని ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన దాడిని నిరసిస్తూ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ నేతృత్వంలో పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు నెక్లెస్ రోడ్డులో కాంగ్రెస్ క్యాండిల్ ర్యాలీ నిర్వహించింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, విద్యార్థులు, యువత, జెన్ జీలు, &lt;a title=&quot;కాంగ్రెస్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Congress&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కాంగ్రెస్&lt;/a&gt; నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నీట్ పేపర్ లీక్ ఘటనతో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు నివాళులర్పించారు. యువత పోరాటంతో కేంద్రం ఎట్టకేలకు దిగొచ్చిందని సీఎం &lt;a title=&quot;రేవంత్ రెడ్డి&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Revanth-Reddy&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;రేవంత్ రెడ్డి&lt;/a&gt; అన్నారు. విద్యార్థులపై నమోదు చేసిన కేసులన్నీ సోమవారం లోపు ఎత్తివేయాలన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;కేంద్రంతో చర్చలు సఫలం.. ఆందోళన విరమిస్తున్నట్లు ప్రకటించిన సీజేపీ&lt;/h2&gt;
&lt;p&gt;కేంద్రంతో జరిపిన చర్చలు విజయవంతమైనట్లు కాక్రోచ్ జనతా పార్టీ నేతలు ప్రకటించారు. తమ డిమాండ్లకు కేంద్రం అంగీకారం తెలపడం, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో ఆందోళన విరమిస్తున్నట్లు సీజేపీ ప్రకటించింది. గత కొన్ని రోజులుగా విద్యార్థులు, యువత మద్దతుతో సీజేపీ నేతలు ఢిల్లీ సహా దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆందోళనకు దిగారు. చర్చలు సఫలం కావడంతో ఆందోళన విరమించిన సీజేపీ నేతలు, విద్యార్థులు క్షేమంగా ఇళ్లకు చేరుకోవాలని కోరారు. గత కొన్ని రోజులుగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొని నీట్ పేపర్ లీక్ పై కేంద్రం బాధ్యత తీసుకుని, మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం తెలిసిందే.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;విద్యార్థులపై కేసులు ఎత్తివేస్తాం.. కేంద్ర మంత్రి జేపీ నడ్డా&lt;/h2&gt;
&lt;p&gt;నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై ఢిల్లీ సహా ఇతర ప్రాంతాల్లో నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై కేసులు ఎత్తివేస్తామని కేంద్ర మంత్రి జేపీ నడ్డా తెలిపారు. సీజేపీ ప్రతినిధులతో కేంద్రం మూడోసారి సమావేశమై చర్చలు జరిపింది. భవిష్యత్తులోనూ విద్యార్థులను కేసుల పేరుతో వేధించబోమని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు అండగా ఉంటామన్నారు.&lt;/p&gt;
&lt;h2&gt;Union Minister Dharmendra Pradhan resigns : కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;విద్యార్థుల ఉద్యమానికి దిగొచ్చిన కేంద్రం ధర్మేంధ్రప్రధాన్&amp;zwnj;తో రాజీనామా చేయించింది. కాసేపట్లో మరో దఫా చర్చలు కాక్రోచ్ జనతాపార్టీ ప్రతినిధులతో చర్చలు జరగనున్నాయి. ఇంతలోనే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం సంచలనంగా మారింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;కదిరి సీఐ బెదిరిస్తున్నాడని మంగళగిరిలో ఫ్లెక్సీ పరంజ ఎక్కిన వ్యక్తి!&lt;/h2&gt;
&lt;p&gt;కదిరి సీఐ నాగేంద్రబాబు బెదిరిస్తున్నాడని దేవాంగుల భార్గవ రాజు అనే వ్యక్తి మంగళగిరిలో ఫ్లెక్సీ పరంజ ఎక్కిన నిరసన తెలిపారు. తన ఇంటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశాడు. సమస్య పరిష్కరించకుండా కదిరి సీఐ నాగేంద్రబాబు బెదిరిస్తున్నారంటూ ఆరోపించాడు. భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి మంగళగిరి &lt;a title=&quot;టీడీపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/tdp&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;టీడీపీ&lt;/a&gt; కేంద్ర కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టాడు. సమాచారం అందుకున్న మంగళగిరి రూరల్ సీఐ ఏ.