<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/" xmlns:dc="http://purl.org/dc/elements/1.1/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/" xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/" xmlns:media="http://search.yahoo.com/mrss/"><channel><title>amravati</title><atom:link href="https://telugu.abplive.com/amravati/feed" rel="self" type="application/rss+xml"/><link>https://telugu.abplive.com/</link><description/><lastBuildDate>Tue, 18 Aug 2026 12:04:21 +0530</lastBuildDate><language>en-US</language><sy:updatePeriod>hourly</sy:updatePeriod><sy:updateFrequency>1</sy:updateFrequency><generator>https://telugu.abplive.com</generator><item><title><![CDATA[AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!]]></title><link>https://telugu.abplive.com/jobs/andhra-pradesh-teacher-recruitment-dsc-notification-3000-posts-nara-lokesh-256589</link><comments>https://telugu.abplive.com/jobs/andhra-pradesh-teacher-recruitment-dsc-notification-3000-posts-nara-lokesh-256589#respond</comments><pubDate>Tue, 18 Aug 2026 07:58:22 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ జాబ్స్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/jobs/andhra-pradesh-teacher-recruitment-dsc-notification-3000-posts-nara-lokesh-256589</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;AP DSC Notification 2026:&amp;nbsp;&lt;/strong&gt;ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం వేచి చూస్తున్న లక్షలాది మంది మంత్రి నారా లోకేష్ మరో గుడ్ న్యూస్ చెప్పారు. ఇప్పటికే ఎప్పుడు ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారో చెబుతూ క్యాలెండర్ ప్రకటించారు. దాని ప్రకారం అక్టోబర్&amp;zwnj;లో డీఎస్సీ నోటిఫికేషన్ వేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. దానికి అనుగుణంగానే 3000 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ రాబోతోందని ఆయన తెలిపారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;అసెంబ్లీ వేదికగా లోకేష్&amp;zwnj; ప్రకటన&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;ఆంధ్రప్రదేశ్&amp;zwnj; శాసనసభ వర్షాకాల సమావేశాల్లో భాగంగా విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్&amp;zwnj; &amp;nbsp;ఉపాధ్యాయ నియామకాలపై స్పష్టమైన రోడ్డు మ్యాప్ ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఖాళీలను భర్తీ చేసే ప్రక్రియలో భాగంగా రాబోయే అక్టోబర్&amp;zwnj; నెలలో 3000 పోస్టులతో కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడనుందని ప్రకటించారు. ప్రభుత్వం పాఠశాలల్లో ఉపాధ్యాయ- విద్యార్థి నిష్పత్తిని మెరుగుపరచడం ద్వారా విద్యా ప్రమాణాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనేది ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;ప్రతి ఏటా డీఎస్సీ&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;ఈ ప్రకటనలో అత్యంత కీలకమైన మరో అంశం యాన్యువల్ డీఎస్సీ, ఇప్పటివరకు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియక అభ్యర్థులు పడే మానసిక ఒత్తిడిని తొలగించడానికి, ప్రతి సంవత్సరం నిర్ధిష్ట సమయంలో నోటిఫికేషన్ విడుదల చేసేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. దీని వల్ల అభ్యర్థులు తమ ప్రిపరేషన్&amp;zwnj;ను ప్రణాళికాబద్ధంగా కొనసాగించుకోడానికి వీలు అవుతుంది. ఇప్పటికే ప్రభుత్వం గ్రూప్-1, గ్రూప్&amp;zwnj;-2, డీఎస్సీ పోస్టుల భర్తీ ప్రక్రియలో ముందంజలో ఉన్నట్టు అసెంబ్లీలో వెల్లడించింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;నియామకాల్లో పారదర్శకత&lt;/h2&gt;
&lt;p&gt;నియామక ప్రక్రియలో ఎటువంటి అక్రమాలకు తావులేకుండా వంద శాతం పారదర్శకత పాటిస్తామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు. కంప్యూటర్ ఆధారిత పరీక్షల ద్వారానే అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని, జిల్లాల వారీగా ఉన్న ఖాళీలు, రిటైర్మెంట్&amp;zwnj;లు, పదోన్నతలు ఆధారంగా నోటిఫికేషన్ డిజైన్ చేస్తున్నట్టు ఆయన తెలిపారు. గతంలో ఎదురైన న్యాయపరమైన ఆటంకాలను, దాదాపు 336 కోర్టు కేసులను అధిగమించి గత ఏడాది నిర్వహించిన మెగా డీఎస్సీని 148 రోజుల్లోనే రికార్డు స్థాయిలో పూర్తి చేసినట్టు గుర్తు చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;ఉపాధ్యాయులకు అంతర్జాతీయ శిక్షణ&lt;/h2&gt;
&lt;p&gt;ఉపాధ్యాయులకు కేవలం పాఠశాలలకు పరిమితం కాకుండా, వారికి అత్యాధునిక బోధనా పద్ధతుల్లో శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే ఏపీ ఉపాధ్యాయులను సింగపూర్, ఫిన్&amp;zwnj;లాండ్ వంటి దేశాలకు పంపి అంతర్జాతీయ ఎక్స్&amp;zwnj;పోజర్ కల్పించనున్నారు. అక్టోబ్&amp;zwnj;లో నోటిఫికేషన్ ఇచ్చి, పరీక్షలు నిర్వహించి ఉగాది పండుగ నాటికి ఎంపికైన వారికి నియామక పత్రాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుంది. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి వీరందరూ విధుల్లో చేరనున్నారు.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/18/26826903dd147be88738a2f7b510cf721787019858734215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[AP CM Chandrababu Speech: ఎల్‌నినో ప్రభావంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. అక్కడ మాత్రమే వరి వేయాలని రైతులకు సూచనలు]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/ap-cm-chandrababu-highlights-severe-drought-and-el-nino-impact-in-ap-legislative-council-256579</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/ap-cm-chandrababu-highlights-severe-drought-and-el-nino-impact-in-ap-legislative-council-256579#respond</comments><pubDate>Mon, 17 Aug 2026 21:20:16 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ అమరావతి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/amravati/ap-cm-chandrababu-highlights-severe-drought-and-el-nino-impact-in-ap-legislative-council-256579</guid><description><![CDATA[&lt;p&gt;అమరావతి: ఈ ఏడాది భారత్&amp;zwnj;లో పలు రాష్ట్రాల్లో ఎల్ నినో తీవ్ర ప్రభావం చూపుతోంది. ఆగస్టు నెల సగం పూర్తయినా లోటు వర్షపాతం కారణంగా రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, ఎల్ నినో తీవ్ర ప్రభావం, నీటి సంక్షోభంపై మాట్లాడుతూ ఈ ఏడాది 35.5 శాతం లోటు వర్షపాతం ఉంటుందని నిపుణులు అంచనా వేశారని రైతులకు కీలక సూచనలు చేశారు. ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలోనూ తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడి నీటి లభ్యత తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. లోటు వర్షపాత పరిస్థితుల కారణంగా రైతులు అన్ని ప్రాంతాల్లో వరి వేసి ఇబ్బంది పడొద్దని సూచించారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;గోదావరి బేసిన్ మినహా ఇతర ప్రాంతాల్లో వరి వద్దు!&lt;/strong&gt;&lt;br /&gt;గోదావరి నదికి మాత్రమే కొంత వరద నీరు వస్తోందని తెలిపారు. కనుక గోదావరి బేసిన్ మినహా మిగిలిన ఏ ప్రాంతంలోనూ వరి పంటలు వేస్తే, పంటలు ఎండిపోయి రైతులు ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉందని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. ఈ విషయాన్ని రైతులు గ్రహించి నీటిని అత్యంత పొదుపుగా వాడుకోవాలని సూచించారు. ఎల్ నినో ప్రభావంతో లోటు వర్షపాతం నమోదవుతుందని రైతులు అర్థం చేసుకుని, ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవడం మంచిదన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు వారి ప్రాంతాల్లో ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించాలని సూచించారు.&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/17/0c6deb82229a002e4c9329fa640804a51786981200531233_original.jpg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;రాష్ట్రంలో తాగునీటి అవసరాలకు మొదటి ప్రాధాన్యత ఇస్తూనే, పరిశ్రమలకు అవసరమైన నీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి పెడతామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. నిపుణుల అంచనాల ప్రకారం ఈ ఏడాది దాదాపు 35.5 శాతం మేర లోటు వర్షపాతం నమోదు కానుందని తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రాజెక్టులతో పాటు పెన్నా బేసిన్ వ్యాప్తంగా పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, కొన్ని జిల్లాల్లో లోటు వర్షపాతం 42 శాతానికి చేరిందన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;నీటి కొరతతో రాష్ట్రాల మధ్య వివాదాలు&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;నీటి కొరత వల్ల రాష్ట్రాల మధ్య వివాదాలు, విభేదాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గత రెండేళ్లుగా ఏపీ ప్రభుత్వం నీటి నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందన్నారు. పొరుగు రాష్ట్రాలైన &lt;a title=&quot;కర్ణాటక&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Karnataka&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కర్ణాటక&lt;/a&gt;, మహారాష్ట్రలలో కూడా వర్షపాతం తగ్గడంతో అక్కడి రిజర్వాయర్లు నిండిన తర్వాతే మన రాష్ట్రానికి నీరు వస్తుందని తెలిపారు. దీనివల్ల కృష్ణా పరివాహక ప్రాంతంలోని శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు నీటి ప్రవాహం భారీగా తగ్గిందని ఆయన వివరించారు. ఉదాహరణకు శ్రీశైలానికి సాధారణంగా రావాల్సిన 753 టీఎంసీల నీటికి గాను ఈ ఏడాది కేవలం 214 టీఎంసీలు మాత్రమే వచ్చాయని తెలిపారు.&lt;/p&gt;
&lt;p&gt;జూన్ నుంచి డిసెంబర్ మధ్య సాధారణంగా పడాల్సిన 867 మిల్లీమీటర్ల వర్షపాతానికి బదులుగా కేవలం 557 మి.మీ మాత్రమే నమోదయ్యే అవకాశం ఉందన్నారు. జులై నుంచి నవంబర్ వరకు &amp;nbsp;20 శాతం నుండి 68 శాతం వరకు లోటు వర్షపాతం ఉంటుందని, డిసెంబర్&amp;zwnj;లో మాత్రమే స్వల్పంగా సాధారణ వర్షపాతం ఉండవచ్చని వివరించారు. ఈ ఏడాది అన్ని జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కానుందని.. కొన్ని జిల్లాల్లో జులైలో 68 శాతం లోటు వర్షపాతం నమోదు కాగా, ఆగస్టులో 35 శాతం, సెప్టెంబర్ నెలలో 35 శాతం, అక్టోబర్&amp;zwnj;లో 25 శాతం, నవంబర్&amp;zwnj;&amp;zwnj; నెలలో 20 శాతం మేర లోటు వర్షపాతం నమోదు కానుందని అంచనాలు వివరించారు. &amp;nbsp;నీటి కొరత ముప్పు తీవ్రంగా ఉన్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సీఎం &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; హెచ్చరించారు.&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/17/e020b81666993aefcbcfe68bc98679421786981067447233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! ]]></title><link>https://telugu.abplive.com/politics/bjp-national-executive-ap-telangana-leaders-political-strategy-cabinet-expansion-256555</link><comments>https://telugu.abplive.com/politics/bjp-national-executive-ap-telangana-leaders-political-strategy-cabinet-expansion-256555#respond</comments><pubDate>Mon, 17 Aug 2026 16:23:03 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ పాలిటిక్స్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/politics/bjp-national-executive-ap-telangana-leaders-political-strategy-cabinet-expansion-256555</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Andhra Pradesh and Telangana BJP:&amp;nbsp;&lt;/strong&gt;సోమవారం బీజేపీ జాతీయ కార్యవర్గాన్ని అధిష్ఠానం ప్రకటించింది. నితిన్ జట్టులోకి తెలుగు రాష్ట్రాల నుంచి కేవలం ఇద్దరికే చోటు దక్కింది. ఆ ఇద్దరు కూడా ఆంధ్రప్రదేశ్&amp;zwnj;కు చెందిన వారే. రామ్&amp;zwnj;మాధవ్&amp;zwnj;కు చోటు దక్కినా ఆయన ఢిల్లీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తెలంగాణ నుంచి మాత్రం ఒక్కరంటే ఒక్కరికి కూడా చోటు లభించలేదు. అంతేకాకుండా మొన్నటి వరకు జాతీయ కార్యవర్గంలో ఉన్న డీకే అరుణకు కూడా చోటు కల్పించలేదు. అయితే ఈ మార్పులు చేర్పులపై ఆంధ్రప్రదేశ్&amp;zwnj;కు చెందిన నేతలు కాస్త నిరాశ చెందుతుంటే, తెలంగాణకు చెందిన నేతలు మాత్రం ముసిముసి నవ్వులు నవ్వుతూ ఫుల్&amp;zwnj; ఖుష్ అవుతున్నారు. పదవులు రాని వారందరూ ఎందుకు ఆనందపడుతున్నారో చూద్దాం. &amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;ఏపీలో అన్&amp;zwnj;హ్యాపీ- తెలంగాణలో హ్యాపీ&lt;/h2&gt;
&lt;p&gt;మంత్రివర్గ విస్తరణ, పార్టీ పదవులు, నామినేటెడ్ పదవులు ఏవైనా సరే ఒక లీడర్&amp;zwnj;కు బూస్ట్ ఇస్తాయి. తన ప్రాంతంలో పెట్టు మరింత పెంచుకోవడానికి సహకరిస్తాయి. అందుకే పదవుల కోసం గ్రామస్థాయి లీడర్ నుంచి జాతీయ స్థాయి నాయకుడి వరకు పోటీ పడుతుంటారు. లాబీయింగ్ చేస్తుంటారు. పదవులు రాని వారు మాత్రం విమర్శలు చేస్తారు. ఆలిగి కూర్చుంటారు. మరికొందరు తిరుగుబాటు చేస్తారు. బీజేపీ నేతల ఆలోచనలు మాత్రం వేరుగా ఉన్నాయి. త్వరలోనే జరిగే మంత్రివర్గ విస్తరణలో తమకు చోటు ఖాయమనే ధీమాతో ఉన్నారు. అందుకే తమను జాతీయ కార్యవర్గంలోకి తీసుకోలేదని సంబరపడిపోతున్నారు. అదే తెలంగాణ నేతల్లో ఆనందాన్ని రెట్టింపు చేస్తే, ఆంధ్రప్రదేశ్ నేతల్లో నిరాశ నింపుతోంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;ఏపీ బీజేపీ నేతలకు ఆమాత్యయోగం లేనట్టే!&lt;/h2&gt;
