<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/" xmlns:dc="http://purl.org/dc/elements/1.1/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/" xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/" xmlns:media="http://search.yahoo.com/mrss/"><channel><title>amravati</title><atom:link href="https://telugu.abplive.com/amravati/feed" rel="self" type="application/rss+xml"/><link>https://telugu.abplive.com/</link><description/><lastBuildDate>Thu, 10 Sep 2026 07:20:46 +0530</lastBuildDate><language>en-US</language><sy:updatePeriod>hourly</sy:updatePeriod><sy:updateFrequency>1</sy:updateFrequency><generator>https://telugu.abplive.com</generator><item><title><![CDATA[CM Chandrababu: వచ్చే ఏడాది మార్చి నాటికి భూసమస్యలకు పరిష్కారం.. బెస్ట్ టెక్నాలజీతో పాస్ పుస్తకాలు - సీఎం చంద్రబాబు]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/ap-all-land-issues-to-be-resolved-by-march-high-tech-pattadar-passbooks-soon-says-cm-chandrababu-258523</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/ap-all-land-issues-to-be-resolved-by-march-high-tech-pattadar-passbooks-soon-says-cm-chandrababu-258523#respond</comments><pubDate>Wed, 9 Sep 2026 23:53:05 +0530 </pubDate><dc:creator><![CDATA[ Satyaprasad Bandaru ]]></dc:creator><category><![CDATA[ ఆంధ్రప్రదేశ్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/ap-all-land-issues-to-be-resolved-by-march-high-tech-pattadar-passbooks-soon-says-cm-chandrababu-258523</guid><description><![CDATA[&lt;p&gt;CM Chandrababu: 2027 మార్చి నాటికి ఏపీలో భూసమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. బుధవారం కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం &amp;nbsp;మాచవరంలో &amp;lsquo;మీ భూమి- మీ హక్కు&amp;rsquo; కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. గతంలో రెవెన్యూశాఖలో డబ్బులు ఇవ్వకపోతే పని జరిగేది కాదని, ఇప్పుడు ఆ పరిస్థితిని మార్చి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తున్నామన్నారు. అన్ని సమస్యలు పరిష్కరించేందుకు ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ల్యాండ్&amp;zwnj; టైటిలింగ్&amp;zwnj; చట్టాన్ని రద్దు చేశామన్నారు. వైసీపీ ప్రభుత్వంలో భూముల వ్యవహారంలో ఘోరాలు జరిగాయన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;36 లక్షల మందికి పాస్ బుక్&amp;zwnj;లు&lt;/h3&gt;
&lt;p&gt;సొంత భూములకు భద్రత కల్పించడమే కూటమి ప్రభుత్వం అజెండా అని సీఎం చంద్రబాబు అన్నారు. రీసర్వే చేసి బెస్ట్ టెక్నాలజీతో పాస్&amp;zwnj; పుస్తకాలు ఇస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చే పట్టాదారు పాస్&amp;zwnj; పుస్తకాలు ఎవరూ మార్చలేరన్నారు. ఇప్పటి వరకు 36 లక్షల మందికి పాస్&amp;zwnj; బుక్&amp;zwnj;లు ఇచ్చామని తెలిపారు. వచ్చే మార్చి లోపు 56 లక్షల మందికి అందజేస్తామన్నారు. పాలన అంటే సచివాలయంలో ఉండటం కాదని, ప్రజల వద్దకే నేరుగా వెళ్లి వాళ్ల &amp;nbsp;కష్టసుఖాలు తెలుసుకొని పాలసీలు రూపొందించి న్యాయం చేయడం అన్నారు. ఓటు వేసి గెలిపించిన ప్రజలతో మాట్లాడేందుకే తాను ఎక్కువగా పర్యటిస్తున్నట్లు చెప్పారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;పిల్లలే సంపద&amp;nbsp;&lt;/h3&gt;
&lt;p&gt;పేదల సంక్షేమం కోసమే సూపర్&amp;zwnj; సిక్స్&amp;zwnj; సహా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో ప్రజలంతా గౌరవంగా జీవించేలా ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. పీ4 పథకం తెచ్చి పేదలను ఆదుకునే కార్యక్రమం చేపట్టామన్నారు. పిల్లలే సంపద పిల్లలు లేకపోతే &amp;nbsp;యంత్రాలకు సేవ చేయాల్సి వస్తుందన్నారు. విలువలతో కూడిన రాజకీయం చేయాలనే ఆలోచనతో ఫ్యామిలీ బిజినెస్&amp;zwnj; ఏర్పాటు చేశామన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;మూడేళ్ల క్రితం ఇదే రోజున&lt;/h3&gt;
&lt;p&gt;3 ఏళ్ల క్రితం ఇదే రోజు నంద్యాలలో మీటింగ్&amp;zwnj; నుంచి వస్తుండగా తనను వైసీపీ ప్రభుత్వం అరెస్ట్&amp;zwnj; చేసిందని సీఎం చంద్రబాబు అన్నారు. తనపై ఏ కేసు పెట్టారో చెప్పమంటే కూడా చెప్పలేదన్నారు. 53 రోజుల పాటు రాజమహేంద్రవరం జైలులో పెట్టారని, తాను జైలులో ఉంటే చూడడానికి వస్తున్న &lt;a title=&quot;పవన్ కల్యాణ్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Pawan-Kalyan&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;పవన్ కల్యాణ్&lt;/a&gt; ను ఇబ్బంది పెట్టారన్నారు. ఆయన ఇబ్బందులను ఎదుర్కొని తనను కలిశారన్నారు. కోనసీమ అంటే బాలయోగి గుర్తుకు వస్తారన్నారు. ప్రజల జీవితాలు బాగుపడాలనే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&quot;నా కుమారుడిని అమెరికా పంపితే చదువు పూర్తి చేసి వచ్చారు. రాజశేఖర్ రెడ్డి తన కొడుకును అమెరికా పంపితే చదవకుండానే తిరిగి వచ్చారు. చివరికి కొడుకు &lt;a title=&quot;జగన్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/cm-jagan&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;జగన్&lt;/a&gt; ముఖం చూడడానికి కూడా ఇష్టం లేక బెంగళూరులో ఉంచాల్సిన దుస్థితి నా మిత్రుడు రాజశేఖర్ రెడ్డిది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా హత్య చేశారు. ఆయన కుమార్తె సునీత మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించాలని కోరితేనే పోస్టుమార్టం నిర్వహించారు. ఆ రోజే హత్యకు పాల్పడిన దోషులను అరెస్ట్ చేసి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేదా? &amp;nbsp;ఈ వ్యవహారంలో తల్లి, చెల్లి పడుతున్న పరిస్థితిని ప్రజలు చూశారు&quot; - &lt;strong&gt;సీఎం చంద్రబాబు&amp;nbsp;&lt;/strong&gt;&lt;br /&gt;&lt;br /&gt;Also Read: &lt;a title=&quot;కూటమి ప్రభుత్వంపై వల్లభనేని వంశీ తీవ్ర ఆరోపణలు.. ఏసీపీ దామోదర్&amp;zwnj;పై విజయవాడ సీపీకి ఫిర్యాదు&quot; href=&quot;https://telugu.abplive.com/andhra-pradesh/vijayawada/former-mla-vallabhaneni-vamsi-files-complaint-with-vijayawada-cp-against-acp-damodar-258512&quot; target=&quot;_self&quot;&gt;కూటమి ప్రభుత్వంపై వల్లభనేని వంశీ తీవ్ర ఆరోపణలు.. ఏసీపీ దామోదర్&amp;zwnj;పై విజయవాడ సీపీకి ఫిర్యాదు&lt;/a&gt;&lt;/p&gt;