వి. బ్రహ్మం, పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి చేరకొని అతనితో మాట్లాడారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Vijayawada Latest News: విజయవాడలోని భవానీపురంలో గ్యాంగ్&amp;zwnj;వార్- భయభ్రాంతులకు గురైన స్థానికులు&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;&lt;strong&gt;Vijayawada Latest News:&lt;/strong&gt; విజయవాడ భవానీపురంలో గ్యాంగ్ వార్ స్థానికులను పరుగులు పెట్టించింది. భవానీపురం స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. అన్నదమ్ముల గొడవ కారణంగానే గ్యాంగ్ జరిగిందని స్థానికులు చెబుతున్నారు. అన్న షేక్ నాగూర్ తమ్ముడు ఖాదర్&amp;zwnj;పై విచక్షణరహీతంగా దాడి చేయడంతో తమ్ముడు &amp;nbsp;ఖాదర్ భవానీపురం పోలీస్ స్టేషన్&amp;zwnj;లో ఫిర్యాదు చేశాడు. తమ్ముడు ఖాదర్ అన్న నాగూర్&amp;zwnj;పై సుమారు వంద మందితో ఇంటికి వెళ్లి దాడి చేశాడు. షేక్ నాగూర్ ఇప్పటికే ఓ కేసులో ముద్దాయిగా ఉన్నాడు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;వ్యక్తిగత గొడవలను గ్యాంగ్&amp;zwnj;వార్&amp;zwnj;లా మార్చి స్థానికులను భయపెట్టిందుకు ఇరువురుపై కేసులు నమోదు చేసే ఆలోచనలో భవానీపురం పోలీసులు ఉన్నారు. అన్న షేక్ నాగూర్ వల్ల తనకు ప్రాణ హాని ఉందని ఖాదర్ పోలీసులకు తెలిపాడు. గతంలో షేక్ &amp;nbsp;నాగూర్&amp;zwnj;పై విజయవాడలో పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైనట్టు పోలీసులు తెలిపారు. నాగూర్&amp;zwnj;పై రౌడీ షీట్ ఓపెన్ చేయాలి తమ్ముడు ఖాదర్ డిమాండ్ చేస్తున్నాడు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;Vijayawada Latest News: విజయవాడలోని మధురానగర్&amp;zwnj;లో బిర్యాని షాపు దగ్ధం!&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;Vijayawada Latest News: విజయవాడ మధురానగర్&amp;zwnj;లోని గోల్డెన్&amp;zwnj; ప్లేట్&amp;zwnj; బిర్యాని అండ్&amp;zwnj; రెస్టారెంట్&amp;zwnj;లో శుక్రవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. దుకాణంలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు సామగ్రిని పూర్తిగా దహనం చేశాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటన జరిగిన సమయంలో షాపులో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం జరగలేదు. లక్షల్లో ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చని అంచనా. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/25/dbce97c63be9be0295cd210964b5cf331784944281475215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[కుంకీ ఏనుగులకు పవన్ కల్యాణ్ ఘన స్వాగతం]]></title><link>https://telugu.abplive.com/short-videos/andhra-pradesh/pawan-kalyan-gives-a-grand-welcome-to-kunki-elephants-254388</link><comments>https://telugu.abplive.com/short-videos/andhra-pradesh/pawan-kalyan-gives-a-grand-welcome-to-kunki-elephants-254388#respond</comments><pubDate>Fri, 24 Jul 2026 15:00:08 +0530 </pubDate><dc:creator><![CDATA[ ABP Desam ]]></dc:creator><category><![CDATA[ ఆంధ్రప్రదేశ్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/short-videos/andhra-pradesh/pawan-kalyan-gives-a-grand-welcome-to-kunki-elephants-254388</guid><description><![CDATA[&lt;p data-path-to-node=&quot;6&quot;&gt;ఏపీలో ఏనుగుల సంచారం, వాటి వల్ల జరుగుతున్న ప్రాణ నష్టాన్ని నివారించేందుకు ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. రాష్ట్రానికి చేరుకున్న స్పెషల్ 'కుంకీ ఏనుగుల'కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘన స్వాగతం పలికారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/24/10a2f85effc48b5344ad52190e3624a917848853614771476_original.jpeg" width="220"/></item><item><title><![CDATA[నేరుగా జనసేన ఆఫీస్‌కే కుంకీ ఏనుగులు.. పవన్ కళ్యాణ్ మాస్ వెల్కమ్!]]></title><link>https://telugu.abplive.com/short-videos/andhra-pradesh/elephants-rush-straight-to-the-jana-sena-office-pawan-kalyan-s-mass-welcome-254383</link><comments>https://telugu.abplive.com/short-videos/andhra-pradesh/elephants-rush-straight-to-the-jana-sena-office-pawan-kalyan-s-mass-welcome-254383#respond</comments><pubDate>Fri, 24 Jul 2026 14:42:08 +0530 </pubDate><dc:creator><![CDATA[ ABP Desam ]]></dc:creator><category><![CDATA[ ఆంధ్రప్రదేశ్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/short-videos/andhra-pradesh/elephants-rush-straight-to-the-jana-sena-office-pawan-kalyan-s-mass-welcome-254383</guid><description><![CDATA[&lt;p&gt;ఏపీలో ఏనుగుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రంగంలోకి దిగిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ఏకంగా కుంకీ ఏనుగులను జనసేన పార్టీ కార్యాలయానికి రప్పించారు. వాటికి ఘన స్వాగతం పలికిన ఆయన, అధికారులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/07/24/7844c4052bc8eaa97dc99a8043325a9517848843138101476_original.jpeg" width="220"/></item></channel></rss>