&lt;p&gt;పార్టీలు ఏ పని చేసినా దాని వెనుక రాజకీయ వ్యూహం కచ్చితంగా ఉంటుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా అదే ఆలోచనతో పావులు కదుపుతోంది. వివిధ స్థాయి పదవులకు నాయకులను ఎంపిక చేస్తుంది. ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లో పార్టీని అధికారంలోకి వచ్చే బలం బలగం బీజేపీకి లేదు. అందుకే కూటమితో ప్రయాణం సాగిస్తోంది. అందుకే సొంతంగా ఎదగడానికి ప్రయత్నిస్తూనే కూటమిని కూడా కాపాడుకోవాలని ఆలోచనతో వెళ్తోంది. త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో కచ్చితంగా ఆంధ్రప్రదేశ్&amp;zwnj;కు ఒక మంత్రి పదవి వస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఆ మంత్రి పదవి ఇచ్చే క్రమంలో లెక్కలు పరిగణలోకి తీసుకుంటారు. ఇప్పటికే మూడు మంత్రిపదవులు ఆ రాష్ట్రం నుంచే ఉన్నాయి. ఇందులో టీడీపీ లీడర్లు ఇద్దరు అయితే, మూడో వ్యక్తి బీజేపీ నుంచి ఎన్నికైన వ్యక్తే. టీడీపీ నుంచి శ్రీకాకుళం నుంచి ఎన్నికైన రామ్మోహన్ నాయుడు కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉంటే, గుంటూరు నుంచి ఎన్నికైన పెమ్మసాని చంద్రశేఖర్&amp;zwnj; గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ మంత్రిగా ఉన్నారు. నరసాపురం నుంచి బీజేపీ గుర్తుపై గెలిచిన భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు భారీ పరిశ్రమల, ఉక్కు శాఖల మంత్రిగా కొనసాగుతున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;పురంధేశ్వరిని పోటీ నుంచి తప్పించిన అధిష్ఠానం&lt;/h2&gt;
&lt;p&gt;ఇప్పుడు ఏపీకి ఇంకో పదవి ఇవ్వాల్సి వస్తే కచ్చితంగా సీనియర్&amp;zwnj;, రాజమండ్రి నుంచి విజయం సాధించిన పురంధేశ్వరి పోటీకి వస్తారు. ఇవ్వాల్సిన మంత్రి పదవి ఈసారి కూటమి పార్టీల్లో ఒకరికి ఇవ్వాల్సిన మోదీ, అమిత్&amp;zwnj;షా నిర్ణయించినట్టు తెలుస్తోంది. అలా చేస్తే బీజేపీ కేడర్&amp;zwnj;ను నిరాశ పరచినట్టు అవుతుంది. అందుకే జాతీయ కార్యవర్గంలోకి పురంధేశ్వరిని తీసుకున్నారు. ఇప్పుడు ఆమెను మంత్రిపదవి రేసు నుంచి తప్పించారు. దీంతో సమీకరణాలు లెక్కించడం బీజేపీకి, కూటమి పార్టీలకు ఈజీ అవుతుంది. అందుకే ఇది తెలిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు ఒక్కసారిగా డీలా పడిపోయారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;తెలంగాణలో నేతల హ్యాపీకి కారణం!&lt;/h2&gt;
&lt;p&gt;తెలంగాణలో బీజేపీ నేతలు మాత్రం ఫుల్ హ్యాపీగా ఉంటున్నారు. ఒక వేళ జాతీయ కార్యవర్గంలో చోటు కల్పించి ఉంటే కచ్చితంగా తమ మంత్రిపదవి ఆశలపై నీళ్లు చల్లినట్టేనని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఎవర్నీ ఎంపిక చేయకపోవడం వారంతా తమ లాబీయింగ్&amp;zwnj;ను మరింత తీవ్రం చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్&amp;zwnj;తో పోల్చుకుంటే తెలంగాణలో బీజేపీ బలంగా ఉంది. ఇక్కడ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తుంది. అందుకే పార్టీ పదవులతో ఇక్కడి నేతలను డైవర్ట్ చేయలేమని గ్రహించి, వారి మంత్రి పదవుల ఆప్షన్&amp;zwnj;ను లైవ్&amp;zwnj;లో ఉంచింది. త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో కచ్చితంగా వారిని తీసుకుంటారనే విశ్లేషణలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఇక్కడ ఇద్దరికి మంత్రిపదవులు ఉన్నాయి. కిషన్ రెడ్డి గనుల శాఖను చూస్తున్నారు. మరో నేత &lt;a title=&quot;బండి సంజయ్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Bandi-Sanjay&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;బండి సంజయ్&lt;/a&gt;&amp;zwnj; కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా సేవలు అందిస్తున్నారు. వీరితోపాటు ఇంకో మంత్రిపదవి తెలంగాణలు దక్కవచ్చని వార్తలు వస్తున్నాయి. అందుకే వారిని జాతీయ కార్యవర్గంలోకి తీసుకోలేదనే విశ్లేషణ వినిపిస్తోంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;విష్ణువర్దన్ రెడ్డి పలుకుబడి!&lt;/h2&gt;
&lt;p&gt;ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లో బీజేపీ యువ నేత విష్ణువర్దన్ రెడ్డి మాత్రం కాస్త హ్యాపీగా ఉన్నారు. ఆయన కరుడుగట్టిన &lt;a title=&quot;బీజేపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/BJP&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;బీజేపీ&lt;/a&gt; లీడరే అయినప్పటికీ ఆయన మనసు వైసీపీలో ఉంటుందని కూటమి నేతలు సెటైర్లు వేస్తుంటారు. అందుకే ఆయన్ని రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్ పదవులకు కానీ, ఎన్నికల్లో పోటీకి కానీ &lt;a title=&quot;టీడీపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/tdp&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;టీడీపీ&lt;/a&gt;, &lt;a title=&quot;జనసేన&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Janasena&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;జనసేన&lt;/a&gt; అంగీకరించలేదు. నేరుగా ఆయనకు కేంద్రంలో ప్రత్యేక పదవులు ఇచ్చే పరిస్థితి లేదు. మధ్యేమార్గంగా ఆయన్ని డైరెక్ట్&amp;zwnj;గా నబీన్ టీంలోకి తీసుకున్నారు. దీంతో అధిష్ఠానం వద్ద ఆయన పలుకుబడి బాగానే ఉందని ప్రచారం మొదలైంది. ఇది ఆయనకు కలిసి వచ్చే అంశంగా చెప్పుకుంటున్నారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/17/f6776cb0dd10100a2bcd1c14c41ae34d1786963892353215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Chandra Babu About Mega DSC 2025: మెగా డీఎస్సీ2025 ఆరోపణలపై సాక్ష్యాలు ఉంటే సభ ముందు పెట్టండి, వైసీపీకి చంద్రబాబు సవాల్‌!]