&lt;h3&gt;కోర్టు చివాట్లు పెట్టినా&lt;/h3&gt;
&lt;p&gt;డీఎస్సీ నిర్వహించి ఏడాదిలోనే ఉద్యోగాలు ఇచ్చామని సీఎం చంద్రబాబు అన్నారు. అయితే ఏడాది తర్వాత డీఎస్సీ ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. డీఎస్సీ అంశంపై కొందరు వితండవాదం చేస్తున్నారని &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; మండిపడ్డారు. కోర్టులు చీవాట్లు పెట్టినా వారికి బుద్ధి రావడం లేదన్నారు. గత ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు వెంటిలేటర్&amp;zwnj;పై ఉన్న ఏపీకి సంజీవినిగా మారిందని అన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;Also Read: &lt;a title=&quot;రూ.10,021 కోట్లతో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు పరిధిలో 5 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులు&quot; href=&quot;https://telugu.abplive.com/news/india/pm-modi-union-cabinet-approves-5-railway-multi-tracking-projects-worth-10021-crore-across-4-southern-states-258516&quot; target=&quot;_self&quot;&gt;రూ.10,021 కోట్లతో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు పరిధిలో 5 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులు&lt;/a&gt;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/09/2ccd5583622656d51850cc95db772d0e17889651363641409_original.png" width="220"/></item><item><title><![CDATA[Vallabhaneni Vamsi: కూటమి ప్రభుత్వంపై వల్లభనేని వంశీ తీవ్ర ఆరోపణలు.. ఏసీపీ దామోదర్‌పై విజయవాడ సీపీకి ఫిర్యాదు]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/vijayawada/former-mla-vallabhaneni-vamsi-files-complaint-with-vijayawada-cp-against-acp-damodar-258512</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/vijayawada/former-mla-vallabhaneni-vamsi-files-complaint-with-vijayawada-cp-against-acp-damodar-258512#respond</comments><pubDate>Wed, 9 Sep 2026 17:39:26 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ విజయవాడ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/vijayawada/former-mla-vallabhaneni-vamsi-files-complaint-with-vijayawada-cp-against-acp-damodar-258512</guid><description><![CDATA[&lt;p&gt;విజయవాడ: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబును కలిసి సెంట్రల్ ఏసీపీ దామోదర్&amp;zwnj;పై ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన వల్లభనేని వంశీ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ పేరుతో తనపై, తన సహచరులపై పలు అక్రమ కేసులు బనాయించిందని ఆరోపించారు. రాజకీయ కక్షసాధింపుతో కూటమి ప్రభుత్వం పెట్టిన ఈ కేసులను తాము చట్టపరంగా, న్యాయస్థానాల్లోనే ఎదుర్కొంటున్నామని స్పష్టం చేశారు. అయితే, రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తులను కూడా కేసుల్లో చేర్చి పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.&lt;/p&gt;
&lt;p&gt;తన తరఫున కేసులను వాదిస్తున్న అడ్వకేట్ సత్యశ్రీని ఏసీపీ దామోదర్ ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని వల్లభనేని వంశీ ఆరోపించారు. 2021లో విజయవాడలో సత్యశ్రీ కుటుంబం ఒక ఫ్లాట్ కొనుగోలు చేయగా, ప్రైవేట్ ప్రాపర్టీకి సంబంధించిన ఆ స్థల వివాదంలో ఏసీపీ జోక్యం చేసుకుని వేధిస్తున్నారని పేర్కొన్నారు. పక్కింటి వారు ఆక్రమణలకు పాల్పడుతుంటే అడ్డుకున్నందుకు సత్యశ్రీపై 2 తప్పుడు కేసులు నమోదు చేశారని వివరించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;లాయర్ తన సొంత స్థలంలో పనులు చేసుకుంటున్నా ఏసీపీ దామోదర్ అడ్డుపడుతున్నారని విజయవాడ సీపీకి వివరించానని వంశీ తెలిపారు. విజయవాడ కృష్ణలంకలో సాయికృష్ణ కేసును చూసిన తర్వాత ఇవన్నీ చిన్న కేసులుగా అనిపిస్తున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. దామోదర్ వంటి అధికారుల వైఖరి వల్లే మొత్తం పోలీసు వ్యవస్థపై ప్రజల్లో తప్పుడు అభిప్రాయం ఏర్పడే ప్రమాదం ఉందని వల్లభనేని వంశీ వ్యాఖ్యానించారు.&lt;br /&gt;&lt;br /&gt;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/09/4e326fdd46ce5978f214c6572908be061788955724898233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[NTR Bharosa Scheme: ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్.. కొత్త దరఖాస్తుల స్వీకరణ, అర్హతలు, దరఖాస్తు విధానం ఇవే!]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/ntr-bharosa-pension-scheme-eligibility-application-dates-how-to-apply-complete-details-258497</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/ntr-bharosa-pension-scheme-eligibility-application-dates-how-to-apply-complete-details-258497#respond</comments><pubDate>Wed, 9 Sep 2026 13:59:24 +0530 </pubDate><dc:creator><![CDATA[ Satyaprasad Bandaru ]]></dc:creator><category><![CDATA[ ఆంధ్రప్రదేశ్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/ntr-bharosa-pension-scheme-eligibility-application-dates-how-to-apply-complete-details-258497</guid><description><![CDATA[&lt;p&gt;NTR Bharosa Pension Scheme: ఏపీ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ కింద కొత్త పింఛన్ల మంజూరుకు దరఖాస్తులు స్వీకరిస్తుంది. అర్హులైన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, మత్స్యకారులు, ఇతర చేతివృత్తుల వారు కొత్త పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;ముఖ్య తేదీలు&amp;nbsp;&lt;/h3&gt;
