2026-27 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల ప్రవేశపెట్టిన బడ్జెట్ మొత్తం 3,32,205 కోట్ల రూపాయలు.
AP Budget 2026 Updates : ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో ఆస్తుల సృష్టి ఎంత? రెవెన్యూ లోటు సంగతి ఏంటీ?
AP Budget 2026 Updates : రాష్ట్రంలో కీలక రంగాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన పయ్యావుల కేశవ్ చెప్పారు. అందులో మొదటిది వ్యసాయం అయితే రెండోది సాగునీటిపారుదల రంగమని పేర్కొన్నారు.

AP Budget 2026 Updates : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక భవిష్యత్కు సంబంధించిన అత్యంత కీలకమైన వార్షిక బడ్జెట్ 2026-27ను సభలో ఆర్థికమంత్రి పయ్యావుల ప్రవేశ పెట్టారు. ఇది కేవలం అంకెలతో కూడిన లెక్కల పత్రం కాదని రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజల ఆశలు, ఆకాంక్షలను ప్రతిబింబించే ఒక ఆశల వారధి అని అభివర్ణించారు. ముఖ్యమంత్రి నేతృత్వంలో స్వర్ణాంధ్ర @2047 లక్ష్యానికి అనుగుణంగా ఈ బడ్జెట్ రూపొందించారు.
మొత్తం 3,32, 205 కోట్ల భారీ వ్యయంతో ఈ బడ్జెట్ను ప్రతిపాదించారు. గత ప్రభుత్వ పాలనలో దెబ్బతిన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెడుతూనే, సంక్షేమం , అభివృద్ధిని సమాంతరంగా తీసుకెళ్తున్నట్టు పేర్కొన్నారు.
బడ్జెట్ను అంకెల్లో చూస్తే
- మొత్తం బడ్జెట్ వ్యయం- 3,32, 205 కోట్లు
- రెవెన్యూ వ్యయం- రోజు వారి ఖర్చుల కోసం 2, 56, 143 కోట్లు కేటాయించారు.
- మూలధన వ్యయం(ఆస్తుల సృష్టి)- 53, 915 కోట్లుగా చెప్పారు.
- రెవెన్యూ లోటు- 22, 002కోట్లు ఇది జీఎస్డీపీలో 1.11శాతంగా ఉంది.
- ఆర్థిక లోటు - 75, 868 కోట్లు. ఇది కూడా జీఎస్డీపీలో 3.84 శాతంగా ఉంది.
భవిష్యత్ భరోసార కోసం ఏపీ వెల్త్ ఫండ్
ఈ బడ్జెట్లో అత్యంత వినూత్నమైన అంశం ఏపీ వెల్త్ ఫండ్ ఏర్పాటు . నార్వే, అబుదాబి వంటి దేశాల్లో ఉన్న సావరినిటీ ఫండ్ తరహాలోనే ఏపీ రాష్ట్రానికి సొంతంగా ఒక నిధిని సృష్టించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం ప్రాథమికంగా 100 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలోని ఆస్తులను అభిృద్ధి చేయడం, పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా సంపదను సృష్టించి, ఆ లాభాలను మళ్లీ ప్రజల అభివృద్ధి కోసం వాడటం కోసం ఈ ఫండ్ ముఖ్య ఉద్దేశంగా చెప్పారు.
సాగు నీటికి ఇచ్చిన నిదులు ఇవే
రాష్ట్రంలో సాగునీటి రంగానికి అధికా ప్రాధాన్యత ఇస్తున్నట్టు పయ్యావుల తెలిపారు. ప్రకృతిపై ఆధారపడి వ్యసాయం చేయడం వల్ల నష్టాలు ఎక్కువగా వస్తున్నందున నీటి నిల్వ, సమర్థ పంపిణీపై ఎక్కువ ఫోకస్ చేసినట్టు తెలిపారు. నీటి ప్రాజెక్టు కట్టడమే కాకుండా దీర్ఘకాలిక నీటి భద్రతను కల్పించేలా విధానాలు రూపకల్పన చేస్తున్నట్టు వెల్లడించారు. అందుకే ఈ బడ్జెట్లో ఈ రంగానికి 18,224 కోట్లు కేటాయిస్తున్నట్టు వెల్లడించారు.
రైతుల స్థిరీకరణ నిధికి పెరిగిన నిధులు
గత ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధికి భారీగా కేటాయింపులు చేసినప్పటికీ వాటిని సమర్థవంతంగా వినియోగించలేదన్నారు. 2019-24 మధ్య కాలంలో 7,500 కోట్లు బడ్జెట్లో కేటాయించినా కేవలం 880 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం ధర స్థిరీకరణ నిధికి 300 కోట్లు మాత్రమే కేటాయించినా 1200 కోట్లను ఖర్చు చేసిందని తెలిపారు. ఇప్పుడు ఈ బడ్జెట్లో 500 కోట్లు కేటాయిస్తున్నట్టు పేర్కొన్నారు.
సహకార రంగానికి సహకారం
పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సహకార రంగాన్ని పునరుద్ధరించేందుకు పని చేస్తుందన్నారు. మూడు అంచెల సహకారంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మరింత బలాన్ని ఇస్తున్నామని అన్నారు. గత ఈ ఆర్థిక సంవత్సరంలో 52.2 లక్షల మంది సభ్యులకు 7600 కోట్లకుపైగా వ్యవసాయ రుణాలు ఇచ్చామని తెలిపారు. 2026-27 బడ్జెట్లో 13, 598 కోట్ల రూపాయలు కేటాయించినట్టు వెల్లడించారు.
Frequently Asked Questions
2026-27 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఎంత?
ఏపీ వెల్త్ ఫండ్ ఎందుకు ఏర్పాటు చేశారు?
రాష్ట్రంలోని ఆస్తులను అభివృద్ధి చేయడం, పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా సంపదను సృష్టించి, ఆ లాభాలను ప్రజల అభివృద్ధి కోసం ఉపయోగించడం ఈ నిధి ముఖ్య ఉద్దేశ్యం.
వ్యవసాయ రంగానికి ఈ బడ్జెట్లో ఎంత కేటాయించారు?
రాష్ట్రంలో సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తూ, నీటి నిల్వ మరియు సమర్థ పంపిణీపై దృష్టి సారించి, ఈ రంగానికి 18,224 కోట్లు కేటాయించారు.
రైతుల స్థిరీకరణ నిధికి ఎంత కేటాయించారు?
గత ప్రభుత్వం కంటే ఎక్కువ మొత్తంలో, ఈ బడ్జెట్లో రైతుల స్థిరీకరణ నిధికి 500 కోట్లు కేటాయించారు.