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/andhra-pradesh-assembly-mega-dsc-2025-irregularities-transparency-cm-chandra-babu-naidu-challenges-to-ysrcp-256547</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/andhra-pradesh-assembly-mega-dsc-2025-irregularities-transparency-cm-chandra-babu-naidu-challenges-to-ysrcp-256547#respond</comments><pubDate>Mon, 17 Aug 2026 15:03:30 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ అమరావతి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/amravati/andhra-pradesh-assembly-mega-dsc-2025-irregularities-transparency-cm-chandra-babu-naidu-challenges-to-ysrcp-256547</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Chandra Babu About Mega DSC 2025: &lt;/strong&gt;ఆంధ్రప్రదేశ్&amp;zwnj; అసెంబ్లీలో మెగా డీఎస్సీ 2025పై కీలకమైన చర్చ జరిగింది. ఈ నియామకాల్లో అక్రమాలు జరిగాయని చాలా కాలంగా వైసీపీ ఆరోపణలు చేస్తూ వస్తోంది. రోడ్లపై నిరసనలు తెలియజేస్తోంది. అధికారులు ఎప్పటికప్పుడు వారు చేస్తున్న ఆరోపణలకు కౌంటర్ ఇస్తూనే వస్తున్నారు. అయినా తమ ఆరోపణలను మాత్రం వారు ఆపడం లేదు. దీంతో అసెంబ్లీలోనే చర్చ పెట్టి పూర్తి సమాచారాన్ని ప్రజలకు చేరవేయాలని ప్రభుత్వం భావించింది. అనుకున్నట్టుగానే అసెంబ్లీలో విస్తృతంగా చర్చ సాగింది. ఇందులో మాట్లాడిన మంత్రులు, ముఖ్యమంత్రి వైసీపీ తీరును తప్పుపట్టారు. అక్రమాలు జరిగినట్టు ఆధారాలు చూపించకుండా కేవలం బురద జల్లుతున్నారని, అపోహలు సృష్టించడమే వారి పని అని అంటూ మండిపడ్డారు. సాక్ష్యాలు ఉంటే పట్టుకొని సభకు రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ చేశారు. ఈ ప్రభుత్వంలో తప్పులకు ఆస్కారం లేదని అలాంటి వాటిని ఉపేక్షించే ప్రసక్తే లేదని అన్నారు. అదే టైంలో జరగని తప్పులు గురించి ఆధారాలు లేకుండా పదే పదే ఆరోపణలు చేసిన వారి కూడా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఎలాంటి తప్పులు లేకుండా కేవలం ప్రతిభ ఆధారంగానే మెగా డీఎస్సీ 2025 నియామకాలు పూర్తి అయ్యాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తేల్చి చెప్పారు. తప్పులు లేకుండా, పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రతి దశలోనూ జాగ్రత్తలు తీసుకున్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఆ విషయం రాసిన అభ్యర్థులకు, ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు తెలుసునని అన్నారు. అందుకే వైసీపీ ఎన్ని విధాలుగా తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తున్నా పట్టించుకున్న వారు లేరని అభిప్రాయపడ్డారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;కేవలం వైసీపీ నేతలు మాత్రమే రోడ్డుపైకి వచ్చి నానాయాగి చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. వారు చేస్తున్న ఆరోపణలకు అధికారులు సాక్ష్యాలతో సమాధానం ఇచ్చారని పేర్కొన్నారు. ధర్నాలు చేస్తున్న వైసీపీ నేతలకు స్పోర్ట్స్&amp;zwnj;కు గేమ్స్&amp;zwnj;కు తేడా తెలియదన్నారు. అందుకే ఏదో జరిగిపోయిందనే భ్రమల్లో ప్రజలను తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి అధికారులతోపాటు డీఎస్సీలో ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులు కూడా రోడ్డుపైకి వచ్చి వైసీపీ నేతలకు కౌంటర్ ఇచ్చారని, వీరిలో ఎక్కువ మంది మహిళలే ఉన్నారని గుర్తు చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేస్తున్నా వారి వద్ద ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు చంద్రబాబు. వారు అధికారంలో ఉన్నప్పుడు డీఎస్సీ ఉద్యోగాల నోటఫికేషన్ వేయలేకపోయామనే కోపంతోనే ఇలాంటివి చేస్తున్నారని అన్నారు. తాము ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టు నోటిఫికేషన్ ఇచ్చామని, 108 రోజుల్లోనే ప్రక్రియను ఎలాంటి తప్పుల్లేకుండా పూర్తి చేశామని అన్నారు. ఇందులో భాగమైన అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృతజ్ఞత తెలిపారు. ఇంత పకడ్బంధీగా ఉద్యోగ నియామకాలు పూర్తి చేసినప్పటికీ వైసీపీ తప్పుడు ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. నిజంగా వారి వద్ద ఏమైనా ఆధారాలు ఉంటే కచ్చితంగా అసెంబ్లీకి వచ్చి వాటిని టేబుల్&amp;zwnj;పై పెట్టాలని సవాల్ చేశారు. రోడ్డుపై నిలబడి ఏవో కాగితాలు చూపించి ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;తమ ప్రభుత్వంలో తప్పుల చేసేందుకు ఆస్కారం లేదని అలాంటి తప్పులు ఉన్నట్టు నిరూపిస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; అన్నారు. అదే టైంలో సాక్ష్యాలు లేకుండా పదే పదే తప్పుడు ఆరోపణలు చేసినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. తప్పులు జరిగి ఉంటే చర్యలు, సాక్ష్యాలు లేకుండా తప్పుడు ఆరోపణలు చేసినా చర్యలు ఉంటాయని వైసీపీ వాళ్లకు వార్నింగ్ ఇచ్చారు. ఇక డీఎస్సీపై క్లియర్&amp;zwnj;గా అన్ని వివరాలు చెప్పేశామని, ఇకపై దీని గురించి చర్చ అనవసరమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. &amp;nbsp; &amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/17/459819c5b4ea23eceab5ca61520078461786958965147215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Nara Lokesh About Mega DSC: 148 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి, వైసీపీ విమర్శలకు టీచర్లే కౌంటర్ ఇచ్చారు]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/nara-lokesh-speaks-on-mega-dsc-2025-transparancy-and-educational-reforms-in-ap-assembly-256537</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/nara-lokesh-speaks-on-mega-dsc-2025-transparancy-and-educational-reforms-in-ap-assembly-256537#respond</comments><pubDate>Mon, 17 Aug 2026 13:17:14 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ అమరావతి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/amravati/nara-lokesh-speaks-on-mega-dsc-2025-transparancy-and-educational-reforms-in-ap-assembly-256537</guid><description><![CDATA[&lt;p&gt;Nara Lokesh on Mega DSC 2025 |&amp;nbsp;అమరావతి: ఎంతో బాధ్యతగా తీసుకుని, కేవలం 148 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి చేశామని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాల సందర్భంగా మంత్రి నారా లోకేష్ మెగా డీఎస్సీ-2025 నియామకాలు, విద్యా రంగంలో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలపై కీలక ప్రసంగం చేశారు. డీఎస్సీ నియామకాలపై శాసనసభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి విమర్శలకు చెక్ పెట్టారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;టీచర్లను కూటమి విదేశాలకు పంపితే.. వైసీపీ హయాంలో వైన్స్ వద్ద ఉంచారు..&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;అసెంబ్లీలో నారా లోకేష్ మాట్లాడుతూ.. &amp;lsquo;రాష్ట్రంలో నిరుద్యోగుల కోసం ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఈ ప్రక్రియను ఎంతో బాధ్యతగా నిర్వర్తిస్తున్నాం. సీఎం నారా &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; నాయుడు ఆకాంక్ష మేరకు టీచర్ల నియామకాలు, బదిలీలను అత్యంత పారదర్శకంగా నిర్వహించాం. ఇప్పటివరకు &lt;a title=&quot;టీడీపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/tdp&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;టీడీపీ&lt;/a&gt; ప్రభుత్వాల హయాంలో మొత్తం 1.80 లక్షల టీచర్ పోస్టులను భర్తీ చేశాం. &amp;nbsp;టీచర్లలో నైపుణ్యాభివృద్ధి పెంచేందుకు కూటమి ప్రభుత్వం వారిని సింగపూర్, ఫిన్&amp;zwnj;లాండ్ వంటి విదేశాలకు పంపించాం. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టీచర్లను మద్యం దుకాణాల వద్ద నిలబెట్టి, వారి గౌరవాన్ని భంగపరిచేలా చేశారని&amp;rsquo; &amp;nbsp;విమర్శించారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe title=&quot;YouTube video player&quot; src=&quot;https://www.youtube.com/embed/dVMH5-s5nYs?si=XTPE2KnhaZE_Z3L_&quot; width=&quot;560&quot; height=&quot;315&quot; frameborder=&quot;0&quot; allowfullscreen=&quot;allowfullscreen&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;దేశ చరిత్రలో తొలిసారిగా వర్టికల్, హారిజాంటర్ రిజర్వేషన్&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ప్రజలందరికీ పూర్తి స్వేచ్ఛ ఉందని, వ్యవస్థను ఎవరైనా ప్రశ్నించవచ్చని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. వర్టికల్, హారిజంటల్ రిజర్వేషన్ల అమలుపై భిన్నాభిప్రాయాలు ఉన్నవారు కోర్టులను ఆశ్రయించగా, 336 కేసులు నమోదైనప్పటికీ కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని చర్చ సందర్భంగా తెలిపారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా డీఎస్సీలో వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్ విధానాన్ని అమలు చేశామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నియామకాలు అత్యంత పారదర్శకంగా జరగడం వల్లే వేలాది మంది టీచర్లు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రభుత్వానికి అండగా నిలిచారు. ఇందులో భాగంగా వైసీపీ చేస్తున్న విమర్శలను ఖండిస్తూ, విజయవాడలో మెగా డీఎస్సీ ద్వారా నియమితులైన టీచర్లు భారీ ఆత్మగౌరవ ర్యాలీ చేశారని&amp;rsquo; మంత్రి లోకేష్ &amp;nbsp;వివరించారు.&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/17/6f1867abc280632f094682559cb50dab1786951815846233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Jana Sena Leader Murder Attempt: గుంటూరులో జనసేన నేత శ్రీనివాస యాదవ్ హత్యకు వైసీపీ నేత కుట్ర భగ్నం!]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/major-plot-to-murder-jana-sena-leader-bonaboyina-srinivasa-yadav-uncovered-in-guntur-256528</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/major-plot-to-murder-jana-sena-leader-bonaboyina-srinivasa-yadav-uncovered-in-guntur-256528#respond</comments><pubDate>Mon, 17 Aug 2026 12:19:51 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ అమరావతి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/amravati/major-plot-to-murder-jana-sena-leader-bonaboyina-srinivasa-yadav-uncovered-in-guntur-256528</guid><description><![CDATA[&lt;p&gt;Guntur గుంటూరు: జనసేన పార్టీ నేత బోనబోయిన శ్రీనివాస యాదవ్&amp;zwnj;ను హతమార్చేందుకు వైసీపీ నేత కుట్ర చేయడం కలకలం రేపుతోంది. గుంటూరు జిల్లాకు చెందిన జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస యాదవ్&amp;zwnj;ను హత్య చేసేందుకు ఒక రౌడీషీటర్&amp;zwnj;తో నరేంద్ర రెడ్డి సుపారీ మాటాడినట్లు విమర్శలు వస్తున్నాయి. జనసేన హత్యకు ఏకంగా రూ. 1.5 కోట్లకు సుపారీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;వైసీపీ నేత అక్రమాలను అడ్డుకున్నారని &lt;a title=&quot;జనసేన&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Janasena&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;జనసేన&lt;/a&gt; నేతపై పగ..&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;నిందితులు పక్కా ప్లాన్ ప్రకారం ఉదయం వేళ శ్రీనివాస యాదవ్ జిమ్&amp;zwnj;కు వెళ్లే సమయంలో ఆయనపై దాడి చేసి, హత్య చేసేందుకు ప్లాన్ చేశారు. ఈ కుట్రలో భాగంగా నిందితులు ఇప్పటికే రెండుసార్లు శ్రీనివాస యాదవ్ కదలికలపై రెక్కీ కూడా నిర్వహించినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. గతంలో నరేంద్ర రెడ్డి చేసిన అక్రమాలు, అరాచకాలను శ్రీనివాస యాదవ్ అడ్డుకున్నారు. దాంతో వైసీపీ నేతను హత్య చేయాలని రౌడీ షీటర్&amp;zwnj;తో సుపారీ మాట్లాడుకుని కుట్ర చేయడం రాజకీయంగా సంచలనంగా మారింది. గతంలో జరిగిన ఎన్నికల సమయంలోనూ &lt;a title=&quot;టీడీపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/tdp&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;టీడీపీ&lt;/a&gt; నాయకుడు పెమ్మసాని చంద్రశేఖర్&amp;zwnj;పై నరేంద్ర రెడ్డి వర్గం దాడికి ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి.&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/17/c96365ea2af69161d5f9cf974147a9021786949311422233_original.jpeg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;హత్య కుట్రకు సంబంధించిన పక్కా సమాచారం లభించడంతో పోలీసులు వైసీపీ నేత నరేంద్ర రెడ్డిపై కేసు నమోదు చేశారు. కేసు నమోదైన విషయాన్ని గ్రహించిన నరేంద్ర రెడ్డి ప్రస్తుతం పరారీలో ఉండగా, అతని కోసం ప్రత్యేక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి.&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/17/d70ee4770a32dc0320587865c70148cf1786949057767233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Amaravati Projects Budget: అమ‌రావ‌తిలో మొత్తం 119 ప‌నుల‌కు 66,802 కోట్లు ఖ‌ర్చు.. సభలో వెల్లడించిన మంత్రి నారాయణ]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/ap-minister-narayana-details-amaravati-projects-budget-and-farmers-plots-256517</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/ap-minister-narayana-details-amaravati-projects-budget-and-farmers-plots-256517#respond</comments><pubDate>Mon, 17 Aug 2026 10:45:49 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ అమరావతి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/amravati/ap-minister-narayana-details-amaravati-projects-budget-and-farmers-plots-256517</guid><description><![CDATA[&lt;p&gt;AP Minister Narayana |&amp;nbsp;అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఎమ్మెల్యేలు శ్రావణ్ కుమార్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి అడిగిన