&lt;ul&gt;
&lt;li&gt;సెప్టెంబర్ 7 నుండి 16 వరకు - కొత్త పింఛన్ దరఖాస్తుల స్వీకరణ, ఆన్&amp;zwnj;లైన్ రిజిస్ట్రేషన్, eKYC పూర్తి చేయడం&amp;nbsp;&lt;/li&gt;
&lt;li&gt;సెప్టెంబర్ 17 నుండి 21 వరకు - కామన్ ఎలిజిబిలిటీ వాలిడేషన్ &amp;nbsp;&lt;/li&gt;
&lt;li&gt;సెప్టెంబర్ 22 నుండి 24 వరకు - &amp;nbsp;అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన, సిఫార్సులు&amp;nbsp;&lt;/li&gt;
&lt;li&gt;సెప్టెంబర్ 25 నుండి 26 వరకు - బడ్జెట్ ప్రతిపాదనలు, ప్రభుత్వ తుది ఆమోదం&amp;nbsp;&lt;/li&gt;
&lt;/ul&gt;
&lt;h3&gt;అర్హతలు&amp;nbsp;&lt;/h3&gt;
&lt;p&gt;ఆదాయ పరిమితి - గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ నెలవారీ ఆదాయం రూ. 10,000 లోపు ఉండాలి. పట్టణాల్లో కుటుంబ నెలవారీ ఆదాయం రూ. 12,000 లోపు ఉండాలి.&lt;/p&gt;
&lt;p&gt;భూమి పరిమితి - కుటుంబానికి ప్రభుత్వ నిబంధనలకు మించి సొంత భూమి ఉండకూడదు.&lt;/p&gt;
&lt;p&gt;ప్రభుత్వ ఉద్యోగం/పింఛను- కుటుంబంలో ఎవరూ ప్రభుత్వ ఉద్యోగిగా గానీ, ఇతర రిటైర్డ్ పెన్షనర్&amp;zwnj;గా గానీ ఉండకూడదు.&lt;/p&gt;
&lt;p&gt;ఆదాయపు పన్ను- కుటుంబంలో ఏ వ్యక్తి కూడా ఇన్&amp;zwnj;కమ్ టాక్స్ చెల్లింపుదారుడు అయి ఉండకూడదు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;అవసరమైన పత్రాలు&amp;nbsp;&lt;br /&gt;&amp;nbsp;&lt;br /&gt;&amp;nbsp;వృద్యాప్య పెన్షన్ల కోసం కావాల్సిన పత్రాలు:&lt;/h3&gt;
&lt;p&gt;1) ఆధార్ కార్డు&lt;/p&gt;
&lt;p&gt;2) రేషన్ కార్డు (లేదా) ఇన్కమ్ సర్టిఫికెట్&lt;/p&gt;
&lt;p&gt;3) కరెంటు బిల్లు&lt;/p&gt;
&lt;p&gt;4) కుల ధృవీకరణ పత్రం&lt;/p&gt;
&lt;p&gt;5) ఓటు గుర్తింపు కార్డు&lt;/p&gt;
&lt;p&gt;6) పాస్పోర్ట్ సైజ్ ఫోటో&lt;/p&gt;
&lt;p&gt;7) ఆధార్ అప్డేట్ హిస్టరీ&lt;/p&gt;
&lt;h3&gt;వికలాంగుల కొత్త పెన్షన్ కోసం కావాల్సిన పత్రాలు&lt;/h3&gt;
&lt;p&gt;1) ఆధార్ కార్డు&lt;/p&gt;
&lt;p&gt;2) వికలాంగుల ధృవీకరణ పత్రం&lt;/p&gt;
&lt;p&gt;3) రేషన్ కార్డు (లేదా) ఇన్కమ్ సర్టిఫికెట్&lt;/p&gt;
&lt;p&gt;4) కరెంటు బిల్లు&lt;/p&gt;
&lt;p&gt;5) కుల ధృవీకరణ పత్రం&lt;/p&gt;
&lt;p&gt;6) ఓటు గుర్తింపు కార్డు&lt;/p&gt;
&lt;p&gt;7) ఆధార్ అప్డేట్ హిస్టరీ&lt;/p&gt;
&lt;p&gt;8) పాస్పోర్ట్ సైజ్ ఫోటో&lt;br /&gt;Also read: &lt;a title=&quot;యూట్యూబర్ నందనను ఎందుకు అరెస్ట్ చేయలేదు? - నోటీసులిచ్చి పంపేశారు... లీగల్ ప్రొసీడింగ్స్ ఏంటంటే?&quot; href=&quot;https://telugu.abplive.com/andhra-pradesh/vijayawada/why-nandus-world-nandana-released-with-only-notice-fraud-case-latest-update-258472&quot; target=&quot;_self&quot;&gt;యూట్యూబర్ నందనను ఎందుకు అరెస్ట్ చేయలేదు? - నోటీసులిచ్చి పంపేశారు... లీగల్ ప్రొసీడింగ్స్ ఏంటంటే?&lt;/a&gt;&lt;/p&gt;
&lt;h3&gt;వితంతు కొత్త పెన్షన్- కావాల్సిన పత్రాలు&lt;/h3&gt;
&lt;p&gt;1) ఆధార్ కార్డు, భర్త ఆధార్ కార్డు&lt;/p&gt;
&lt;p&gt;2) భర్త మరణ దృవపత్రం&lt;/p&gt;
&lt;p&gt;3) రేషన్ కార్డు (లేదా) ఇన్కమ్ సర్టిఫికెట్&lt;/p&gt;
&lt;p&gt;4) కరెంటు బిల్లు&lt;/p&gt;
&lt;p&gt;5) కుల ధృవీకరణ పత్రం&lt;/p&gt;
&lt;p&gt;6) ఓటు గుర్తింపు కార్డు&lt;/p&gt;
&lt;p&gt;7) ఆధార్ అప్డేట్ హిస్టరీ&lt;/p&gt;
&lt;p&gt;8) పాస్పోర్ట్ సైజ్ ఫోటో&amp;nbsp;&lt;/p&gt;
&lt;ul&gt;
&lt;li&gt;వితంతు పింఛన్ - భర్త మరణ ధృవీకరణ పత్రం &amp;nbsp;&lt;/li&gt;
&lt;li&gt;దివ్యాంగుల పింఛన్- సదరమ్ సర్టిఫికెట్ &amp;nbsp;&lt;/li&gt;
&lt;li&gt;చేనేత, మత్స్యకార, కల్లుగీత ధృవీకరణ పత్రాలు&lt;br /&gt;&lt;br /&gt;Also Read: &lt;a title=&quot;చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు: 'నిజం గెలిచింది' అంటూ నారా లోకేష్ భావోద్వేగ పోస్ట్&quot; href=&quot;https://telugu.abplive.com/andhra-pradesh/amravati/ap-minister-nara-lokesh-recalls-chandrababu-illegal-arrest-on-3rd-anniversary-258469&quot; target=&quot;_self&quot;&gt;చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు: 'నిజం గెలిచింది' అంటూ నారా లోకేష్ భావోద్వేగ పోస్ట్&lt;/a&gt;&lt;/li&gt;
&lt;/ul&gt;
&lt;h3&gt;దరఖాస్తు విధానం, పరిశీలన &amp;nbsp;&lt;/h3&gt;
&lt;ol&gt;
&lt;li&gt;అర్హులైన అభ్యర్థులు తమ పరిధిలోని స్వర్ణ గ్రామ లేదా స్వర్ణ వార్డు ఆఫీసుకు వెళ్లి దరఖాస్తు ఫారాన్ని సమర్పించాలి.&lt;/li&gt;
&lt;li&gt;సచివాలయ సిబ్బంది అభ్యర్థి వివరాలను ఆన్&amp;zwnj;లైన్&amp;zwnj;లో నమోదు చేసి, eKYC ప్రక్రియను పూర్తి చేస్తారు.&lt;/li&gt;
&lt;li&gt;ప్రభుత్వం సూచించిన నిబంధనల ప్రకారం ఆటోమేటెడ్ సాఫ్ట్&amp;zwnj;వేర్ ద్వారా అర్హతలను క్రాస్ చెక్ చేస్తారు.&lt;/li&gt;
&lt;li&gt;వాలిడేషన్ పూర్తైన తర్వాత, సంబంధిత సిబ్బంది లబ్ధిదారుడి ఇంటికి వెళ్లి సమాచారాన్ని, డాక్యుమెంట్లు తనిఖీ చేసి రిపోర్ట్ ఇస్తారు.&lt;/li&gt;
