అన్వేషించండి

AP Rains : నారుమడులు మునిగిన రైతులకు ప్రభుత్వం భరోసా

గత ప్రభుత్వ కాలంలో కరవు, రైతు ఆత్మహత్యలు సర్వసాధారణం కాగా జగన్‌ సీఎం అయ్యాక వర్షాలు సకాలంలో పడుతుండగా ఇప్పటి వరకూ ఒక్క కరవు మండలాన్నికూడా ప్రకటించలేనది మంత్రి కాకాణి పేర్కొన్నారు.

ఏపీలో వైఎస్‌ఆర్‌ ఉచిత పంటల బీమా పథకం కింద ఇప్పటి వరకూ రూ.9వేల 662 కోట్లు చెల్లించామన్నారు రాష్ట్ర వ్యవసాయ మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డి. బుధవారం అమరావతి సచివాలయం మాట్లాడిన ఆయన.. అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయానికి ముఖ్యంగా రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చాం. అనేక వినూత్న కార్యక్రమాలు, పథకాలను ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్నాం. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులపై బురదజల్లే లక్ష్యంతో ప్రతిపక్ష నేతలు కొన్నిమీడియా సంస్థలు లేనిపోని ఆరోపణలు, విమర్శలు చేస్తున్నాయి అని అన్నారు. 

సీసీఆర్సీ కార్డు లేకపోయినా వైఎస్సార్ బీమా పథకం కింద లక్ష రూపాయల సాయం అందించాలని సీఎం జగన్ ఆదేశించినట్టు మంత్రి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం కింద రైతులు చెల్లించాల్సిన వాటా, కేంద్ర ప్రభుత్వం చెల్లించాల్సిన వాటా, రాష్ట్ర ప్రభుత్వ వాటా మొత్తం ప్రభుత్వమే భరించిందన్నారు. ఇప్పటి వరకూ రూ.9662కోట్లను ఉచిత బీమా కింద చెల్లించామని చెప్పారు.

రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబానికి సకాలంలో నష్ట పరిహారం అందిస్తున్నామని వ్యవసాయశాఖ మంత్రి గోవర్ధన రెడ్డి స్పష్టం చేశారు. పట్టాదార్ పాస్ పుస్తకం, సీసీఆర్సీ కార్డు ఉండి నష్ట పరిహారం అందలేదనే వారుంటే నిరూపించాలని ప్రతిపక్ష నేతలకు మంత్రి సవాల్ విసిరారు. గత ప్రభుత్వ హయాంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు 5లక్షల వంతున నష్ట పరిహారాన్ని అందిస్తామని ప్రకటించి కేవలం లక్షన్నర మాత్రమే ఇచ్చారన్నారు. మిగతా మూడున్నర లక్షలు తహసీల్దార్ల వద్ద జాయింట్ అకౌంట్‌లలో ఉంచి దానిపై వచ్చే వడ్డీని వాడుకుని తర్వాత ఎప్పటికో ఆ మిగతా మూడున్నర లక్షలు ఇచ్చే పరిస్థితి ఉండేదని అన్నారు. కానీ తమ ప్రభుత్వం అధికారానికి వచ్చాక ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి పరిహారాన్ని 7లక్షలకు పెంచి సకాలంలో ఆ నష్ట పరిహారాన్ని అందిస్తున్నట్టు వివరించారు మంత్రి గోవర్ధన రెడ్డి.

2014 నుంచి 31 మే 2019 వరకూ ఆత్మహత్య చేసుకున్న రైతుల జాబితాను పున:పరిశీలించి 471 మంది రైతు కుంటుంబాలకు 23కోట్ల 55 లక్షల రూపాయల న‌ష్టపరిహారాన్నిఅందించామని వ్యవసాయశాఖ మంత్రి గోవర్ధనరెడ్డి చెప్పారు. 2019 జూన్ 1 నుంచి 2019 డిసెంబరు 31 వరకూ ఆత్మహత్య చేసుకున్న311 మంది రైతు కుటుంబాలకు 7లక్షల వంతున 21 కోట్ల 77 లక్షల రూపాయల పరిహారాన్ని అందించామని చెప్పారు. 2020లో 277 మందికి 19.39 కోట్లు, 2021లో 211 మందికి 14.77 కోట్లు, 2022లో ఇప్పటి వరకూ 51 మంది రైతు కుటుంబాలకు 3కోట్ల 57 లక్షల రూపాయలు కలిపి 83కోట్ల 5లక్షలను నష్ట పరిహారంగా అందించినట్టు మంత్రి గోవర్ధన రెడ్డి వెల్లడించారు.

గత ప్రభుత్వ కాలంలో కరవు, రైతు ఆత్మహత్యలు సర్వసాధారణం కాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక వర్షాలు సకాలంలో పడుతుండగా ఇప్పటి వరకూ ఒక్క కరవు మండలాన్నికూడా ప్రకటించలేనది మంత్రి పేర్కొన్నారు. గత ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్ కు 800 కోట్ల రూపాయల బకాయిలు పెట్టి వెళ్ళిపోయిందని ఈ ప్రభుత్వం వచ్చాక 1075కోట్లతో ఈ పథకాన్ని తిరిగి ప్రారంభించామన్నారు. ఆయిల్ పామ్ రైతులకు 85 కోట్లు వెచ్చించి టన్నుకు 600 వంతున అదనపు సాయం అందించి ఆదుకుంటున్నట్టు చెప్పారు.

రాష్ట్రంలో ప్రస్తుతం కురిసిన వర్షాలకు ఇప్పటి వరకూ అందిన ప్రాథమిక నివేదిక ప్రకారం 1800 ఎకరాల్లో వరినారు(నారుమడులు) దెబ్బతిన్నట్టు తెలుస్తోందన్నారు. నష్టం అంచనా ఎన్యుమరేషన్ ప్రక్రియ కొనసాగుతోందని వ్యవసాయశాఖ మంత్రి గోవర్ధన రెడ్డి వివరించారు. వరినారు దెబ్బతిన్న రైతులకు 85శాతం సబ్సిడీతో వరి విత్తనాలను త్వరలో పంపిణీ చేస్తామని తెలిపారు. అదే విధంగా ఇతర పంటలు దెబ్బతింటే గతంలో అవలంభించిన విధానాల ప్రకారం సీజన్ ముగిసేలోగా తగిన పంటనష్ట పరిహారాన్ని రైతులకు అందిస్తామన్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad News: సంతానం కోసం గరుడ ప్రసాదం వితరణ - చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం
సంతానం కోసం గరుడ ప్రసాదం వితరణ - చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం
Heavy Temparatures: నిప్పుల గుండంలా తెలుగు రాష్ట్రాలు - ఈ జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు
నిప్పుల గుండంలా తెలుగు రాష్ట్రాలు - ఈ జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు
Lok Sabha Election 2024: తమిళనాడులో ఓటు హక్కు వినియోగించుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు
Lok Sabha Election 2024: తమిళనాడులో ఓటు హక్కు వినియోగించుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు
Lok Sabha Election 2024: ఇది కదా ప్రజాస్వామ్యం గొప్పదనం, వీళ్లే అసలు సిసలు సెలెబ్రిటీలు
Lok Sabha Election 2024: ఇది కదా ప్రజాస్వామ్యం గొప్పదనం, వీళ్లే అసలు సిసలు సెలెబ్రిటీలు
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Annamalai Reaction 1000Crores Google Pay | కోయంబత్తూరులో డీఎంకే వెయ్యికోట్లు పంచిందా..? | ABP DesamRohit Sharma on Impact Player | IPL 2024 లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ పై హిట్ మ్యాన్ గుస్సా | ABP DesamLoksabha Elections 2024 | Tamil Nadu సహా 21రాష్ట్రాల్లో మొదలైన పోలింగ్ పండుగ | ABP DesamPBKS vs MI Toss Coin in IPL 2024 | కెమెరా మెన్ ఫోకస్ కరో ఫోకస్ కరో అన్నట్లుగా ఐపీఎల్ లో టాస్ లైవ్ షో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad News: సంతానం కోసం గరుడ ప్రసాదం వితరణ - చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం
సంతానం కోసం గరుడ ప్రసాదం వితరణ - చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం
Heavy Temparatures: నిప్పుల గుండంలా తెలుగు రాష్ట్రాలు - ఈ జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు
నిప్పుల గుండంలా తెలుగు రాష్ట్రాలు - ఈ జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు
Lok Sabha Election 2024: తమిళనాడులో ఓటు హక్కు వినియోగించుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు
Lok Sabha Election 2024: తమిళనాడులో ఓటు హక్కు వినియోగించుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు
Lok Sabha Election 2024: ఇది కదా ప్రజాస్వామ్యం గొప్పదనం, వీళ్లే అసలు సిసలు సెలెబ్రిటీలు
Lok Sabha Election 2024: ఇది కదా ప్రజాస్వామ్యం గొప్పదనం, వీళ్లే అసలు సిసలు సెలెబ్రిటీలు
Tillu Square OTT: ఓటీటీలో పాన్‌ ఇండియాగా వస్తున్న 'టిల్లు స్క్వేర్‌' - రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌, ఆ రోజు నుంచే స్ట్రీమింగ్‌!
ఓటీటీలో పాన్‌ ఇండియాగా వస్తున్న 'టిల్లు స్క్వేర్‌' - రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌, ఆ రోజు నుంచే స్ట్రీమింగ్‌!
Mahesh Babu SSMB29: క్రేజీ అప్‌డేట్‌, దుబాయ్‌ నుంచి వచ్చేసిన మహేష్‌, రాజమౌళి - ఇక షూటింగ్‌ అప్‌డేటేనా?
క్రేజీ అప్‌డేట్‌, దుబాయ్‌ నుంచి వచ్చేసిన మహేష్‌, రాజమౌళి - ఇక షూటింగ్‌ అప్‌డేటేనా?
Eesha Rebba Birthday : ఈ తెలుగు అందానికి ముప్పై నాలుగు ఏళ్లు.. ఈషా రెబ్బా బర్త్​డే స్పెషల్ ఫోటోలు చూశారా?
ఈ తెలుగు అందానికి ముప్పై నాలుగు ఏళ్లు.. ఈషా రెబ్బా బర్త్​డే స్పెషల్ ఫోటోలు చూశారా?
Tariff: జూన్‌ నుంచి ఫోన్‌లో మాట్లాడాలంటే వణికి పోవాల్సిందే! ఎన్నికల తర్వాత పడే మొదటి ఎఫెక్ట్ ఇదే!
జూన్‌ నుంచి ఫోన్‌లో మాట్లాడాలంటే వణికి పోవాల్సిందే! ఎన్నికల తర్వాత పడే మొదటి ఎఫెక్ట్ ఇదే!
Embed widget