ప్రశ్నలకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ సమాధానమిచ్చారు. అమరావతి రాజధాని పనులు పునఃప్రారంభమైన తర్వాత ప్రాజెక్టుల పురోగతి, కేటాయించిన నిధులు, వ్యయం, రైతుల రిటర్నబుల్ ప్లాట్ల పంపిణీకి సంబంధించిన కీలక వివరాలను ఆయన సభకు వెల్లడించారు. ఇప్పటివరకు 119 ప్రధాన మౌలిక వసతుల ప్రాజెక్టులు ప్రతిపాదించగా, వాటిలో 113 ప్రాజెక్టులకు లెటర్ ఆఫ్ అప్రూవల్ (LoA) జారీ చేసినట్లు తెలిపారు. చాలా ప్రాజెక్టుల పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;మంత్రి నారాయణ వెల్లడించిన వివరాలు&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;ప్రాజెక్టుల పురోగతి: అమరావతిలో ఇప్పటివరకు 119 ప్రధాన మౌలిక వసతుల ప్రాజెక్టులను ప్రతిపాదించగా, వాటిలో 113 ప్రాజెక్టులకు లెటర్ ఆఫ్ అప్రూవల్ (LoA) జారీ చేశారు. మొత్తం 97 ప్రాజెక్టుల పనులు ప్రారంభం కాగా, 4 ప్రాజెక్టులు పూర్తయ్యాయి. మరో 93 ప్రాజెక్టుల పనులు ప్రస్తుతం వేగంగా జరుగుతున్నాయి.&lt;/p&gt;
&lt;p&gt;నిధుల సమీకరణ &amp;amp; వ్యయం: రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, హడ్కో, నాబార్డ్, NABFID, APPFC ల ద్వారా రూ. 41,187.70 కోట్ల మేర రుణాలు సమకూర్చుకున్నాం. 2024 నుంచి ఇప్పటివరకు రూ. 12,731.13 కోట్లు ఖర్చు చేశాం&lt;/p&gt;
&lt;p&gt;పెరిగిన వ్యయం: అమరావతిలో ప్రతిపాదించిన 119 పనులకు మొత్తం రూ. 66,802 కోట్లు ఖర్చవుతుందని, ప్రస్తుతం పురోగతిలో ఉన్న 103 పనులకు రూ. 58,093 కోట్లు వెచ్చిస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. గత ప్రభుత్వం రాజధాని పనులను నిలిపివేయడం వల్ల పనుల అంచనా వ్యయం దాదాపు 25 శాతం పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.&lt;/p&gt;
&lt;p&gt;రైతుల ప్లాట్లు &amp;amp; కౌలు: ల్యాండ్ పూలింగ్ విధానంలో భూములు ఇచ్చిన 30,173 మంది రైతులకు 71,299 రిటర్నబుల్ ప్లాట్లలో 98 శాతం కేటాయింపులు పూర్తి చేసి, అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. 2014 నుంచి ఇప్పటివరకు రైతులకు రూ. 2,248.02 కోట్ల మేర కౌలు చెల్లించినట్లు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.&lt;/p&gt;
&lt;p&gt;గ్రామాల్లో మౌలిక వసతులు: రాజధాని అమరావతిలోని 29 గ్రామాల్లో రూ. 904 కోట్లతో రహదారులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజి, తాగునీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని, ఈ పనుల టెండర్లను ఆగస్ట్ 27న ఖరారు చేయనున్నామని తెలిపారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఆర్&amp;zwnj; అండ్ బీ రోడ్లు: రాజధాని గ్రామాల్లో ఆర్&amp;zwnj; అండ్ బీ (R&amp;amp;B) రోడ్ల పనుల్లో కొంత ఆలస్యం జరిగిందని అంగీకరించిన మంత్రి నారాయణ, సంబంధిత ఆర్&amp;zwnj; అండ్ బీ మంత్రితో చర్చించి ఆ పనులను వేగవంతం చేశామని సభలో తెలిపారు.&lt;/p&gt;
&lt;p&gt;Also Read: &lt;a href=&quot;https://telugu.abplive.com/politics/ysrcp-mlas-disqualification-issue-speaker-rights-article-190-ap-politics-256419&quot; target=&quot;_blank&quot; rel=&quot;noopener&quot;&gt;YSRCP MLA Disqualification Issue: అనర్హత వేటు వేసుకోండి .. వైసీపీ పొలిటికల్ ఆఫర్ వెనుక అసలు వ్యూహమేంటి? స్పీకర్ ఏం చేయబోతున్నారు?&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;వెలిగొండ ప్రాజెక్టులో ప్రమాదంపై స్పందించిన మంత్రి నిమ్మల రామానాయుడు&lt;/strong&gt;&lt;br /&gt;ప్రకాశం జిల్లా వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్-2 లో జరిగిన ప్రమాదంపై ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆయన ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ (CE)తో పాటు నిర్మాణ ఏజెన్సీ అయిన మేఘా ఇంజనీరింగ్ ప్రతినిధులతో ఫోన్&amp;zwnj;లో మాట్లాడి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు.&lt;/p&gt;
&lt;p&gt;ఈ ప్రమాదంలో టన్నెల్-2లో పనిచేస్తున్న హైడ్రాలిక్ మిషన్ తగలడంతో ఉత్తరప్రదేశ్&amp;zwnj;కు చెందిన మోంటీలాల్ అనే కార్మికుడు మృతి చెందడంపై మంత్రి తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. మృతుని కుటుంబానికి అన్ని రకాలుగా అండగా నిలవాలని, తక్షణమే అవసరమైన ఆర్థిక మరియు ఇతర సహాయ సహకారాలు అందించాలని అధికారులను, కాంట్రాక్ట్ ఏజెన్సీ ప్రతినిధులను ఆదేశించారు.&lt;/p&gt;
&lt;p&gt;వెలిగొండ ప్రాజెక్టు పనులు చివరి దశకు చేరుకున్న ఈ సమయంలో ఇలాంటి దురదృష్టకర సంఘటన జరగడం ఎంతో విచారకరమని మంత్రి పేర్కొన్నారు. ప్రాజెక్టు పనుల్లో పాల్గొంటున్న కార్మికుల భద్రతకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని, భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా తగిన అన్ని ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవాలని అధికారులకు, &amp;nbsp;సంబంధిత ఏజెన్సీ ప్రతినిధులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/17/28276a828f7aa64da1cd8b7403e78d301786942968560233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[AP Assembly Session: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం, మండలిలో మెగా డీఎస్సీపై వైసీపీ ప్రశ్నలు!]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/ap-assembly-monsoon-sessions-begin-speaker-ayyanna-patrudu-to-chair-bac-meeting-256508</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/ap-assembly-monsoon-sessions-begin-speaker-ayyanna-patrudu-to-chair-bac-meeting-256508#respond</comments><pubDate>Mon, 17 Aug 2026 09:46:07 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ అమరావతి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/amravati/ap-assembly-monsoon-sessions-begin-speaker-ayyanna-patrudu-to-chair-bac-meeting-256508</guid><description><![CDATA[&lt;p&gt;AP Assembly Monsoon Sessions | అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి 4 రోజులపాటు ఈ సెషన్ లో పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది.&amp;nbsp; తొలిరోజున ఉదయం 9 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రశ్నోత్తరాల కార్యక్రమంతో మొదలయ్యాయి. సభలో ప్రజా సమస్యలు, వివిధ శాఖల సమర్థతపై సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు సంబంధిత మంత్రులు సమాధానాలు ఇస్తున్నారు. ఈ సమావేశాల్లో ప్రభుత్వం మొత్తం 7 కీలక బిల్లులను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది.&lt;/p&gt;