&lt;li&gt;ఎంపీడీవో లేదా మున్సిపల్ కమిషనర్ అర్హులైన జాబితాను పరిశీలించి పై అధికారులకు సిఫార్సు చేస్తారు. &amp;nbsp;&amp;nbsp;&lt;/li&gt;
&lt;/ol&gt;
&lt;h3&gt;పింఛన్ మంజూరు &amp;nbsp;&lt;/h3&gt;
&lt;ul&gt;
&lt;li&gt;క్షేత్రస్థాయి అధికారులు సిఫార్సు చేసిన దరఖాస్తులను రాష్ట్రస్థాయిలో పరిశీలించి, బడ్జెట్ కేటాయింపు ఆధారంగా ప్రభుత్వం ఆమోదం తెలుపుతుంది.&lt;/li&gt;
&lt;li&gt;దరఖాస్తు చేసిన తేదీ నుంచి బకాయిల రూపంలో పింఛను చెల్లిస్తారు. SERP ద్వారా పోర్టల్&amp;zwnj;లో పింఛను ఎనేబుల్ చేసిన నెల నుంచే నెలవారీ చెల్లింపులు ప్రారంభమవుతాయి. &amp;nbsp;&lt;br /&gt;&lt;br /&gt;Also Read: &lt;a title=&quot;పాదయాత్ర 2.0పై వైసీపీ అధినేత జగన్ కీలక ప్రకటన&quot; href=&quot;https://telugu.abplive.com/andhra-pradesh/amravati/ys-jagan-announces-padayatra-2-ysrcp-chief-to-launch-statewide-march-in-2027-258491&quot; target=&quot;_self&quot;&gt;పాదయాత్ర 2.0పై వైసీపీ అధినేత జగన్ కీలక ప్రకటన&lt;/a&gt;&lt;br /&gt;&amp;nbsp;&lt;/li&gt;
&lt;/ul&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/09/910516ad5b35ce1f10f1387da028f48f17889420902991409_original.jpg" width="220"/></item><item><title><![CDATA[YS Jagan Padayatra: పాదయాత్ర 2.0పై వైసీపీ అధినేత జగన్ కీలక ప్రకటన, స్థానిక ఎన్నికలపై నేతలకు సూచనలు]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/ys-jagan-announces-padayatra-2-ysrcp-chief-to-launch-statewide-march-in-2027-258491</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/ys-jagan-announces-padayatra-2-ysrcp-chief-to-launch-statewide-march-in-2027-258491#respond</comments><pubDate>Wed, 9 Sep 2026 13:22:44 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ అమరావతి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/amravati/ys-jagan-announces-padayatra-2-ysrcp-chief-to-launch-statewide-march-in-2027-258491</guid><description><![CDATA[&lt;p&gt;YS Jagan Announces Padayatra |&amp;nbsp;తాడేపల్లి: ఏపీ, తెలంగాణలో వచ్చే ఏడాది పాదయాత్ర సీజన్ మొదలయ్యేలా కనిపిస్తోంది. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని చూస్తున్న వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను రాష్ట్రవ్యాప్తంగా &amp;lsquo;పాదయాత్ర 2.0&amp;rsquo; చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. తాడేపల్లిలోని పార్టీ సెంట్రల్ ఆఫీసులో పర్చూరు నియోజకవర్గ నాయకులు, ముఖ్య కార్యకర్తలతో బుధవారం నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో జగన్ పాల్గొన్నారు. 2027 సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో తాను పాదయాత్ర ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;రాబోయే 2029 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, క్షేత్రస్థాయిలో వైసీపీని మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడమే పాదయాత్ర లక్ష్యంగా పేర్కొన్నారు. గతంలో వైఎస్ జగన్ చేపట్టిన 'ప్రజా సంకల్ప యాత్ర' ఆయన రాజకీయ జీవితంలోనే కీలకంగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలుస్తూ అధికారం సొంతం చేసుకున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;స్థానిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం కుట్రలు&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;బీసీలకు 34 శాతం రిజర్వేషన్ పేరుతో ఏపీ ప్రభుత్వం డ్రాలు చేస్తుందని, ఇవన్నీ కోర్టులో చెల్లవని సీఎం చంద్రబాబుకు ముందే తెలుసునన్నారు. SIR ప్రక్రియతో రాష్ట్రంలో 44 లక్షల ఓట్లు గల్లంతయ్యాయని, &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; ఉండగా ఎన్నికలు సజావుగా సాగే అవకాశమే లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతుందని, ఎలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు జరుగుతున్నాయో అర్థం చేసుకుని వైసీపీ నేతలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గట్టిగా పోరాటం చేసి ఎన్నికల్లో విజయాలు సాధించాలని దిశానిర్దేశం చేశారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;పాదయాత్రతో 2019 ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;2017 నవంబర్ 6న వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలోని దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ స్మృతి వనం నుంచి ప్రారంభమైన ఆ యాత్ర సుమారు 341 రోజుల పాటు సాగింది. అప్పటి మొత్తం 13 జిల్లాల్లోని 134 నియోజకవర్గాలు, 2,516 గ్రామాల మీదుగా 3,648 కిలోమీటర్లు చేసిన ఈ పాదయాత్రలో కోట్ల మంది ప్రజలను నేరుగా కలుసుకున్నారు.&lt;/p&gt;
&lt;p&gt;ఆ రోజుల్లో ప్రతిపక్ష నేతగా రైతులు, మహిళలు, యువత, నిరుద్యోగులు, అన్ని వర్గాల సమస్యలను తెలుసుకున్న జగన్ 'నవరత్నాలు' సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం కల్పించారు. ఈ ప్రజా సంకల్ప యాత్ర అందించినప్రజాదరణతోనే 2019 సాధారణ ఎన్నికల్లో వైఎస్సార్&amp;zwnj;సీపీ 151 స్థానాల్లో ఘనవిజయం సాధించి అధికారంలోకి వచ్చింది. మరోసారి ప్రజల్లోకి వెళ్లేందుకు 'పాదయాత్ర 2.0' చేస్తానని &lt;a title=&quot;జగన్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/cm-jagan&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;జగన్&lt;/a&gt; నిర్ణయం తీసుకున్నారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/09/7e8bcb3125c4f24a3df0274117345c811788940311444233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు: 'నిజం గెలిచింది' అంటూ నారా లోకేష్ భావోద్వేగ పోస్ట్]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/ap-minister-nara-lokesh-recalls-chandrababu-illegal-arrest-on-3rd-anniversary-258469</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/ap-minister-nara-lokesh-recalls-chandrababu-illegal-arrest-on-3rd-anniversary-258469#respond</comments><pubDate>Wed, 9 Sep 2026 10:52:19 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ అమరావతి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/amravati/ap-minister-nara-lokesh-recalls-chandrababu-illegal-arrest-on-3rd-anniversary-258469</guid><description><![CDATA[&lt;p&gt;అమరావతి: వైసీపీ హయాంలో టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుకు గురై మూడేళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో స్పందించారు. నిజం గెలిచింది అంటూ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే అప్పటి అధికార పక్షమైన గొడ్డలి పార్టీ సరిగ్గా 3 ఏళ్ల క్రితం చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపిందని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.&lt;/p&gt;
&lt;p&gt;చంద్రబాబు జైలులో ఉన్న ఆ 53 రోజుల పాటు ఆయనకు అండగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరూ &quot;నిజం గెలవాలి&quot; అనే నినాదంతో మద్దతుగా నిలిచారని లోకేష్ గుర్తుచేసుకున్నారు. చివరకు ఆ అక్రమ కేసులన్నింటినీ న్యాయస్థానాలు కొట్టివేశాయని, న్యాయమే గెలిచి చంద్రబాబు నిర్బంధం నుంచి స్వేచ్ఛగా బయటకు వచ్చారని తెలిపారు. నాటి చీకటి రోజులను తలుచుకుంటూ, చంద్రబాబుకు మరియు పార్టీకి అండగా నిలిచిన తెలుగుజాతి మొత్తానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;a title=&quot;టీడీపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/tdp&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;టీడీపీ&lt;/a&gt; అధినేత చంద్రబాబు నాయుడిని సిల్క్ డెవలప్&amp;zwnj;మెంట్ స్కాం కేసులో 2023, సెప్టెంబర్ 9వ తేదీ తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్ సీఐడీ (CID) పోలీసులు అరెస్టు చేశారు. నంద్యాలలో ఆయన బస చేసిన చోటే సీఐడీ పోలీసులు భారీ బందోబస్తు మధ్య అదుపులోకి తీసుకున్నారు. ఏపీ స్కిల్ డెవలప్&amp;zwnj;మెంట్ కార్పొరేషన్ (APSSDC) నిధుల మళ్లింపు ఆరోపణలకు సంబంధించిన కేసులో చంద్రబాబును అరెస్టు చేసినట్లు సీఐడీ అధికారులు ప్రకటించారు. ఈ అరెస్టుతో రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడమే కాకుండా, TDP శ్రేణులు రాజకీయ కక్షసాధింపుగా పేర్కొంటూ ఆందోళనలు చేపట్టాయి.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;విచారణ, రిమాండ్&lt;/strong&gt;&lt;br /&gt;అరెస్టు అనంతరం చంద్రబాబును నంద్యాల నుంచి రోడ్డు మార్గాన విజయవాడకు తరలించారు. అనంతరం విజయవాడలోని ఏసీబీ (ACB) ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం, కోర్టు చంద్రబాబు నాయుడికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో సెప్టెంబర్ 10 రాత్రి ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.&lt;/p&gt;
&lt;p&gt;దాదాపు 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్&amp;zwnj;లో ఉన్న &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt;కి, కంటి శస్త్రచికిత్స, వైద్య కారణాల రీత్యా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2023, అక్టోబర్ 31న నాలుగు వారాల తాత్కాలిక (మధ్యంతర) బెయిల్ మంజూరు చేసింది. దీంతో అదే రోజు సాయంత్రం ఆయన రాజమండ్రి జైలు నుంచి బయటకు వచ్చారు. జైలు వెలుపల వేలాది మంది అభిమానులు, తెదేపా నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత 2023, నవంబర్ 20న ఏపీ హైకోర్టు ఈ కేసులో ఆయనకు పూర్తిస్థాయి (రెగ్యులర్) బెయిల్ మంజూరు చేసింది.&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/09/ac7de4b1207e9e0b82587810156049621788930729394233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Visakhapatnam Latest News: విశాఖలో స్లం రీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్.. పేద కుటుంబాలకు ఇళ్ల నిర్మాణం- ఏపీలో తొలి ప్రాజెక్టు]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/visakhapatnam/minister-narayana-launches-andhra-pradeshs-1st-slum-redevelopment-project-in-visakhapatnam-258461</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/visakhapatnam/minister-narayana-launches-andhra-pradeshs-1st-slum-redevelopment-project-in-visakhapatnam-258461#respond</comments><pubDate>Wed, 9 Sep 2026 10:19:43 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ విశాఖపట్నం ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/visakhapatnam/minister-narayana-launches-andhra-pradeshs-1st-slum-redevelopment-project-in-visakhapatnam-258461</guid><description><![CDATA[&lt;p&gt;Minister Narayana Launches Andhra Pradeshs 1st Slum Redevelopment Project in Visakhapatnam&lt;/p&gt;
&lt;p&gt;విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లో మొదటిసారిగా చేపడుతున్న 'స్లమ్ రీడెవలప్&amp;zwnj;మెంట్' (మురికివాడల పునర్నిర్మాణం) కార్యక్రమానికి రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ శ్రీకారం చుట్టారు. విశాఖపట్నంలోని వేలంపేట మురికివాడ పునర్నిర్మాణ ప్రాజెక్టుకు బుధవారం ఉదయం ఆయన శంకుస్థాపన చేశారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ డెవలప్&amp;zwnj;మెంట్&amp;zwnj;లో భాగంగా రూ.28.44 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టారు.&lt;/p&gt;
&lt;p&gt;గత 50 ఏళ్లుగా సరైన ఆవాసాలు లేక ఇబ్బందులు పడుతున్న 177 పేద కుటుంబాలకు గాను, 2,691 చదరపు అడుగుల విస్తీర్ణంలో 45 మీటర్ల ఎత్తుతో 12 అంతస్తుల మోడల్ అపార్ట్&amp;zwnj;మెంట్ భవనాన్ని నిర్మించనున్నామని మంత్రి నారాయణ తెలిపారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/09/a746f80bd031299014c833ee6689db311788929059718233_original.jpeg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;పట్టణ పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఈ సందర్భంగా మంత్రి నారాయణ తెలిపారు. సరికొత్త షియర్ వాల్ (Shear Wall) సాంకేతికతను ఉపయోగించి కేవలం 9 నెలల్లోనే ఈ నిర్మాణాలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/09/97874193ecf923191c4e436c694807051788929085688233_original.jpeg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఇందులో నిర్మించే ఒక్కో నివాస యూనిట్ విలువ సుమారు రూ.16.07 లక్షలు ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలోనే ఇది తొలి మోడల్ ప్రాజెక్ట్ అని, ఇదే తరహాలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇతర మురికివాడలను కూడా దశలవారీగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/09/55060ed50fefc4686612bafef0de9ed21788929131437233_original.jpeg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/09/851882b3db907e504d5155fa29cd3c391788929154219233_original.jpeg&quot; /&gt;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/09/e24b0b8550e6888246561ac7c3674d3e1788928817242233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Chandrababu: డేటా సెంటర్లకు నీళ్లు అసలు సమస్యే కాదు, లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది: చంద్రబాబు]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/tdp-leadership-conclave-chandrababu-outlines-vision-for-sustainable-development-and-infrastructure-growth-258390</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/tdp-leadership-conclave-chandrababu-outlines-vision-for-sustainable-development-and-infrastructure-growth-258390#respond</comments><pubDate>Tue, 8 Sep 2026 13:05:37 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ అమరావతి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/amravati/tdp-leadership-conclave-chandrababu-outlines-vision-for-sustainable-development-and-infrastructure-growth-258390</guid><description><![CDATA[&lt;p&gt;అమరావతి: రాష్ట్ర స్థూల అభివృద్ధి సాధించాలంటే అది నియోజకవర్గ స్థాయి అభివృద్ధితో అనుసంధానమవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. డేటా సెంటర్లకు నీటి లభ్యతకు ఎలాంటి అడ్డంకులు లేవని పేర్కొన్నారు. గూగుల్ మన వద్దకు వస్తే భారత్&amp;zwnj;లోని ఇతర రాష్ట్రాలు అసూయపడ్డాయని, రాష్ట్రంలోని కొందరు వ్యక్తులు సూతం అడ్డుకునే ప్రయత్నం చేశారని కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో నిర్వహించిన టీడీపీ లీడర్షిప్ కాంక్లేవ్&amp;zwnj;లో సుస్థిర అభివృద్ధిపై చంద్రబాబు పలు అంశాలు ప్రస్తావించారు. ప్రస్తుతం విజయవాడ సెంట్రల్, పాలకొల్లు, మండపేట, నెల్లూరు సిటీ, తణుకు వంటి నియోజకవర్గాలు జిఎస్&amp;zwnj;డీపీ (GSDP) సాధనలో ముందంజలో ఉన్నాయని వెల్లడించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర జీఎస్డీపీ రూ.20.35 లక్షల కోట్లుగా ఉందని, దాదాపు 15 నుండి 20 రంగాలలో వృద్ధిని పెంచేలా ప్రణాళికలు రూపొందించాలని పిలుపునిచ్చారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/08/1c2191fcbdb9b5085ac41dca77bcb8c01788851994956233_original.jpeg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;డేటా సెంటర్లకు నీటి సమస్య ఉండదు&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;రాష్ట్రంలో డేటా సెంటర్లు, సాంకేతిక పరిశ్రమల ఏర్పాటు ద్వారా లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని సీఎం చంద్రబాబు అన్నారు. గూగుల్ వంటి గ్లోబల్ సంస్థలు రాష్ట్రానికి రావడం గర్వకారణమని, ఆ డేటా సెంటర్ల నిర్వహణకు అవసరమైన నీటి సరఫరా పెద్ద సమస్యేమీ కాదని తెలిపారు. మౌలిక వసతుల కల్పనలో వేగం పెంపొందించడానికి 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' విధానాన్ని అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. అలాగే వన్ ఫ్యామిలీ - వన్ ఎంట్రప్రెన్యూర్ అనే భావనను ప్రోత్సహించడం ద్వారా అభివృద్ధి వేగంగా ప్రతి ఇంటికీ చేరుతుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.&lt;/p&gt;
&lt;p&gt;పోలవరం ఎడమ కాలువ ద్వారా రోజుకు దాదాపు 2 టీఎంసీల నీరు తీసుకెళ్లవచ్చు. డేటా సెంటర్ల ద్వారా భారీగా ఉద్యోగాలు, లక్షల మందికి ఉపాధి కూడా లభిస్తుంది. 2026-27 ఆర్ధిక సంవత్సరానికి రాష్ట్ర జీఎస్డీపీ రూ.20.35 లక్షల కోట్లు. 