&lt;p&gt;సోమవారం ఉదయం 10:30 గంటల తర్వాత లంచ్ బ్రేక్ సమయంలో స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడి అధ్యక్షతన శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ) భేటీ కానుంది. ఈ సమావేశాలు ఎన్ని రోజుల పాటు నిర్వహించాలి, సభలో ఏయే ముఖ్యమైన అంశాలపై చర్చించాలనే విషయాలపై ఈ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ వర్షాకాల సమావేశాలు నాలుగు రోజుల పాటు నిర్వహించే అవకాశముంది.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;శాసనమండలిలో వైసీపీ ప్రశ్నల వర్షం&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఎగ్జామ్ లేకుండానే డీఎస్సీ ఉద్యోగాలు ఇచ్చారని వైసీపీ సభ్యులు ఆరోపించారు. మెగా డీఎస్సీలో అవకతవకలపై చర్చ జరగాలని వాయిదా తీర్మానం ఇచ్చారు. కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తామని వైఎస్సార్&amp;zwnj;సీపీ ఎమ్మెల్సీలు చెబుతున్నారు. డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియలో పెద్ద ఎత్తున అక్రమాలు, అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ దానిపై కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) ద్వారా సమగ్ర విచారణ జరిపించాలని ప్రతిపక్షం గట్టిగా డిమాండ్ చేస్తోంది. అదేవిధంగా ఈ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని వైఎస్సార్&amp;zwnj;సీపీ డిమాండ్ చేస్తోంది. ఉదయం 10 గంటలకు శాసనమండలి ప్రారంభమైంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;Also Read: &lt;a href=&quot;https://telugu.abplive.com/politics/ap-tdp-janasena-alliance-social-media-war-damage-control-256420&quot; target=&quot;_blank&quot; rel=&quot;noopener&quot;&gt;TDP Janasena Social Media War: క్షేత్రస్థాయిలో పాలనలో సమన్వయం .. సోషల్ మీడియాలో సెల్ఫ్ గోల్ ! కూటమి సోషల్ వార్&amp;zwnj;ను అరికట్టడం ఎలా?&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;శాసన మండలి ప్రారంభానికి ముందు వైఎస్సార్&amp;zwnj;సీపీ ఎమ్మెల్సీలు నిరసన ప్రదర్శనగా మండలిలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. డీఎస్సీ ప్రక్రియలోని లోపాలపై వెంటనే చర్చ చేపట్టాలని కోరుతూ ఎమ్మెల్సీలు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, కల్పలత, పి. రామాంజనేయులు (రామచంద్రారెడ్డి) మండలి చైర్మన్&amp;zwnj;కు వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు.&lt;/p&gt;
&lt;p&gt;ఈ సందర్భంగా వైఎస్సార్&amp;zwnj;సీపీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, వరుదు కళ్యాణి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. డీఎస్సీలో జరిగిన అవకతవకలపై నిష్పక్షపాత విచారణ సాగాలంటే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని, పూర్తి వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి అనుకూలంగా మరియు తమకు నచ్చిన రీతిలో నిబంధనలను, జీవోలను సవరించడం ఎంతవరకు న్యాయమని నిలదీశారు. కూటమి ప్రభుత్వం వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు డైవర్షన్ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. అవుట్&amp;zwnj;సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్న ఉద్యోగికి మొదటి ర్యాంక్ రావడం వెనుక అనేక అనుమానాలు ఉన్నాయని, మంత్రి తీరు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని వ్యాఖ్యానించారు.&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/17/5b5b5cae915619f75262a7326dfb83731786939868032233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Andhra Pradesh Assembly Sessions: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/andhra-pradesh-assembly-sessions-mega-dsc-nara-lokesh-key-bills-amaravati-256500</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/andhra-pradesh-assembly-sessions-mega-dsc-nara-lokesh-key-bills-amaravati-256500#respond</comments><pubDate>Mon, 17 Aug 2026 07:56:02 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ అమరావతి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/amravati/andhra-pradesh-assembly-sessions-mega-dsc-nara-lokesh-key-bills-amaravati-256500</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Andhra Pradesh Assembly Sessions:&amp;nbsp;&lt;/strong&gt;ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి వర్షాకాల సమావేశాలు సోమవారం ఉదయం నుంచి ప్రారంభంకానున్నాయి. గవర్నర్&amp;zwnj; ఎస్ అబ్దుల్&amp;zwnj; నజీర్&amp;zwnj; నోటిఫికేషన్ మేరకు ఉదయం 9 గంటలకు శాసనసభ, పది గంటలకు శాసన మండలి కొలువుదీరనున్నాియ. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా అత్యంత కీలకమైన ఈ సమావేశాల్లో ప్రభుత్వం పలు ప్రజా ప్రాధాన్యత కలిగి అంశాలను సభ ముందుకు తీసుకురానుంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;సమావేశాల అజెండా&lt;/h2&gt;
&lt;p&gt;ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ సమావేశాలు నాలుగు రోజుల పాటు నిర్వహించే అవకాశం ఉంది. తొలిరోజు ఉభయ సభలు ప్రారంభమైన కొద్ది సేపటికే వాయిదా పడతాయి. అనంతరం స్పీకర్ అధ్యక్షతను శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ భేటీ కానుంది. ఈ కమిటీ సమావేశాల కాలవ్యవధిని, ప్రతి రోజూ చర్చించాల్సిన అంశాలపై తుది నిర్ణయం తీసుకుంటుంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఈసారి సమావేశాల్లో ఒక నూతన సాంకేతిక విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. ఎమ్మెల్యేలు తమకు కేటాయించిన సీట్లలో కూర్చుంటే వారి హాజరు నమోదు అయ్యేలా డిజిటల్ ఏర్పాట్లు చేశారు. భద్రత దృష్ట్యా అసెంబ్లీ పరిసరాల్లో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. మీడియా, సిబ్బందికి డిజిటల్ పాస్&amp;zwnj;లనను తప్పనిసరి చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;మండలిలో మెగా డీఎస్సీపై వార్&lt;/h2&gt;