15-20 రంగాల్లో జీఎస్డీపీని పెంచేలా నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఎల్ నినో ప్రభావం ఉన్నప్పటికీ గోదావరి నుంచి ఈ ఏడాది 1,000 టీఎంసీల నీరు సముద్రంలోకి వెళ్లిందని, ఇందులో కనీసం 300 టీఎంసీలు వాడుకున్నా పరిస్థితులు మారతాయన్నారు. మూడేళ్లలో రూ.35 వేల కోట్లతో రాష్ట్రంలోని 36 ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి చేస్తామని పేర్కొన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/08/616aeb0e7d09c90b68b1684f89ba35d71788852016258233_original.jpeg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;వంశధార, గోదావరి, కృష్ణ, తుంగభద్ర, కావేరి, పెన్నా నదులు అనుసంధానం అయితే అన్ని రిజర్వాయర్లన్నీ నింపుకోవచ్చని తెలిపారు. వెలిగొండలో ఈ సీజన్&amp;zwnj;లో 10.7 టీఎంసీలు నిల్వచేసుకుంటున్నాం, వచ్చే ఉడాది 50 టీఎసీలు నిల్వ చేస్తామన్నారు. పోలవరంలో ఫేజ్-2 పూర్తితో 190 టీఎంసీల వరకూ నిల్వ చేసుకోవచ్చు, బొల్లాపల్లి నిర్మిస్తే 350 టీఎంసీలు నిల్వ చేసుకోవాలన్నారు. కడప జిల్లాలోని ప్రాజెక్టులతో దాదాపు 100 టీఎంసీలు నింపుకునే అవకాశం ఉందన్న చంద్రబాబు.. నెల్లూరు జిల్లాలో సోమశిల, కండలేరు జలాశయాలపై ఫోకస్ చేయాలన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;నదుల అనుసంధానంతో ఎంతో మేలు జరుగుతుంది&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;నీటి పారుదల రంగానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను వివరించారు. రాబోయే మూడేళ్లలో రూ.35,000 కోట్లతో 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. గోదావరి, కృష్ణా, పెన్నా, వంశధార వంటి నదుల అనుసంధానం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా రిజర్వాయర్లను నింపి 1,250 నుంచి 1,400 టీఎంసీల నీటిని నిల్వ చేసే స్థాయికి తీసుకెళ్తామని వెల్లడించారు. భూగర్భ జలాలు పెరిగితే వ్యవసాయానికి విద్యుత్ సబ్సిడీ భారం తగ్గుతుందని, రహదారులు, పోర్టులు, ఎయిర్&amp;zwnj;పోర్టుల అభివృద్ధితో ఆంధ్రప్రదేశ్&amp;zwnj;ను దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/08/24814da5eff0381bea767083afb5eb3f1788852039679233_original.jpeg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;పార్టీకే తొలి ప్రాధాన్యం.. మంత్రి నారా లోకేష్&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;a title=&quot;టీడీపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/tdp&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;టీడీపీ&lt;/a&gt; పార్టీయే మనకు సుప్రీం అని, మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా పార్టీ పదవుల్లో ఉన్నవారిని గౌరవించాల్సిందేనని మంత్రి నారా లోకేష్ నేతలకు స్పష్టంచేశారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణపై జరిగిన చర్చలో మాట్లాడుతూ.. పార్టీ ఇచ్చే బాధ్యతలకే తన తొలి ప్రాధాన్యమని, క్వాంటమ్&amp;zwnj; టవర్స్&amp;zwnj; కార్యక్రమాన్ని కూడా పక్కనపెట్టి పార్టీ పనికే ప్రాధాన్యమిచ్చినట్లు తన అనుభవాన్ని ఆయన వెల్లడించారు.&lt;/p&gt;
&lt;p&gt;పార్టీ పదవుల్లోని వారు కార్యక్రమాలకు రావడానికి ఎవరి అనుమతులూ అవసరం లేదని తేల్చి చెప్పారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; బి-ఫారమ్ ఇవ్వకపోతే ఎవరూ ప్రజాప్రతినిధులు కాలేరనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని, పార్టీ ఆదేశించిన పనులను నాయకులందరూ తప్పనిసరిగా పూర్తి చేయాల్సిందేనని స్పష్టం చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/08/d1cf9c9e2963277cd72e9f561f5a93771788851806314233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[CM Chandrababu: ఎప్పుడు ఎన్నికలొచ్చినా కూటమిదే విజయం, సర్వేలన్నీ మనకే అనుకూలం: చంద్రబాబు]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/alliance-will-win-hands-down-even-if-elections-are-held-now-cm-chandrababu-at-tdp-leadership-conclave-258335</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/alliance-will-win-hands-down-even-if-elections-are-held-now-cm-chandrababu-at-tdp-leadership-conclave-258335#respond</comments><pubDate>Mon, 7 Sep 2026 18:09:54 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ అమరావతి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/amravati/alliance-will-win-hands-down-even-if-elections-are-held-now-cm-chandrababu-at-tdp-leadership-conclave-258335</guid><description><![CDATA[&lt;p&gt;Andhra Pradesh Top News |&amp;nbsp;అమరావతి: ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లో ఇప్పుడు ఎన్నికలు జరిగినా మళ్లీ ఎన్డీయే (NDA) కూటమిదే ఘనవిజయమని సీఎం నారా చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. అన్ని తాజా సర్వేలు కూటమికే అనుకూలంగా ఉన్నాయంటూ తెలుగుదేశం పార్టీ నాయకుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. అమరావతి వేదికగా నిర్వహించిన &lt;a title=&quot;టీడీపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/tdp&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;టీడీపీ&lt;/a&gt; లీడర్&amp;zwnj;షిప్ కాంక్లేవ్&amp;zwnj;లో పాల్గొన్న ఆయన, పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలకు భవిష్యత్ కార్యాచరణపై కీలక దిశానిర్దేశం చేశారు. పాలనలోనూ, రాజకీయాల్లోనూ కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య యునిటీ ముఖ్యమని, అంతర్గత వివాదాలు, చిన్న చిన్న గిల్లికజ్జాలతో రచ్చకెక్కవద్దని నేతలకు సూచించారు.&lt;/p&gt;
&lt;p&gt;రాజకీయ నాయకులు ఎప్పటికప్పుడు భవిష్యత్ పరిస్థితులను అర్థం చేసుకుంటూ ముందుకెళ్లాలని చంద్రబాబు సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో అభివృద్ధికి అనేక అవకాశాలు ఉన్నాయని, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు వాటిని సరిగ్గా అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. త్వరలోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పూర్తిస్థాయి నివేదికను తయారుచేస్తామన్నారు. విశాఖపట్నం రీజియన్&amp;zwnj;కు పెద్ద ఎత్తున పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని, ఇవి రాష్ట్ర భవిష్యత్తుకు ఎంతో కీలకమని పేర్కొన్నారు. అలాగే ఏపీలో నీటి సమస్య శాశ్వతంగా పరిష్కరిస్తే దాదాపుగా మెజారిటీ సమస్యలు తీరతాయి కనుక... నేతలంతా ఈ అంశంపై ఫోకస్ చేయాలని దిశానిర్దేశం చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; నాయుడు అన్ని జిల్లాలకు ఇంఛార్జ్&amp;zwnj;లను నియమించారు. &lt;br /&gt;ఈసారి అభ్యర్థుల ఎంపికను సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కాకుండా ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర కీలక నేతలకు అప్పగించారు. ఎన్నికల ప్రచారం, క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను యాక్టివ్ చేయడంతో పాటు కూటమి మిత్రపక్షాలైన &lt;a title=&quot;జనసేన&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Janasena&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;జనసేన&lt;/a&gt;, &lt;a title=&quot;బీజేపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/BJP&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;బీజేపీ&lt;/a&gt; నేతలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని ఇంఛార్జ్&amp;zwnj;లకు సూచించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;తెలుగుదేశం పార్టీ 28 జిల్లాలకు ప్రకటించిన ఇంఛార్జ్&amp;zwnj;ల లిస్ట్&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;1. పార్వతీపురం మన్యం: దాడి రత్నాకర్&lt;br /&gt;&amp;nbsp;2. అల్లూరి సీతారామరాజు: పేరాబత్తుల రాజశేఖర్&lt;br /&gt;&amp;nbsp;3. శ్రీకాకుళం: ఎండీ నజిర్&lt;br /&gt;&amp;nbsp;4. విజయనగరం: ఎంపీ చింతకాయల విజయ్&lt;br /&gt;&amp;nbsp;5. విశాఖపట్నం: ఎంఏ షరీఫ్&lt;br /&gt;&amp;nbsp;6. అనకాపల్లి: కొండపల్లి అప్పలనాయుడు&lt;br /&gt;&amp;nbsp;7. పోలవరం: కే సత్తిబాబు&lt;br /&gt;&amp;nbsp;8. కాకినాడ: సుజయ కృష్ణారంగారావు&lt;br /&gt;&amp;nbsp;9. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ: ఎంపీ సానా సతీశ్&lt;br /&gt;&amp;nbsp;10. తూర్పు గోదావరి: దేవినేని ఉమామహేశ్వరరావు&lt;br /&gt;&amp;nbsp;11. పశ్చిమ గోదావరి: ఎంపీ భాష్యం రామకృష్ణ&lt;br /&gt;&amp;nbsp;12. ఏలూరు: ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ&lt;br /&gt;&amp;nbsp;13. కృష్ణా: కొమ్మాలపాటి శ్రీధర్&lt;br /&gt;&amp;nbsp;14. ఎన్టీఆర్: మల్లికార్జునరావు&lt;br /&gt;&amp;nbsp;15. గుంటూరు: ఎంవీ సత్యనారాయణరాజు&lt;br /&gt;&amp;nbsp;16. పల్నాడు: కొనకళ్ల నారాయణ&lt;br /&gt;&amp;nbsp;17. బాపట్ల: జంగా కృష్ణమూర్తి&lt;br /&gt;&amp;nbsp;18. ప్రకాశం: ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి&lt;br /&gt;&amp;nbsp;19. మార్కాపురం: ఎమ్మెల్సీ బీటీ నాయుడు&lt;br /&gt;&amp;nbsp;20. నెల్లూరు: ఎస్వీపీఎస్ఎన్ వర్మ&lt;br /&gt;&amp;nbsp;21. తిరుపతి: నూకసాని బాలాజీ&lt;br /&gt;&amp;nbsp;22. చిత్తూరు: దామచర్ల సత్య&lt;br /&gt;&amp;nbsp;23. కడప: దీపక్ రెడ్డి&lt;br /&gt;&amp;nbsp;24. అన్నమయ్య: ఎమ్మెల్సీ శ్రీకాంత్&lt;br /&gt;&amp;nbsp;25. అనంతపురం: ఏరాసు ప్రతాపరెడ్డి&lt;br /&gt;&amp;nbsp;26. శ్రీసత్యసాయి: సోమిశెట్టి వెంకటేశ్వర్లు&lt;br /&gt;&amp;nbsp;27. కర్నూలు: పెళ్లకూరు శ్రీనివాసరెడ్డి&lt;br /&gt;28. నంద్యాల:&amp;nbsp; వైకుంఠం ప్రభాకర్ చౌదరి&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/07/f8d6686bb8e17f6e7f7d292ad32c2a0f1788783827923233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[పొలాలకే కాదు ఇళ్లకూ, ఊళ్లకూ ఉచిత కరెంట్]]></title><link>https://telugu.abplive.com/short-videos/andhra-pradesh/free-electricity-not-just-for-farms-but-also-for-homes-and-villages-258334</link><comments>https://telugu.abplive.com/short-videos/andhra-pradesh/free-electricity-not-just-for-farms-but-also-for-homes-and-villages-258334#respond</comments><pubDate>Mon, 7 Sep 2026 17:52:27 +0530 </pubDate><dc:creator><![CDATA[ ABP Desam ]]></dc:creator><category><![CDATA[ ఆంధ్రప్రదేశ్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/short-videos/andhra-pradesh/free-electricity-not-just-for-farms-but-also-for-homes-and-villages-258334</guid><description><![CDATA[&lt;p&gt;&lt;span class=&quot;citation-48 citation-end-48&quot;&gt;తాను త్వరలో ప్రారంభించబోయే కొత్త పార్టీకి సంబంధించి మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి మరో మాస్టర్ ప్లాన్ ప్రకటించారు.&lt;/span&gt;&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/07/f87dd6cc20a6b601d079276cc50af37717887837424811476_original.jpeg" width="220"/></item><item><title><![CDATA[జెన్ జీకి మా పార్టీలో 66 శాతం సీట్లు]]></title><link>https://telugu.abplive.com/short-videos/andhra-pradesh/66-of-seats-in-our-party-for-gen-z-258333</link><comments>https://telugu.abplive.com/short-videos/andhra-pradesh/66-of-seats-in-our-party-for-gen-z-258333#respond</comments><pubDate>Mon, 7 Sep 2026 17:47:14 +0530 </pubDate><dc:creator><![CDATA[ ABP Desam ]]></dc:creator><category><![CDATA[ ఆంధ్రప్రదేశ్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/short-videos/andhra-pradesh/66-of-seats-in-our-party-for-gen-z-258333</guid><description><![CDATA[&lt;p&gt;యువతకు రాజకీయాల్లో పెద్దపీట వేసేలా విజయసాయి రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ తరఫున 'జెన్ జీ' (Gen Z) యువతకు ఏకంగా 66 శాతం సీట్లు కేటాయించనున్నట్లు వెల్లడించారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/07/a7763e5acc59568a4cbd15d8da476e7117887834105451476_original.jpeg" width="220"/></item></channel></rss>