&lt;p&gt;మెగా డీఎస్సీ 2025లో అక్రమాలు జరిగాయని చాలా కాలంగా వైసీపీ ప్రచారం చేస్తోంది. మండలిలో కూడా దీనిపై నిలదీయాలని చూస్తోంది. అందుకే తొలి రోజే మెగా డీఎస్సీపై మంత్రి నారా లోకేష్&amp;zwnj; సభలో ప్రకటన చేయనున్నారు. పారదర్శకంగా ఎలా నిర్వహించారో పవర్&amp;zwnj;పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించనున్నారు. దీంతో ఈ వివాదానికి పుల్&amp;zwnj;స్టాప్ పెట్టి భవిష్యత్&amp;zwnj;లో చర్చ లేకుండా చేయాలని అధికార పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;కీలక బిల్లులు ఆమోదం&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;ఈ సమావేశాల్లో ప్రభుత్వం సుమారు 6 కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు రాజకీయ ప్రాతినిధ్యాన్ని 34శాతానికి పెంచుతూ ప్రభుత్వం బిల్లు తీసుకురానుంది. దీనిపై డెడికేటెడ్&amp;zwnj; కమిషన్ ఇచ్చిన నివేదికను ఆగస్టు 18న మంత్రిమండలి ఆమోదించి, అదే రోజు సభలో చర్చకు పెట్టనుంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;మున్సిపల్ మేయర్లు, చైర్మన్&amp;zwnj;ను నేరుగా ప్రజలే ఎన్నుకునే ప్రత్యక్ష ఎన్నికల విధానానికి సంబంధించి చట్ట సవరణ చేయనున్నారు. గత ప్రభుత్వం హయాంలో తీసుకొచ్చిన దిశ చట్టాన్ని ఉపసంహరించుకుని, మహిళలు, బాలికల భద్రత కోసం మరింత పటిష్టమైన నిబంధనలను ప్రభుత్వం రూపొందించనుంది. ఏపీ విద్యుత్ శాసనాలు-2019 బిల్లును ఉపసంహరించుకుంటూ సంబంధిత శాఖ మంత్రులు కొత్త ప్రతిపాదనలు చేయనున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;అమరావతిలో మౌలిక వసతుల అభివృద్ధి&lt;/h2&gt;
&lt;p&gt;రాజధాని అమరావతి అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం తన కార్యాచరణను సభలో వివరించే ఛాన్స్ ఉంది. క్వాంటమ్&amp;zwnj; వ్యాలీ ట్విన్ టవర్స్&amp;zwnj;, రైల్వే రోడ్డు కనెక్టివిటీ, మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు ప్రకటించనుంది. అలాగే, పెట్టుబడులను ఆకర్షించేందుకు రూపొందించిన ఏపీ పీపీపీ పాలసీ 2026 గురించి కూడా చర్చ జరగనుంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ దూరం- స్పీకర్ హెచ్చరిక&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;గత సమావేశాల మాదిరిగానే ఈసారి కూడా వైసీపీ సభ్యులు సభకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని, సభలో మాట్లాడేందుకు తగిన సమయం ఇవ్వరని మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యను స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఖండించారు. సభకు రాకుండా సమయం ఇవ్వడం లేదనడం సరికాదన్నారు. 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న &lt;a title=&quot;జగన్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/cm-jagan&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;జగన్&lt;/a&gt;&amp;zwnj;కు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడానికి లేదని, కానీ సభకు వస్తే ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం కల్పిస్తాం, సమాధానం చెప్పించే బాధ్యత తనది అన్నారు. ఎమ్మెల్యే క్వార్టర్లపై వైసీపీ నేతలు చేస్తున్న కామెంట్స్&amp;zwnj;పై కూడా స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/17/3a34975dfe5d931e1a8be4e48229db261786933483287215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం]]></title><link>https://telugu.abplive.com/crime/sub-inspectors-car-collides-with-auto-near-addanki-ganja-allegations-cause-tension-256494</link><comments>https://telugu.abplive.com/crime/sub-inspectors-car-collides-with-auto-near-addanki-ganja-allegations-cause-tension-256494#respond</comments><pubDate>Mon, 17 Aug 2026 00:04:10 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ క్రైమ్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/crime/sub-inspectors-car-collides-with-auto-near-addanki-ganja-allegations-cause-tension-256494</guid><description><![CDATA[&lt;p&gt;Addanki Ganja Allegations |&amp;nbsp;అద్దంకి: ఏపీలో గంజాయి బ్యాచ్ అనే పదం గత కొన్నేళ్లుగా ఎక్కువగా వినిపిస్తుంది. ఇప్పటికీ రాష్ట్రంలో పలుచోట్ల గంజాయి బ్యాచ్ దాడులకు పాల్పడటం, హత్యలు చేసి జైలుకు వెళ్తున్న ఘటనలు జరుగుతున్నాయి. గంజాయి, డ్రగ్స్ మీద కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నట్లు చెబుతోంది. కానీ పోలీసుల వాహనంలోనే గంజాయి తరలిస్తుండటం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది. రోడ్డు ప్రమాదానికి గురైన పోలీసుల కారు (AP 27 CB 4789&amp;nbsp;) డిక్కీ తెరిచి చూసిన స్థానికులు గంజాయి గుర్తించి షాకయ్యారు. ఆ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.&lt;/p&gt;
&lt;p&gt;బాపట్ల జిల్లా అద్దంకి సమీపంలో ఇద్దరు సబ్ ఇన్&amp;zwnj;స్పెక్టర్లు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బల్లికురవ ఎస్సై నాగరాజు, సంతమాగుళూరు ఎస్సై నాగమల్లేశ్వరావు సివిల్ దుస్తుల్లో స్విఫ్ట్ డిజైర్ కారులో బల్లికురవ నుండి అద్దంకి వెళ్తున్నారు. మార్గమధ్యంలో వీరు ప్రయాణిస్తున్న డిజైర్ కారు ఒక ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే, ప్రమాదం జరిగిన అనంతరం పోలీసులు ప్రయాణిస్తున్న కారు డిక్కీలో గంజాయి ఉన్నట్లు గమనించిన స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/17/77b041699c67d88ef8db61e32e96b1411786905088948233_original.png&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఘటనా స్థలానికి అద్దంకి సీఐ సుబ్బరాజు చేరుకోగా, కారు డిక్కీని తెరవకుండా అడ్డుకున్నారంటూ స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కారు డిక్కీలో గంజాయి ఎందుకు ఉందని, పోలీసులు గంజాయి వాడుతున్నారా, లేక సీజ్ చేశారా .. అది ఎక్కడినుంచి వచ్చిందని అడిగితే కూడా ప్రజలకు సరైన సమాధానం చెప్పలేదు. దీంతో అక్కడ పోలీసులు, స్థానికుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి ఉద్రిక్త వాతావరణం నెలకొంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/17/8c0a298b84224ebd00ff2c4a9002ead91786905119567233_original.png&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;గంజాయి దొరికిన పోలీసులు ప్రయాణిస్తున్న కారును పూర్తిగా తనిఖీ చేయాలని గ్రామస్థులు పట్టుబట్టినప్పటికీ, పోలీసులు ప్రమాదంలో ఉన్న ఇద్దరు ఎస్సైలను మరో కారులో అక్కడి నుండి పంపించివేశారు. స్థానిక &lt;a title=&quot;టీడీపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/tdp&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;టీడీపీ&lt;/a&gt; నాయకుడి కారులో ఆ ఇద్దరు ఎస్సైలను అక్కడి నుంచి పంపించివేశారని స్థానికులు ఆరోపించారు. పోలీసులు వెళ్తున్న వాహనం డిక్కీలో గంజాయి లభించడం, పోలీసులు దానిపై స్పష్టత ఇవ్వకపోవడంతో పాటు కారు చెక్ చేయనీయకుండా ప్రజలను అడ్డుకోవడం, పనిలో పనిగా ఇద్దరు ఎస్సైలను అక్కడి నుంచి పంపించివేయడం స్థానికంగా కలకలం రేపింది. పోలీస్ ఉన్నతాధికారులు ఈ విషయాన్ని సీరియస్&amp;zwnj;గా తీసుకుని, బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/16/79570879f0b1214dca0385c1f3f3136b1786904948692233_original.jpg" width="220"/></item></channel></rss>